పోస్ట్‌లు

సెప్టెంబర్ 23, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అబ్బా కోలుకోలేని దెబ్బ..దిగ్గజ సంస్థ దివాళా..!

చిత్రం
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్రిటన్ కు చెందిన థామస్ కుక్ సంస్థ దివాళా తీసినట్తు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం నెలకొన్నది. నిన్నటి దాకా ఇండియా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రభుత్వ బ్యాంకులు సైతం ఇప్పుడు ఆసరా కోసం ఎదురు చూస్తున్నాయి. దాదాపు 178 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది థామస్ కుక్ కంపెనీకి. బెయిల్ అవుట్ ఇవ్వడానికి  ఇంగ్లాండ్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపక పోవడం గమనార్హం. ఈ ఒక్క డెసిషన్ తో 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. వారికి ఏవిధంగా ఉపాధి కల్పిస్తుందో వేచి చూడాలి. 1841 లో థామస్ కుక్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రతి ఏటా దాదాపు 1000 కోట్ల పౌండ్లు ఆదాయం వచ్చేది. కానీ ఎప్పుడైతే మెట్రావల్ కంపెనీని  కొనుగోలు చేసిందో ఇక అప్పటి నుంచి థామస్ కుక్ కోలుకోలేని స్థితికి దిగజారింది. పర్యాటక రంగంలో ఈ కంపెనీ తర్వాతనే ఏదైనా. సర్వీస్ ఇవ్వడంలోనూ, సౌకర్యాలను కల్పించడం లోను ఈ సంస్థ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నది. కాగా ఆన్‌లైన్‌ పోటీ, బ్రెగ్...

మోదీ వన్ మెన్ షో .. ప్రెసిడెంట్ ఔరా..పీఎం భళా

చిత్రం
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అగ్ర రాజ్యం అమెరికా విస్తు పోయేలా భారత ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ చేసేశారు. ఆయన మాట్లాడిన తీరుకు ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ సైతం తన గురించి ఆలోచించేలా చేశారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉన్నది. వేరే భూభాగంలోకి చొరబడి వారిపై దాడులు చేయడం, మట్టు బెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. హ్యూస్టన్ లో జరిగిన ఒకే ఒక్క సమావేశం పూర్తిగా భారతీయ జెండాలతో, మోదీ అంటూ అనుకూల నినాదాలతో పూర్తి గా నిండి పోయింది. ప్రవాస భారతీయుల మద్దతును చూసి ట్రంప్ అలా చూస్తూనే వుండి పోయారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఇండియా తరపున ఎంత సపోర్ట్ కావాలో తెలిసేలా చెప్పడంలో ఇండియన్ పీఎం చెప్పకనే చెప్పారు. మోదీ సాధించిన దౌత్య విజయం ఇది. పక్కనే ఉన్న దాయాది దేశం ఆడుతున్న నాటకాలను బట్టబయలు చేశారు. అంతే కాకుండా ఏ సమయంలోనైనా తాము దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో ఓ వైపు ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపాలని ఉవ్విళ్ళూరుతున్న అమెరికా ప్రెసిడెంట్ కు అలాంటి ఛాన్స్ ఇవ్వకుండానే ఘాటుగా చెప్పారు. తమ దేశం శాంతిని కోరుకుంటుం...

హెచ్‌సీఏలో టెన్షన్ టెన్షన్..అధ్యక్ష పీఠం దక్కేదవ్వరికో

చిత్రం
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ లో ఎప్పుడూ లేనంతగా టెన్షన్ వాతాహవరణం నెలకొన్నది. బీసీసీఐకి అనుబంధంగా వున్న ఈ సంస్థలో సభ్యునిగా ఉండటం గొప్పగా భావిస్తారు. 200 మంది దాకా సభ్యులున్నారు. ఇప్పటికే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా వున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు గడ్డం వెంకట స్వామి తిరిగి తన పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తునాన్రు. దీని కోసం మాజీ టీమిండియా సారథి మహమ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిండెంట్ పదవి కోసం పోటీ పడ్డారు. ఈ ఒక్క అంశం దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. ఎందుకంటే వివేక్ అంటే కొందరికి మాత్రమే తెలుసు. కానీ అజారుద్దీన్ అంటే ప్రపంచంలోనే అత్యుత్తమైన రిస్టీ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నారు. కపిల్ దేవ్ తర్వాత ఇండియాకు ఎనలేని విజయాలు తెచ్చిపెట్టిన ఒకే ఒక్క సారథి, బ్యూటిఫుల్ బ్యాట్స్ మెన్ గా ఆయన వినుతికెక్కారు. అతడు ఆడే విధానం ఇంకే ఆటగాడు ఆడలేక పోయారు ఇప్పటి దాకా. అతడికున్న టాలెంట్ వెరీ వెరీ డిఫరెంట్. అనుకోని రీతిలో అజ్జు భాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కున్నాడు. బీసీసీఐ ఆయనపై జీవిత కాలం నిషేధం విధించింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తానేమిటో నిరూపించుకున్నాడు. ఏపీ హైకోర్టు తప్పు ప...

దమ్మున్నోడు దుమ్ము లేపిండు

చిత్రం
తెలుగు సినిమా రంగంలో దమ్మున్న డైరెక్టర్లు కొందరే. ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి దారుల్లో వాళ్ళే. దీనినే నమ్ముకుని వున్న వాళ్ళు వేళల్లో ఉన్నారు. కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇంకొందరు ఎప్పుడు తమను అదృష్టం తలుపు తడుతుందా అంటూ వేచి చూస్తున్నారు. ఇప్పుడున్న పేరున్న దర్శకులంతా బాగా పుస్తకాలను చదువుతారు. అందుకే వారి మాటాల్లో ఏదో తెలియని మంత్రం వుండే ఉంటుంది. సినిమా నడవాలన్నా కంటెంట్ తో పాటు మ్యూజిక్, పాటలు, డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉండాలి. లేకపోతే జనం చూడరు. అప్పట్లో హీరోలను చూసి సినిమాలు నడిచేవి. హీరోయిన్లు తోలు బొమ్మల్లా వుండే వాళ్ళు. టెక్నాలజీ మారింది. సినిమా కూడా పూర్తిగా తక్కువ రోజుల్లోనే పూర్తవుతోంది. కొన్ని రోజుల్లోనే సినిమా సక్సెస్సా లేక ఫెయిలా అన్నది తెలిసి పోతోంది. ఒక్కో సినిమా కోసం 200 మంది కి పైగా టెక్నీషియన్స్ పనిచేస్తారు. సినిమా భారీ బడ్జెట్ తూ కూడుకున్నది అవుతే పని చేసే వాళ్ళు పెరిగి పోతారు. ఈ సినీ ప్రేమికులు ఎప్పుడు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో తెలియదు. అందుకే ఎక్కువ మంది నిర్మాతలు దేవుళ్ళ చుట్టూ తిరుగుతారు. కోట్లల్లో బడ్జెట్ ఉండడంతో కొద్ది మంది మాత్రమే ఈ ర...