పోస్ట్‌లు

జనవరి 6, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

బన్నీ ప్రాసలు..త్రివిక్రమ్ పంచ్..లు

చిత్రం
మీరే నాకు ప్రాణం. మీరు లేకపోతే నేను లేను. నా కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చింది. ఈ సమయాన్ని నేను ఎంజాయ్ చేశా. చిరజనీవి గారంటే ఎంతో అభిమానం. ఈ శరీరం అంటే కట్టే కాలేంత దాకా నేను ఆయనను మరిచి పోలేను. మీరేమో పవన్ కళ్యాణ్ గూర్చి మాట్లాడమంటున్నారు. ఒకే..చిరు తర్వాత నేను ఇష్టపడే మరో హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సర్. వీరిని చూస్తూ పెరిగా అన్నారు బన్నీ. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. మ్యూజికల్‌ కన్సర్ట్‌లో అల్లు అర్జున్‌ ఉద్వేగంగా మాట్లాడాడు. నా సినిమాలకు చాలా గ్యాప్‌ వచ్చింది..నేను ఇవ్వలా..వచ్చింది. సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా. కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌లో గ్యాప్‌ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు. మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్‌ బ్యాండ్‌ కల్చర్‌ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది..ముందు నచ్చేది కాదు....

మహేష్ ను మరిచి పోలేను

చిత్రం
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అంటే యూత్ కు ఏమా క్రేజ్. ఆయన మోము, నవ్వు ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే అమ్మాయిలకు తెగ నచ్చుతాడు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఒక్కసారైనా ఆయనతో నటిస్తే చాలనుకుని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వారిలో తాజాగా గీత గోవిందం ఫెమ్ రష్మిక మందన్న కూడా చేరి పోయారు. ఈ అమ్మడు కొద్దీ సినిమాల్లోనే నటించినా ఏకంగా మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాదు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరూ అంటూ మనల్ని పలకరిస్తుంది. ఈ అమ్మడు మహేష్ ను పొగడ్తలతో ముంచెత్తింది. తాజాగా జరిగిన ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి తనను కాంట్రాక్ట్ ఏమైనా చూసుకున్నావా అంటూ సరదాగా కామెంట్ చేశారు. నేను చాలా సెటిల్డ్‌ యాక్టర్‌ని. డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో చాలా ఎమోషనల్‌గా నటించాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫుల్‌ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను అన్నారు రష్మికా మందన్నా. దర్శకుడు అనిల్‌ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్‌ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింప...

యుద్ధ మేఘాలు..ఇండియాకు కష్టాలు

చిత్రం
అమెరికా కాలు దువ్వుతోంది. ఇరాన్ పై ఏక పక్షంగా దాడులకు దిగుతోంది. మరో వైపు ఇరాన్ మాత్రం ఊరుకో బోమంటూ లక్షలాది మంది సాక్షిగా ఆ దేశాధినేత అయతుల్లా ఖొమేనీ హెచ్చరించారు. అంతే కాదు తం దేశంలోని ఎనిమిది కోట్ల మందిలో ఒక్కొక్కరి నుంచి ఒక్కో డాలర్ వసూలు చేసి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తలను తీసుకు వస్తే 537 కోట్లు ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో బతుకు దెరువు కోసం మన భారతీయులు చాలా మంది ఇరాన్ లో ఉన్నారు. తాజాగా ఇరాన్‌ మిలటరీ కమాండర్‌ ఖాసీ సులేమానిని అమెరికా లక్షిత దాడుల్లో హత మార్చడంతో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా భగ్గు మన్నాయి. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలవుతుందని, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని సోషల్‌ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇరువర్గాల దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్న నేటి పరిస్థితుల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవ కాశాలు లేవు. ఇరాన్, అమెరికా మధ్య పరిమిత యుద్ధం జరిగినా భారత్‌ బాగా నష్టపోవాల్సి వస్తోంది. యుద్ధం వల్ల భారత్‌కు ప్రాథమికంగా రెండు ముప్పులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో వ...

పెద్దన్న తలకు వెల

చిత్రం
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఏ క్షణం లోనైనా మరో వార్ కు సై అంటున్నాయి. అంతే కాదు ఒకరిపై మరొకడు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదే సమయంలో అమెరికా ఏకపక్ష దాడుల్లో ఇరాన్ భారీగా నష్ట పోయింది. ఈ దాడులను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా ఇరాన్‌ జనరల్‌ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తలకు ఇరాన్‌ వెల కట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు 575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్‌ దాడిలో చనిపోయిన జనరల్‌ సులేమానీ మృతదేహం ఇరాన్‌ రాజధాని బాగ్దాద్‌ చేరుకుంది. సులేమానీకి లక్షలాది మంది కన్నీళ్లతో నివాళులు అర్పించారు. అనంతరం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్‌ సులేమానీ, తదితరులకు చెందిన శవ పేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్‌లోని 8...

