పోస్ట్‌లు

డిసెంబర్ 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

హైదరాబాద్ లో రియల్ బూమ్

చిత్రం
ఇల్లు అన్నది ఒకప్పుడు కష్టసాధ్యమైన విషయం. కానీ ఇప్పుడు అలా కాదు. అది నిత్యావసరం. ఇది కాదనలేని సత్యం. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సిటీగా హైదరాబాద్ కు పేరుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, ఐటీ పరంగా నూతన కంపెనీలు పెట్టుబడులు పెట్టడం తో పాటు దిగ్గజ సంస్థలన్నీ నగరం జపం చేస్తున్నాయి. కొలువు తీరిన ప్రభుత్వం మొదటి ప్రయారిటీ ఇన్వెస్ట్ మెంట్ చేసే వారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. సకల సదుపాయాలు అందజేస్తోంది. దీంతో వందలాది కంపెనీలు కొలువు తీరాయి. మరికొన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో వేలాది మందికి ఇక్కడ ఉపాధి లభిస్తోంది. టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గతంలో తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అపరిమితమైన డేటా, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆయా కంపెనీలు తమ ఇళ్లలో ఉంటూనే పని చేసే అవకాశాన్ని కల్పిష్తున్నాయి. దీంతో గృహాలకు భలే డిమాండ్ ఉంటోంది. పదేళ్ల కిందట వీటి ధరలు 40 లేదా 50 లక్షల్లో వుంటే ఇప్పుడు వాటి ధరలు మరింత పెరిగాయి. ఇప్పటికే 30 శాతానికి మించి పెరిగాయి. ప్రైమ్ లొకేషన్ లో అయితే కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా చేరుకున్నాయి. నోట్ల రాడ్డ్డుతో ...

రియల్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్

చిత్రం
హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారింది. క్రికెట్ ప్రెమికులు ఫుల్ గా క్రికెట్ ఆటలో మజాను ఎంజాయ్ చేశారు. ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా ఏమిటో రుచి చూపించాడు. ఛేదనలో మళ్లీ మొనగాడిగా నిలిచాడు. రాహుల్‌ మెరుపులకు తోడుగా నిలిచిన కోహ్లి ఆ తర్వాత అన్నీ తానై గెలిపించాడు. కడదాకా నిలిచాడు. కసిదీరా బంతుల్ని కొట్టాడు. దీంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లే కాదు బంతి కూడా దెబ్బ మీద దెబ్బలతో విసిగి పోయింది. విరాట్‌ ఆఖరి దాకా నిలువడంతో కొండంత లక్ష్యం కూడా చిన్న బోయింది. తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ముందుగా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. హెట్‌మైర్‌ 41 బంతుల్లో 56 పరుగులు చేయగా, లూయిస్‌ 17 బంతుల్లో 40 పరుగులతో చెలరేగారు. భారత బౌలర్లలో చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ 40 బంతుల్లో 62 పరుగులు చేసి రాణించగా, సారధి కోహ్లీ దుమ్ము రేపాడు. కాగా టాస్‌ నెగ్గిన  కోహ్లి ఫీల్డింగ్...

దిశకు దేశం సలాం

చిత్రం
దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశ వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తోంది. పలు కళాశాలల్లో విద్యార్థినులు .. మా ఆడపిల్లకు న్యాయం జరిగిందంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలి వచ్చారు. పూల వర్షం కురిపించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్ల క్రితం వరంగల్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినులపై యాసిడ్‌ దాడి చేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. అప్పుడు వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ప్రస్తుతం దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదేళ్ల తర్వాత అదే సంఘటన చటాన్‌పల్లిలోనూ పునరావృతం అయింది. ఎన్‌కౌంటర్ క్రెడిట్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌దే. కాగా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దిశ సంఘటనలో నిందితులు దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిపారు. కర్ణాటకకు చెందిన విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ 19...