పోస్ట్‌లు

నవంబర్ 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పతనం అంచున ప్రభుత్వ బ్యాంకులు

చిత్రం
ఏ ముహూర్తాన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందో ఆ రోజు నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్ల సేవలకు మంగళం పాడాయి. ఇప్పటికే వీటిని నిర్వీర్యం చేసే పనిలో పాడింది సర్కార్. తాజాగా టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒకవేళ ఆయా కంపెనీలకు నష్టాలు వాటిల్లితే ఇక రుణాలు అందజేసిన బ్యాంకులకు వసూలు చేసు కోవడం మరింత కష్టమవుతుంది. చాలా తెలివిగా ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులకే కన్నం వేశాయి ఈ బడా కంపెనీలు. ఒకటా రెండా వందలు కాదు వేల కోట్లను రుణంగా పొందాయి. మొత్తం దేశీయంగా ఇప్పటి దాకా ఆయా టెలికాం కంపెనీలకు లక్షా 15 వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చాయి. ఇది వరకే అప్పుల కుప్పగా మారిన టెలికాం సెక్టార్ కు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అశనిపాతం లాగా మారింది. ఏజీఆర్ ప్రకారం ప్రభుత్వానికి 93 వేల కోట్లు చెల్లించాలని, ఈ మొత్తం డబ్బులను మూడు నెలల్లో తీర్చాలని ఆదేశించింది. దీంతో ఆయా కంపెనీలకు మరిన్ని నష్టాలు వచ్చాయి. టెలికం కంపెనీలకు సంబంధించి రుణాల లెక్కలు చూస్తే దిమ్మ తిరిగి పోవడం ఖాయం. ఇవ్వన్నీ ప్రజలు బ్యాంకులలో దాచుకున్న డబ్బులు. ఇండియాలో అతిపెద్ద బ్యాంకు...

లడ్డూలు ప్రియం..భక్తుల ఆగ్రహం

చిత్రం
ప్రపంచంలో అత్యంత ధనవంతమైన పుణ్యక్షేత్రంగా వినుతికెక్కింది తిరుమల ఆలయం. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా, కోర్కెలు తీర్చే దైవంగా పేరుంది. ఇక్కడ దొరికే ప్రసాదానికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. ఎవరైనా తిరుపతికి వెళితే లడ్డు తీసుకు వచ్చారా అని అడగటం మామూలే. అంటే ఆ ప్రసాదానికి ఎంతటి విలువ వుందో అర్థం చేసుకోవచ్చు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా పాలక మండలి కొలువు తీరాక భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సామాన్య, మధ్య తరగతి భక్తులు బస చేసే గదుల ధర ఏకంగా వంద శాతం టీటీడీ పెంచింది. తాజాగా 175 గ్రాముల లడ్డూల ధర పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు దివ్య దర్శనం, సర్వ దర్శనం భక్తులకు 70కి నాలుగు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రాయితీ తీసేసి ఒక్కో లడ్డూను 50 రూపాయల చొప్పున అమ్మాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం కోసం పంపనుంది. మరో వైపు శ్రీవారి లడ్డూల అమ్మకాన్ని లాభాపేక్షతో చూడటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో నడిచి వచ్చే  దివ్య దర్శన భక్తులకు ఒక ఉచిత లడ్డూను ఇస్తున్నారు. వీరికే సబ్సిడీ ధరతో10 చొప్పున ...

ఆర్టీసీ సమ్మెకు అంతమే లేదా

చిత్రం
తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 42 రోజులకు చేరుకుంది. ఇప్పటి దాకా పలువురు కండక్టర్లు, డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష పార్టీలతో సహా విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, వ్యాపారులు, సకల జనులు కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. ఈ మేరకు ధర్మాసనం ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తప్పు పట్టింది. అంతే కాకుండా ఆర్టీసీ సంస్థకు చెందిన ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకానొక సమయంలో కార్మికుల పట్ల ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై మండి పడింది. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన అధికారులపై రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందు కోసం తమ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదేనని స్పష్టం చేసింద...

