పోస్ట్‌లు

జులై 23, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పీసీ ముస్త‌ఫా ..వారెవ్వా..ఐడి ఫ్రెష్‌..ఇండియ‌న్ మార్కెట్‌లో టాప్..!

చిత్రం
ఇండియ‌న్ ఫుడ్ మార్కెట్‌లో ఐడీ ఫ్రెష్ సంచ‌ల‌నాలు సృష్టిస్తూ ..గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని గ‌డిస్తూ ..కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొడుతోంది. ఇత‌ర కంపెనీల‌కు చుక్క‌లు చూపిస్తోంది. పీసీ ముస్త‌ఫా ఈ పేరు చెబితే చాలు హీ వాజ్ ఏ క్రియేట‌ర్. రూర‌ల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చిన ఈ యువ‌కుడి మ‌దిలో మెదిలిన ఐడియా ఇపుడు డాల‌ర్ల‌ను కొల్ల‌గొడుతోంది. అత‌డికి వ‌చ్చిన ఒకే ఒక్క ఆలోచ‌న..చూస్తే ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది. మ‌నం రోజూ బ్రేక్ ఫాస్ట్ సంద‌ర్భంగా తినే ప‌దార్థాల‌పై దృష్టి పెట్టారు. ఇడ్లి, దోశ‌, వ‌డ‌, ప‌రోటా ఐట‌మ్స్‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గరాల‌తో పాటు దుబాయి, అమెరికా, త‌దిత‌ర దేశాల‌కు విస్త‌రించింది ముస్తాఫా వ్యాపారం. త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ ఆదాయాన్ని పొంద‌వ‌చ్చ‌ని అత‌డిని చూస్తే తెలుస్తుంది. ప్ర‌తి రోజూ వంద‌లాది వాహ‌నాలు ఈ ఐట‌మ్స్‌కు సంబంధించిన ప్యాకెట్లు స‌ర‌ఫ‌రా అవుతుంటాయి. పీసీ ముస్తాఫా ..బెంగ‌ళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్ స్టార్ట‌ప్ కంపెనీని ప్రారంభించారు. 16 వేల అవుట్ లెట్ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి చోటా ఐడీ ఫ్రెష్ ఉండేలా తీర్చిదిద్దారు. ఎవ‌రైనా టిఫిన్లు వేడిగా అప్ప‌టిక...

గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం - స‌వ‌రించిన ప్ర‌భుత్వం..!

చిత్రం
తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు ఒక్కోసారి త‌ల‌నొప్పులు తెచ్చి పెడ‌తాయి అన‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ..పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేదీల ఖ‌రారుపై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అభ్యంత‌రం చెప్ప‌డం. యుద్ధ ప్రాతిప‌దిక‌న పుర‌పాల‌క చ‌ట్టాన్ని తీసుకు వ‌స్తున్న‌ట్లు విధాన స‌భ సాక్షిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు స‌భ్యులు ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. కొత్తగా పుర‌పాల‌క చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది స‌ర్కార్. దీనిపై అభ్యంత‌రం చెబుతూ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌నాల వ్యాజ్యం కింద పిల్ దాఖ‌లైంది. దీంతో పాటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్కార్ త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేదంటూ కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా త‌మకు అనుకూలంగా ఉండేందుకే ప్ర‌భుత్వం ఉన్న చ‌ట్టానికి తూట్లు పొడిచిందంటూ విప‌క్షాలు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన్న‌వించారు. దీంతో ప‌రిశీల‌న నిమిత్తం ప్ర‌భుత్వం పంపించిన పుర‌పాల‌క చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయాల్సిందేనంటూ తిప్పి పంపించారు. ఈ సంద‌ర్భంగా, మున్సిప‌ల్ ఎన్నిక‌ల తేదీల‌పై ప్ర‌భుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో తెలియ చేయాల్సిందంటూ గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం తెలిపార...

సంకీర్ణం స్వ‌యం కృతాప‌రాధం .. యెడ్యూర‌ప్ప‌నే సీఎం..?

