పోస్ట్‌లు

మే 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అంద‌రి చూపు క‌న్న‌య్య వైపు

చిత్రం
మేధావిగా..అద్భుత‌మైన స్పీక‌ర్‌గా ..జెఎన్‌యు లీడ‌ర్‌గా పేరు తెచ్చుకున్న క‌న్న‌య్య కుమార్ ఇపుడు ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డ్డారు. ఒంట‌రి పోరాటం సాగిస్తున్నారు. విలువైన ఓటును అమ్ముకోవ‌ద్ద‌ని..నిజాయితీకి ప‌ట్టం క‌ట్టండ‌ని ఆయ‌న కోరుతున్నారు. విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. వ‌య‌సులో చిన్నోడైనా చ‌దువులో గ‌ట్టోడు. జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియ‌న్‌కు ఇంత‌కు ముందు ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్ కు నాయ‌కుడిగా ఉన్నారు. ఈ విద్యార్థి సంస్థ సీపీఐకి అనుబంధంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి లో డాక్ట‌రేట్ డిగ్రీ అందుకున్నారు క‌న్న‌య్య కుమార్. బీహార్ ..బెగ‌సూరై జిల్లా బిహాత్ గ్రామంలో జ‌న‌వ‌రి 1987లో జ‌న్మించారు. తెగ్రా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌స్తుంది క‌న్న‌య్య స్వంతూరు. క‌న్న‌య్య త‌ల్లి మీనాదేవి అంగ‌న్‌వాడి టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. అన్న మ‌నికాంత్ అస్సాంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌నిచేస్తారు. క‌న్న‌య్య కుటుంబీకులంతా సిపిఐ పార్టీకి స‌పోర్ట‌ర్స్‌గా ఉన్నారు. ఆఫ్రీక‌న్ స్ట‌డీస్ పై జెఎన్‌యులో పీహెచ్‌డి చేశారు. కాలేజీ ఆఫ్ కామ‌ర్స్ లో చ‌దువుతుండ‌గానే పాలిటిక్స్‌లో చురు...

రుచి సోయాకు పతంజ‌లి బిగ్ ఆఫ‌ర్

చిత్రం
ఇండియ‌న్ మార్కెట్‌ను చేజిక్కించు కోవాల‌ని చూసిన ఫారిన్ కంపెనీల‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది ప‌తంజ‌లి సంస్థ‌. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే అన్ని వ‌స్తువుల‌ను అమ్ముతోంది ..కోట్లాది రూపాయ‌ల‌ను గ‌డిస్తోంది. ప్ర‌తి ఊరుకు ప‌తంజ‌లి విస్త‌రించింది. రోజు రోజుకు న్యూ ట్రెండ్స్‌ను సృష్టిస్తూ ఇత‌ర కంపెనీల‌కు కోలుకోలేని షాక్ ఇస్తోంది. ఇప్ప‌టికే అప్పుల ఊబిలో కూరుకు పోయి..దిక్కు తోచ‌ని స్థితిలో వున్న రుచి సోయా ఇండ‌స్ట్రీస్‌ను ప‌తంజ‌లి ఆయుర్వేదం స్వాధీనం చేసుకోనుంది. సోయాను స్వంతం చేసుకునేందుకు 4 వేల 325 కోట్ల బిడ్‌ను దాఖ‌లు చేసింది. రుచి సోయా 9 వేల 300 కోట్ల అప్పులు చెల్లించ‌క పోడంతో రుణ దాత‌లు నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో రుచి సోయాను అప్ప‌జెప్పేందుకు బిడ్‌ల‌ను పిలిచారు. ఈ కంపెనీ పాల‌కు ఇండియా వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటోంది. దీంతో డిమాండ్ పెర‌గ‌డంతో అదానీ విల్మార్, ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి. అత్య‌ధిక బిడ్డ‌ర్‌గా అదానీ ఉన్నా..ఎందు వ‌ల్ల‌నో వెన‌క్కు త‌గ్గింది. దీంతో మ‌ళ్లీ బిడ్ దాఖ‌లు చేసే అవ‌కాశం ప‌తంజ‌లికి ఛాన్స్ ఇచ్చారు. తిరిగి 4 వేల‌...

బ్యాంకుల‌తో ఒప్పందం..ప్ర‌యాణం సుల‌భం

చిత్రం
జ‌ర్నీ చేయాలంటే..నానా తిప్ప‌లు ప‌డే వాళ్లు జ‌నం. దానిని గ‌మ‌నించి..ఇక్క‌ట్ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు చేసిన ఆలోచ‌నే..బుక్ చేస్తే చాలు మ‌న ద‌గ్గ‌ర‌కు క్ష‌ణాల్లో వాలిపోయే వాహ‌నాలు వుంటే ఎలా ఉంటుందో అదే ఇది. ఇక డ‌బ్బులు లేవ‌ని చింతించాల్సిన ప‌నిలేదు. ఏకంగా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించాయి ఓలా , ఫ్లిప్ కార్డ్ కంపెనీలు. ఇందు కోసం బ‌డా బ్యాంకులు ఒప్పందాలు చేసుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. క్యాడ్ ఎగ్రిగేట‌ర్ స్టార్ట‌ప్ ఓలా ఎస్ బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వారం రోజుల్లోనే ఈ కార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఊబ‌ర్ కంటే ఓలా సంస్థ‌కు కోటిన్న‌ర మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. దీంతో వీరిలో మొద‌టి ఏడాది 10 లక్ష‌ల కార్డులు జారీ చేయాల‌ని సంస్థ నిర్ణ‌యించింది. ఈ ఒప్పందం కుదిరితే రిస్క్ ఎనాల‌సిస్, కార్డుల జారీ, పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్ లైన్ మేనేజ్‌మెంట్, స్టేట్‌మెంట్ ప్రాసెసింగ్ వంటి ప‌నులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. మ‌రో వైపు మార్కెటింగ్, ప్ర‌మోష‌న్స్, డిస్కౌంట్స్ వంటి బాధ్య‌త‌ల‌ను ఓలా చూసుకుంటుంది. క్రెడిట్ కార్డ్స్ జారీ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ...

కిరాణా దుకాణాల‌తో అమెజాన్ ఒప్పందం

చిత్రం
దేశంలో ఏ గ‌ల్లీకి వెళ్లినా అక్క‌డ టీ కొట్టు..కిరాణ కొట్టు ..సారా కొట్టు..వైన్స్ షాప్ వుండ‌నే ఉంటుంది. ఇప్పుడు ఇవ్వ‌న్నీ మామూలై పోయాయి. ఈ కామ‌ర్స్ రంగంలో దిగ్గ‌జ కంపెనీగా అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీకి మంచి పేరుంది. ఇప్ప‌టికే లాజిస్టిక్ ప‌రంగా ఈ కంపెనీ కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డిస్తోంది. ఆసియా ఖండంలో అతి పెద్ద మార్కెట్ క‌లిగిన కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియానే. సూది నుంచి వాడుకునే అన్ని వ‌స్తువుల దాకా రిల‌య‌న్స్ కంపెనీ స‌ర‌ఫ‌రా చేస్తోంది. గృహోప‌క‌రాణ‌లు కూడా అంద‌జేస్తోంది. దేశ వ్యాప్తంగా ట్రెండ్స్ పేరుతో, రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్, రిల‌య‌న్స్ షాపులు, మాల్స్, అన్నీ ఒక దాని వెంట మ‌రొక‌టి ఏర్పాటు చేసుకుంటూ వ‌స్తోంది. దేశ వ్యాప్తంగా అత్యంత బిగ్ నెట్ వ‌ర్క్ క‌లిగిన ఈ కంపెనీ చేయ‌ని వ్యాపారం అంటూ లేదు. మ‌రో వైపు ఐపీఎల్ టోర్నీలో సైతం స‌పోర్ట్ చేస్తోంది. కేవ‌లం కిరాణా కొట్టులు లేదా దుకాణాల ద్వారా రోజుకు కోట్లాది రూపాయ‌ల వ్యాపారం జ‌రుగుతోంది. ప్ర‌తి వారం జ‌రిగే సంత‌లు, ప్ర‌తి ఏటా ఒక‌సారి జ‌రిగే జాత‌ర్ల‌లో చిరు వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువుల‌ను అమ్ముతున్నారు. పూట గ‌డుపుకుంట...

