పోస్ట్‌లు

మే 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

న బూతో న భ‌విష్య‌త్ - అశ్లీలం స‌ర్వ నాశ‌నం

చిత్రం
నాలుగు గ‌దుల్లో దాచు కోవాల్సినవ‌న్నీ ఇపుడు బ‌హిర్గ‌త‌మై పోతున్నాయి. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ మంచి కంటే చెడు ఎక్కువ‌గా ముక్కు ప‌చ్చ‌లార‌ని యువ‌తీ యువ‌కుల‌ను టార్గెట్ చేస్తోంది. భోజ‌నం లేకుండా ఉండ‌గ‌ల‌రమో కానీ మొబైల్స్ లేకుండా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశారు. కాదంటే బాధ‌..వ‌ద్దంటే కోపం..క‌న్న‌వారి మీద క‌సురు కోవ‌డాలు..కుటుంబం అంటే గౌర‌వం లేదు. పాఠాలు చెప్పే వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త లేదు. బ‌ట్టీ ప‌ట్ట‌డాలు..ర్యాంకుల మోత‌లు..ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయి. చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. 60 ఏళ్లకే రావాల్సిన అనుభవం ఇపుడు 10 ఏళ్ల పిల్ల‌ల‌కు అర్థ‌మై పోతోంది. ఇదేమిటంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా..పేరెంట్స్ త‌మ బాధ్య‌త‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. నూటికి 90 శాతం పిల్ల‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేదు. గాలికి వ‌దిలి వేస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన వాళ్లు సైతం ప్రేమ పాఠాలు వ‌ల్లె వేస్తున్నారు. బంధాల‌కు అర్థం లేకుండా పోయింది. డాల‌ర్ల మాయ‌లో ప‌డిన వీరంతా దేశాన్ని ఏం ర‌క్షిస్తారో తెలియ‌డం లేదు. సామాజిక మాధ్యమాల్లో ..గూగుల్ వ‌చ్చాక‌..రిల‌య‌న్స్ జియో ఎంట‌ర్ అయ్...

దేశానికే ఆద‌ర్శం..ర‌వీంద‌ర్ సింగ్ నిర్ణ‌యం

చిత్రం
కోట్లు వుంటే ఏం లాభం..కొలువులుంటే ఏం ప్ర‌యోజ‌నం..ప‌దవులుంటే ఏం చేసుకుంటాం. మ‌న‌మైతే కోట్లు ఎలా కొల్ల‌గొట్టాలో ఆలోచిస్తాం. ఎవ‌రి మీద ప‌డితే డ‌బ్బులు వ‌స్తాయో ప్లాన్ల‌లో మునిగి తేలుతాం. కానీ అధికార పార్టీకి చెందిన ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం వెరీ వెరీ డిఫ‌రెంట్. ఏ మ‌త‌మైనా..ఏ కుల‌మైనా స‌రే ఆదుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇంకేం ఏకంగా పార్టీని న‌మ్ముకున్నందుకు న‌గ‌ర పాల‌క సంస్థ‌కు మేయ‌ర్‌గా ఎన్నుకోబడ్డారు సింగ్. అంద‌రూ గెలిచాక ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం మానేస్తే..ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం జ‌నం కోసం ఏమేం చేస్తే బాగుంటుందోన‌ని నిత్యం ప్ర‌జా సేవ‌కు అంకిత‌మ‌య్యారు. రోడ్డు మీద రూపాయి ప‌డితే వ‌దిలి వేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే ఆ రూపాయితో ఏం వ‌స్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మ‌నోడు మాత్రం ఆ రూపాయికి మ‌రింత విలువ‌ను పెంచారు. సేవ చేయాల‌న్న త‌లంపు వుంటే ..మాన‌వ‌త్వం వెల్లి విరియ‌దా..న‌గ‌ర వాసుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. కేవ‌లం ఒక్క రూపాయి చెల్లించండి..మ‌ధ్య ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌కండి..మీ వెనుక నేనున్నా..మీకు క్ష‌ణాల్లో న‌ల్లా క‌నెక్ష‌న్ ఇస్తామంటూ ప్ర‌క‌టించారు. దెబ్బ‌కు ఆయ‌న ఇలా ప్ర‌క‌టించా...

గ్రోఫ‌ర్సా ..మ‌జాకా - ఎస్‌బీ బిగ్ ఆఫ‌ర్

చిత్రం
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ క‌నెక్టివిటీ ఈజీగా మారి పోయింది. ఒక‌ప్పుడు టెలికాం, ర‌వాణా రంగాలు జ‌నానికి దూరంగా ఉండేవి. ఎప్పుడైతే అవి రావ‌డం ప్రారంభ‌మైందో ప్ర‌పంచం చిన్న‌దై పోయింది. ఐటీ అంటేనే ఇండియా.అంత‌గా పాపుల‌ర్ అయ్యిందీ ఈ దేశం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్‌లో అమెరికా టాప్ వ‌న్ పొజిష‌న్‌లో వుంటే..అందులో 30 శాతానికి పైగా భార‌తీయులే ఉన్న‌త స్థానాల్లో కొలువుతీరారు. అదే స్ఫూర్తితో గూగుల్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, స్నాప్ ఛాట్, ఇలా ప్ర‌తి సామాజిక మాధ్య‌మాల‌ను నిర్వ‌హిస్తున్న వారిలో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్సే ఉన్నారు. వీరే ప్ర‌తి ఫార్మాట్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువ‌త కొత్త‌గా ఆలోచిస్తోంది. డిఫ‌రెంట్ గా ఉండేందుకు య‌త్నిస్తోంది. వారు త్వ‌ర‌గా త‌మ కాళ్ల మీద నిల‌బడాల‌ని కోరుకుంటున్నారు. స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే తాము ఒక‌రి కింద ప‌ని చేసేందుకు స‌సేమిరా అంటున్నారు. ఐడియాసుకు ప‌దును పెడుతూ ..స్టార్ట‌ప్ ల‌కు ప్రాణం పోస్తున్నారు. గ‌తంలో పెట్టుబ‌డి కోసం భ‌య‌ప...

టీఓ క్లాక్ - ఛాయ్ అడ్డా హైద‌రాబాద్

చిత్రం
ఓహ్..హైద‌రాబాద్ అంటేనే ప్యార‌డైజ్ బిర్యానీకి పెట్టింది పేరు. అంతేనా ప్ర‌తి గ‌ల్లీలో ఓ టీకొట్టు ఉండాల్సిందే. ఇరానీ ఛాయ్ కి కేరాఫ్ ఈ న‌గ‌ర‌మే. ఎక్క‌డికి వెళ్లినా ..ఏ సందులోకి దూరినా అక్క‌డ ఇరానీ కేఫ్ ఉంటుంది. అంతేనా గ‌రం గ‌రం టీతో పాటు నోరూరించే ఉస్మానియా బిస్క‌ట్లు కూడా నోరూరిస్తాయి. అంత‌లా పాపుల‌ర్ అయ్యిందీ ఈ సిటీ. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వారి దాకా అంతా ఛాయ్ ప్రియులే. పొద్దున లేస్తేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది టీనే. ర‌క‌ర‌కాల ఫ్లేవ‌ర్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. టీ ప్రియుల కోసం ప్ర‌త్యేకంగా రెస్టారెంట్లు వెలిశాయి. త‌క్కువ ఖ‌ర్చు ..ఎక్కువ ఆదాయం ఏద‌న్నా ఉందంటే అది టీ కొట్టు..టీ హోట‌ల్, టీ అడ్డా. మేధావులు, క‌ళాకారులు, సినీ న‌టులు, ద‌ర్శ‌కులు, క్రియేటివిటీ కోసం నానా తిప్ప‌లు ప‌డే వాళ్లంద‌రికీ ఇష్ట‌మైన‌ది ఏదైనా ఉందంటే ఛాయ్ నే. వేడి వేడి టీ గొంతులోకి వెళితే ఆ టేస్ట్ వేరు. ఆ మ‌జా వేరు. ఆంధ్రా వారి దెబ్బ‌కు తెలంగాణ సంస్కృతి దెబ్బ‌తిన్న‌ది. కానీ బ‌తక‌డంలో మాత్రం త‌న సంస్కృతిని కోల్పోలేదు. తెలంగాణ‌లో ఎక్క‌డికి వెళ్లినా మ‌జ్జిగ‌నో లేదా టీనో త‌ప్ప‌కుండా ఇస్తారు. తేనీటి విందు త‌ప్ప‌ని...