పోస్ట్‌లు

డిసెంబర్ 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రమ్యా..పెళ్లి..వైరల్

చిత్రం
సోషల్ మీడియా పుణ్యమా అంటూ క్షణాల్లో పాపులర్ అవుతున్నారు. ఇటీవల టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో నటీనటులు హల్ చల్ చేస్తున్నారు. అనుకోని రీతిలో కొందరు నటీమణులకు పెళ్లిళ్లు అయి పోయా యంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిన్నటి దాకా సోగకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి కూడా న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న రమ్యా నంబీశన్‌ పెళ్లి చేసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కోలీవుడ్‌లో రామన్‌ తేడియ సీత, ఆట్ట నాయగన్, ఇళైంజన్‌ కుళ్లనరి కూట్టం, పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీకి జంటగా తమిళరసన్‌ చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా ఈ కేరళ కుట్టి ఇటీవల మలయాళంలోనూ నటిస్తోంది. కాగా ఇటీవల ఈ అమ్మడు పట్టు చీర ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలిప్పుడు వైరల్‌ అవ్వడంతో పాటు నటి రమ్యా నంబీశన్‌ రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. కొందరు ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. దీంతో షాక్‌ అయిన రమ్యానంబీశన్‌ తనకు పెళ్లి అయ్యిందా అంటూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తూ తన...

ఇన్వెస్ట్రర్స్ కు భలే ఛాన్స్

చిత్రం
ఇండియన్ మార్కెట్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీగా అవతరించింది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీ మరో రికార్డు నమోదు చేసింది. మదుపు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి దాకా నష్ట పోలేదు. ఇది కూడా ఓ చరిత్రే. గత ఐదేళ్ళలో అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఈ కంపెనీ 5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ తేల్చింది. అధికంగా సంపద తెచ్చి పెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద 49 లక్షల కోట్లుగా ఉంది. ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ కాలంలో 5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు అని నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమ కూర్చిన టాప్‌ 3 కంపెనీలుగా ఆర్‌ఐఎల్, ఇండియా బుల్స్‌ వెంచర్స్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చి పెట్టిన వాటిల్లో ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ వరుసగా రెండో సారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండ...

కంపెనీల కోసం వేదాంత వేట

చిత్రం
భారతీయ వ్యాపార రంగం ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా ఒడిడుకులు ఎదుర్కుంటోంది. మోడీ ప్రభుత్వం కొలువు తీరికా వ్యాపారులకు, కంపెనీలకు కష్టకాలం మొదలైంది. ఆర్ధిక రంగం పూర్తిగా పక్కదారి పట్టింది. ఆర్ధిక వృద్ధి రేటు కిందకే తప్ప పైకి ఎగబాకడం లేదు. దీంతో వ్యాపారం నేలచూపులు చూస్తోంది. ఇండియన్ మార్కెట్ లో అత్యధిక వాటా కలిగిన వజ్రాల బిజినెస్ ఊసే లేకుండా పోయింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ చేసిన మోసానికి దాదాపు మొత్తం డైమండ్ పరిశ్రమపై పడింది. దీంతో ఇదే రంగంపై ఆధారపడి బతుకుతున్న 10 లక్షల మంది కార్మికులు రోడ్డు పాలయ్యారు. ఇంత ఇబ్బందులు పడుతున్నా మోడీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా ఓ వైపు ప్రభుత్వ కంపెనీలు ఒకప్పుడు బాగా నడిచేవి. చాలా సంస్థలు, కంపెనీలకు పెద్ద ఎత్తున నికర, స్థిర ఆస్తులున్నాయి. వీటిని మోడీ, అమిత్ షా కలిసి అమ్మేసే పనిలో పడ్డారు. అయితే దీనికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో పవర్ లోకి వచ్చింది. కొలువు తీరాక దానిని పూర్తిగా మరిచి పోయింది. ఇదే సమయంలో విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కానీ ఇండియాలో వ్యాపార పరంగా లాభాల బాటలో నడుస్తున్న వాటికి కొనుగోలు ...

ఇక నుంచి రుచి..పతంజలి

చిత్రం
చూస్తే బాబా..కానీ రాందేవ్ బాబా అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలకు దడ. తక్కువ కాలంలో తన పేరుతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఒకే ఒక్క యోగా గురు. అవసరమైతే ప్రపంచంలో ఎక్కడికైనా తాను అనుకుంటే చాలు క్షణాల్లో వెళ్లగలడు. ప్రపంచ మార్కెట్ లో తమ హవా కొనసాగిస్తూ, ఇండియాపై పెత్తనం చెలాయించాలి అనుకున్న ప్రతి కార్పొరేట్ కంపెనీకి దిమ్మ తిరిగేలా కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ యువతీ యువకులకు, వ్యాపార వేత్తలుగా రాణించాలని అనుకునే వాళ్లకు ఆయనో ఓ ఐకాన్. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని మొత్తం మార్కెట్ రంగాన్ని పతంజలి శాసిస్తోంది. బాలకృష్ణ, రాందేవ్ బాబా ల ఐడియాల ముందు కార్పొరేట్ కంపెనీలు తేలిపోయాయి. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా పతంజలి అన్న బోర్డు తప్పక ఉండే ఉంటుంది. ప్రతి భారతీయుడు తమ ఉత్పత్తులను వాడుకునేలా చేసిన ఘనత పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీయివో బాలకృష్ణ ఆచార్య దే. రాందేవ్ బాబాకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడానికే ఆయనే కారణం. ప్రస్తుతం ఆయుర్వేద రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. మోదీతో చనువు ఉండటం కూడా తన బిజినెస్ ను మరింత విస్తరించేందుక...

సోషల్‌ మీడియాపై డేగ కన్ను

చిత్రం
సోషల్ మీడియా దెబ్బకు దేశాలు, బిగ్ చాప్స్ తో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఇండియాలో ఇది మరింతగా పెరిగింది. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడం, అపరిమితమైన డేటా వినియోగించుకునే వీలుండడంతో డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువై పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీంతో మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటోంది. దీనికే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీనిని కంట్రోల్ లో పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా పోస్టింగ్‌లు పెడితే అంతే సంగతులు. 24 గంటల్లో కేసు నమోదు చేస్తారు. ఇలా కేసుల్లో ఇరుక్కున్న వారికి లక్ష రూపాయల జరిమానా లేదా 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త.. సోషల్‌ మీడియా పోస్టులపై సైబర్‌ క్రైం పోలీసులు కన్నేశారు. ఇష్టం వచ్చినట్లు, చూసు కోకుండా ఎలా పడితే అలా పోస్టులు పెడితే ఇట్టే బుక్కవుతారు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఆ ఫోన్లు వాడుతున్న వారికి కూడా నెట్‌ అందుబాటులో ఉంటోంది....

నేరగాళ్లు..దారుణాలు

చిత్రం
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. దిశ హత్య కంటే ముందే నలుగురు నిందితులు మరో 9 మంది మహిళలపై హత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా పోలీసుల విచారణ తేలింది. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో ఈ కీలక విషయాలు బయట పడ్డాయి. ప్రధాన సూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు, చెన్న కేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాల సమాచారం. ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృత దేహాలను దిశ మాదిరిగానే దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గతంలో జరిగిన హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్టులను పోలీసులు పరిశీస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీస్తున్నారు. దీని కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేధించాలని పోలీసులు చెబుతున్నారు. అయితే డీఎన్‌ఏ పరిశీలనలో భాగంగా పలు పాత కేస...

అంకురాల్లో ఇండియా హవా

చిత్రం
అంకుర సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పనలో భారత్ తన హవా కొనసాగిస్తోంది. ఈ మేరకు స్టార్టప్‌ వ్యవస్థకు సంబంధించి మన దేశం మూడో ప్లేస్ లో నిలిచింది. ఏకంగా ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్‌ ఏర్పాటయ్యాయి. గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య దాదాపు 9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వెల్లడించింది. గతేడాది టెక్‌ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 8,200 దాకా వుంటే ఈసారి కొద్దీ మేర పెరిగింది. ఇదే ఊపు కొనసాగితే 2014–2025 మధ్య కాలంలో భారత స్టార్టప్‌ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదని వెల్లడించింది. ఇక 2025 నాటికి యూనికార్న్‌ల సంఖ్య దేశీయంగా 95 –105 శ్రేణిలో ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేస్తోంది. 2014లో 10–20 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్‌ వ్యవస్థ వేల్యుయేషన్‌ 2025 నాటికి 350–390 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. సంఖ్యా పరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంది. కొత్తగా వస్తున్న టెక్‌ స్టార్టప్‌ల్లో 12–15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటుండటం...

వేలంపాటలో వీరులెవ్వరో

చిత్రం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పండుగ రానే వచ్చింది. టోర్నీలో దుమ్ము రేపేందుకు వరల్డ్ వైడ్ గా టాప్ పొజిషన్ లో ఉన్న ఆటాగాళ్ళ వేలానికి రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయానికి వేళయింది. ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆట కోసం ఆటగాళ్ల వేలం పాట జరగనుంది. భారత యువ క్రికెటర్లతో పాటు ప్రధానంగా ఆ్రస్టేలియా, వెస్టిండీస్‌ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఇందులో ధరలు పలికే ధీరులు ఎందరో తేలాలంటే వేలం ముగిసే దాకా ఎదురు చూడాలి. ఓవరాల్‌గా ఎనిమిది జట్లలో మొత్తం 73 ఖాళీలుండగా, ఈ వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.  ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్‌ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది. కరీబియన్‌ హిట్టర్‌ హెట్‌మైర్‌ ప్రధాన ఆకర్షణ కావొచ్చు. ప్రస్తుతం అతను అసాధారణ ఫామ్‌ కనబరుస్తుండటంతో ఎంతైనా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు రెడీ అంటున్నాయి.  టెస్టులకు పరిమితమైన హనుమ విహారి, పుజారా 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్...

విశాఖలో పరుగుల సునామీ

చిత్రం
మొదటి వన్డేలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. సాగర తీరం సునామీతో హోరెత్తింది. ఫోర్లు, సిక్సర్లతో పోటెత్తింది. బంతులు వేగంగా బౌండరీలు దాటాయి. చెన్నైలో దెబ్బ తిన్న టీమిండియా తగిన రీతిలో రిప్లై ఇచ్చింది. రోహిత్, రాహుల్‌ రెచ్చి పోతే  అయ్యర్, పంత్‌ లో దూకుడు పెంచడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. ఇండియన్ బౌలర్లు తమదైన శైలిలో విండీస్ ను కట్టడి చేశారు. హోప్, పూరన్‌ పోరాడినా ఫలితం లేక పోయింది. ఈ వన్డేలో ఏకంగా ఇరు జట్లు కలిసి 667 పరుగులు చేస్తే, 29 సిక్సర్లు కొట్టారు. ఈ మ్యాచ్ లో 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ మరోసారి తన ప్రతిభ చూపాడు. 138 బంతుల్లో 159  పరుగులు చేశాడు. రాహుల్‌ 104 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించారు. అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ 32 బంతుల్లో 53 పరుగులు చేస్తే, రిషభ్‌ పంత్‌ 16 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఇండియా భా...