పోస్ట్‌లు

నవంబర్ 2, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నో కంట్రోల్..పోర్న్ హల్ చల్

చిత్రం
లోకమంతటా అంతర్జాలంలో బూతు రాజ్య మేలుతోంది. క్లిక్ చేస్తే చాలు కుప్పలు తెప్పలుగా పోర్న్ దర్శనమిస్తోంది. వీటి బారిన పడిన వారంతా అది చూడ లేకుండా ఉండలేక పోతున్నారు. చిన్నారులు, మహిళలు, పురుషులు, వృద్దులు, యూత్ అంతా బూతు తోనే గడుపుతున్నారు. ఎప్పుడైతే  నెట్ అందుబాటు లోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి కోట్లాది ఫోటోలు, వీడియోలు, వెబ్ సైట్స్ హల్ చల్ చేస్తున్నాయి. జనాన్ని జలగల్లా పీల్చుకు తింటున్నాయి. ఒక్కసారి దీనికి అడిక్ట్ అయితే ఇక లైఫ్ అంతా నాశనం అయినట్లే. ఈ పోర్న్ దెబ్బకు కుటుంబాలు కూలి పోతున్నాయి. సంస్కృతి చిన్నా భిన్నమవుతోంది. బంధాలు పలచనవుతున్నాయి. ఏదైనా సమాచారం కావాల్సి వెదికితే చాలు ఇక అంతా బూతే దర్శనమిస్తోంది. ఇది ఒక రకంగా టెక్నాలజీ మాయాజాలం. ప్రతి రోజుకు కోట్లల్లో వీడియోలు డౌన్లోడ్ అవుతున్నాయి. పోర్న్ స్టార్స్ కు ఎనలేని క్రేజ్ ఉంటోంది. వీరు నటిస్తూనే డాలర్లు పోగేసుకుంటున్నారు. ఎప్పుడైతే నెట్ కనెక్టివిటీ పెరిగిందో ఇక అప్పటి నుంచి బూతుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు. అవి కూడా సెక్స్ ను పెంచి పోషిస్తున్నాయి. నాలుగు గోడల మధ్యన ఉండాల్సిన శృంగారం...

ఆ ఒక్కటి వద్దంటున్న ముద్దుగుమ్మ

చిత్రం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ నటీమణిగా కాజల్ అగర్వాల్ కొనసాగుతోంది. ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఈ అమ్మడు పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం, ఆ ఒక్కటి అడుగొద్దంటూ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. తాజాగా ఈ ముంబై బ్యూటీ గురించి ఇటీవల పలు రకాలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. నటిగా దశాబ్దంన్నరకు చేరు కోవడంతో పెళ్లిపై   ప్రచారం జరుగుతోంది. ఒక పారిశ్రామిక వేత్తతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతోందని వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇండియన్‌–2 చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందని సామాజిక మాధ్యమాల్లో టాక్. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ చిత్రాలకు సంబంధించిన వివరాలు అంత సులభంగా బయటకు రావు. అలాంటిది కాజల్‌ అగర్వాల్‌ పాత్రకు సంబంధించిన విషయాలు బయటకు రావడానికి ఒక రకంగా తనే కారణం. అగ్ర నటుడు కమల్ హాసన్ కథా నాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇండియన్‌–2. ఈ చిత్రంలో నటించే విషయం గురించి నటి కాజల్‌ అగర్వాల్‌ ఎక్కువగా ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆమె పాత్ర గురించి ఊహాగానాలు ప్...

ధిక్కార పతాకం..సర్దారా సంచలనం

చిత్రం
ఈ దేశం ఒక్కసారిగా అతడి వైపు చూస్తోంది. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా, సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా..ప్రజల కోసం ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఆయన టార్గెట్ చేశారు. సేవ చేసే వాళ్లకు పెన్షన్స్ ఎందుకంటూ భారత దేశ అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతగా వైరల్ అవుతున్న ఆయనెవరో కాదు దేశం గర్వించదగిన ఆర్థికవేత్తలలో, మేధావుల్లో ఒకడు. అతడే సర్దారా సింగ్ జోహ్. అగ్రికల్చర్ ఎకానమిస్ట్ గా, పూర్వ ఉప కులపతిగా ఆయన పని చేశారు. అత్యున్నతమైన అవార్డులు అందుకున్నారు. ఇన్ని వున్నా ఆయన మాత్రం సమస్యలపై నిరంతరం నిలదీస్తూ వస్తున్నారు. రచయితగా, పొలిటికల్ లీడర్ గా, ఎకానమిస్ట్ గా, సామాజికవేత్తగా ఇప్పటికే ప్రభుత్వాలను గడగడ లాడిస్తున్నారు సింగ్. పంజాబ్ యూనివర్సిటీ కి వీసీగా పని చేశారు. తాజాగా ఆయన జనం ఎన్నుకున్న ఎంపీలకు పెన్షన్స్ ఎందుకు ఇస్తున్నారని, వెంటనే ప్రభుత్వం నిలిపి వేయాలని కోరుతూ కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. 2018 అభివృద్ధి చట్టం ప్రకారం ఎంపీలు పెన్షన్ పొంద కూడని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయాలు అం...

నవ్వుల హరివిల్లు..గుండెల్లో చిరుజల్లు

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద ప్రారంభమైన రియాల్టీ షో బిగ్ బాస్ - 3 ఎపిసోడ్ కు భారీ ఆదరణ లభించింది. ఈ ప్రోగ్రాం వినోద రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి ఎపిసోడ్ ను నటుడు ఎన్ఠీఆర్ ప్రయోక్తగా చేస్తే, మరో నటుడు నాని రెండో ఎపిసోడ్ ను సక్సెస్ చేశాడు. ముచ్చటగా మూడో ఎపిసోడ్ ను లవర్ బాయ్ నాగార్జున హోస్ట్ చేశాడు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీఆర్ఫీ రేటింగ్స్ లో టాప్ రియాల్టీ షో గా పేరు తెచ్చుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో గుర్తుండి పోయేలా చేసిన పార్టిసిపెంట్ మాత్రం పునర్నవి భూపాళం. చెరగని చిరునవ్వుతో వేలాది మంది మనసు దోచుకుంది ఈ ముద్దు గుమ్మ. పునర్నవి నటిగా కూడా రాణిస్తోంది. ఉయ్యాల జంపాల చిత్రంలో సునీత పాత్రతో పునర్నవి ప్రేక్షకులను కట్టి పడేసింది. అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్‌ ప్రేక్షక, చిత్రలోకాన్ని తన వైపునకు తిప్పుకొంది. బిగ్‌బాస్‌–3 కంటెస్టెంట్‌గా బుల్లి తెరపై తన పాపులారిటీని మరింత పెంచుకుంది. అమాయకమైన నవ్వు, ముద్దు ముద్దుగా మాటలు నాగార్జునను సైతం ఆకట్టుకునేలా చేసింది. హీరోయిన్‌ గానూ పలు అవకాశాలను అంది పుచ్చుకుంది. పునర్నవి భూపాలం తలిదండ్రులు హైదరా...

మన ఆటకు మంచి రోజులు

చిత్రం
ఇప్పుడు ఆటలు అంటే ఎవ్వరికైనా గుర్తుకు వచ్చేది క్రికెట్ ఆటనే. కానీ భారత దేశానికి క్రీడా పరంగా ఘనమైన చరిత్ర ఉన్నది. అదేమిటంటే ఇప్పుడు ప్రపంచమంతటా మెస్మరైజ్ చేస్తోంది హాకీ ఆట. ఈ క్రీడ మనది. మన కంట్రీలో మొదటి సారిగా పుట్టింది. దీనికి ప్రాచుర్యం తీసుకు వచ్చింది మాత్రం ధ్యాన్ చంద్. ఆయన పేరు మీద ప్రభుత్వం అవార్డు కూడా ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఈ ఆటలో ప్రతిభ చూపిన ఆటగాళ్లను ఘనంగా సత్కరిస్తోంది. ఎప్పుడైతే క్రికెట్ ఆట లో మాజీ జట్టు సారధి, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 1983 లో ప్రపంచ కప్ ఇండియాకు తీసుకు వచ్చాడో, ఇక అప్పటి నుంచి దాని స్వరూపమే పూర్తిగా మారి పోయింది. ఇప్పుడు 100  కోట్ల మందికి పైగా జనం  క్రికెట్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అది లేకుండా ఉండలేక పోతున్నారు. జాతీయ జెండాలు రెపరెపలాడేలా, కోట్లాది గుండెల్ని ఏకం చేసేలా చేస్తోంది క్రికెట్ క్రీడ. దీనిని తట్టుకుని మెలమెల్లగా మిగతా క్రీడలు కూడా వెలుగు చూస్తున్నాయి. టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, చెస్, తదితర మరుగున పడిన ఆటలన్నీ మళ్ళీ జీవం పోసుకుంటున్నాయి. తాజాగా ఇండియన్ హాకీకి మంచి రోజులు వస్తున్నాయి. ...

సేతుపతికి చిరు వ్యాపారుల ఝలక్

చిత్రం
అభిమానం ఒక్కోసారి  కొంప ముంచుతుంది. ఒక్కోసారి స్టార్ డమ్ ఇబ్బందులకు గురి చేస్తుంది. తమిళనాడులో ఏది జరిగినా అది సంచలనమే. ఎందుకంటే తమిళులు దేనినైనా భరిస్తారు. కానీ తమ ఆత్మాభిమానం దెబ్బ తిన్నా లేదా తమ భాషను కించ పరిచినా తట్టు కోలేరు. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ కు అనుభవం లోకి వచ్చింది కూడా. తాజాగా మరో నటుడు విజయ్ సేతుపతికి ఈసారి ఫ్యాన్స్ నుండి కాక చిరు వ్యాపారస్తుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంతే కాకుండా తన ఇల్లు ముట్టడించాలని కూడా డిసైడ్ అయ్యారు వ్యాపారులు. కారణం విజయ్ ఓ వాణిజ్య ప్రకటనలో నటించడమే వీరి కోపానికి కారణమైంది. నటుడిగా సేతుపతి ఇప్పుడు మంచి ఫామ్‌లో  వున్నాడు. ఆన్‌లైన్‌ వ్యాపారం కోసం ఒక వ్యాపార సంస్థ మండి పేరుతో ఓ యాప్ రూపొందించింది. ఆ యాప్‌లో చిరు వ్యాపారులను దెబ్బ కొట్టేలా సేతుపతి నటించారు. దీనిని వ్యాపారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్ ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కాగా దీనిపై తమిళనాడు వ్యాపార సంఘాల నిర్వాహకులు స్పందించారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఏ విషయాన్ని తాము అనుమతించమని స్పష్టం చేశారు. ఆన్‌లైన...

రంగస్థలం రీమేక్ కానుందా..?

చిత్రం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రంగా రంగస్థలం నిలిచింది. దీనికి క్రియేటివ్  డైరైక్టర్ సుకుమార్ డైరెక్షన్ చేశారు. ఇందులో రామ్ చరణ్, సమంత, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనుక్కన్న దాని కంటే భారీగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. అప్పటి దాకా కమర్షియల్ సినిమాలకే పరిమితమైన చరణ్ కు అద్భుతమైన కేరెక్టర్ ఇచ్చాడు సుకుమార్. ఎవరికి వారు ఇందులో పోటీపడి నటించారు. ఈ సినిమా కథా పరంగా, సంగీత పరంగా జనాన్ని ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున అవార్డులు దక్కించుకుంది రంగ స్థలం. తాజాగా ఇదే సినిమాను తమిళ్, హిందీలో రీమేక్ చేసేందుకు డైరెక్టర్ లారెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. నటి సమంతకు మంచి పేరు వచ్చింది ఈ సినిమా. కాగా ఈ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను రాఘవ లారెన్స్‌ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన నటించిన కాంచన–3 మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌ చేస్తానని రాఘవ లారెన్స్‌ ఇటీవలే ప్రకటించారు కూడా. ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌ హీరోగా హిందీలో చేసే పనిలో బిజీగా ఉన్నారు. నటి కియారా అద్వాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాని...

విలీనం చేయం..ప్రైవేట్ పరం చేస్తం

చిత్రం
అనుకున్నదే జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై కీలక ప్రకటన చేశారు. కార్మికులకు సీఎం డెడ్ లైన్ విధించారు. ఇచ్చిన గడువు లోపు చేరక పోతే ఇక ఇంటికే అని చెప్పారు. లేకపోతే వారికి ఫ్యూచర్ ఉండదన్నారు. కేంద్రం ఆమోదించిన మోటార్ వెహికిల్ చట్టం ప్రకారంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేయ కూడదని కేబినెట్‌ నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీతో 975 కోట్ల ఆదాయం కలిసి వచ్చిందని తెలిపారు. అంతులేని కోరికలతో ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని విమర్శించారు. ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2100 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ అర్ధరహితమైనది. ప్లా...

రేసులో ఇద్దరే..గెలిచేది ఒక్కరే

చిత్రం
బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ వంద రోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులను తిరగ రాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించ లేక పోయింది. బిగ్‌బాస్‌ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, రాహుల్‌, పునర్నవిల రిలేషన్‌షిప్‌ షోను గట్టెక్కించాయి. జర్నీలో ఇంటి సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మధురాను భూతులను మిగుల్చుకున్నారు. ఉన్న స్నేహితులు మరింత క్లోజ్‌ అయ్యారు. ఒకరినొకరు తెలుసుకున్నారు. ఇక బిగ్‌బాస్‌ అంతిమ ఘట్టానికి చేరుకుంది. అందరినీ దాటుకుంటూ, ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ అయిదుగురు టాప్‌ 5లోకి అడుగు పెట్టారు. ఓట్లు వేయడానికి డెడ్‌ లైన్‌ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారై పోయిందని, విన్నర్‌ ఎవరో తేలి పోయిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటింగ్‌లో దుమ్ము లేపిన రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరలో వచ్చే సరికి మాత్రం రాహుల్‌కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విచిత్రంగా నామినేషన్లోకి వెళ్లిన ప్రతిసారీ రాహుల్‌దే పైచేయి అవుతూ వచ్చి...

మతులు పోగొడుతున్న అందం

చిత్రం
కియారా అద్వానీ తెలుసుగా. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించింది..మెప్పించింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా కియారా కెరీర్‌కి కలసి రాలేదు. ఆ దెబ్బతో తనకి కలిసొచ్చిన బీటౌన్‌కి వెళ్లి అక్కడ బిజీ అయింది. ఇక రీసెంట్‌గా వంగా అనుదీప్ రెడ్డి తీసిన 'కబీర్ సింగ్'‌తో సంచలన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ సుందరాంగి తన సొగసులకి మెరుగులు దిద్దే పనిలో పడింది. అందులో భాగంగానే బాక్సింగ్ పంచెస్ విసురుతూ కుర్రాళ్ళకి మతులు పోగొడుతోంది ఈ లస్ట్ హాటీ.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కియారా సీరియస్‌గానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఈ హాట్ బ్యూటీ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి ఎదురుగా ఉన్న ట్రైనర్ పైనా పంచులతో విరుచుకు పడుతోంది. చేతులతోనే కాక, కాళ్ళతో కూడా కిక్ ఇవ్వడానికి తెగ ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ అందాలగుమ్మ పంచుల వర్షం కురిపిస్తూ ఉంటే పాపం ఆ ట్రైనర్ చేతులను అడ్డం పెడుతూ వెనుకకు జరుగుతూ కనిపిస్తున్నాడు. ఇక బాక్సింగ్ ప్రాక్టీస్‌లో కూడా కియారా అందాల విందు చేయడం మరచి ప...

అభిమానులకు పవన్ చిత్ర కానుక

చిత్రం
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు అందించారు. ఇప్పటికే అయన పార్టీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నారు. అటు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణాలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టారు. అంతే కాకుండా దేనినీ వదిలి పెట్టడం లేదు ఈ జనసేనాని. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత 29 రోజులుగా చేస్తున్న సమ్మెకు, ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్తమ రెడ్డి, రాజి రెడ్డి, తదితరులు పవర్ స్టార్ ను కలిశారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బేషరతుగా కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను సీఎం ను కలుస్తానని చెప్పారు. కార్మికులకు వేతనాలు చెల్లించక పోవడం దారుణమని అన్నారు. ఇదిలా ఉండగా, తాజాగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పండుగ లాంటి వార్త ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడి అయ్యింది. బాలీవుడ్ చిత్రం `పింక్‌`ను తె...

తలైవాకు అరుదైన గౌరవం

చిత్రం
భారతదేశంలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్న రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను స‌త్క‌రించ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేవ‌క‌ర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. కొన్ని ద‌శాబ్దాలుగా త‌న న‌ట‌న‌తో ఇండియ‌న్ సినిమాకు ర‌జనీకాంత్ చేసిన సేవ‌ల‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. వచ్చే 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో ఈ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేష‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. వివిధ దేశాల‌కు చెందిన 250 సినిమాల‌ను ఈ వేడుక‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. కాగా రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కండక్టర్ గా కొద్ది కాలం పని చేశారు. ఆయన స్వస్థలం కర్ణాటక. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. ఆయన పేరును ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రజనీకాంత్ గా మార్చారు. జన్మతః మరాఠీ యాదవ కులంలో 1950 డిసెంబర్ 12వ తేదీన జన్మించారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళనాడు ర...

యెడ్డీ ఆడియో వైరల్..హల్ చల్

చిత్రం
కర్ణాటకలో అతి కష్టం మీద అధికారం లోకి వచ్చినా, ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండడం లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ హై కమాండ్ యెడ్డీకి కుర్చీ అప్పగించింది. మోడీ, అమిత్ షా కు సుతారమూ ఇష్టం లేదు. అయినా తప్ప లేదు. ఏ మాత్రం వీలు చిక్కినా తప్పించాలని చూస్తున్నారు. అదును కోసం వెయిట్ చేస్తున్నారు వీరిద్దరూ. ఇదిలా ఉండగా ఇటీవల ఒకవేళ బీజేపీ సర్కారు కూలి పోతే తాము మద్దతు ఇస్తామంటూ జేడీఎస్ అధినేత కుమార స్వామి ప్రకటించారు. దీంతో యెడ్డీ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంత లోపే యెడ్డీకి మరో తలనొప్పి వచ్చి పడింది. అదేమిటంటే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చేలాగా ఉన్నాయి. ఆ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చే సమయంలో యడ్యూరప్ప బీజేపీ నేతలతో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ విషయంపై  బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ, ముంబైలోని హోటల్‌లో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల విషయం అమిత్‌షాకు తెలుసు. వారే పూర్తిగా చూసుకుంటారు అని అన్నారు. అన్ని ఏర్పాట్లూ చేశారు. 17 మంది రెబల్స్ ఎమ్మెల్యేల విషయం ఆయనే చూసుకుంటారు. పార్ట...

అద్భుతం..సైకత శిల్పం..కళా నైపుణ్యం

చిత్రం
అద్భుత కళా నైపుణ్యం కలిగిన కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సైకత శిల్పి  సుదర్శన్ పట్నాయక్‌ కు అరుదైన పురస్కారం లభించింది. 2019 వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఇటలీలో జరిగే అంతర్జాతీయ స్కోరానా శాండ్ నేటివిటీ వేడుకల్లో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు పట్నాయక్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి భారత్‌ తరపున కూడా పట్నాయక్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా సుదర్శన్ పట్నాయక్ సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను 2014లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది. 15 ఏప్రిల్ 1977 లో పుట్టాడు. ప్రస్తుతం సుదర్శన్ పట్నాయక్ కు 42 ఏళ్ళు. స్వస్థలం ఒడిస్సా రాష్ట్రం పూరీ. వృత్తి రీత్యా సైకత శిల్పిగా ఉన్నారు. గత 27 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ వస్తున్నారు. ఎందరో శిల్పుల కన్నా భిన్నంగా సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చడం సుదర్శన్ పట్నాయక్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచ స్థాయి సైకత శిల్పాల ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన ఘనత...