పోస్ట్‌లు

మే 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

.జెట్ ఎయిర్ వేస్‌కు ఎథిహాద్ కాయ‌క‌ల్ప చికిత్స

చిత్రం
అన్నం పెట్టే రైతుల‌కు రుణాలు మంజూరు చేయాలంటే నానా ఇబ్బందుల‌కు గురి చేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇపుడు సంక్షోభం దిశ‌గా నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ‌ను గ‌ట్టెక్కించేందుకు నానా తంటాలు ప‌డుతోంది. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ఎస్‌బిఐలో పైసా పైసా కూడ‌బెట్టుకున్న డ‌బ్బుల‌ను అప్ప‌నంగా జెట్ ఎయిర్ వేస్ కు క‌ట్ట‌బెట్టింది. తాము స‌ర్వీసులు న‌డిపే స్థితిలో లేమంటూ స‌ద‌రు యాజ‌మాన్యం చేతులెత్తేసింది. దీంతో దానిని తిరిగి నిల‌బెట్టేందుకు ఎస్‌బిఐ నేరుగా రంగంలోకి దిగింది. ఇత‌ర డ‌బ్బున్న వ్యాపారులు, సంస్థ‌లు, కంపెనీల‌తో చ‌ర్చోప చ‌ర్చ‌లు చేస్తోంది. ఆ బ్యాంకు చీఫ్ ర‌జ్‌నీష్ కుమార్ ఈ మేర‌కు త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కుంద‌ని స్ప‌ష్టం చేశారు. విమానాలు న‌డుపుతున్న జెట్ ఎయిర్ వేస్ ప్రైవేట్ కంపెనీకి ఎస్‌బిఐ ఏకంగా కోట్లాది రూపాయ‌లు రుణంగా అంద‌జేసింది. ఇపుడు స‌ద‌రు కంపెనీ బ్యాంకుకు 8 వేల 400 కోట్లు బాకీ ప‌డింది. ఇంత మొత్తం డ‌బ్బుల‌న్నీ ప్ర‌జ‌ల‌వే. తిరిగి రోప్ వేపై విమానాలు తిరుగుతాయ‌ని ఈ బ్యాంక‌ర్ చీఫ్ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నారు. జెట్ ఎయిర్ వేస్ ను ద‌క్క...

డెలివ‌రూ కంపెనీకి అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్

చిత్రం
ప్ర‌పంచంలోనే ఈకామ‌ర్స్ రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న అమెరిక‌న్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ప‌లు కంపెనీల‌లో పెట్టుబడులు పెడుతున్న స‌ద‌రు కంపెనీ యుకెలో ఆదాయ‌ప‌రంగా దూసుకెళుతున్న ఫుడ్ కంపెనీ డెలివ‌రూలో ఏకంగా 575 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఫుడ్ కంపెనీ 14 దేశాల‌కు విస్త‌రించింది. యుకె, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, సింగ‌పూర్, తైవాన్, ఆస్ట్రేలియా, యుఏఇలో న‌డుస్తోంది. డెలివ‌రూలో పెట్టుబ‌డి పెట్ట‌డంతో అత్య‌ధికంగా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా అమెజాన్ రికార్డ్ బ్రేక్ చేసింది. అమెజాన్ తోడవ‌డంతో వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో ఒక్క‌సారిగా ఆదాయ వృద్ధి సూచిక ప‌రుగులు పెట్టింది. 1.43 బిలియ‌న్ డాల‌ర్లు అమాంతం పెరిగాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా డెలివ‌రూ ఫుడ్ కంపెనీకి సంబంధించి 80, 000 వేల రెస్టారెంట్లు ఉన్నాయి. 60,000 వేల మంది డెలివ‌రీ చేస్తుండ‌గా..2 వేల 500 ప‌ర్మినెంట్ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే ఫుడ్ రంగంలో పోటీ ప‌డుతున్న ఉబెర్ ఈట్స్ కంపెనీతో డెలివ‌రూ పోటీ ప‌డుతోంది. త‌న‌కు పోటీ ఇస్తున్న డెలివ‌రూ ఫుడ్ కంపెనీని కొనుగోలు చేయాల‌ని ఉబెర్ ఈట్స్ యాజ‌మా...

చంద్ర‌బాబు మంత్రాంగం ఫ‌లించేనా ..?

