పోస్ట్‌లు

సెప్టెంబర్ 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సాన్యా సంచలనం..పుస్తక ప్రభంజనం..!

చిత్రం
లోగ్ క్యా కహేంగే..అంటూ సాన్యా ఖురానా రాసిన పుస్తకం దేశ వ్యాప్తంగా అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. వృత్తి రీత్యా సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన ఈ అమ్మాయి రాయడంలో అందెవేసిన చెయ్యి. తన మీద తనకు అపారమైన నమ్మకం , ఆత్మ విశ్వాసం కలిగిన ఈమె అనుకోకుండా రచయిత్రిగా మారారు. అంతకు ముందు ఆమె అడోబ్ ఐటి కంపెనీలో పని చేశారు. మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచేలా ప్రత్యేక కథనాలు రాశారు. సాన్యా రాసిన పుస్తకం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. అమెజాన్ కంపెనీలో ఇప్పుడు ఈ బుక్ సంచలనం రేపుతోంది. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సాన్యా పర్యటించారు. ఈ జర్నీలో ఎందరినో కలిశారు. వారితో మాట్లాడారు. ఆ అనుభవాలనే అక్షరబద్దం చేశారు. ఈ పుస్తకం ఇప్పుడు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఖురానాకు కాసులు కురిపిస్తోంది. ఒక్క రోజులోనే ఆమె మోస్ట్ పాపులర్ రైటర్ గా పేరు సంపాదించారు. వుమెన్ డ్రీమ్స్ అండ్ యాంబిషన్స్ నే ఆమె టార్గెట్ గా పెట్టుకున్నారు. లీన్ ఇన్ ఇండియా పేరుతో ఓ సంస్థను ఖురానా స్థాపించారు. ఒక రోజు ఆమె తండ్రి తనకు చదువుకునేందుకు ఓ పుస్తకం చేతిలో పెట్టారు. అందులో మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ...

రాజ భక్తి సరే..అభ్యంతరాల మాటేమిటి..?

చిత్రం
మనం ఎన్ని చెప్పినా వినిపించుకునే పాలకులు లేరు. ఎందుకంటే అయిదేళ్ల పాటు మనం వారికి అధికారాన్ని రాసి ఇచ్చేశాం కదా. అందుకని వారు చెప్పినట్లు చచ్చినట్లు వినాల్సిందే. లక్షలాది కొలువులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయని ప్రభుత్వం పోలీసులను మాత్రం అడగకుండానే నింపుతోంది. ఎందుకంటే ప్రజలు, విపక్షాలు ఒకవేళ నిరసన వ్యక్తం చేసినా లేదా ఆందోళనలు చేపడితే అరెస్టులు చేయాలి కదా అందుకని. మొత్తం మీద స్వాముల కాలం నడుస్తున్నది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో. ఒకరు విశాఖ పీఠాధిపతి అయితే ఇంకొకరు శంషాబాద్ పరివారంలో ఉన్న స్వామిజి. మొదటి నుంచి భక్తి భావం కలిగిన మన రాష్ట్ర సీఎంకు వారంటే ఎనలేని గౌరవం. ఇంకేం తాను ఆరాధించే శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయాన్ని తిరుమలకు ధీటుగా తీర్చి దిద్దాలని తలపెట్టారు. ఆమేరకు నిధులు మంజూరు చేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఇక ఈ ఆలయ పేరు యాదగిరిగుట్టగా ఉండగా దానిని చిన్నజీయర్ స్వామి వారు యాదాద్రిగా మార్పు చేశారు. దీనిపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. దానిని సీఎం పట్టించుకోలేదు. స్వామి వారికే పూర్తిగా ఆలయ పునర్ నిర్మాణం పనులు అప్పగించారు కేసీఆర్. దీనిని ప్ర...

ఊసూరుమనిపించిన చంద్రయాన్ -2 ..శివన్ ను ఓదార్చిన మోదీ..!

