పోస్ట్‌లు

నవంబర్ 3, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పొదుపు భవిష్యత్..కు మలుపు

చిత్రం
కదిలే కాలంలో జీవన ప్రయాణం మరింత కష్టంగా మారింది. బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు కనీసం వేళల్లో డబ్బులు రావాలి. లేకపోతే జీవించడం కష్టమవుతుంది. ఉన్నదంతా తినేందుకు సరిపోతే ఇక దాచు కోవడం ఎట్లా అన్నది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. తెలివి, అర్హత ఉన్నా చేసేందుకు పని దొరకడం లేదు. కేంద్రంలో బీజేపీ కొలువు తీరాక మరింత తీవ్ర రూపం దాల్చింది నిరుద్యోగం. మనుషులకు భద్రత లేకుండా పోయింది. అంతటా బాధ్యతా రాహిత్యమే రాజ్యమేలుతోంది. దీంతో దినదిన గండం అర్ధాయుస్సు అన్నట్టుగా తయారైంది. సంపాదించిన దాంట్లో కొద్దిగా దాచుకుంటే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. లేక పోతే కస్టాలు కొని తెచ్చుకున్న వారవుతాం. ఇవ్వాళ కొద్ది మొత్తంలో దాచుకున్న డబ్బులు రేపు పెద్ద మొత్తంలో జమ అవుతాయి. అవే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు భరోసా కలుగ చేస్తాయి. ఇండియాలో ఎక్కువగా పొదుపు చేసే అలవాటు మహిళల్లోనే ఉంటోంది. పొదుపు సంఘాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఈ మేరకు పొదుపుపై ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలి...

గల్లీ పోరడు..దుమ్ము రేపిండు

చిత్రం
తెలుగు వాకిళ్ళలో అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు మన తెలంగాణకు చెందిన హైదరాబాద్ పోరడు రాహుల్ సిప్లిగంజ్. మనసులో ఏదీ పెట్టుకోకుండా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఈ పోరడు ఇప్పుడు అంతటా వైరల్ గా మారి పోయిండు. సామాజిక మాధ్యమాల్లో, గూగుల్ సెర్చింగ్ లో మనోడి పేరు ఎక్కువగా చక్కర్లు కొట్టింది. గాయకుడిగా, రచయితగా ఇప్పటికే పాపులర్ అయ్యాడు. ఎక్కువగా పబ్లిసిటీ అంటే ఇష్టపడని ఇతడికి వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ మా టీవీ టెలికాస్ట్ చేసిన రియాల్టీ షో లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు. ఎన్ని టాస్కులు నిర్దేశించినా వాటిని దాటుకుని అంతిమ పోరులో విన్నర్ గా నిలిచాడు సిప్లిగంజ్. ఈ షో ఇప్పటికే ఇండియా అంతటా పాపులర్ అయ్యింది. తెలుగులో మొదటి సారిగా మా టీవీ దీనిని స్టార్ట్ చేసింది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ను హోస్ట్ చేశాడు. రెండో షో ను నటుడు నాని సక్సెస్ చేశాడు. ముచ్చటగా మూడో సారి ఇదే టీవీలో లవర్ స్టార్ అక్కినేని నాగార్జున దీనిని టాప్ రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు. తన అందం, అభినయం తో పాటు ఆద్యంతమూ జనరంజకంగా మలిచేలా చేశాడు. దీంతో బు...

కూనలు భళా..పులులు డీలా

చిత్రం
నిన్నటి దాకా తమకు ఎదురే లేదని ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు కూనలుగా భావించిన బంగ్లాదేశ్ జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. పేలవమైన బ్యాటింగ్, పదును లేని బౌలింగ్‌ తో భారత్‌ తొలిసారి టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ చేతిలో బోల్తా పడింది. ఢిల్లీలో జరిగిన ఈ ఆటలో  బంగ్లా టీమిండియాను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి ఇండియాను వారి సొంత గడ్డపైనే ఓడించి సగర్వంగా నిలిచింది. షకీబ్, తమీమ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే ఆ జట్టు ప్రదర్శించిన స్ఫూర్తి దాయక ఆటతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఏ దశలోనూ బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చని రోహిత్‌ సేన ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరించడంలో పూర్తిగా విఫలమైంది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అడ్డు గోడలా నిలిచి జట్టును గెలిపించాడు. టాస్‌ ఓడి ముందుగా టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 42 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇదే జట్టులో అత్యధిక స్కోరు. మన బ్యాటింగ్ దిగ్గజాలు ఉన్నా ఫలితం లేక పోయింది. అందరూ పెవిలియన్ బాట పట్...

కాలజ్ఞానం..వీర బ్రహ్మేంద్ర మహోత్సవం

చిత్రం
నాలుగు వందల ఏళ్ళు గడిచినా కాలజ్ఞానం చెక్కు చెదరలేదు. లోకానికి అడుగులు నేర్పించి, ప్రపంచ పోకడను, జీవన గమనాన్ని నిర్దేశించి, మానవ జాతికి మరింత భవిష్యత్తును అందజేసిన మహానుభావుడు. సామాజిక సంస్కర్త. కాలజ్ఞాని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. సజీవ సమాధి అయి తరాలు గడిచినా, కాలాలు మారినా ఆయన చెప్పిన కాలజ్ఞానం చెక్కు చెదరలేదు. సజీవంగా, జాతి జీవగర్రగా కొనసాగుతూ వస్తున్నది. తెలుగు వాకిళ్ళలో ఏది జరిగినా, ఏ సంఘటన చోటు చేసుకున్నా వెంటనే గుర్తుకు వచ్చేది, జ్ఞాపకానికి తెచ్చుకునేది వీర బ్రహ్మం గారినే. కుల, మతాలు మనకెందుకు అన్నాడు. మనుషులంతా సమానమేనని చెప్పాడు. ఆయన జగమెరిగిన యోగి, హేతువాది, సాక్షాత్ దైవ స్వరూపుడు. తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. పరిపూర్ణయా చార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో పుట్టారు. పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజ యాచార్య, వీరపాప మాంబల వద్ద శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పెరిగారు. కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధి పొందారు. ఇదే ప్రాంతం ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. జనులందరిని సన్మార్గంలో న...

దృశ్యం సంచలనం

చిత్రం
లోకమే వాకిలి..మనసే లోగిలిగా మారి పోయింది ఈ ప్రపంచం. ప్రస్తుతం క్రియేటివిటీ ఉంటే చాలు లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇది అన్ని రంగాలకు విస్తరించింది. ఇండియా పరంగా చూస్తే సినిమా రంగం రాష్ట్రాలను, దేశ సరిహద్దులను దాటుకుని హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, కొంకిణి, ఉర్దూ, తదితర భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో యంగ్ టాలెంట్ కాసులు కురిపించేలా చేస్తోంది. మన సినిమాలు ఇతర దేశాలలో కూడా విడుదల అవుతున్నాయి. అమెరికా, దుబాయి, సౌదీ, చైనా, బ్యాంకాక్, థాయిలాండ్, జపాన్, ఇరాక్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక, నేపాల్, తదితర కంట్రీస్ లో భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల చైనాలో ఇండియన్ మూవీస్ కు ఆదరణ పెరుగుతోంది. ఇక ఇండియన్ సూపర్ స్టార్ తమిళ తలైవా, రజనీకాంత్ సినిమాలకు జపాన్ లో జనాదరణ ఎక్కువ. మిగతా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇదిలా ఉండగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్‌ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో  రీమేక్‌ అయింది. త...

చర్చలకు సిద్ధం..బెదిరిస్తే భయపడం

చిత్రం
ఆర్టీసీ సీఎం కేసీఆర్ జాగీర్ కాదు. అయన మమ్మల్ని అపాయింట్ చేయలేదు. మమ్మల్ని డిస్మిస్ చేసే అధికారం ఆయనకు లేదు. బెదిరిస్తే భయపడతామని అనుకుంటున్నారు. మట్టిని నమ్ముకున్నాం. కస్టపడి సంస్థను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పనంగా ఎగరేసుకు పోతానంటే ఒప్పుకోమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని కోరారు. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టు విడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. కేసీఆర్ఈ డెడ్ లైన్ విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిని కార్మికులు పట్టించు కోరని తేల్చి చెప్పింది. తమ డిమాండ్లు పరిష్కారం కానంత వరకు సమ్మెను ఆప బోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయించటం చట్ట విరుద్ధమన్నారు. పరిష్కార మార్గాలు చూపనంత వరకు సమ్మెను ఆపబోమని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయ భ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చ...

