పోస్ట్‌లు

జులై 28, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క‌ర్నాట‌క స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం .. 14 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై వేటు

చిత్రం
క‌న్న‌డ నాట ప‌వ‌ర్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతూనే వున్నాయి. నిన్న‌టి దాకా 15 రోజుల పాటు ఉత్కంఠ కొన‌సాగింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ కూలి పోవ‌డం, బీజేపీ స‌ర్కార్ కొలువు తీర‌డం, ఆ పార్టీ తర‌పున యెడ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా హుటా హుటిన ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం జ‌రిగి పోయింది. ప్ర‌భుత్వానికి కావాల్సిన బ‌లాన్ని తిరిగి నిరూపించు కోవాల్సిన ప‌రిస్థితి బీజేపీపై ఉంది. ఇందు కోసం ఇప్ప‌టికే ముగ్గురు రెబ‌ల్ ఎమ్మ్యేల్య‌పై అన‌ర్హ‌త వేటు వేశారు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్. దీంతో కేంద్రంలోని క‌మ‌ల స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. ఎలాగైనా స‌రే క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని పూర్తి కాలం న‌డిపించాల‌నే కృత నిశ్చ‌యంతో ఉంది. దీంతో రాజ్యాంగ‌బ‌ద్దంగా ఎన్నికైన స్పీక‌ర్ ఇపుడు కీల‌కంగా మారడంతో వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. స్పీక‌ర్‌గా ఎన్నికైన ర‌మేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి. ఎలాగైనా స‌రే సంకీర్ణ స‌ర్కార్‌ను గ‌ట్టెక్కించేందుకు ఆయ‌న ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. చివ‌రి వ‌ర‌కు దానిని నిల‌బెట్టాల‌ని చూశారు. తీరా క‌మ‌ల‌నాథులు రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌భావితం చేయడం, తాయిలాలు ఎర చూప‌డంతో క‌థ మొద‌టికొచ్చింది....

ముంబ‌యిని ముంచెత్తిన వాన‌లు..త‌ల్ల‌డిల్లుతున్న జ‌నాలు..!

చిత్రం
దక్షిణాదిన వ‌ర్షాలు లేక త‌ల్ల‌డిల్లి పోతుంటే..సాగు నీరు దేవుడెరుగు క‌నీసం తాగేందుకు నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంటే.. మ‌రో వైపు ముంబ‌యిలో మాత్రం ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. దేశ ఆర్థిక రంగానికి ఆయువు ప‌ట్టుగా ఉన్న ఈ న‌గ‌రం ఇపుడు జ‌నం హాహాకార‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోతోంది.  రాక‌పోక‌లు స్తంభించి పోయాయి. ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. ఎక్క‌డ చూసినా వ‌ర‌ద‌లే..నీళ్లే..న‌గ‌ర వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. విమానాశ్ర‌యం నీళ్ల‌తో నిండి పోయింది. రైళ్లు , బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచి పోయాయి. ర‌వాణా వ్య‌వ‌స్థ అర్దాంత‌రంగా ఆగి పోయింది. వ‌ర‌ద ప్ర‌వాహాం దెబ్బ‌కు ఏకంగా మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచి పోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న వారిని నావికా, ర‌క్షక ద‌ళాలు ర‌క్షించాయి. ల‌క్ష‌లాది మందికి ప‌ర‌క్షోంగా ఉపాధి క‌ల్పించిన ఈ న‌గ‌రం ఇపుడు బేల చూపులు చూస్తోంది.  ఈ రైలులో 17 గంట‌ల‌కు పైగా బిక్కు బిక్కు మంటూ గ‌డిపారు. 1050 మందికి పైగా ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. త‌మ విద్యుక్త ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించారు. రెస...

వీఆర్ఎస్‌కు ఐఏఎస్ ముర‌ళి ద‌ర‌ఖాస్తు ప‌త్రం - గులాబీ స‌ర్కార్‌పై సంధించిన అస్త్రం..!

చిత్రం
ఇక నేనుండ‌లేను. ప‌ని లేకుండా ఊరికే ఉండ‌లేను. చేతులు క‌ట్టేసి ప‌ని చేయ‌మంటే ఎలా..నాకు వెళ్లేందుకు కారు కూడా  ఏర్పాటు చేయ‌లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ముర‌ళి. సోష‌ల్ రిఫార్మ్స్  కోసం త‌ప‌న ప‌డే ఈ ఉన్న‌తాధికారికి ఏ.ఆర్. శంక‌రన్ అంటే అభిమానం.  కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్ర‌భుత్వంపై వీఆర్ ఎస్ అస్త్రాన్ని సంధించారు. ఇక నేను ఈ కొలువు చేయ‌లేనంటూ ప్ర‌క‌టించారు. ఈ విష‌యం తెలంగాణ‌లో సంచ‌ల‌నం క‌లిగించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆయ‌న ప్ర‌ధానంగా ఈ ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కూడా చేశారు. ప్ర‌చారానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న దాంట్లో క‌నీసం 20 శాతం ఖ‌ర్చు చేయ‌గ‌లిగితే విద్యా వ్య‌వ‌స్థ గాడిన ప‌డేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మైన ఆరోప‌ణ లేదా ఆవేద‌న మొత్తం భ్ర‌ష్టు ప‌ట్టి పోయిన విద్యా రంగం గురించే. వ్య‌క్తిగ‌తంగా కొంత విభేదించిన‌ప్ప‌టికీ ..ఆయ‌న చెప్పిన దాంట్లో 100 శాతం వాస్త‌వమే. ఈరోజు వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లోని పాఠ‌శాల‌ల్లో ఎంత మంది టీచ‌ర్లుగా ప‌నిచ...