చిత్రం
దేశం యావత్తు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసిన సమయంలో చంద్రయాన్ -2 జాబిలమ్మ దగ్గరకు వెళ్ళినట్లే వెళ్లి ఆచూకీ లేకుండా పోయింది. ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పై కోట్లాది మంది ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. అనుకోని రీతిలో అది ఆగి పోయింది. దీంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఈ సమయంలో ఎంతో కష్టపడినా ఫలితం దక్కక పోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. ఆయనను ప్రధానమంత్రి మోదీ ఓదార్చారు. మీ శ్రమలో ఎలాంటి లోపం లేదు. రాబోయే రోజుల్లో మీరు మరెన్నో విజయాలు సాధించగలరు. మీ కృషి అపారం. అమోఘం. ఇవ్వాళ కాకపోయినా రేపైనా అంతిమ గెలుపు మీదేనని పీఎం శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ఇక జాబిల్లి కొద్ది దూరంలో ఉన్న సమయంలో చంద్రయాన్ -2 వచ్చి ..చిక్కకుండా ఆగి పోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇలా జరిగిందని చైర్మన్ శివన్ వెల్లడించారు. దీనిని ప్రయోగం చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం కీలకమేనని ఆయన పేర్కొంటూ వచ్చారు. ఇదే సమయంలో సాంకేతిక లోపం చోటు చేసుకోవడం వల్లనే ఇలా జరిగిందంటూ తెలిపారు. దాదాపు 90 శాతహానికి పైగా సక్సెస్ ఫుల్ గా జాబిల్లమ వద్దకు చంద్రయాన్ -2 చేరుకున్నది. అక్కడ తేమ, ...

సెక్యూరిటీకే ప్రయారిటీ..రానున్న జియో గేట్

చిత్రం
ధీరుభాయి అంబానీ స్థాపించిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా చేజిక్కించుకునే స్థాయికి అత్యంత దగ్గరలో ఉన్నది. ప్రత్యర్థి కంపెనీలను తలదన్నేలా వినూత్న పంథాను అవలంభిస్తూనే, తన బ్రాండ్ తో పాటు ఇమేజ్ ను పెంచుకుంటూ పోతోంది. బిజినెస్ లో గెలుపు ఓటముల గురించి చర్చ అనవసరం. ట్రెండ్ ను గుర్తించడం. భిన్నంగా ఆలోచించడం. పక్కా ప్లాన్ రూపొందించడం. ఆచరణలో అందరికంటే ముందు ఉండేలా ప్రయత్నం చేయడం. ఇదే మేము అనుసరిస్తున్న పద్ధతి. ఇంతకంటే మేము ఎలాంటి మ్యాజిక్కులు చేయడం లేదంటూ ఇటీవల ముంబై లో జరిగిన రిలయన్స్ కంపెనీల సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు, చైర్మన్ హోదాలో ఉన్న ముకేశ్ అంబానీ. దేశంలో మీరు ఎక్కడికి వెళ్లినా జియో కంపెనీ లోగో ఉండాల్సిందే. అందుకే ప్రతి భారతీయుడి కుటుంబం ఇందులో లీనం కావాలన్న సుదీర్ఘమైన కలల్ని మా తండ్రి ధీరుభాయి కన్నారు. దానిని మేము ఇవ్వాళ దిగ్గజ కంపెనీలను దాటుకుని అందజేయగలిగాం. ఇది నా ఒక్కరితో అయ్యిందనుకుంటే పొరపాటే, నాతో పాటు సంస్థను నమ్ముకున్న లక్షలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సలహాదారులు, మేధావులు, ఇంజనీర్ల శ్రమ దాగి ఉన్నది. ఇప్పుడు మేము తల ఎత్తుకుని చెబ...