లివింగ్ మ్యూజిక్ లెజెండ్

చిత్రం
అల్లా రఖా రెహమాన్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ ఏఆర్ రెహమాన్ అంటే మాత్రం లోకం వెంటనే గుర్తు పడుతుంది. చిన్నగా మొదలైన ఈ సంగీతపు శిఖరం గురించి ఎంత చెప్పినా తక్కువే. 1967 జనవరి 6 న జన్మించాడు ఈ దిగ్గజం. రెహమాన్ అసలు పేరు ఏ.ఎస్. దిలీప్ కుమార్. స్వరకర్త. గాయకుడు. సంగీత దర్శకుడు. గీత రచయిత. నిర్మాత. సంగీతకారుడు అంతే కాదు జగమెరిగిన భక్తుడు.దానకర్త కూడా. భారతీయ సంగీత ప్రపంచాన్ని తన ప్రతిభతో గుర్తింపు తెచ్చినవాడు. ఎందరో కొత్త గాయనీ గాయకులను పరిచయం చేశాడు. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలోనే ఫాదర్ ను కోల్పోయాడు. తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పని చేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమ కూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ సినిమా ఇండియన్ సినీ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది. మొదటి సినిమా తోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కించుకున్నాడు. అలా రోజాతో స్టార్ట్ అయినా రెహమాన్ సంగీతపు ప్రయాణం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నది. లోకం అంతటా నిద్రలోకి జారుకున్నప్పు...

నేను గర్భవతి కానున్న పదుకొనే

చిత్రం
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే మీడియాపై ఫైర్ అయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి మండిపడటంతో అంతా అవాక్కయ్యారు. నేను గర్భవతిలా కనిపిస్తున్నానా అంటూ బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చపాక్‌ సినిమా ప్రమోషన్లలో దీపిక బిజీగా ఉన్నారు. పలు రియాలిటీ షోలు, కార్యక్రమాలకు హాజరవుతూ అభిమానులతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా చపాక్‌తో పాటు తన తదుపరి సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ..షకున్‌ బాత్రా దర్శకత్వంలో తెర కెక్కనున్న సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో ప్రారంభం అవుతుంది. ఇంకా టైటిల్‌ నిర్ణయించ లేదు. అయితే 2021, ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్‌ షోలో చపాక్‌ను ప్రమోట్‌ చేస్తారా అని  అడుగగా..ఇందుకు సంబంధించి నిర్వాహకులతో ఎలాంటి చర్చ జరగ లేదన్నారు. ఈ విధంగా దీపిక తన మూవీ బిజీ షెడ్యూల్‌ గురించి ఓపి...

బరువుతోనే ఇబ్బంది

చిత్రం
సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. దానికి మించి అందం, అభినయం ఉండాలి. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగిన అనుష్క తాజాగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీయబోయే సినిమాకు ఎంపికైంది. గౌతమ్ సినిమా అంటేనే వెరీ వెరీ స్పెషల్. మిగతా దర్శకులు వేరు..మీనన్ సినిమాలు వేరు. ఇదిలా ఉండగా అనుష్క ఈ మధ్య లావెక్కింది. అయితే ఎంత అందం ఉన్నా దానికి బరువు పెద్ద భారమే అవుతుంది. అలాంటి అందమైన నాజూకుతనాన్ని అనుష్క సైజ్‌ జీరో చిత్రం కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బరువు తగ్గడానికి నానా తంటాలు పడింది. కసరత్తులు, యోగా వంటివి చేయాల్సినంతా చేసింది. చివరికి అమెరికాకు వెళ్లి ఆధునిక వైద్యం చేయించుకుంది. ఇందు కోసం కొంత కాలం నటనకు దూరం అయింది కూడా. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. సైజ్‌ జీరో చిత్రం తరువాత బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో కూడా నటించింది. బాహుబలి 2లో అనుష్కను స్లిమ్‌గా చూపించడానికి ఈ చిత్ర యూనిట్‌ గ్రాఫిక్స్‌ను ఉపయోగించక తప్ప లేదు. అందుకు భారీగానే ఖర్చు చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి బహిరంగంగానే చెప్పారు. ఆ తరువాత అనుష్క నటించిన భాగమతి చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌తో అనుష్క...

సిద్దూపై మీనాక్షి ఫైర్

చిత్రం
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సింగ్ సిద్దూపై బీజేపీ లీడర్ మీనాక్షి లేఖి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ అనుసరిస్తున్న తీరును ఆమె ఖండించారు. పాకిస్తాన్‌లో నాన్‌ కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడిని తాను  తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. అయితే దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎక్కడికి పారి పోయారో తనకు తెలియదని, ఎవరైనా కని పెట్టాలంటూ చురకలంటించారు. పాకిస్తాన్‌లోని మతపరమైన ప్రదేశాలలో నిరంతరం హింస చోటు చేసుకుంటుందని ఆరోపించారు. కొన్ని దశాబ్దాలుగా బలవంత మత మార్పిడులు, అత్యాచారాలతో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పా​కిస్తాన్‌లో యువతులను బలవంతంగా ఎత్తు కొచ్చి వారికి మత మార్పిడిలు చేసి ముస్లిం అబ్బాయిలకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి అక్కడ వేల సంఖ్యలో జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం అరి కట్టాల్సింది పోయి వారికి వత్తాసు పలకడం దారుణమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడ హింస నిరంతరాయంగా కొనసాగు తుండడంతో మైనారిటీలు భారతదేశంలోకి బలవంతంగా చొరబడుతున్నారు. దీనివల్ల దేశంలో పౌరసత్...