చెన్నై షాన్ దార్ ..ఢిల్లీ బేకార్

చిత్రం
క్యా బాత్ హై..కుచ్ న‌హీ ..ఇక అంతేగా ..ఉన్న‌దేగా..ఐపీఎల్ -12 టోర్నీలో ఎప్ప‌టి లాగే సీన్ మొద‌టికొచ్చింది. ఎం ఎస్ ధోనీ సార‌ధ్యంలోని చెన్నై క్రికెట్ జ‌ట్టు భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. దీంతో ప్లే ఆఫ్ కు చేరిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. అటు బ్యాటింగ్‌లోను ఇటు బౌలింగ్‌లోను అత్యుత్త‌మ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించారు చెన్నై ఆట‌గాళ్లు. చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన డిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక రంగంలోకి దిగిన చెన్నై జ‌ట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. సుచిత్ వేసిన 4వ ఓవ‌ర్ రెండో బంతికే పంచ్ హిట్ట‌ర్ వాట్స‌న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ద‌శ‌లో ఏ మాత్రం స్కోర్ చేయ‌ద‌న్న ద‌శ‌లో బ‌రిలోకి దిగిన రైనా, డుప్లెసిస్ ల జోడి వికెట్లు పోకుండా ధాటిగా ప‌రుగులు చేస్తూ వ‌చ్చారు. వీరిద్ద‌రు క‌లిసి 83 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో చెన్నై జ‌ట్టు ఆ మాత్రం స్కోర్ చేయ‌గ‌లిగింది. అక్బ‌ర్ వేసిన అద్భుత‌మైన బంతికి డుప్లెసిస్ 39 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఆ త‌ర్వాత సుచిత్ చేసిన మాయాజాలానికి సురేష్ రైనా...

సింధూరం ఆభ‌ర‌ణం..గుర్తింపున‌కు ద‌ర్ప‌ణం

చిత్రం
ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా లేదు. కాని ఇండియాలోనే ఉన్న‌ది. విశిష్ట‌మైన చ‌రిత్ర‌. ఘ‌న‌మైన వార‌స‌త్వ‌పు సంప‌ద‌..అపార‌మైన వ‌న‌రులు ..లెక్క‌లేనంత సంప‌ద‌..లెక్కించ‌లేనంత ఆల‌యాలు ఉన్నాయి. ప్ర‌తి ఊరిలో మ‌నుషులు లేక పోయినా స‌రే గుడి మాత్రం త‌ప్ప‌క ఉండి తీరుతుంది. ఎక్క‌డికి వెళ్లినా సింధూరం పెట్టుకుని వెళ్ల‌డం అల‌వాటు. ఇదో సాంప్ర‌దాయానికి గుర్తింపుగా మారి పోయింది. ప్ర‌తి చోటా కుంకుమ అనివార్యంగా మారింది. గ్లోబెల్ గురువుగా వినుతికెక్కిన శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామిజి సింధూరాన్ని ధ‌రించే ప‌ద్ధ‌తి అద్భుతంగా ఉంటుంది. ఇదో స్ట‌యిల్. అంద‌రూ ఆయ‌న‌ను అనుస‌రిస్తారు. ఆరాధిస్తారు. ప్రేమిస్తారు కూడా. ఇదే భ‌క్తిలో ఉన్న మ‌హ‌త్తు. వేలాది మంది భ‌క్తులు ఎక్క‌డినుండో వ‌స్తారు. ప్ర‌తి ఒక్క‌రికి స్వామి వారు ఏదో ఒక‌టి ఇస్తారు. ఎంత ఇవ్వ‌గ‌లిగితే అంత మంచిది అంటారు. ఇవ్వ‌డం మ‌న జాతి ల‌క్ష‌ణంగా పేర్కొంటారు. ద‌శ‌..దిశ‌ల‌ను మార్చేసే స‌త్తా ఆయ‌న‌కు మాత్ర‌మే ఉన్న‌ది. అందుకే ఆయ‌న గురువ‌య్యారు. మ‌నం మ‌నుషులుగా ఉండి పోయాం. న‌డిచే ప‌ద్ధ‌తి..మాట్లాడే ప‌ద్ధ‌తి..సింధూరం ధ‌రించే విధానం అన్నీ ప్ర‌త్యేక‌త...

రోడ్డు పాలైన జెట్ ఎయిర్ వేస్ ఎంప్లాయిస్

చిత్రం
ఆకాశంలో విహ‌రించే వారంతా రోడ్డు పాల‌య్యారు. అనాలోచిత‌మైన నిర్ణ‌యాలు..ఆదాయాన్ని ప‌క్క‌దారులు ప‌ట్టించ‌డం..లెక్క‌కు మించి అప్పులు చేయ‌డం..వాటిని ఎగ్గొట్టాల‌ని చూడ‌టం ఇదేగా ..గ‌త కొన్నేళ్లుగా ఇండియాలో జ‌రుగుతున్న తతంగం. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా వంద కోట్ల‌కు పైగా జ‌నాభా ఉన్నా ఏ ఒక్క‌రు బాధ్య‌త‌తో ప్ర‌శ్నించే హ‌క్కును కోల్పోయారు. నోట్ల‌కు ఓట్లు అమ్ముకున్నాక వీరికేం విలువ ఉంటుంది. అందుకే ఒకప్పుడు జాతి భ‌విష్య‌త్ కోసం పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌లు జ‌రిగేవి. చ‌ట్టాలు రూపొందేవి. కానీ ఇపుడు వ్యాపార‌స్తులు, కార్పొరేట్ కంపెనీలు స్పాన్స‌ర్ చేసిన వారే చ‌క్రం తిప్పుతున్నారు. ఆర్థిక నేర‌గాళ్ల‌కు అండ‌దండ‌లు అందిస్తున్నారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతున్నా..జ‌ర‌గాల్సిన అన్యాయం జ‌రుగుతూనే ఉన్న‌ది. ఓ వైపు మాల్యా దేశం విడిచి పోయి ..ఎంజాయ్ చేస్తున్నా ఇంకా ఇండియాకు రావడం లేదు. నా ఆస్తుల‌కు లెక్క‌లేన‌న్ని వున్నాయి..నాకు ప‌ర్మిష‌న్ ఇవ్వండి ..నేను అమ్మి క‌డ‌తానంటున్నాడు. ఇంకో వైపు కింగ్స్ ఎయిర్ లైన్స్‌ను ఆయ‌న కూడా ఇలాగే ఆడుకున్నాడు. సిబ్బందితో చెల‌గాట‌మాడాడు. వారిని రోడ్డు పాలు చేశాడు. ఇపుడు జెట్...

బిత్తిరి స‌త్తి స్వ‌రం - ప‌ల్లెత‌న‌పు ప‌రిమిళం

చిత్రం
తెలంగాణ ప్రాంతానికి ఎన‌లేని చ‌రిత్ర ఉన్న‌ది. ఘ‌న‌మైన క‌థ ఉన్న‌ది. దీని గురించి చెప్పాలంటే ఏడాదికి పైగా అవుతుంది. పోరాటాల‌కు, త్యాగాల‌కు పెట్టింది పేరు. ఒక‌ప్పుడు ఈ పేరు చెబితే నిషేధం. కానీ ఇపుడు ప్ర‌పంచపు మైదానం మీద ఎగురుతున్న ప‌తాకం తెలంగాణ‌. యాస‌, భాష‌, సంస్కృతి అన్నీ ఇపుడు మారి పోయాయి. ప్ర‌తి ఒక్క‌రు మ‌న ప్రాంత‌పు భాష‌ను నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు ల‌క్ష‌లాది మంది. వ్యాపారం రాదు.వ్య‌వ‌హారం తెలియ‌దు అనే వాళ్లు. కానీ ఇపుడు సీన్ మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌..వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలంగాణ విస్మ‌రించ‌లేని ప‌దంగా మారింది. అంత‌టి చ‌రిత్ర త‌న స్వంతం చేసుకుంది ఈ నేల‌. ఈ మ‌ట్టిలో ఏదో మ‌హ‌త్తు దాగి ఉన్న‌ది. వేలాది మంది త‌మ మేధ‌స్సును ఈ ప్ర‌పంచ‌పు దారుల్లో న‌డుస్తూనే ఉన్నారు. త‌మ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడుతున్నారు. త‌మ‌ను తాము నిరూపించుకుంటున్నారు. కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లతో తెలంగాణ‌కు ..దాని గుండె కాయ‌గా మిగిలి పోయిన హైద‌రాబాద్‌కు ఎన‌లేని కీర్తిని తీసుకు వ‌స్తున్నారు. లెక్క‌కు మించి ప్ర‌తిభ క‌లిగిన వారంతా మోత మోగిస్తున్నారు. క‌ళాకారులు, గాయ‌నీ గాయ‌కులు , ర‌చ‌యిత‌...

డాల‌ర్ల పంట పండిస్తున్న మొబైల్ యాడ్స్

చిత్రం
ఒక‌ప్పుడు ప్రింట్..మీడియా..కానీ ఇపుడు ప‌రిస్థితిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యాడ్స్ కోసం నానా తంటే ప‌డాల్సిన ప‌నిలేదు. న్యూ లుకింగ్..కొత్త ర‌క‌మైన సాంకేతిక తోడ‌వ్వ‌డంతో ప్ర‌క‌ట‌న‌ల రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఎక్కువ రిస్క్ వుండేది. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి త‌ప్పింది. అన్ని రంగాల‌కు చెందిన కంపెనీల‌న్నీ మొబైల్స్ ను టార్గెట్ చేసుకుంటున్నాయి. శోధిస్తే స్మార్ట్ ఫోన్ల‌దే హ‌వా కొన‌సాగుతోంది. ఏది అమ్మాల‌న్నా కొనాల‌న్నా ఈ కామ‌ర్స్‌లోనే. దీంతో డిజిట‌ల్ మార్కెటింగ్..అడ్వ‌ర్ టైజ్ మెంట్ ..ఎంట‌ర్ టైన్ మెంట్ క‌లిసి పోతున్నాయి. ఇదంతా ఇంట‌ర్నెట్ మాయాజాలం. వీటి వ్యాపారం బిలియ‌న్లు..ట్రిలియ‌న్ల‌ను దాటింది. రిస్క్ లేని వ్యాపారం. త‌క్కువ పెట్టుబ‌డి..ఎక్కువ‌గా రాబ‌డి వ‌చ్చే రంగం ఏదైనా వుందంటే అది ఇదే. ఇంకేం అన్ని కంపెనీలు..క్లౌడ్ కంప్యూటింగ్ , ఆటోమేష‌న్ , మెషిన్ ల‌ర్నింగ్, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా టెక్నాల‌జీ రోజు రోజుకు అప్ డేట్ అవుతోంది. ఈ మేర‌కు దీని పైనే ఔత్సాహికులు, ఎక్స్ ప‌ర్ట్స్‌, సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు ప్ర‌తిరోజు కుస్తీలు ప‌డుతున్నారు. త‌మ మెద‌ళ్ల...