రికార్డుల మోత మోగిస్తున్న సాహూ - డార్లింగ్ ప్రభాస్ హవా

చిత్రం
తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి. గత ఏడాదితో పాటు ఈ సంవత్సరం విడుదలైన సినిమాలు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుని ముందుకు వెళుతుండడం ఓ రకంగా శుభ పరిణామమనే చెప్పాలి. ఒకప్పుడు 20 కోట్లు అంటే అతి పెద్ద బడ్జెట్ అనుకునే వాళ్ళం. కానీ రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి మూవీ తీశాడో, ఇక అప్పటి నుంచి తెలుగు సినిమాకు హాలీవుడ్ స్థాయిలో ఓ రేంజ్ వచ్చేలా చేసింది. ఆ తర్వాత ఇతర హీరోలు నటించిన సినిమాలు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ ఒక్క సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి అతడికి ఎనలేని స్టార్ డం తీసుకు వచ్చేలా చేసింది. దాని తర్వాత ఏ సినిమా చేస్తాడోనని అభిమానులు ఉత్కంఠకు లోనయ్యారు. దానిని పటాపంచలు చేస్తూ ప్రభాస్ టాలీవుడ్ లో కేవలం ఒకే ఒక్క సినిమా రన్ రాజా రన్ మూవీ మాత్రమే తీసిన అనంతపురం జిల్లాకు చెందిన సుజీత్ రెడ్డి కి అవకాశం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి అనుభవం లేని డైరెక్టర్ కు సినిమా చేసేందుకు సంతకం చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కానీ ప్రభాస్ అతడిపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఏకంగా ఇండియన...

కాదలే..కాదలే..వైరలే..!

చిత్రం
ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించే కాన్వాస్ సినిమా. అనంతమైన బతుకును..సమాజాన్ని శాసించే కాలాన్ని ఒడిసి పట్టుకునే ఆయుధమే మూవీ. అదో అంతులేని ప్రవాహం. అంతమే లేని ప్రపంచం. ప్రతి సినిమా గొప్పగా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. కానీ అలా ఉండాలని తీసేందుకు లక్షలాది మంది ఫిల్మ్ మేకర్స్ రేయింబవళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. శక్తికి మించి, బతుక్కి మించి కష్టపడుతున్నారు. ఒక్కో సినిమా ఒక్కో లోకం. ప్రతి మూవీ ఆడొచ్చు..ఆడక పోవొచ్చు. కానీ పది కాలాల పాటు గుర్తుంచుకునే సినిమాలు కోకొల్లలు. ప్రతి దృశ్యం ఆకట్టు కోవాలన్నా, గుండెల్లో గూడు కట్టు కోవాలన్నా దమ్ముండాలి. దానికి తెర మీద ప్రాణం పోయాలంటే క్రియేటివిటీ కలిగిన డైరెక్టర్ కష్టపడాలి. అలాంటి వాళ్ళు వేళ్ళ మీద ఉన్నారు. మాటలు, సీన్స్ , పాత్రలు, పాత్రధారులు, విలన్స్, హీరో హీరోయిన్లు అన్నీ ఉన్నా డామినేట్ చేసేది మాత్రం . సంగీత నేపధ్యం. అందుకే అంతటి ప్రాధాన్యత. వేలాది పాటలు ప్రాణం పోసుకుంటున్నాయి. గూగుల్ పుణ్యమా అంటూ యూట్యూబ్ లో లక్షలాదిగా కావాల్సిన పాటలన్నీ, కోల్పోయిన వన్నీ తిరిగి లభిస్తున్నాయి. ఒకందుకు దానికి రుణపడి ఉండాలి మనమంతా. గాయని గాయకుల్లో ఎందరో తమ గ...

అభివృద్ధికి ఆమడ దూరం..ఉస్మానియాపై ఎందుకంత కోపం..?

చిత్రం
ఈ దేశంలో సామాజిక చైతన్యం కలిగిన యూనివర్సిటీస్ లలో మొదటి పేరు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు దిక్కులేనిదైంది. తాజాగా వందేళ్ల ఉత్సవం జరుపుకున్నా కనీస వసతులకు నోచుకోని దుస్థితికి దిగజారి పోయింది. నిత్య చైతన్యానికి, జీవన పోరాటానికి ప్రతీకగా ఉన్న ఈ చదువుల తల్లి ఇప్పుడు ఆసరా కోసం వేచి చూస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది. వేలాది మంది చైతన్యం కలిగిన విద్యార్థులు, తెలంగాణ ప్రాంతపు బిడ్డలు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. ఖాకీల దాస్టికానికి బలై పోయారు. ఇంకొందరు నామ రూపాలు లేకుండా పోయారు. ఈ దేశపు అభివృద్ధిలో, పునర్ నిర్మాణంలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారంతా ఈ ఉన్నత విద్యాలయం నుంచి వచ్చిన వారే. ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసిన ఘనత ఇక్కడ,.ఈ నాలుగు గోడల మధ్యన చదువుకున్న వారిదే. జాతికి జీవగర్రలాగా మారిన చరిత్రను స్వంతం చేసుకున్నది ఇక్కడే. పోరాటాలకు, ఆరాటాలకు నెలవై పాటలకు, కవితలకు ప్రాణం పోసుకున్నది ఈ జాగాలోనే. ఎంత చెప్పినా తక్కువే . ఒక ఏడాది కాదు ఒక దశాబ్డం పడుతు...

అమోఘం..అద్భుతం..ఆనంద సాయి కళా నైపుణ్యం..!

చిత్రం
కళా దర్శకుడిగా, అద్భుతమైన ఆర్కిటెక్ట్ గా వినుతి కెక్కిన ఆనందసాయి కళా నైపుణ్యం మరోసారి వేలాది మంది భక్తుల హృదయాలను తాకుతోంది. తెలంగాణకే తలమానికంగా భావించే శ్రీ లక్ష్మి నరసింహ్మస్వామి కొలువై వున్న యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, నభూతో న భవిష్యత్ అన్న రీతిలో తీర్చి దిద్దుతున్నారు. ఆర్కిటెక్ట్ గా ఎంతో అనుభవం కలిగిన ఆయనను ఏరి కోరి జగత్ గురు శ్రీ చిన్న జీయర్  స్వామి అప్పగించారు. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. ఆలయ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్పనైన ఆలయంగా తీర్చి దిద్దాలని, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఇస్తానని చెప్పారు. వెంటనే నిధులు మంజూరు చేశారు. ఆనంద సాయి పర్యవేక్షణలో ఆలయ పనులు సాగుతున్నాయి. వందలాది మంది శిల్పులు ఈ దైవ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. ఆనంద సాయి శిల్పా కళా నైపుణ్యం కలిగిన వారు. అందుకే ఈ ఆలయం సుందరంగా రూపొందుతోంది. కళా దర్శకుడిగా ఆయన సినిమా రంగంలో పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆయనకు ఉపయోగ పడింది. ఆనం...

అదివో అల్లదివో శ్రీనివాసం..అన్న దానం..మహా ప్రసాదం..ఎన్టీఆర్ పుణ్యం..!

చిత్రం
కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా, కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా వినుతికెక్కిన  శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలు కొలువు తీరిన శ్రీ తిరుమల పుణ్యక్షేత్రం ఆదాయంలో చరిత్రను తిరుగ రాస్తోంది. కోట్లాది రూపాయలు, లెక్కలేనంత ..లెక్కించలేనంత బంగారం, వజ్రాలు, వైఢూర్యాలతో అలరారుతున్న ఈ స్థలం భక్తులకు సేద దీరేలా చేస్తోంది. అనునిత్యం పూజలతో మనసు దోచుకుంటున్న ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. పామరుల నుంచి పండితుల దాకా , సామాన్యుల నుంచి డబ్బున్నోళ్ల దాకా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా కొలువబడుతూ,  కోరుకున్న వెంటనే కోరికలు తీరుస్తూ , ఆశీస్సులు అందజేస్తూ వినుతికెక్కారు స్వామీ, అమ్మవార్లు. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమలను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో పాటు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. అంతే కాకుండా రవాణా సౌకర్యం, ఉచిత వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. అన్నిటికంటే ముందే దర్శనం కోసం బుకింగ్ చేసుకున్న వారికంటే, నడక దార...