పోస్ట్‌లు

మార్చి 19, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆల‌యాలు క్లోజ్..ద‌ర్శ‌నాలు బంద్

చిత్రం
క‌రోనా ఎఫెక్ట్ దెబ్బ‌కు అన్ని రంగాలు విల‌విల‌లాడుతుండ‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్ర‌ధాన ఆల‌యాల‌న్నీ మూసి వేశారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగిన తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు టీటీడీ ఈఓ సింఘాల్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్, టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డిల‌తో చ‌ర్చించిన మీదట ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. వేలాది మంది ఇప్ప‌టికే వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్నారు. వీరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది టీటీడీ. క‌రోనా వ్యాధి ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతుండ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే విద్యా సంస్థ‌ల‌ను మూసి వుంచారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, క‌నీసం 15 రోజుల పాటు ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని సూచించారు. దీంతో ప్ర‌ధాన ఆల‌యాలు వేములాడ రాజ‌న్న‌, యాదాద్రి శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ స్వామి, భ‌ద్రాద్రి రామాల‌యం, బాస‌ర‌, ఆలంపూర్, బీచుప‌ల్లి, శ్రీ‌శైలం, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, కాణిపాకం, శ్రీ‌శైలం, మ‌హానంది, మంత్రాల‌యంతో పాటు శ్రీ‌కా...

క‌రోనాపై ఫ్యాన్స్ ఫైర్

చిత్రం
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని రంగాల‌తో పాటు క్రీడారంగం కూడా కుదుపున‌కు లోనైంది. ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ దెబ్బ‌కు క్రికెట్, బ్యాడ్మింట‌న్, టెన్నిస్, వాలీబాల్, చెస్, ఫుట్ బాల్, బేస్ బాల్, హాకీ, త‌దిత‌ర అన్ని ఆట‌లు అర్ధాంత‌రంగా ర‌ద్ద‌య్యాయి. ప్ర‌స్తుతం జ‌పాన్‌లో జ‌రుగుతున్న ఒలంపిక్ గేమ్స్ కూడా జ‌రుగుతాయో లేదోన‌న్న మీమాంస నెల‌కొంది. మ‌రో వైపు ఇండియాకు ఐకాన్‌గా ఉన్న క్రికెట్ కు సంబంధించి భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు అసాధ‌ర‌ణ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ పోటీలు జ‌ర‌గాల్సి ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తాము కూడా తాత్కాలికంగా అన్ని మ్యాచ్‌ల‌ను, టోర్న‌మెంట్ ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బిసిసిఐ చీఫ్ సౌర‌బ్ గంగూలీ వెల్ల‌డించారు. దీంతో కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్ల‌నుంది. అంతే కాకుండా స్పాన్స‌ర్స్ చేస్తున్న కంపెనీలు సైతం భారీగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ర‌ద్దు చేయ‌డం కాకుండా వాయిదా మాత్రం వేయాలని కోరుతున్నాయి. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బీసీసీఐ అత్య‌వ‌స‌ర స‌మావేశ...

మంజ్రేక‌ర్‌కు పండిట్ బాస‌ట

చిత్రం
భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు  కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్‌ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌ ఎవర్నీ కావాలని గాయ పరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్‌ చిన‍్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేక పోవచ్చని, అందుచేత మంజ్రేకర్‌ను తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్‌ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్‌ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్‌ పండిట్‌ కోరాడు. నాకు మంజ్రేకర్‌ బాల్యం నుంచి తెలుసు. ఇతరుల్ని గాయపరిచే మనస్తత్వం అతనిదైతే కాదు. ఉన్నది ఉన్నట్లు వ్యక్తిత్వం మంజ్రేకర్‌ది. ఆ విషయంలో నేను ఎప్పుడు అతన్ని అభిమానిస్తూనే ఉంటాను. ముఖం మీద మాట్లాడే స్వభావం ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు.. కానీ ఒక కామెంటేటర్‌గా అతను ...

ఉద్యోగుల‌కు బంప‌ర్ ఛాన్స్

చిత్రం
క‌రోనా పుణ్య‌మా అంటూ ఆయా కంపెనీల్లో ప‌నిచేస్తున్న వారికి ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప‌ని చేసుకునే స‌దుపాయం క‌లుగుతోంది. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అన్ని దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో తాము ప్ర‌యాణం చేస్తూ ఆఫీసుల‌కు రాలేమంటూ ఉద్యోగులు తెగేసి చెప్ప‌డంతో కంపెనీలు కాళ్ల బేరానికి వ‌చ్చాయి. దీంతో ఆఫీసుల‌కు మాత్రం రాక‌పోయినా ప‌ర్వాలేదు కానీ టైం త‌ప్ప‌కుండా నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను తాము స‌మ‌కూరుస్తామంటూ కంపెనీల య‌జ‌మానులు స్ప‌ష్టం చేశారు. దీంతో సందిట్లో స‌డేమియా అన్న చందంగా ఫుల్ జోష్ మీదున్నారు. ఎక్కువ‌గా అమెరికా, ఫ్రాన్స్, సింగ‌పూర్, లండ‌న్ , త‌దిత‌ర దేశాల్లో ఎక్కువ‌గా ఉంటున్న అన్ని రంగాల కంపెనీల‌న్నీ వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. దీనిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఉద్యోగులు సైతం వ‌ర్క్‌లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. తాజాగా ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఫేస్ బుక్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే క‌రోనా ప్ర‌భావం ఉన్నందున ఉద్యోగుల‌కు అద‌న‌పు బోన‌స్ ప్ర‌...

ఇండియాలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ

చిత్రం
క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంతా ఒకే తాటిపై వుంటూ త‌మ‌కు తాము స్వీయ నియంత్ర‌ణ విధించు కోవాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్ధేశించి ప్ర‌సంగించారు. క‌రోనా ప్ర‌భావం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుండ‌గా మ‌న దేశాన్ని సైతం విస్మయం చెందేలా చేస్తోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ కుటుంబంతో పాటు ప‌రిస‌రాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. క‌రోనా వైర‌స్ కు మందు అనేది లేకుండా పోయింది. ఎంతో మంది వైద్యులు, నిపుణులు ఈ మ‌హ‌మ్మారి వ్యాధి నుంచి ర‌క్షించేందుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్య ప‌రంగా బాగుండాల‌నే ఉద్దేశంతో ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల‌తో పాటు సిబ్బంది, పోలీసులు, ప్యారా మిల‌ట‌రీ ద‌ళాలు త‌మ వంతుగా దేశ సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని, వీరంద‌రికి మ‌నంద‌రం కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిన స‌మయం ఆసన్న‌మైంద‌న్నారు. క‌నీసం వారం రోజుల పాటు దేశంలోని వారంతా త‌మ త‌మ స్థ‌లాల్లోనే ఉండాల‌ని, ఇళ్ల‌ల్లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దని పీఎం కోరారు. వైద్య ఆరోగ్య శాఖ...