చిత్రం
దేశ వ్యాప్తంగా వైర‌ల్‌గా మారిన క‌న్న‌డ రాజ‌కీయం ఎట్ట‌కేల‌కు సంకీర్ణ సర్కార్ విశ్వాస ప‌రీక్ష వీగిపోవ‌డంతో తెర ప‌డింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు క‌లిసిక‌ట్టుగా క‌ర్నాట‌క‌లో ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం దిన‌దిన గండాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబ‌ల్ ఎమ్మెల్యేలు టాటా చెప్ప‌డం, ముంబ‌యి హోట‌ల్‌లో బ‌స చేయ‌డం, ట్ర‌బుల్ షూట‌ర్ డీకే శివ‌కుమార్ రంగంలోకి దిగ‌డం, సీనియ‌ర్ నేత సిద్దిరామ‌య్య మంత‌నాలు జ‌రిపినా చ‌ర్చ‌లు కొలిక్కి రాలేదు. ఈ సర్కార్ క‌న్న‌డ నాట కొలువుతీరి స‌రిగ్గా 14 నెల‌లు గ‌డిచింది. స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ తీవ్ర వ‌త్తిళ్ల‌ను ఎదుర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన స‌భ్యుడైన‌ప్ప‌టికీ..అత్యంత హుందాగా వ్య‌వ‌హ‌రించారు. త‌న ప‌రిమితులు, అధికారాల గురించి చాలా స్ప‌ష్టంగాఈ దేశానికి, ముఖ్యంగా కేంద్రంలో కొలువు తీరిన క‌మ‌ల‌నాథులు, మోదీ, అమిత్ షాల‌కు స్ప‌ష్టం చేశారు. స‌భాప‌తి రూలింగ్ ఇచ్చే విష‌యంలో, ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డంలో ఎలాంటి పాత్ర పోషిస్తారో, విధాన‌స‌భ‌లో ఆయ‌న ఎంత ప‌వ‌ర్ ఫుల్లో తేట‌తెల్లం చేశారు. స్పీక‌ర్ పోస్టు అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాద‌ని, అది అత్యున్న‌త విలువ‌త...

కుప్ప కూలిన క‌న్న‌డ స‌ర్కార్ - అనుకూలం 99 - ప్ర‌తికూలం 105 - వీగిన విశ్వాసం..యెడ్డీనే సీఎం..!

చిత్రం
మోడీ, షాల ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింది. ఎట్ట‌కేల‌కు గ‌త కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతూ క‌న్న‌డ రాజ‌కీయాన్ని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప కూలి పోయింది. అవిశ్వాస తీర్మానం మేర‌కు క‌ర్నాట‌క విధాన‌స‌భ‌లో స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ స‌మ‌క్షంలో సీఎం కుమార స్వామి ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు కుమార స్వామి ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగం చేశారు. తాను ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాన‌ని, ఎన్నో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ సంకీర్ణ స‌ర్కార్‌ను కూల్చేప‌నిగా పెట్టుకుంద‌ని, అందులో భాగంగానే ఇవాళ జ‌రుగుతున్న నాట‌కీయ ప‌రిణామాలని స్ప‌ష్టం చేశారు. విశ్వాస తీర్మానం వీగి పోవ‌డంతో కుమార ఇక మాజీ ముఖ్య‌మంత్రి కానున్నారు. సీఎం మాట్లాడాక‌..ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరున్న డీకే శివ‌కుమార్ ఆవేశంగా మాట్లాడారు. త‌మ సంకీర్ణ ప్ర‌భుత్వం న్యాయ‌బ‌ద్ధంగానే వ్య‌వ‌హ‌రించింద‌న్నారు. తాను కూడా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశామ‌న్నారు. క‌న్న‌డ విధాన‌స‌భ‌లో జ‌రుగుతున్న అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా జ‌రిగిన దానిని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. స‌భాప‌తిగా ఉన...

ఆన్‌లైన్ గేమింగ్‌ను షేక్ చేస్తున్న హిట్‌వికెట్

చిత్రం
డిజిట‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ ఇండియాలో ఎక్క‌డ‌లేని స్టార్ట‌ప్‌లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని అంకురాలు నిల‌బ‌డితే మ‌రికొన్ని టాప్ పొజిష‌న్ లో ఉంటున్నాయి. దేశంలో లెక్క‌లేన‌న్ని ఆట‌లు ఉన్న‌ప్ప‌టికీ క్రికెట్ ఆట‌కున్నంత క్రేజ్ ఇంకే ఆట‌కు లేదు. ఈ ఒక్క ఆట‌ను బేస్‌గా చేసుకుని వ్య‌క్తులు, సంస్థ‌లు, కంపెనీలు, వ్యాపారులు, టెక్నిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌, బిజినెస్ టైకూన్స్ , డిజైన‌ర్స్, ఆట‌గాళ్లు సైతం త‌మ క‌ల‌ల‌కు రెక్క‌లు తొడుగుతున్నారు. పురుషుల‌కు ధీటుగా గేమింగ్ విభాగంలో ఓ మ‌హిళ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ స్వంతం చేసుకుంది. హిట్‌వికెట్ కో ఫౌండ‌ర్ కీర్తిసింగ్. ఈ ప్రారంభించిన మొబైల్ గేమింగ్ స్టార్ట‌ప్ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గ‌డిస్తోంది. దీనికంత‌టికీ ఆమె పెట్టిన ఎఫ‌ర్ట్స్‌. చిన్పప్ప‌టి నుంచి కీర్తి సింగ్‌కు క్రికెట్ అంటే చ‌చ్చి పోయేంత ప్రేమ‌..ఇష్టం కూడా. చ‌దువుపై కాన్‌సెంట్రేష‌న్ చేస్తూనే మ‌రో వైపు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా క్రికెట్ ఆట గురించి కుటుంబీకుల‌తో పాటు ఇంటికి వ‌చ్చే వారిని, ఎక్స్ ప‌ర్ట్స్‌ను అడిగి తెలుసుకునేది. ఈ ఉత్సుక‌త‌నే ఆమెను ఆంట్ర‌ప్రెన్యూర్‌గా మార్చేలా చేసింది. రాను రాను ఆమె...

