పోస్ట్‌లు

అక్టోబర్ 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అర్దాకలిలో విద్యా వలంటీర్లు

చిత్రం
ఆరేళ్ళు గడిచినా తెలంగాణాలో విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈరోజు వరకు విద్యా శాఖలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా నేటి దాకా ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. వారి స్థానంలో అతి తక్కువ వేతనాలకు విద్యా వాలంటీర్లను గతంలో నియమించింది.   టెట్ తో పాటు బిఇడి, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని కఠినతరమైన నిబంధనలు విధించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15000 లకు పైగా ప్రొఫెషనల్ గా అన్ని అర్హతలు, అనుభవం కలిగిన వారు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ టీచర్స్ తో సమానంగా, అంత కంటే ఎక్కువగా విధులు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే కాంట్రాక్టు పద్ధతిన నియమించిన విద్యా వాలంటీర్లను ఎప్పుడు పడితే అప్పడు తీసివేసేలా నిబంధనలు రూపొందించింది ప్రభుత్వం. ఎన్నికల సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో జాబ్స్ అంటూ ఉండబోవని చెప్పారు. తీరా కొలువు తీరాక దాని ఊసే ఎత్తడం లేదు. పొరుగున తాజాగా కొలువు తీరిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్...

అట్లీ క్రియేషన్..విజిల్ సెన్సేషన్

చిత్రం
ఎవరీ అట్లీ అనుకుంటున్నారా. తమిళ సినిమాలో సునామీలా దూసుకు వచ్చాడు. తనకంటూ ఓ బ్రాండ్ ను ..ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని..సక్సెస్ బాటలో నడుస్తున్నాడు అట్లీ. ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవంతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. కొన్ని సినిమాలే చేసినా అవి మాత్రం బ్లాక్ బ్లస్టర్ గా నిలిచాయి. తాజాగా 187 కోట్లతో విజయ్ తో చేసిన విజిల్ సినిమా విడుదల కాకుండానే ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అంతే కాకుండా అందులో విజయ్ నటన పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇదంతా అట్లీ చలవే. ఎవరిని ఎలా వాడు కోవాలో అట్లీకి బాగా తెలుసు. రీల్ పరంగా పూర్తి కమిట్మెంట్ తో ఉండే ఈ డైరెక్టర్ టేకింగ్ విషయంలో తనకు తానే సాటి. విజిల్ సినిమాను దేశ వ్యాప్తంగా దీపావళి పండుగకు విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. సినిమా రైట్స్ కోసం  పలువురు పోటీ పడుతున్నారు. తమిళనాడులో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా బాలీవుడ్ లో మాత్రం ఎవ్వరికి ఇచ్చారనే విషయం  ఇంకా వెల్లడించలేదు.  అయితే విజిల్ సిన...

సరిలేరు నీకెవ్వరూ తమన్నా

చిత్రం
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా చెలామణి అవుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి తన రికార్డును తానే అధిగమించే పనిలో పడ్డాడు. ఎఫ్ - 2 సినిమా బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచేలా చేసిన డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరి లేరు నీకెవ్వరూ అంటూ ఓ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం స్థూడియోలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎలాగైనా సరే వచ్చే సంక్రాంతి పండుగ కు సరిలేరు నీకెవ్వరూ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాపై మహేష్ బాబు భారీ గా నమ్మకం పెట్టుకున్నాడు. అంతకు ముందు మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం , స్పైడర్ సినిమాలు నిరాశ పరిచాయి. కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ సినిమాలుగా నిలిచాయి. ఓవర్ సీస్ లో కూడా మహేష్ బాబుకు మాంచి డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమా విడులా కాకుండానే రికార్డ్ బ్రేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మహేష్ బాబు లుక్స్, డ్రెస్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఈ మూవీలో మహేష్ మిలిటరీ నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నారు. ఇందు...

ఇండియా వైట్ వాష్ - సఫారీలకు షాక్

చిత్రం
అంతా అనుకున్నట్టే జరిగింది. రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 202 పరుగుల ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. కోహ్లీ సేన స్వంత గడ్డపై మూడు టెస్టులు గెలిచి రికార్డ్ సృష్టించింది. టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి రెండు టెస్టులను సునాయాసంగా గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో సైతం అదే జోష్‌ కనబరిచి సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఇదే మొదటి సారి. టెస్టు ఫార్మాట్‌లో ఇరు జట్ల ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో టీమిండియాదే పైచేయిగా ఉంది. నాల్గో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలవుట్ అయ్యింది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లను టీమిండియా పడగొట్టి సిరీస్‌లో తమకు ఎదురులేదని నిరూపించింది. బ్రుయిన్‌ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఎన్‌గిడీ డకౌట్‌ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా కథ ముగిసింది. చివరి రెండు వికెట్...

రేవంతా మజాకా - ఖాకీలకు ఝలక్

చిత్రం
డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద పికెట్‌ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. తెల్లవారు జామున రేవంత్‌ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం పది గంటల తర్వాత రేవంత్‌ అనుచరులు ఒక్కొక్కరుగా వచ్చారు. అనుచరులు ఎప్పట్లా సాధారణంగానే ఉన్నారు. దాంతో, పోలీసులు కాస్త రిలాక్స్‌ అయ్యారు. ఇదే అదనుగా రేవంత్‌ మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అడ్డుకోబోయిన పోలీసులను అనుచరులు 15 సెకన్ల పాటు నిలువరించారు. పరుగులు తీసుకుంటూ రేవంత్‌ పెద్దమ్మ దేవాలయం వెనక రోడ్డు వరకు వచ్చారు. అప్పటికే అక్కడ ద్విచక్ర వాహనంతో అనుచరుడు సిద్ధంగా ఉన్నాడు. రేవంత్‌ దానిపై కూర్చున్నారు. ఓ పోలీసు అడ్డుకున్నా.. అనుచరులు తప్పించారు. అనుచరుడు డ్రైవ్‌ చేస్తుండగా.. ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లిన...

ఇంటర్నెట్ సర్చింగ్ లో మోదీనే టాప్

చిత్రం
సమున్నత భారతం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకుని, డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకుని, ఇటు ఇండియాలో అటు ప్రపంచ మంతటా తన హవాను కొనసాగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇంటర్నెట్ (అంతర్జాలం) లో సెర్చింగ్ లో మొదటి స్థానంలో నిలిచాడు. తన రికార్డు ను తానే అధిగమించాడు. దేశంలో రెండవ సారి భారతీయ జనతా పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చిన ఘనత మోడీదే అని చెప్పక తప్పదు. కాషాయ దళంలో తలపండిన నేతలు ఉన్నా మోదీ చరిష్మా ముందు తేలి పోయారు. తాను నమ్మిన బంటుగా భావించే కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో కలిసి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా దేశమంతటా కాషాయ జెండాలు రెపరెప లాడాలని మోదీ ఇప్పటినుంచే చాప కిందా నీరులా పార్టీని తీసుకు వెళ్లే ప్రయత్నంలో నిమగ్నమై పోయారు. అంతర్జాతీయ పరంగా చూస్తే ఇప్పుడు మోదీ జపమే వినిపిస్తోంది. మరో వైపు జమ్మూ, కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ ను రద్దు చేశాక మోదీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. హ్యూస్టన్ లో జరిగిన మీటింగ్ లో ట్రంప్ తో కలిసి ఆయన మాట్లాడిన తీరుకు కోట్లాది మంది ఫిదా అయ్యారు. అంతే కాకుండా అమెరికన్స్ మనసు దోచుకున్నారు కూడా. దీంతో ప్రతి ఒక్కరు ఎవరీ ...

భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం

చిత్రం
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ లో గొడవలు ఉన్నాయని, మీరెందుకు వెళ్లడం లేదంటూ నాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది, దీంతో స్పందించక తప్పడం లేదు. మా అధ్యక్షుడిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకున్నదని నటుడు నరేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్వంతంగా తన వివరణతో ఓ వీడియో విడుదల చేశారు. గత 25  ఏళ్లలో ఎప్పుడూ ‘ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌’ జరగలేదు. నేను షూటింగ్‌లో ఉండగా ‘ఎమర్జెన్సీ మీటింగ్‌ నిర్వహిస్తున్నాం.. మీరు రావాలి’ అంటూ నాకు ఓ లెటర్‌ వచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా జనరల్‌ బాడీని ఆహ్వానించాల్సిన బాధ్యత నాకే ఉంది. కొత్త కమిటీ ఎంపికై 6 నెలలు కూడా కాక ముందే ఈ జనరల్‌ బాడీ ఎందుకు జరుగుతోంది? అవసరం ఉందా?  పైగా, నేను పిలవాల్సిన దాన్ని ఎవరో పిలిచారు కాబట్టి దానికి నేను వెళ్లడం సబబు కాదని కొందరు పెద్దలు నాకు చెప్పారు. రెండు మూడు రోజుల తర్వాత ఇది ఫ్రెండ్లీ సమావేశమని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా నేను హాజరు కావాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న ఓ సినిమాలో 30  మంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ సీన్స్‌ కోసం నేను డేట్స్‌ ఇచ్చాను కాబట్టి షూటింగ్‌లో ఉన్నా. జనరల్‌ బాడీ మీటింగ్‌ జరుగుతోం...

దిగొచ్చిన దిగ్గజ కంపెనీ

చిత్రం
నిన్నటి దాకా జనానికి అంతా ఫ్రీ అంటూ బురిడీ కొట్టించి తన ఆదాయాన్ని అమాంతం పెంచుకుటూ పోయిన రిలయన్స్ గ్రూప్ కంపెనీ తాజాగా మొబైల్ వినియోగదారుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఎట్టకేలకు దిగి వచ్చింది. తాజాగా తన టారిఫ్ లను మార్చేసింది. జియో పేరుతో టెలికాం రంగం లోకి దిగిన కొన్ని రోజుల్లోనే మిగతా టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించింది. ఇదే సమయంలో ట్రాయ్ నిబంధనల పేరుతో కస్టమర్స్ నెత్తిన అదనపు చార్జీలు వసూలుకు తెరలేపింది. దీంతో సదరు కంపెనీ దిగి రాక తప్పలేదు. రీఛార్జ్ చేసుకుంటే కొంత వెసలుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. జియో కొత్త గా మంత్లీ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఉచిత ఐయూసీ కాల్స్‌ ఆఫర్‌తో  ‘జియో ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌ టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటి లాగే  జియో టు జియో అన్‌ లిమిటెడ్‌  కాలింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. సవరించిన రేట్లు ఇలా ఉన్నాయి. ఒక నెలకు ౨౨౨ రూపాయలు, 2 నెలలకు 333, 3 నెలలకు  444 ల...

ఎక్జిట్ పోల్స్ లో కమల వికాసమే

చిత్రం
ఓ వైపు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న, ధరాభారం జనాన్ని కోలుకోలేకుండా చేస్తున్నా, బడాబాబులు బ్యాంకులను లూటీ చేస్తూనే ఉన్నా కేంద్రంలో నరేంద్ర మోదీజీ నేతృత్వంలోని బీజేపీ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటికే 80 శాతానికి పైగా పలు రాష్ట్రాలలో పవర్ లోకి వచ్చింది. మోడీ, అమిత్ షా దెబ్బకు విపక్షాలు విలవిలలాడి పోతున్నాయి. వీరిద్దరూ కొట్టిన దెబ్బకు అబ్బా అంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా హర్యానా, మహారాష్ట్రలలో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ  బీజేపీకే పట్టం కట్టాయి. దీంతో ఇప్పటికే చేష్టలుడిగి పోయిన కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీలన్నీ దిక్కుతోచని స్థితిలోకి పడి పోయాయి. ఈ రెండు రాష్ట్రాలలో పోలింగ్‌ అనంతరం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే కాషాయనిదేనని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి సునాయాసంగా డబుల్‌ సెంచరీ సాధిస్తుందని న్యూస్‌ 18– ఐపీఎస్‌ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్‌ తేల్చాయి. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల ద...

అంతటా అవుట్ ఆఫ్ స్టాక్

చిత్రం
  చైనాకు చెందిన షావోమి కంపెనీ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో దిగ్గజ కంపెనీలకు కోలుకొని రీతిలో షాక్ ఇచ్చింది. ఇప్పటికే తక్కువ కాలంలో ఎక్కువ మొబైల్స్ ను అమ్మిన కంపెనీగా రికార్డ్ బ్రేక్ చేసింది. అతి తక్కువ ధరకు, అన్ని ఫీచర్స్ ఉండడంతో పాటు సామాన్యుల నుంచి బడా బాబుల దాకా, అందరికి నచ్చేరీతిలో స్మార్ట్ ఫోన్స్ ను డిజైన్ చేస్తోంది షావోమి. తాజాగా దీపావళి సందర్బంగా ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని షావోమి రెండు వేరియేషన్స్ లలో ‘రెడ్‌మి నోట్‌ 8, 8 ప్రో’ పేరుతో సరికొత్త మొబైల్స్ ను లాంచ్ చేసింది. ఎవరూ ఊహించని రీతిలో లక్షలాదిగా అమ్ముడు పోయాయి. ఆన్ లైన్ లో జస్ట్ నిమిషాల లోపే అమ్ముడు పోయాయి. దీంతో షావోమి కంపెనీ సైతం విస్తు పోయింది. ఇండియా షావోమి కంట్రీ హెడ్ కుమార్ జైన్ ను ప్రశంశలతో ముంచెత్తారు షావోమి చైర్మన్. ఇదిలా ఉండగా అమ్మకాలు ప్రారంభించిన వెంటనే హాట్‌కేకుల్లా సేల్‌ అయ్యాయి.   ఎంఐ వెబ్‌సైట్‌లో నోస్టాక్‌ అని కనిపించగా, వెయిట్‌ లిస్ట్‌ ఫుల్‌ అని అమెజాన్‌ వెట్‌సైట్‌ చూపించింది. మరోసారి కొనుగోలు చేసేందుకు ఈ ఫోన్లను ఎంఐ, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టనున్నట్టు ...

ఆత్మహత్యలకు పాల్పడొద్దన్న గవర్నర్ - వెల్లడించిన అశ్వత్థామ

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. మరో వైపు సమ్మెను విచ్చిన్నం చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. అంతకు ముందు అశ్వత్థామ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలిశారు. ఈ సందర్బంగా గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, కార్మికులు చనిపోతున్నా స్పందించలేదని గవర్నర్ కు విన్నవించారు. దీంతో జోక్యం చేసుకున్న గవర్నర్ సమస్య గురించి తనకు తెలుసనీ, త్వరలో పరిష్కరిస్తానని, కానీ కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ సూచించారని ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. తమ వద్ద డబ్బులు లేవంటూ కోర్టుకు ఏజీ చెప్పడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. బస్సులు ఫుల్ గా నడిపిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మరి వచ్చిన డబ్బులను ఎవరి జేబుల్లోకి మళ్లించిందో చెప్పాలని ప్రశ్నించారు. విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క గజం స్థలం కూ...

ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం

చిత్రం
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. ఉప ఎన్నిక ఫలితాన్ని 24న ప్రకటిస్తారు. కాగా పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు భారీగా పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 4 గంటల వరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, గత ఎన్నికల్లో ఇక్కడ 88 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. చింతలపాలెం మండలం కృష్ణాపురంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పద్మావతి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కాంగ...

కార్మికుల జీతాలకు డబ్బుల్లేవు

చిత్రం
ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికిప్పుడు చెల్లించేందుకు తమ వద్ద జీతాలు చెల్లించేందుకు తమ సంస్థ వద్ద డబ్బులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అడ్వొకేట్ జనరల్ హైకోర్టు ముందు నివేదించారు. దీనిపై ధర్మాసనం విస్తు పోయింది. నిన్నటి దాకా బస్సులు నడుపుతున్నామని, సమ్మె ప్రభావం ఏమాత్రం లేదని చెప్పిన సర్కార్ ఉన్నట్టుండి మాట మార్చడంపై సీరియస్ అయ్యింది. 50 శాతం బస్సులు నడుస్తున్నాయని చెబుతున్నారు. మరి ఆదాయం ఎక్కడికి వెళ్ళిందంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. సరికదా సంస్థ వద్ద ఏడున్నర కోట్లు మాత్రమే ఉన్నాయని, మొత్తం కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటే కనీసం 224 కోట్లు అవసరం అవుతాయని ఏజీ తెలిపారు. దీంతో తీర్పును 29 కు వాయిదా వేసింది. అంతకు ముందు హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై వాదనలు జరిగాయి. డిమాండ్ల సాధనకు పిలుపునిస్తూ ఆర్టీసీ కార్మికులు 5న సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్‌ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించ లేదు. దీంతో వారు కోర్టులో పిటిషన్‌​ దాఖలు చేశారు. తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన ...

నిలిచేదెవ్వరు..గెలిచేదెవ్వరో

చిత్రం
తెలుగు బుల్లితెరపై జనాదరణతో దూసుకెళుతున్న బిగ్ బాస్ ముగిసేందుకు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నది. దీంతో ఎవరు ఫైనల్ కు చేరుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. తాజాగా వరుణ్ వైఫ్ వితిక అనూహ్యంగా ఎలిమినేటి అయ్యింది. సింగర్ రాహుల్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లో అంతిమ విజేతకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక వితిక వెళ్లి పోవడంతో పార్టిసిపెంట్స్ లలో ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో బాబా భాస్కర్, వరుణ్ , రాహుల్, శివ జ్యోతి , శ్రీ ముఖి, ఆలీ రజా ఫైనల్ కోసం బరిలో ఉన్నారు. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఇక బిగ్‌బాస్‌ షో ముగింపునకు వస్తుండటంతో హౌస్‌లో టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరో పైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్‌ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ షో ఫైనల్‌కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని...

గెలుపు ముంగిట టీమిండియా

చిత్రం
ముచ్చటగా టీమిండియా సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపునకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నది. కేవలం ఇంకో ఇంకో రెండు వికెట్లు పడగొడితే చాలు విజయం సాధిస్తుంది. రాంచీ వేదికగా  జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి సేన విజయం దాదాపు ఖాయమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో సపారీ జట్టుకు వైట్‌వాష్‌ తప్పేలా లేదు. ఇప్పటికే విశాఖ, పుణే టెస్టుల్లో ఘన విజయాలు అందుకుంది టీమిండియా. ఆటను మూడో రోజు ముగించాలని చేసిన టీమిండియా, అంపైర్ల ప్రయత్నాలకు సఫారీ ఆటగాళ్లు డి బ్రూయిన్‌, నోర్ట్జేలు అడ్డు పడ్డారు.   ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 203 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లు కేవలం ఒక్క రోజులోనే 16 వికెట్లు పడగొట్టి దకిణాఫ్రికా జట్టు పతనాన్ని శాసించారు. కాగా ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 9/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టుకు ఆరంభంలోనే ఉమేశ్‌ యాదవ్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. డుప్లెసిస్‌ ను బౌల్డ్‌ చేశాడు. ఆపై హమ్జా-బావుమాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జా, బావుమాలు వెంట వెంటనే ...