పోస్ట్‌లు

అక్టోబర్ 9, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆగని వర్షాలు..కళకళలాడుతున్న ప్రాజెక్టులు

చిత్రం
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల దెబ్బకు వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నదులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి ల నుంచి వరద రావడంతో కృష్ణమ్మ ధాటిగా ప్రవహిస్తోంది. పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ప్రమాద స్థాయిని దాటింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తేశారు. ఈ నీళ్లన్నీ శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిపోతున్నాయి. పాతికేళ్ల తర్వాత ఐదు సార్లు శ్రీశైలం గేట్ల ద్వారా నీళ్లను వదిలారు. అక్కడి నుండి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వదిలారు. మొత్తం అరవై రోజుల్లో ముప్పై రోజుల పాటు నీళ్లను విడుదల చేశారు. 28029 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి 80000 వేల క్యూసెక్కుల వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గత ఆగస్టు నెలలో 13 సార్లు నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్ లో ఏడు రోజులు, ఈ నెలలో నీటిని విడుదల చేస్తూ వచ్చారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 884 అడుగుల మట్టంతో 215 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. భారీగా నీరు నిండుకోవడంతో అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు కింది కాలువలకు నీటిని విడుదల చేస్తున్న...

కార్మికుల కోసం..అఖిలపక్షం

చిత్రం
ప్రభుత్వం దిగి రావడం లేదు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సంస్థను ప్రభుత్వపరం చేయాలని కోరుతున్నారు. నష్టాల పేరుతో ఆర్టీసీని బడా బాబులకు కట్టబెట్టేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని, ఎట్టి పరిస్థితుల్లో తాము ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు స్పష్టం చేశారు. అమరులకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన నేతలను అరెస్ట్ చేసి, విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఎంతకూ దిగి రాక పోవడంతో జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది.  న్యాయపరంగా, శాంతియుతంగా తమ నిరసన కొనసాగుతుందని అన్నారు. విపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 50000 వేల మందికి పైగా కార్మికులు విధులు బహిష్కరించారు. సమ్మెకు దిగి ఆరు రోజులు కావొస్తోంది. అయినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాక పోగా, 30 శాతం ప్రైవేట్ పరం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎవరైతే డెడ్ లైన్ లోపు విధులకు హాజరు కాకపోతే వారంతా మాజీ ఉద్యోగులవుతారని సీఎం చెప్పారు. కొత్తగా నియామకాలు చేపట్టేందుక...

రాజువయ్యా..రాజమౌళి..!

చిత్రం
భారతీయ సినిమా జగత్తులో ధ్రువతారగా వెలుగొందేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాకు హాలీవుడ్ స్థాయిలో పేరు తీసుకు వచ్చిన అరుదైన డైరెక్టర్. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు వచ్చినా ఎలాంటి పబ్లిసిటీ కోరుకోకుండా పూర్తిగా తన లోకంలో తాను వుండి పోతాడు. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం వుండి తీరుతుంది. ఉన్న డైరెక్టర్స్ లలో ఇప్పుడు టాప్ వన్ దర్శకుడిగా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమా కోట్లాది రూపాయలను కొల్లగొట్టింది. ఇండియాలో, వరల్డ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా రంగానికి ఎనలేని కీర్తిని తీసుకు వచ్చాడు రాజమౌళి. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ లో 1973 అక్టోబరు 10 న పుట్టారు. సినిమా దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు ఆయన. ఒక్కో సినిమాకు ఎస్. ఎస్. రాజమౌళి దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగానే తీసుకుంటారన్న టాక్ ఉన్నది. జీవిత భాగస్వామి రామా రాజమౌళి. ఇద్దరు పిల్లలు. ఒకరు కార్తికేయ మరొకరు మయూష. భార్య రామా రాజమౌళి మంచి డిజైనర్. అన్ని సినిమాలకు ఆ...

చదవండి..ఎదగండి..స్ఫూర్తిగా నిలవండి..కపిల్ దేవ్

చిత్రం
సమాజాన్ని, జీవితాన్ని ప్రభావితం చేసేలా..పదిమందికి స్ఫూర్తి దాయకంగా ఉండేలా విద్యార్థులు ఎదగాలని ప్రముఖ క్రికెటర్, మాజీ టీమిండియా సారథి కపిల్ దేవ్ పిలుపునిచ్చారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని కోరారు. విద్య మాత్రమే ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు దోహద పడుతుందన్నారు. డాక్టర్ అయ్యన్న చౌదరి రామినేని స్మృత్యర్థం అమెరికాలోని రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గుంటూరు లో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కపిల్ దేవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సత్తా చాటిన స్టూడెంట్స్ తో పాటు ఉత్తమ టీచర్స్ కు కూడా పురస్కారాలను అందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పిల్లలు, విద్యార్థులు అనుసరించాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని కపిల్ దేవ్ కోరారు. టీచర్లు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్దగా నోట్స్ రాసు కోవాలని, దీనివల్ల స్టూడెంట్స్ కు మేలు జరుగుతుందన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే పెద్దలను మరిచి పోవద్దని హితవు పలికారు. తాను కూడా మీ...

దిల్ ఉన్నోడు..మనోడు ..దమ్మున్నోడు

చిత్రం
తెలుగు సినిమా రంగంలో ఆంధ్రా అధిపత్యానికి చెక్ పెట్టిన ఒకే ఒక్క నిర్మాత తెలంగాణకు చెందిన దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి. మనోడికి ముందు నుంచి సినిమా మీద ఓ అవగాహన ఉంది. అంతకంటే ఎక్కువగా ఆయన ఏది పట్టుకుంటే అది బంగారంగా మారేలా దేవుడు అలా రాసి పెట్టాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు తెలుగు వారికి అందించాడు. అంతే కాకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాడు. డైరెక్టర్స్ కు ఫ్రీడమ్ ఇస్తాడు. తనకు సినిమా మీద మంచి పట్టుంది. ఎప్పుడు ఏ సినిమాను తీయాలో, ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎలా జనంలోకి చొచ్చుకు పోయేలా మార్కెటింగ్ చేయాలో, చివరకు డబ్బులు ఎలా రాబట్టుకోవాలో దిల్ రాజుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదంటే అతిశ యోక్తి కాదేమో. నిర్మాతల పరంగా చూస్తే తెలంగాణ నుంచి దిల్ రాజు ,ఆంధ్ర నుంచి మెగాస్టార్ బావ, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రముఖంగా ఉన్నారు. దిల్ రాజు ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఆ సినిమా సక్సెస్ కావాల్సిందే. అంత వరకు నిద్ర పోడు..తన టీమ్ ను నిద్ర పోనివ్వడు. తెలుగు ప్రేక్షకులకు, సినీ అభిమానులకు దిల్ రాజు సమర్పిస్తున్నాడంటే చాలు అందులో ఏదో మెస్సేజ్ వుండి ఉంటుంది. అంతే కాదు తెలుగుదనం కూడా...

సినీవాలిలో తమన్వయత్వం

చిత్రం
నటుడిగా ప్రారంభమై సంగీత దర్శకుడిగా టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఎస్.ఎస్.థమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాణీలను కాపీ కొడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా వాటిని బేఖాతర్ చేస్తూ తనను తాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పటికే తెలుగు సినీ రంగంలో ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిని కాదనుకుని నిలబడాలంటే దమ్ముండాలి. డిఫరెంట్ గా జనం పల్స్ ను పట్టుకోవాలి. అప్పుడే సక్సెస్ వెంటపడుతుంది. దీని కోసం థమన్ బాగా కష్టపడడ్డాడు. ప్రస్తుతం దుమ్ము రేపుతున్న అందరు నటులకు మ్యూజిక్ ఇచ్చేలా ఎదిగాడు. ఎస్.ఎస్. తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. ప్రస్తుతం థమన్ కు 35 ఏళ్ళు.1983 నవంబరు 16 లో పుట్టాడు. నటుడే కాకుండా స్వరకర్త, రికార్డు నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు కూడా. 2003 నుంచి తన కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఎన్నో జింగిల్స్ చేశాడు. ఏఆర్ రెహమాన్ దగ్గర కొంత కాలం పనిచేశాడు. . ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడి మొదటి చిత్రం తెలుగులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన, మాస్ మహారాజ, ఇలియానా కలిసి నటించిన కిక్ సినిమా. అది బిగ్ హి...

ఒలంపిక్ మెడల్ పై కన్నేసిన జైనా నాసర్

చిత్రం
జైనా నాసర్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతోంది. సామాన్యంగా ముస్లిం కంట్రీస్ లలో మహిళలపై తీవ్ర నిబంధనలు ఉంటాయి. అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉండడంతో బయటకు రావాలంటేనే జడుసుకుంటారు. భయాందోళనకు గురవుతారు. కానీ వీటన్నింటిని తట్టుకుని జైనా నిలబడింది. హిజాబ్ ధరించి ప్రొఫెషనల్ బాక్సర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రీడాకారిణిది బెర్లిన్ దేశం. ఎంతో కష్టపడ్డారు. 2018 ఏడాదిలో జర్మన్ ఎలైట్ ఛాంపియన్ షిప్ ను జైనా నాసర్ గెలుచుకుంది. 57 కేజీల బరువు విభాగంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. బంగారు పతకాన్ని సాధించారు. 2017 లో నైక్ అథ్లెట్ గా జైనా నాసర్ ఎంపికైంది. జెర్మనీలోని బెర్లిన్ లో జైన నాసర్ పుట్టారు. చిన్నప్పటి నుంచి జైనా నాసర్ కు బాక్సింగ్ అంటే ఇష్టం. చాలా మంది మహిళలు, బాలికలు అత్యంత క్లిష్టమైన బాక్సింగ్ ఆట ఆడేందుకు ఇష్టపడరు. కానీ జైనా మాత్రం అందరి బాలికల్లా కాకుండా తాను బాక్సర్ గా అవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కన్నవారిని తనకు కోచింగ్ ఇప్పించమంటూ కోరింది. తానే 13 ఏళ్ళు ఉన్నప్పుడే యూట్యూబ్ లో ఫిమేల్ బాక్సర్లు ఎలా ట్రైనింగ్ పొందుతున్నారో, ఎలా పంచ్ లు విసరాలో, ప్రత్యర్థులను ఎలా బురిడీ కొట...

ఇమ్రాన్ ఖాన్ కు యువరాజు ఝలక్

చిత్రం
దాయాది పాకిస్తాన్ కు ప్రతి చోటా వ్యతిరేకత ఎదురవుతోంది. ఎక్కడికి వెళ్లినా ఏ ఒక్క దేశం సపోర్ట్ చేయడం లేదు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నా, విషం కక్కుతున్నా వర్కవుట్ కావడం లేదు. ఒక్క చైనా కంట్రీ తప్పా ఏ ఒక్క దేశమూ పాకిస్తాన్ వైపు రావడం లేదు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం చోటు చేసుకోవడం వైరల్ గా మారింది. చిరకాల స్నేహితుడివని నీకు స్పెషల్ గా విమానం ఇచ్చి మరీ సాగనంపితే ..ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నన్నే అవమానిస్తావా..నన్ను కాదని మహతీర్ అహ్మద్ , ఎర్డోగాన్ తో కలిసి ఇస్లామిక్ దేశాల వాదన వినిపించాలని డిసైడ్ అవుతావా..దోస్తువని నీకు గౌరవం ఇస్తే ఇలాగేనా ప్రవర్తించేది అంటూ సౌదీ అరేబియా రాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​ పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​పై మండిపడ్డారు. తాజాగా ఇమ్రాన్​ ఖాన్​ తిరిగొస్తున్న విమానం సాంకేతిక సమస్యతో ఆగి పోవడం, తర్వాతి రోజు ఇమ్రాన్​ కమర్షియల్​ ఫ్లైట్​లో ఇస్లామాబాద్చే చేరుకున్నారు. ఆ ఫ్లైట్​లో ఎలాంటి ప్రాబ్లం లేదని, సౌదీ యువరాజు ఆదేశాలతోనే ఫ్లైట్ ను ఆపేసినట్లు పాకిస్తానీ పత్రిక ‘ది ఫ్రైడే టైమ్స్’ వివరించింది. అయితే, ఇదంతా తప్పుడ...

ఆర్ధిక మాంద్యం..సినిమాకు వరం

చిత్రం
కేంద్రంలో బిజేపీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు దెబ్బకు వ్యాపార వర్గాలు అబ్బా అంటున్నాయి. దేశ ఆర్ధిక పరిస్థితులు పతనం దిశగా సాగుతున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్ధేందుకు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్దీపన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వం తరపు నుండి సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. అయితే విచిత్ర కరంగా సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపక పోవడం విస్తుపోయేలా చేస్తోంది. దీని ఎఫక్ట్ ఈ రంగంపై చూపక పోవడంతో సినిమాలు యధావిధిగా విడుదలవుతున్నాయి. మిగతా ప్రాధ్యాన్య రంగాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నా వినోద రంగం మాత్రం అంతకంతకు ఆదాయాన్ని గడిస్తోంది. డిజిటల్ టెక్నాలజీ లో పెను మార్పులు చోటు చేసుకోవడం కూడా కొంత మేరకు డబ్బులు వచ్చేలా చేస్తున్నాయి. ఒక్క సినిమా రంగాన్ని నమ్ముకుని ఆధార పడుతున్న కుటుంబాలు వేలాదిగా ఉన్నాయి. ఒక్క సినిమా స్టార్ట్ అవుతే కనీసం నాలుగు నెలల నుండి ఆరు నెలల దాకా సమయం పడుతుంది. సినిమా ప్రారంభం నుంచ...

సై అంటున్న కార్మికులు..డోంట్ కేర్ అంటున్న కేసీఆర్

చిత్రం
ఘనమైన చరిత్రను స్వంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు రోడ్డున పడింది. వేలాది మంది కార్మికుల కుటుంబాలు అన్నమో రామచంద్ర అంటున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. నష్టాల పేరుతో కోట్లాది ప్రజలకు రేయింబవళ్లు సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తమ సంస్థకు 50 వేల కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయని, అయితే సీఎం చెబుతున్నట్లు తమ ఆర్టీసీ నష్టాల్లో ఉందనడం అబద్ధమన్నారు. తాను తలుచుకుంటే 2800 కోట్లు మంజూరు చేయడం పెద్ద విషయం కాదన్నారు. ఆస్తులపై కన్నేసి తమను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేసేలా చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి జీతాలు తీసుకోకుండానే సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ బతుకులు బాగు  పడుతాయని కార్మికులు భావిస్తున్నారు. అయినా సర్కార్ నోరు మె...