బిల్ గేట్స్ వరల్డ్ బిలియనీర్

చిత్రం
మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ అరుదైన ఘనతను సాధించారు. ఆయన ఏకంగా వరల్డ్ బిలియనీర్ గా అవతరించారు. తాజగా అమెజాన్​ ఓనర్​ కమ్​ సీఈవో జెఫ్​ బెజోస్​ను బిల్​ గేట్స్​ దాటేశారు. మళ్లీ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు.బ్లూమ్ ​బర్గ్​ విడుదల చేసిన తాజా ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్​గేట్స్​ మొదటి స్థానాన్ని దక్కించు కున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఆయన ఫస్ట్​ ప్లేస్​లోకి వచ్చారు. క్లౌడ్​ కంప్యూటింగ్​ కాంట్రాక్ట్​ను అమెజాన్​కు కాకుండా మైక్రోసాఫ్ట్​కు పెంటగాన్​ అప్పగించడంతో సంస్థ ఆస్తులు మరింత పెరిగాయి. సుమారు 71,635 కోట్ల విలువైన ప్రాజెక్ట్​ను దక్కించు కోవడంతో మైక్రోసాఫ్ట్​ ఆస్తులు 11000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. వీటి విలువ దాదాపు 7.88 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రాజెక్టు దక్కడంతో కంపెనీ షేర్ల విలువ కూడా 4 శాతం పెరిగింది. అన్నీ కలిసి మైక్రోసాఫ్ట్​ అధిపతికి లక్​ను తీసు కొచ్చాయి. ఇక వస్తుందనుకున్న కాంట్రాక్ట్​ వేరే కంపెనీ ఎగరేసుకు పోవడంతో అమెజాన్​ షేర్ల విలువ 2 శాతానికి పడి పోయింది. దీంతో బెజోస్​ ఆస్తి 10,870 కోట్ల డాలర్లకు దిగ జారింది. యూరప్​కు చెందిన కోటీశ్వరుడు బెర్నార్డ్​ ఆర్...

గూగుల్ పై వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్

చిత్రం
ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ పై ఇప్పటికే పలు కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. తమ డేటాకు భద్రత లేకుండా పోతోందని, తమ అనుమతి లేకుండానే మొత్తం సమాచారాన్ని వెలుగులోకి తీసుకు వస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశాయి ఇప్పటికే. దీనిని గూగుల్ తేలిగ్గా తీసుకుంటోంది. ప్రతి ఒక్క కంపెనీ అభ్యర్థన మేరకే తాము డేటాను జాగ్రత్తగా ఉండేలా చూస్తామని, ఇందు కోసం లక్షలాది మంది సాంకేతిక నిపుణులు నిమగ్నమై ఉంటారని సీఇఓ సుందర్ పిచ్చాయ్ స్పష్టం చేశారు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది గూగుల్. కొన్ని వెబ్ సైట్స్ అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్నాయి. వీటిని ముందే పసిగట్టేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా దేశాలలో కొలువుతీరిన ప్రభుత్వాల నియమ నిబంధనలకు లోబడే గూగుల్ పని చేస్తోంది. ఇప్పటికే కొన్ని కేసులు నడుస్తున్నాయి కూడా. అయితే సదరు కంపెనీ మాత్రం తమ పరిమితులకు లోబడే పని చేసుకుంటూ పోతామని, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే రీతిలో వ్యవహారాలు ఉండబోవని స్పష్టం చేసింది. కాగా గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

నష్టాల్లో కంపెనీలు..ఆందోళనలో బ్యాంకులు

చిత్రం
ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇచ్చ్చుకుంటూ పోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజాగా టెలికాం కంపెనీలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దెబ్బకు విలవిలలాడి పోతున్నాయి. ఎలా రాబట్టు కోవాలోనని పున రాలోచనలో పడ్డాయి. ఇండియాలో టెలికం రంగ వ్యవస్థ రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు టెలికం కంపెనీలకు దాదాపు1.15 లక్షల కోట్లకు పైగా రుణాల రూపేణా ఇచ్చాయి. ఇది వరకే అప్పుల కుప్పగా మారిన టెలికం సెక్టార్‌‌‌‌కు ధర్మాసనం ఇచ్చిన డిసిషన్ మింగుడు పడటం లేదు. అడ్జెస్టెడ్‌‌‌‌ గ్రాస్‌‌‌‌ రెవెన్యూ ఏజీఆర్‌‌‌‌ బకాయిలు 93 వేల కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో కంపెనీల నష్టాలు అమాంతం పెరిగాయి. వొడాఫోన్‌‌‌‌, ఐడియా కంపెనీ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇండియాలో వ్యాపారం కొనసాగించడం సాధ్యం కాకపోతే, తాము లిక్విడేషన్‌‌‌‌కు వెళ్లే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని కంపెనీ సీఈఓ రీడ్‌‌‌‌ ప్రకటించారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల్లో టెన్షన్‌‌‌‌ మొదలయింది. దివాలా పిటిషన్‌‌‌‌ దాఖలు చేసిన టెల్కోల నుంచి బకాయిలు రాబట్టడం అసాధ్యమని ఇవి ప్రభుత్వానికి తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెల్కోలు మూడు న...

అన్నింటికీ ఆధారమే..లేకుంటే దుర్భరమే

చిత్రం
ఇండియాలో బతకాలన్నా లేదా చని పోవాలన్నా అన్నింటికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికీ దీనిని తప్పనిసరి చేస్తూ కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా వివిధ భూములు, ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలుకు సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరి చేయలేదు. దీంతో అవినీతి, అక్రమాలు చెప్పుకోలేని రీతిలో పెరిగాయని కేంద్ర ఆదాయ, పన్నుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మోదీ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా బ్లాక్ మనీని వెలుగులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఆ దిశగా నోట్లను రద్దు చేశారు. అంతే కాకుండా నగదు లావాదేవీలను పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుతం దివాళా అంచున నిలబడ్డాయి. ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది కమల సర్కార్. ఇక స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలను, అవినీతిని అరి కట్టడానికి ఆధార్‌‌తో లింక్‌‌ చేసే విధానాన్ని తీసుకు రావాలని యోచిస్తోంది. ఈ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనేది తాజా సమాచారం. దీనిని అమలు చేస్తే నల్లధనం, మనీ లాండరింగ్‌‌పై ప్రభుత్వం సర్జికల్‌‌ స్ట్రైక్‌‌ చేసినట్టేనని ఆర్థిక రంగ...

ఆన్‌‌లైన్‌‌లో మోసాలు..పెరుగుతున్న బాధితులు

చిత్రం
  ఇంటర్నెట్ మాధ్యమం పెరగడం, డేటా కనెక్టివిటీ అద్నుబాటులోకి రావడం, అపరిమితమైన నెట్ వర్క్ వర్కవుట్ అవడంతో కోట్లాది మంది తమ రోజూవారీ లావాదేవీలను ఆన్‌‌లైన్‌‌లోనే నిర్వహిస్తున్నారు. నెట్ వర్క్ విషయంలో  ఆయా కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోటా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్ ప్రస్తుతం ట్రిలియన్ డాలర్లను దాటేసింది. ఇదే సెక్టార్ లో వరల్డ్ వైడ్ గా టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి చైనాకు చెందిన అలీబాబా, అమెరికాకు చెందిన అమెజాన్, వాల్ మార్ట్ కంపెనీలు. ఇక ఇండియా ఈ కామర్స్ విషయానికి వస్తే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఈ బే కంపెనీలు ఉండగా అమెజాన్, అలీబాబా కూడా కోట్లల్లో లావాదేవీలు జరుపుతున్నాయి. ఆఫర్లు, గిఫ్టుల పేరుతో పండుగలు, ఇతర అకేషన్స్ పేరుతో భారీగా సేల్స్ చేపడుతున్నాయి.   ఇదే సమయంలో జనం ఆన్ లైన్ లోనే ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో 80 శాతానికి ఒకే అయినా మిగతా 20 శాతం మాత్రం కోలుకోలేని మోసాలకు లోనవుతున్నారు. కస్టమర్స్ నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆన్‌‌లైన్‌‌లో ఏదో వస్తువు ఆర్డర్ చేస్తే, దానికి బదులు మరొకటి డెలివ...

మహర్షి అరుదైన రికార్డ్

చిత్రం
ప్రిన్స్ మహేష్ బాబు సినీ కెరీర్లో అత్యంత జనాదరణ పొందిన సినిమాగా మహర్షి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం చేపట్టారు. ఇందులో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నటించారు మహేష్ బాబు. నటనతో ఆకట్టు కోవడమే కాదు భారీ వసూళ్లు రాబట్టేలా అద్భుతంగా మెప్పించారు ఈ ప్రిన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా ‘మహర్షి’ సినిమా రూపొందింది. ఈ మూవీకి దిల్ రాజు, అశ్వనిదత్, ప్రసాద్ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. గత మే నెలలో మహర్షి సినిమాను విడుదల చేశారు. మహేష్ సినిమాను వంశీ పైడిపల్లి ఏకంగా 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు సినిమా పరంగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అంతకు ముందు కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేశారు. ఈ రెండూ భారీ విజయాలను నమోదు చేశాయి. ప్రిన్స్ కు బలాన్ని ఇచ్చాయి. ఇదిలా ఉండగా సంతషం పట్టలేక కొరటాల శివకు భారీ ఖర్చుతో కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. వంశీ మాత్రం మనసు పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మహర్షి మూవీన...

మరాఠా పీఠం సేనదే

చిత్రం
ఇండియన్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా ఎత్తులు పారలేదు. ముందు  నుంచి చెబుతున్నట్టుగానే శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మరాఠా పీఠాన్ని అధీష్టించ బోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పోటీ నుంచి తప్పు కోవడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించి, చివరకు ఓ అంగీకారానికి వచ్చాయి. ఐదేళ్ల​ పాటు సీఎం పీఠం శివసేనకు అప్పగించి, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రి పదవులు చెరి సమానంగా పంచు కునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ అంగీకారం తెలిపితే కొద్ది గంటలోపే శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎం పీఠం సేనదే అని ఖరారైనా, సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేనే సీఎం అని మొన్నట...

టీమిండియా బిగ్ విక్టరీ

చిత్రం
బంగ్లాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థి ఏ జట్టు అయినా సరే భారత క్రికెట్ జట్టు సునాయాసంగా గెలుస్తూనే ఉన్నది. రికార్డులు తిరుగ రాస్తున్నది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభమైన తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభపు టెస్టులో భారీ విజయం సాధించి శుభారంభం చేసింది. బంగ్లాతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్‌ చేసి భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్ఫికర్‌ రహీమ్‌ 64 మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను మూడో రోజే ముగించింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు సాధించగా, అశ్విన్‌ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు, ఇషాంత్‌కు వికెట్‌ లభించింది. ఆటలో భాగంగా 493/6 ఓవర్‌ నైట్‌ స్కోరు వద్ద భారత్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌లు ఆరంభి...

సరిలేరు కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

చిత్రం
టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుకు ఓ ప్రత్యేకత ఉంది. అయన టైమింగ్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మిగతా హీరోలకు  చాలా తేడా ఉంటుంది. ఎవ్వరి విషయాల్లో తల దూర్చడు. తానేదో తన పని ఏదో చేసుకుంటూ పోతారు. అందుకే చాలా మంది నటీమణులు మహేష్ బాబు తో ఒక్క సినిమా అయినా చేయాలని ఆరాట పడతారు. ఇక బాలీవుడ్ తారలైతే ఏకంగా ప్రిన్స్ తో ఒక్కసారైనా నటించాలని ఉందంటూ తెగ ముచ్చట పడ్డారు. అంతే కాదు బహిరంగంగానే తమ ఒపీనియన్స్ పంచుకున్నారు కూడా. మహేష్ బాబు ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్. ఆయన రేంజ్ ఇటీవల మరింతగా పెరిగింది. ప్రిన్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్స్రి లీజ్ చేశారు. టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతోంది. త్వరలోనే టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హీరో మహేశ్‌బాబు గన్‌ లోడ్‌ చేస్తున్న క్లిప్‌ను షేర్ చేసి టీజర్ లోడ్ అవుతోంది అంటూ కామెంట్‌ పెట్టారు. అయితే టీజర్‌ ఏ తేదీన విడుదలవుతుందో ఇంకా వెల్లడించలేదు. వచ్చే వారం టీజర్‌ బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. సరిలే...

టెలికం కంపెనీలకు ఊరట

చిత్రం
ఇండియాలో టెలికం సేవల పేరుతో వినియోగదారుల నెత్తిన శఠగోపం పెట్టిన ఆయా టెలికం దిగ్గజ కంపెనీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. సవరించిన స్థూల ఆదాయం కింద బాకీ పడిన మొత్తాలను చెల్లించాల్సిందేనంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో విదేశీ టెలికం కంపనీలు లబోదిబోమంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు భారత దెస ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని స్పష్టం చేశారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక స్థిరత్వ లేమి కారణంగా ఏ కంపెనీ తమ సేవలను నిలిపి వేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడమే తమ అభిమతమని అన్నారు. టెలికం నష్టాలకు  సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు టెలికం సంక్షోభాన్ని ప్రభుత్వం పట్టించు కోకుంటే భారత్‌లో పెట్టుబడుల పెట్టే విషయంలో పునరాలోచిస్తామని వొడాఫోన్‌ సీఈఓ నిక్‌ రెడ్‌ స్పష్టం చేశారు. ఏజీఆర్‌పై సుప్రీ...