చిత్రం
వ‌య‌సు మీద ప‌డినా ఎలాంటి తొట్రుపాటు ప‌డ‌కుండా యువ‌తీ యువ‌కుల‌తో పోటీ ప‌డుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వాన్ని ఆయ‌న గ‌డించారు. పాల‌నాప‌రంగా ప‌రిపాల‌నాద‌క్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ప‌రిపాల‌న సాగించారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న తెలంగాణ ప్రాంతాన్ని స‌రిగా అర్థం చేసుకోలేక పోయారు. ఇక్క‌డి అపార‌మైన వ‌న‌రుల‌ను గుర్తించారు. వాటిని త‌మ ప్రాంతానికి త‌ర‌లించుకు పోయేలా చేశారు. అంతేకాకుండా పూర్తిగా ఈ ప్రాంతాన్ని ప‌క్క‌న పెట్టారు. ఆయ‌న పాల‌నలో తెలంగాణ ప్ర‌జ‌లు న‌ర‌కాన్ని చ‌వి చూశారు. తీవ్ర‌మైన క‌ర‌వు కాట‌కాల‌కు లోన‌య్యారు. కొలువుల్లోను, నిధుల కేటాయింపుల్లోను..నీళ్ల పంపిణీలోను తీవ్ర‌మైన వివ‌క్ష‌కు లోనైనా ప‌ట్టించు కోలేదు. ఎక్క‌డ‌లేని ప్ర‌యారిటీ రాయ‌ల‌సీమ‌, ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేత‌ల‌కు దార‌ద‌త్తం చేశారు. అన్నింటికంటే ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు తెర లేపారు. ప్ర‌పంచ బ్యాంకుకు ఏపీలో ప్ర‌భుత్వ ప‌రంగా రెడ్ కార్పెట్ ప‌రిచారు. జ‌న్మ‌భూమి పేరుతో కాల‌యాప‌న చేశారు. అన్నింటికంటే విద్యుత్ స‌ర‌ఫ‌...

ఓలాకు హ్యూందాయి ఎల‌క్ట్రిక‌ల్ కార్లు

చిత్రం
సౌత్ కొరియా ఆటోమేక‌ర్ హ్యూందాయి మోటార్స్ కంపెనీ త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే ఏసియాలో కార్ల అమ్మ‌కాల‌లో టాప్ 2 పొజిష‌న్‌లో ఉన్న ఈ కంపెనీ స‌రికొత్త‌గా ఆలోచిస్తోంది. ఇత‌ర సంస్థ‌ల‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం క‌లిగి ఉండేలా ఒప్పందాలు చేసుకుంటోంది. ఇండియాలో ఇప్పిట‌కే ఓలా అద్దెకు వాహ‌నాల‌ను స‌మ‌కూర్చి పెడుతోంది. 2021 వ‌ర‌కు ద‌క్షిణ కొరియా కార్ల కంపెనీ యాజ‌మాన్యం ఓలాతో ఒప్పందం చేసుకుంది. సంత‌కాలు కూడా జ‌రిగి పోయాయి. విద్యుత్ సామ‌ర్థ్యంతో న‌డిచేలా ఎల‌క్ట్రిక‌ల్ హ్యూందాయి కార్ల‌ను ఓలాకు స‌ర‌ఫ‌రా చేసేందుకు ఇప్ప‌టి నుంచే త‌యారీలో నిమ‌గ్న‌మైంది. స్మార్ట్ ఈవి ప్లాట్ ఫాం ప‌ద్ధ‌తిన ఈ వెహికిల్స్ ఇండియాకు రానున్నాయి. ఓలాకు చేరుకోనున్నాయి. హ్యూందాయి కంపెనీకి స‌హ కంపెనీగా కియా మోటార్స్ లిమిటెడ్ సంస్థ ఉంది. తాజాగా కియా కంపెనీ ఓలా కంపెనీలో 300 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్టింది. విద్యుత్ వాహ‌నాల‌తో పాటు ఇన్‌ఫ్రాస్ట్ర‌క్ష‌ర్ కూడా అంద‌జేయ‌నుంది. దీని వ‌ల్ల గ్లోబ‌ల్ మార్కెట్‌లో త‌న వాటా పెంచుకోవాల‌నే వ్యూహంతో హ్యూందాయి ఈ డిసిష‌న్ తీసుకుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు...