పోస్ట్‌లు

అక్టోబర్ 17, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దాదాకు లిటిల్ మాస్టర్ ప్రసంశ

చిత్రం
భారతీయ క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా పేరున్న మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ బిసిసిఐ కి ప్రెసిడెంట్ కాబోతున్న సౌరబ్ గంగూలీ ని ప్రసంశలతో ముంచెత్తాడు. క్రికెట్ ను ఎంతగా ఆస్వాదిస్తూ..అభిరుచితో ఆడాడో అలాగే నిసిసిఐ ని నడిపిస్తాడన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు. మరో వైపు ఈనెల 23 న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు అధ్యక్షుడిగా పూర్తిగా బాధ్యతలు చేపట్ట బోతున్నాడు  బెంగాలీ టైగర్. ఇండియన్ క్రికెట్ పాలనలో గంగూలీ తప్పనిసరిగా సక్సెస్ అవుతాడన్న నమ్మకం తనకు ఉందన్నారు సచిన్. గంగూలీ క్రికెట్ ను ఎలా ఆడాడో, దానిని వదిలి వేశాక ఎలా క్రికెట్ కు సేవలు అందించాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అతడు మైదానంలో ఉన్నా లేదా బయట ఎక్కడ ఉన్నా క్రికెట్ కోసమే పని చేశాడు. చేస్తూనే ఉన్నాడు కూడా. అతడు పూర్తిగా కమిట్మెంట్ ఉన్న ప్లేయర్ అని స్పష్టం చేశాడు ఈ లిటిల్ మాస్టర్. శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ కూడా గంగూలీ పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లీగ్ ఆవిష్కరణ సందర్బంగా సచిన్, దిల్షాన్ లు మాట్లాడారు. సెహ్వాగ్, జెహెర్ ఖాన్, ఆర్ఫీ సింగ్, అజిత్ అగార్కర్ తో కూడిన జట్టును సచిన్ నడిపించనున్న...

ఓల్డ్ ఈజ్ గోల్డ్ - మార్కెట్లోకి బజాజ్ స్కూటర్

చిత్రం
భారతీయ ఆటోమొబైల్స్ రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ ను, ఇమేజ్ ను స్వంతం చేసుకుంది బజాజ్ కంపెనీది. హమారా బజాజ్ పేరుతో ఇండియా అంతటా విస్తరించింది. వాహనాల తయారీలో బజాజ్ కు ఎనలేని చరిత్ర ఉన్నది. కోట్లాది భారతీయుల్లో ఇప్పటికీ..ఎప్పటికీ మరిచి పోలేనిది ఏదైనా వెహికిల్ ఉందంటే అది ఒకే ఒక్కటి బజాజ్  స్కూటర్. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండడంతో కోట్లాది మంది బజాజ్ స్కూటర్ ను తమదానిగా భావించారు. ప్రత్యేకించి ఒక ఫ్యామిలీకి సరిపోయే లా దీనిని డిజైన్ చేశారు. మైలేజీ విషయంలోనూ, డిజైన్, కంఫర్ట్ గా ఉండడంతో ప్రతి ఒక్కరు దీనితో పాటే కొన్నేళ్లుగా ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే మిగతా కంపెనీల నుండి బైక్స్ కుప్పలు తెప్పలుగా మార్కెట్ ను ముంచెత్తాయి. అయినా బజాజ్  స్కూటర్ మాత్రం చెక్కు చెదరలేదు. అంటే కంపెనీ ఎంతలా వాహనదారులతో కనెక్ట్ అయి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బజాజ్ కంపెనీ వాహన తయారీలో, డిస్ట్రిబ్యూషన్ లో టాప్ టెన్ కంపెనీలలో ఇండియాలో ఒకటిగా నిలబడుతూ వస్తున్నది. తాజాగా కేవలం 60 నుంచి 70 వేల రూపాయల లోపు బుల్లి కారును కూడా లాంచ్ చేసింది. దీనికి జనం నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే...

తలైవా లుక్స్ అదుర్స్

చిత్రం
లెక్కించలేనంత అభిమానులను సంపాదించుకుని, తలైవాగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా రిలీజ్ కాక ముందే భారతీయ సినిమా రంగాన్ని షేక్ చేసేస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే 90 సినిమా పూర్తయి పోయింది. జస్ట్ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశాడు మురుగదాస్. దీంతో యూట్యూబ్ లో లక్షలాది ఫ్యాన్స్ ట్రైలర్ ను చూశారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా కంటే ముందు రంజిత్ పా కాలా, కబాలి తీశాడు. ఇక రోబో, 2.0 సినిమాలు ఫ్యాన్స్ ఆశించినంతగా ఆడలేదు. అయినా తలైవా రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన చిటికేసినా, లేదా డైలాగ్ చెప్పినా చాలనుకునే వాళ్ళు కోకొల్లలు. రజనీకాంత్ కు ఉన్న అభిమానం అలాంటిది. దర్బార్ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున డీలింగ్స్ జరిగాయి. శాటిలైట్ రైట్స్, సినిమా డిస్ట్రిబ్యూషన్ వన్నీ అయిపోయినట్టు సమాచారం. రజనీకాంత్ కు ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశ మంతటా అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా ఆయనకు మలేషియా, అమెరికా, సింగపూర్, చైనా, జపాన్ లలో లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనిని దృష్టి...

ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ నాన్ ఎంప్లొయీస్ యూనియన్ (టీఎన్జీవో) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎన్జీవో నాయకులు కారెం రవీందర్ రెడ్డి, మమతలు తాము కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు. మరో వైపు తమకు మద్దతు తెలపకుండా టీఎన్జీవో నేతలు ముఖ్యమంత్రితో భేటీ కావడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలు మండి పడ్డారు. మరో వైపు సీఎమ్ మాట వినక పోవడం, చర్చల ఊసెత్తక పోవడం, కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ ప్రకటనలు చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు నోరు మెదపక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం, సోషల్ మీడియా అంతటా నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకో వైపు అన్ని జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కార్మికులకు అండగా నిలవాలని వత్తిళ్లు తీసుకు వచ్చారు. అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఉద్యోగుల తీరు గర్హనీయమని పేర్కొన్నారు. అన్ని వైపులా నుంచి తీవ్ర స్థాయిలో వత్తిళ్లు పెరగడంతో టీఎన్జీవో నేతలు దిగి రాక తప్పలేదు. ఆర్టీసీ జేఏసీ నేత...

ఆర్టీసీ సమ్మెపై తమిళిసై ఆరా..?

చిత్రం
రోజు రోజుకు తెలంగాణాలో ఉధృతమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఆరా తీసినట్టు సమాచారం. తమ సంస్థను వెంటనే ప్రభుత్వ పరం చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. అంతకు ముందు ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు నోటీసులు అందజేశాయి. దీంతో పాటు రాష్ట్ర కార్మిక శాఖ, ప్రభుత్వానికి సైతం ఇవే నోటీసులు ఇచ్చాయి. అయినా సర్కార్ నాన్చుతూ ర ాగా, సంస్థ అధికారులు, మంత్రి పట్టించు కోలేదని కార్మిక నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని, 49 వేల మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ స్వయంగా కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిని తట్టుకోలేక ఇద్దరు కార్మికులు డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర సురేందర్ గౌడ్ ఆత్మహత్యలు చేసుకున్నారని కార్మికులు వాపోయారు. పరిస్థితి తీవ్రం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వత్తిళ్ల...

దాదా మా బాబే అంటున్న దీదీ

చిత్రం
ఇండియాకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిష్టర్ కావడం చాలా ఈజీ, కానీ లక్షల కోట్ల డబ్బులు కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ప్రెసిడెంట్ కావడం చాలా కష్టం. అలాంటి అరుదైన ఫీట్ ను అందుకోబోతున్నాడు మాజీ టీమిండియా సారథి, బెంగాలీ టైగర్, అంతా ముద్దుగా పిలుచుకునే దాదా ఉరఫ్ సౌరబ్ గంగూలీ. దేశంలో ఇప్పుడు మోడీ కంటే ఈ మాజీ క్రికెటర్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ దేశంలో అన్ని క్రీడా పోటీ సంస్థల్లో కంటే బిసిసిఐ సంస్థ బలమైనది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన,  ఆదాయం కలిగిన క్రికెట్ బోర్డు గా పేరున్నది. దీంతో ఇందులో ఏ చిన్న పదవి దక్కినా చాలు కోట్లు వెనకేసుకోవచ్చు. అంతే కాదు జీవితాంతం సరిపడా సౌకర్యాలను పొందవచ్చు. అందుకే ఈ పోస్టులకు అంతులేని డిమాండ్. ఇప్పటి దాకా రాజకీయాలు కొద్దిగానే ఉన్నప్పటికీ, లయన్ అమిత్ షా కన్ను దీనిపై పడింది. ఇంకేం ఊహించని రీతిలో చక్రం తిప్పాడు. తన కొడుకుకు కీలక పదవి కట్టబెట్టాడు. ప్రెసిడెంట్ పదవి కి నామినేషన్ వేసే కంటే ముందే గంగూలీ ..హోమ్ శాఖా మంత్రి షా తో భేటీ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా వీరిద్దరి కలయిక క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే దీనిని దాదా ఖండించాడు. దాదా ముక్...

పలకరింపులు..కౌగిలింతలు..బిగ్ బాస్ షాక్

చిత్రం
స్టార్ మా టీవీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రియాల్టీ షో ఆఖరి అంకానికి చేరుకుంది. దీంతో మరింత ఉత్కంఠ పెంచేలా ప్రోగ్రాం నిర్వాహకులు, బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు బుల్లి తెరమీద ఊహించని రేటింగ్ బిగ్ బాస్ కు వస్తోంది. అంతే కాకుండా భారీ ఆదాయం సమకూరుతోంది. స్పాన్సర్స్ గా దిగ్గజ చైనా మొబైల్స్ కంపెనీలు ఉన్నాయి. ఒప్పో ప్రధాన స్పాన్సర్ కాగా మరో స్పాన్ సర్ వివో కూడా భాగస్వామిగా ఉంది. అంతే కాకుండా పలు పాపులర్ కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి. మరో వైపు నటుడు నాగార్జున ఈసారి బిగ్ బాస్ ను బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాడు. దీంతో అన్ని టీవీలు బిగ్ బాస్ ను తట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి.అంతే కాకుండా స్టార్ మాటీవీని ఓన్ చేసుకున్నాక డిఫ్ఫరెంట్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఇక త్వరలో బిగ్ బాస్ ముగియనుంది. దీంతో మరింత జనరంజకంగా మార్చే పనిలో పడ్డాడు బిగ్ బాస్. రోజు రోజుకు ఎవరిని వరిస్తుందో భారీ ప్రైజ్ అన్న టెన్షన్ ఎక్కువై పోయింది. ఇదే సమయంలో పార్టిసిపెంట్స్ రెచ్చిపోతున్నారు. రాహుల్ కు రాను రాను ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. రాహుల్‌.శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్‌... శ్రీముఖి, బాబా భ...

దోస్త్ మేరా దోస్త్..కంగ్రాట్స్ దాదా

చిత్రం
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ప్రెసిండెట్ కాబోతున్న మాజీ సారథి గంగూలీకి దేశమంతా అభినందనలు అందుతున్నాయి. అంతే కాకుండా టీమిండియాకు ఎనలేని విజయాలు అందించిన ఘనత సౌరభ్ దే. ఇదే సమయంలో గంగూలీ సారథ్యంలో ఆటగాడిగా, అపురూపమైన విజయాలలో భాగస్వామ్యం పంచుకున్నహర్భజన్ సింగ్ అంటే గంగూలీకి చాలా ఇష్టం. వీరిద్దరూ మంచి దోస్తులు. దాదా హ్యాట్స్ ఆఫ్ యూ అంటూ ట్వీట్ చేశాడు భజ్జీ. దీ ంతో దాదా ఉబ్బి పోయాడు. ఎనలేని సంతోషంతో భజ్జీ దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. అంటూ రీ ట్వీట్ చెప్పారు. ఇదే సమయంలో గంగూలీ కీలకమైన కామెంట్స్ చేశాడు. భజ్జీ నీ అవసరం నాకుంది. నీవు లేక నేను లేనంటూ పేర్కొన్నాడు. దీంతో రాబోయే రోజుల్లో భజ్జీ బిసిసిఐకి ఏదో రకంగా సేవలు అందించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. భారత జట్టులో పోటీ పెరిగి పోవడంతో భజ్జీ కేవలం ఇంటికే పరిమితమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ ఇవ్వని భజ్జీ..ఐపీఎల్‌లో పాల్గొంటూ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. గతంలో భారత క్రికెట్‌ జట్టును తన దూకుడుతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన గంగూలీ.. అప్పట...

కేసీఆర్ తో కేకే భేటీ

చిత్రం
ఓ వైపు ఆర్టీసీ సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రభుత్వం మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష చేయనుంది. అటు కార్మికులు ఇటు ప్రభుత్వం మొండి పట్టు వీడడం లేదు. ఎవరికి వారే ఎమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. సమ్మె తీవ్రతపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. అంతే కాకుండా సంస్థకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డ ైరెక్టర్ ను నియమించాలని, తక్షణమే కార్మికులందరికీ సెప్టెంబర్ నెల వేతనాలకు వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశింది. దీనిపై ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది. అంతే కాక జీతాలు తీసుకుని తిరిగి సమ్మె లోకి కార్మికులు వెళతారని నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలు స్పష్టం చేశారు. ప్రభుత్వం అరెస్టులకు దిగుతోందని, బెదిరింపులకు భయపడ బోమని తేల్చి చెప్పారు. మరో వైపు రాష్ట్ర బీజీపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి తెలియ చేశారు. సానుకూలంగా కార్మికుల ...