పోస్ట్‌లు

మే 2, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మేధ‌స్సుకు ప‌రీక్ష‌..ఉపాధికి శ్రీ‌రామ‌ర‌క్ష

చిత్రం
కాస్తంత తెలివి తేట‌లు ఉంటే చాలు..ఎక్క‌డి నుండైనా ..ఎన్ని కోర్సులైనా నేర్చుకోవ‌చ్చు. ఇంటి నుండే పాఠాలు..టీచ‌ర్లు..శిక్ష‌కులు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. మిమ్మ‌ల్ని అన్ని రంగాల్లో నైపుణ్యం క‌లిగిన స్టూడెంట్స్‌గా తీర్చిదిద్దుతారు. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌యారు చేసిన స్వ‌యం ..ప‌థ‌కం భ‌రోసా క‌ల్పిస్తోంది. ఏ కోర్సు అయినా చేయాలంటే స‌వాల‌క్ష ఇబ్బందులు. కానీ అవేవీ వీటికి అడ్డు కాదు. ఓపెన్ స్కూల్ నుంచి క్లౌడ్ టెక్నాల‌జీ వ‌ర‌కు అన్ని ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, క్రెడిట్ స్కోర్ పొందేందుకు వీలు ప‌డుతుంది. ఐఐటీ, ఐఐఎం, ఫారిన్ యూనివ‌ర్శిటీల నుంచి బోధ‌న కూడా ఇందులోనే ల‌భిస్తోంది. కాలం మారింది. టెక్నాల‌జీలో స‌మూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెరుగైన ఫ్యూచ‌ర్ కు ..పునాది వేసుకునేందుకు ఈ కోర్సులు దోహ‌ద ప‌డ‌తాయి. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ కోర్సులు రూపొందించింది. కోచింగ్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌లేని వారి కోస‌మే వీటిని త‌యారు చేశారు. ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన ప‌నిలేదు. ప్ర‌ఖ్యాత సంస్థ‌లు ఆధునిక కోర్సుల‌కు ప్ర‌ణాళిక‌లు, సి...

ఐటీ శాఖ నోటీసులు ప్ర‌జాప్ర‌తినిధుల్లో గుబులు

చిత్రం
ఓ వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటే మ‌రో వైపు గులాబీ పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఒక్క‌సారిగా ఆస్తులు పెరిగాయి. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో పేర్కొన్న వివ‌రాలు..ఇపుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో పొందుప‌ర్చిన వివ‌రాల గురించి ఐటీ శాఖ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టింది. దీంతో ఆయా ప్ర‌జాప్ర‌తినిధులు ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యారు. తెలంగాణ‌తో పాటు రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ గ‌డ్, మిజోరాం అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆయా రాష్ట్రాల‌లో గెలిచిన ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేసిన దాఖ‌లు అగుపించ‌లేదు. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు త‌మ ఆస్తులు, అప్పుల లెక్క‌ల‌ను స‌రి చూసుకునే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌జాప్ర‌తినిధులు నామినేష‌న్లు వేసే స‌మ‌యంలో ఆస్తుల‌కు ..అప్పుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు న‌మోదు చేస్తారు. వాటి ఆధారాంగానే ఐటీ శాఖ నోటీసులు ఇవ్వ‌డమో లేక చ‌ర్య‌లు తీసుకోవ‌డమో జ‌రుగుతుంది. 2018 - 2019 సంవ‌త్స‌రానికి సంబంధించి జ‌రిపిన లావాదేవీలు ..స‌మ‌ర్పించిన వివ‌రాల‌పైనే ఎక్కువ‌గా ఐటీ శాఖ న‌జ‌ర్ పెట్టిన‌ట్టు స‌మాచారం. 2014 నుం...