పోస్ట్‌లు

ఆగస్టు 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దమ్మున్న మగాడు ఉదయ్ శంకర్

చిత్రం
వాడు మగాడ్రా బుజ్జి అన్న తెలుగు సినిమా డైలాగ్ కు ఖచ్చితంగా సరి పోతాడు ఉదయ్ శంకర్. ఎవరితను అనుకుంటున్నారా..భారతీయ మీడియాను ఏలుతున్న ఒకే ఒక్క మగాడు..స్టార్ టీవీ సీయివో. ఇప్పుడు ఇతడే మోస్ట్ పాపులర్ హీరో. ఇతడికున్నంత ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదంటే నమ్మలేం. స్టార్ గ్రూప్ కు భారతీయతను జోడించి కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అందరు నడిచిన బాటలో నడిస్తే కిక్ ఏముంటుంది అని ప్రశ్నిస్తాడు అమాయకంగా. ఏకంగా కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన స్టార్ టీవీ సంస్థను ఏకంగా ట్రిలియన్ డాలర్ల రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు. ఎవరికీ అందడు. అతడు అనుకున్నాడంటే ఇక ప్రత్యర్థులు చిత్తై పోవాల్సిందే. అది అతడికున్న టాలెంట్. ఎక్కడ ఎప్పుడు దెబ్బ కొడతాడా తెలియదు. ఆలోచనల్లో లయన్ ను తలపిస్తే ఆచరణలో చిరుతను గుర్తుకు తెస్తారు ఉదయ్ శంకర్. తాజాగా ఇండియాను ప్రభావితం చేసిన వ్యక్తులు 100 మందిని ఎంపిక చేస్తే స్టార్ అధిపతి ఉదయ్ శంకర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని దాటేసి చరిత్ర సృష్టించారు.  ఆసియా ఖండంలో స్టార్ టీవీ టాప్ రేంజ్ లోకి దూసుకు వెళ్ళింది. ఇండియన్ మీడియా మార్కెట్ ను శాసిస్తున్న స్టార్ ..ప్రపంచ మా...

ఆకలి కేకల్లో వెనిజులా.. ఆదుకునేది ఎలా..?

చిత్రం
ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ నిల్వలు కలిగిన దేశంగా పేరొందిన వెనిజులా ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. లక్షలాది  మంది అన్నమో రామ చంద్ర అంటూ మొత్తుకుంటున్నారు. వందలాది మందికి కూడుతో పాటు గూడు కూడా కరువైంది. చేసేందుకు పనులు లేవు, ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్నింటిని ఉచితంగా ఇస్తూ పోయింది.  దీంతో జనం ఎక్కువ శాతం పని చేయకుండా సోమరులుగా తయారయ్యారు. దక్షిణ అమెరికాలో వుండే ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆ దేశం ఇలా పేద దేశంగా తయారు కావడానికి అగ్ర రాజ్యం అమెరికా కూడా ఒక కారణం. ప్రపంచంలో యుఎస్ కు తాను బతికినన్నాళ్లు ఆ దేశ ప్రెసిడెంట్ కు నిదుర లేకుండా చేసిన ఘనత క్యూబా మాజీ ప్రెసిడెంట్ ఫెడరల్ కాస్ట్రో. ఆయన బతికి ఉన్నన్నాళ్ళు వెనిజులా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్ కు వెన్ను దన్నుగా నిలిచారు. అయినా ఫలితం లేక పోయింది. వెనుజులాను గొప్ప కంట్రీగా తీర్చి దిద్దిన హ్యూగో చావెజ్ మరణించడం తో,  అటు అమెరికాకు అడ్డు లేకుండా పోయింది. ఆ దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలపై కన్నేసింది. అంతర్జాతీయ పరంగా ఆయిల్ ధరలు తగ్గడంతో పన్నుల రూపేణా వచ్చే డబ్బులన్నీ తగ్గి పోయాయి. తిండి నుంచి బట్టల దాక...

సినీవాలిలో వెన్నెల వసంతం..!

చిత్రం
తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. దాని రేంజ్ హాలీవుడ్ ను అందుకునే ప్రయత్నంలో ఉంది అంటే నమ్మగలమా. టాలీవుడ్ లో తీసే సినిమాల్లో కామెడీ అన్నది కంపల్సరీ. ప్రతి సినిమాలో హాస్యం అన్నది తప్పకుండా ఉండాలి. లేకపోతే తెలుగు వారు తట్టుకోలేరు. ప్రతి దర్శకుడు కొన్ని నిమిషాలైనా కామెడీ సీన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే బ్రహ్మ్మనందం, ఆలీ , పృత్వి , తదితరులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వెన్నెల కిషోర్ తన హవాను కొనసాగిస్తున్నారు. మౌనంగా ఉంటూనే తన ప్రతిభా పాటవాలతో దుమ్ము రేపుతున్నారు. రోజు రోజుకు తాను లేకుండా సినిమాలు తీయలేని స్థితికి తీసుకు వచ్చారు ఈ నటుడు.  కిషోర్ ఉంటే చాలు సినిమా తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో పుట్టిన ఇతగాడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొంత కాలం పాటు పనిచేసారు. ఆ తర్వాత సినిమా మీదున్న ప్రేమ అతడిని దర్శకుడిగా మార్చేసింది. ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చాడు. సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ పూర్తయిన తరువాత ఏడాదిన్నర పాటు ఓ కోర్సులో చేరాడు. జీఆర్ఈ, టోఫెల్ లో  మంచి స్కోరు సంపాదించాడు. అమెరికాలో మాస్టర్స్ చదవడ...

క్యూ కట్టిన జనం..వికసిస్తున్న కమలం

చిత్రం
తెలంగాణాలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు దేశంలో ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేశం అన్న నినాదాన్ని నిజం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇప్పటికే తెలంగాణాలో ఉద్యమ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేకుండా పోయింది. గతలోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగ పాటు కలిగింది. ముఖ్యమంత్రి స్వంత కూతురు, ఎంపీగా ఉన్న కవితను చిత్తుగా ఓడించారు. దీంతో కమలం తమ పార్టీ పట్ల ప్రజలకు ప్రేమ, అభిమానం ఉందని తేటతెల్లడం కావడంతో బీజీపీ రంగం లోకి దిగింది . చాప కింద నీరులా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. టీడీపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్, తదితర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , తదితరులు భారీ ఎత్తున జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీకి పూర్వ వైభవం రానుందని సీనియర్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేలాది మంది కార్యకర్తలు కలిగిన తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయక...