పరస్పర సహకారం..అభివృద్ధికి సోపానం


పరస్పర సహకారం వల్లనే అభివృద్ధి జరుగుతుందని తాను నమ్ముతున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆసియా ఖండంలోని దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్​ కట్టుబడి ఉందని చెప్పారు. థాయ్‌లాండ్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ,,బ్యాంకాక్​లో జరిగిన 16వ ఆసియాన్ ​- భారత్​ సదస్సుకు హాజరయ్యారు. తీర ప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పలు అంశాల్లో ఆసియాన్​ కూటమిలోని సభ్య దేశాలతో కలిసి సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని వెల్లడించారు మోదీ.

ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ​ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు ప్రధాని. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్‌ కల త్వరలోనే సాకారం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్​ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడి దారులకు పిలుపునిచ్చారు.

బ్యూరోక్రటిక్​ తరహా పాలనకు స్వస్తి పలికి, నవ భారతం దిశగా దేశం​ అడుగులు వేస్తోందని చెప్పారు. థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్​ ప్రయూత్​ చాన్​ ఓ చాన్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్​ కౌన్సిలర్​ అంగ్​సాన్​ సూకీ తోనూ సమావేశమయ్యారు. అనంతరం మోదీకి అపూర్వమైన రీతిలో విందు ఏర్పాటు చేశారు. 

కామెంట్‌లు