వారెవ్వా...డిజిట‌ల్ మీడియా..టాలెంట్ వుంటే..కోట్లే కోట్లు..!

చిత్రం
టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ డిజిట‌ల్ మీడియా ఊహించ‌ని రీతిలో, మార్కెట్ వ‌ర్గాల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. ప్రింట్, మీడియా రంగాలకు ధీటుగా ఎదుగుతోంది. సాంకేతిక ప‌రిజ్ఞానంలో స‌మూల‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డం, ఇంట‌ర్నెటి క‌నెక్టివిటీ పెర‌గ‌డం, డిజిట‌ల్ టెక్నాల‌జీకి ప్ర‌యారిటీ ఉండ‌డంతో ఈ రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఆఫ్ లైన్‌లో కంటే ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ ప్ర‌పంచ మంత‌టా చాప కింద నీరులా విస్త‌రించింది. ఇటీవ‌ల ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు అత్య‌ధికంగా పెర‌గ‌డం కూడా ఇందుకు కార‌ణం కావ‌చ్చు. ఆన్‌లైన్ వీడియోల‌తో పాటు ఆడియో సేవ‌ల‌కు డిమాండ్ అధికంగా ఉంటోంది. దేశీయ డిజిట‌ల్ మీడియా రంగం ఈ ఏడు ఎంట‌ర్‌టైన్మెంట్ రంగాన్ని దాట‌వ‌చ్చ‌ని ఫిక్కీ-ఈవైలు వెల్ల‌డించాయి. వ‌చ్చే రెండేళ్ల‌లో ప్రింట్, మీడియాను దాటేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. 510 కోట్ల డాల‌ర్లు అంటే ఇండియ‌న్ రూపీస్ అయితే అక్ష‌రాల 35 వేల 700 కోట్లు అన్న‌మాట‌. గ‌త ఏడాదిలో 17 వేల 500 కోట్లు న‌మోదైన సినిమా ఇండ‌స్ట్రీ ఈ ఏడాది మ‌రో 2 వేల కోట్లు పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా. 2018లో 440 కోట్ల డాల‌ర్లుంటే అంటే 30 వేల 800 కోట్ల...

విద్యాశాఖ నిర్ల‌క్ష్యం..టెట్ నిర్వ‌హ‌ణ‌లో జాప్యం..ఇక‌నైనా జ‌రిగేనా..?

చిత్రం
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై చూపించిన శ్ర‌ద్ధ‌లో క‌నీసం ప‌దోవంతు చూపించినా విద్యాశాఖ‌లో ప్ర‌క్షాళ‌న జ‌రిగి వుండేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. వేలాది ఖాళీలు ఇంకా భ‌ర్తీ కావాల్సి ఉంది. స‌రిప‌డ‌నంత టీచ‌ర్లు లేరు. నాన్ టీచింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండ‌క పోవ‌డంతో భార‌మంతా ప్ర‌స్తుతం విధులు నిర్వ‌హిస్తున్న వారిపైనే భారం ప‌డుతోంది. దీంతో పాఠాలు స‌క్ర‌మంగా చెప్ప‌లేక స‌త‌మ‌త‌వుతున్నారు. ప్ర‌భుత్వ ప‌రిధిలోని పాఠ‌శాల‌లతో పాటు ప్రైవేట్ స్కూళ్ల‌ల్లో టీచ‌ర్లుగా ప‌నిచేయాలంటే కేంద్రం టీచ‌ర్ ఎలిజ‌బిలిటి టెస్ట్ (టెట్ ) త‌ప్ప‌క ఉత్తీర్ణులు కావాల్సిందేనంటూ కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌తి ఏటా ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ‌ల‌తో పాటు కేంద్రం కూడా నేష‌న‌ల్ ఎలిజబిలిటి టెస్ట్ నిర్వ‌హిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యినా ఇంకా ఇంత‌వ‌ర‌కు టెట్ నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టికే టెట్ పాసై గ‌డువు పూర్త‌యిన అభ్య‌ర్థులు వేలాదిగా ఉన్నారు. వీరంతా తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇక‌పోతే స‌మ‌గ్ర స‌ర్వ‌శిక్ష అభియాన్ ప‌థ‌కం కింద నిర్వ‌హిస్తున్న...