సౌందర్యకు దేశం సలాం

ఎవరీ సౌందర్య అనుకుంటున్నారా. తమిళనాడులోని విరుధూనగర్ లోని సేతు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇప్పుడు దేశమంతటా వైరల్ గా మారింది. తన ప్రసంగంతో ఆకట్టుకుంది. దేశం యావత్తు ఈ అమ్మాయి ఎవరు..అంటూ గూగుల్ లో వెతుకుతోంది. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్ కు దేశం బాగు పడాలంటే ఏం చేయాలి అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. పలు దిగ్గజ కంపెనీలకు చెందిన సీనియర్లు, మేనేజింగ్ డైరెక్టర్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎంచుకుంటే, సౌందర్య మాత్రం దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగం పైనా, దీనిపైనే ఆధారపడిన రైతుల గురించి ప్రసంగించింది. చదువు పూర్తి కాకా ముందే వీసా కోసం, అమెరికె వెళ్లి పోవాలని, డాలర్స్ కొల్లగొట్టాలని ఆలోచించే వారికి చెంప చెల్లు మనిపించేలా చేసింది సౌందర్య. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు, చెప్పిన పదాలు, ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు సంచలనం కలిగించాయి. ఎంతో పరిణితితో, ఉదాహారణలతో, సమగ్ర సమాచారంతో అనర్గళంగా, ఎక్కడా తొట్రుపాటుకు గురి కాకుండా సౌందర్య చేసిన ప్రసంగం ప...