మరాఠాలో కలవని కత్తులు

చిత్రం
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య మరింత దూరం పెరుగుతోంది. సీఎం కుర్చీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్ళు తమకు అధికారం ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమ పార్టీకి ఉందన్నారు. తమ షరతుకు ఒప్పుకోక పోతే బీజేపీతో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదన్నారు. తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడి మెజారిటీ నిరూపించు కోవడంలో బీజేపీ విఫలమైతే రెండో పెద్ద పార్టీగా తామే ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. కేబినెట్ పదవులతో పాటు, సీఎం పదవిని కూడా సమానంగా పంచు కోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా రెండో సారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఫడ్నవిస్ తమ సీఎం అని బీజేపీ అధిష్టానం తెలిపింది. దీంతో ఇరు పార్టీలు పంతానికి పోవడంతో మాహా ప్రతిష్టంభన నెలకొంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఇతురలతో కలిసి మా సంఖ్యా బలం 170కి చేరుకుంది. మరో అయిదు కూడా పెరిగే ఛాన్స్ ఉందని వెల...

మనోడే మహారాజు..సిప్లిగంజ్ విన్నర్

చిత్రం
ప్రముఖ సింగర్ రాహల్ సిప్లిగంజ్ స్టార్ మా టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ - 3 విన్నర్ గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన ఈ షో తెలుగు బుల్లి తెర మీద టాప్ పొజిషన్ లో నిలిచింది. టీఆర్ఫీ రేటింగ్ లో నంబర్ వన్ లో నిలిచింది. ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ దుమ్ము రేపాడు. తన గానంతో, మాటలతో, ఆటతో ఆకట్టుకున్నారు. లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. రాహుల్..శ్రీ ముఖిల మధ్య ఫైనల్ పోటీలో నిలిచారు. ఆఖరి ఆటలో అదృష్టం మనోడిని వరించింది. అరే ఆడు అంటూ నన్ను పునర్నవి సపోర్ట్ చేసిందని చెప్పారు సిప్లిగంజ్. నాగార్జున, చిరంజీవిల చేతుల మీద ఈ పురస్కారం తీసు కోవడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఇదిలా ఉండగా, ఎంతో టెన్షన్ క్రియేట్ చేసిన బిగ్‌బాస్‌ సీజన్‌ - 3  గ్రాండ్‌ ఫినాలేకి మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్‌గ్రౌండ్‌ పాటతో అదరిపోయేలా గ్రాండ్‌ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్‌ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించారు. 17 మంది ఈ రియాల్టీ షో లో పాల్గొన్నారు. చివరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. వీరిలో బాబా భాస్కర్, అలీ రెజా, వరు...

ఆర్టీసీ కార్మికులకు ఓవైసీ భరోసా

చిత్రం
ఎంఐఎం పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. గత 30 రోజులుగా తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం అలుపెరుగని రీతిలో పోరాడుతున్నారు కార్మికులు. ఇప్పటికే 21 మంది అసువులు బాశారు. అయినా ప్రభుత్వం తరపు నుండి ఏ మాత్రం స్పందన రాలేదు. సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. అయినా కార్మికులు ఎవరూ ఒప్పు కోలేదు. సర్కారు దిగి వచ్చే దాకా, చర్చలు జరిపే దాకా తాము ఒప్పకోమని స్పష్టం చేశారు. మరో వైపు ఎంపీ ఒవైసీ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. దీనిపై ఓవైసీ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడారు. మీ బాధను అర్థం చేసుకోగలను. సమ్మె సమయంలో కొంత మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం. తొందరపడి ప్రాణాలు తీసుకోకండి. సీఎం కేసీఆర్ మాటలను ఆలకించాలని కోరుతున్నాను. సీఎంతో కూర్చుని చర్చించండి. కాంగ్రెస్, బీజేపీ నేతల ఉచ్చు లో పడకండి. ఆ రెండు పార్టీలకు సొంత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ భూమి మీది.. ఈ తెలంగాణ మీది అని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కార మవుతుందని ఆశాభావం వ్యక్...

మోడీతో సమావేశం..బాలు మనస్తాపం

చిత్రం
మహాత్ముని జయంతుత్సవాలను ఘనంగా చేపట్టేందుకు బీజేపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా సినీ రంగానికి చెందిన నటీనటులు, నిర్మాతలు, డైరెక్టర్స్ తో పాటు గాయనీ, గాయకులూ, ఇతర టెక్నీషియన్స్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ వీరందరితో భేటీ అయ్యారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. కేవలం బాలీవుడ్ కు చెందిన వారికే ప్రయారిటీ ఇచ్చారని, సౌత్ ఇండియా సినీ రంగాలకు చెందిన సినీ దిగ్గజాలను పట్టించు కోలేదని పలువురు అభ్యంతరం తెలిపారు. మొదటగా మెగా స్టార్ చిరంజీవి కోడలు ఉపాసన రెడ్డి ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. తెలుగు సినీ రంగానికి సంబంధించి ప్రముఖ సినీ దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్ర మన్యంతో పాటు దిల్ రాజు పాల్గొన్నారు. తమిళ్ సినీ ఇండస్ట్రీ నుంచి రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి నటులున్నారు. వీరితో పాటు టాప్ డైరెక్టర్స్ శంకర్, మురుగదాస్ లాంటి వాళ్ళున్నారు. అంతకు ముందు నటి కుష్బూ కూడా మోదీ తీరుపై మండి పడ్డారు. ఇదే సమయంలో తనకు కలిగిన అనుభవాన్ని ఎస్పీబీ ఏఫ్బీలో పంచుకున్నారు. ఈ సమావేశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ప్రధాని ఢిల్లీలోని త...

పరస్పర సహకారం..అభివృద్ధికి సోపానం

చిత్రం
పరస్పర సహకారం వల్లనే అభివృద్ధి జరుగుతుందని తాను నమ్ముతున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆసియా ఖండంలోని దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్​ కట్టుబడి ఉందని చెప్పారు. థాయ్‌లాండ్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ,,బ్యాంకాక్​లో జరిగిన 16వ ఆసియాన్ ​- భారత్​ సదస్సుకు హాజరయ్యారు. తీర ప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పలు అంశాల్లో ఆసియాన్​ కూటమిలోని సభ్య దేశాలతో కలిసి సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని వెల్లడించారు మోదీ. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ​ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు ప్రధాని. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్‌ కల త్వరలోనే సాకారం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్​ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన స...

మరాఠాలో కొత్త ట్విస్ట్..సేనకు ఎన్సీపీ మద్దతు

చిత్రం
మహారాష్ట్రలో రాజకీయాలు మారుతున్నాయి. తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బీజేపీ, శివ సేన పార్టీలు కలిసి పోటీ చేయగా..మరో వైపు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఈ నాలుగు పార్టీలకు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపింది. అమిత్ షా రంగం లోకి దిగినా ఫలితం లేక పోయింది. సీఎం కుర్చీ విషయంలో శివ సేన, బీజేపీ పార్టీలు పట్టు వీడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాము అధికారాన్ని వదులు కోమని అంటూ అమిత్ షా, ఫడ్నవిస్ లు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు.  శివ సేన తో సంబంధం లేకుండానే పవర్ లోకి రావాలని లోపాయికారిగా బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్నారు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే. ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించు కోవాలని, ఇందు కోసం విపక్షాలతో కలిసేందుకు సిగ్నల్స్ ఇచ్చారు. దీనిని నిజం చేస్తూ ఎన్సీపీ మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయినా సీఎం పీటముడి మాత్రం వీడడం లేదు. ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఎన్సీపీ కూడా కీలక సంకేతాలు పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస...

బాద్‌షా..కు..అరుదైన గౌరవం

చిత్రం
బాలీవుడ్ లో ఆయనో సూపర్ స్టార్. ఎవ్వరి ప్రోత్సాహం, తోడ్పాటు లేకుండానే తన స్వంత టాలెంట్ తో అగ్ర హీరోగా చెలామణి అవుతూ వచ్చారు. ఆయన మేనరిజం, కేరక్టర్ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లి పోవడం షారుఖ్ ఖాన్ కు ఇష్టం. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చే సరికల్లా కొందరు మారి పోతారు. తామేదో గొప్పవారమన్న ఫీలింగ్స్ ప్రదర్శిస్తారు. కానీ ఈ బాద్‌షా మాత్రం ఇవేవీ పట్టించు కోడు. ఇండియాలో గొప్ప నటుల్లో తమిళనాడుకు చెందిన తలైవా ఉరఫ్ రజనీకాంత్, బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు వీటికి దూరంగా ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడం ఈ సూపర్ స్టార్ కు ఇష్టం. ఈ అద్భుతమైన హీరో సినిమాలోనే కాదు నిజ జీవితం లోను రియల్ నటుడు. ఎందుకంటే ఎలాంటి భేషజాలు లేని యాక్టర్. ఈ హీరోకు ఇండియాలోనే కాదు లోకమంతటా లెక్క లేనంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. కింగ్‌ఖాన్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై ఆయన పేరును ప్రదర్శించారు. ఆ దేశంలో మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ బాడ్ షా సినిమాలంటే పడిచస్తారు. ఇక కింగ్ ఆఫ్ బాలీవుడ్ ష...

దొరా కరుణించు..కార్మికులను రక్షించు

చిత్రం
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఊరుమ్మడి ఉంపుడుకత్తెగా చెలామణి అయ్యింది. అస్మదీయులకు, పదవుల పంపకానికి కేరాఫ్ గా ఉపయోగ పడింది. రెండు మూడు పర్మిట్లు మాత్రమే తీసుకుని వందలాది వాహనాలు నడిపిస్తూ రాజ్యమేలిన వారు దర్జాగా కాలరెగరేసుకుని తిరిగారు. కోట్లాది ఆస్తులను కలిగిన ఈ అక్షయపాత్రను ఆధారంగా చేసుకుని కోట్లు వెనకేసుకున్నారు. తమ పేరు మీద, తమకు చెందిన వారి పేరు మీద దొడ్డి దారిన ఆర్టీసీ లోకి ఎంటర్ అయ్యారు. ప్రైవేట్ బస్సులు నడుపుతూ సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. చివరకు పాత బస్సులను సైతం అమ్ముకున్నారు. పాడై పోయిన బస్సుల టైర్లను లోపాయికారీగా అమ్మేసుకుని పోగేసుకున్నారు. వారిలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీలకు చెందిన వారే కాకుండా మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఇదే సమయంలో కింది స్థాయి అంటే మెకానిక్ లు, కండక్టర్లు, డ్రైవర్లను పై,  స్థాయిలో పని చేసిన ఆంధ్రేతర అధికారులు వేధింపులకు పాల్పడ్డారు. ఇందులో ప్రధాన పోస్టుల్లో వీరే తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఆర్టీసీ కార్మికులు, ...

నిమిషాల్లోపే గెలాక్సీ ఫోల్డ్‌ బుకింగ్

చిత్రం
నిన్నటి దాకా మందకొడిగా సాగిన శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. డిఫ్ఫరెంట్ డిజైన్స్, సౌకర్యాలతో న్యూ లుక్ తో కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. ఆన్ లైన్ లో నిమిషాల్లో పే అమ్ముడు పోయాయి. మొబైల్ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్‌ లగ్జరీ స్మార్ట్‌ ఫోన్ల విక్రయంలో శ్యాంసంగ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ ఇటీవల లాంచ్‌ చేసిన లగ్జరీ స్మార్ట్‌ ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ కేకుల్లా బుక్‌ అయి పోయాయి. అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్‌లను కంపెనీ విక్రయించింది. దీంతో ప్రీ బుకింగ్స్‌ను మూసి వేసింది.  ఐఎఎన్‌ఎస్‌ అందించిన నివేదిక ప్రకారం, ఫోన్‌లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఫోన్ విషయానికి వస్తే శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఆరు కెమ...

నిరుద్యోగ భారతం..ఆందోళనకరం

చిత్రం
మేరా భారత్ మహాన్ అంటూ జనాన్ని బురిడీ కొట్టించి కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగిత రేటు పెరిగిందని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వ విద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది. 2011-12, 2017-18 సంవత్సరాలలో దేశంలో 90 లక్షల మంది ఉపాధికి దూరమయ్యారని ఎంప్లాయిమెంట్‌ క్రైసిస్‌ తన నివేదికలో తెలిపింది. యువత, శ్రామికులు, విద్యా వంతులు నిరుద్యోగంలో మగ్గి పోతున్నారని స్పష్టం చేసింది. అసంఘటిత రంగానికి మెరుగైన ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపింది. సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమ రంగాలు సైతం ఏ విధమైన కాంట్రాక్టు లేకుండానే ఛాన్స్ ఇస్తున్నాయని వెల్లడించింది.  దేశంలో వ్యవసాయేతర రంగాలలో  సేవల రంగం అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నదని తెలిపింది. కానీ పెరుగుతున్న జనాభాకు, చదువుకున్న లక్షలాది విద్యార్థులకు ఆశించిన మేర అవకాశాలు దొరకడం లేదన్నది. వ్యవసాయ రంగం లో 27 మిలియన్ల మేర ఉపాధి క్షీణించింది అని పేర్కొంది. అనుబంధ రంగాలలో ఉపాధి వాటా కూడా 49 శాతం నుండి 44 శాతానికి పడి పోయిందని వెల్లడించింది. తయారీ యేతర రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో కేవలం 0.6 మిలి...

డెడ్ లైన్ డోంట్ కేర్

చిత్రం
సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్స్ తమకు కొత్తేమి కాదని స్పష్టం చేసింది ఆర్టీసీ జేఏసీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితి లేదని, సమ్మెపై అవాకులు చెవాకులు పేలడం మాను కోవాలన్నారు నాయకుడు అశ్వత్థామ రెడ్డి. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెర వేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేబినెట్‌ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు. కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. మొదటగా చర్చలు జరిపి కార్మికులకు డెడ్ లైన్ పెట్టాలని అన్నారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలనే సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆ...