పోస్ట్‌లు

డిసెంబర్ 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్లీజ్ ఎఫ్‌డీఐకి పర్మిషనివ్వండి

చిత్రం
ఇండియన్ టెలికాం కంపెనీల్లో టాప్ కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ కంపెనీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఉన్నట్టుండి రిలయన్స్ జియో కొట్టిన దెబ్బకు వృద్ధి రేటులో వెనుకబడి పోయింది. దీంతో ఉద్దీపన చర్యలు చేపట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌గా ఉన్న భారతీ టెలికాం 4,900 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి   ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ఇండియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సొమ్ము సింగపూర్‌కు చెందిన సింగ్‌టెల్‌, ఇతర విదేశీ కంపెనీల నుంచి రానుంది. ఒకవేళ అనుమతి లభించి పెట్టుబడులు పొందితే ఈ టెలికాం కంపెనీ విదేశీ కంపెనీగా మారనుంది. ఎఫ్‌డీఐ ద్వారా నిధులు వస్తే భారతీ టెలికాంలో విదేశీ షేర్‌ హోల్డింగ్‌ 50 శాతం దాటు తుందని, అప్పుడు విదేశీ కంపెనీగా మారడానికి అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. 4,900 కోట్ల నిధుల రాక కోసం భారతీ టెలికాం దరఖాస్తు చేసుకుంది. ఇందులో సింగ్‌టెల్‌తో పాటు ఇతర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి కూడా ఉంది. ఈ పెట్టుబడులతో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పెరిగి భారతీ టెలికాం విదేశీ కంపెనీగా మారుతుంది. ఈ నెలలోనే టెలికాం విభాగం ఈ పెట్టుబడికి అనుమతిచ్చే అవకాశం ఉంది అన...

మహిళల భద్రత..మీదే బాధ్యత

చిత్రం
దేశాన్ని కాపాడటంలో మీరు నిర్వహిస్తున్న పాత్ర గొప్పది. అలాగే ఈ దేశ ప్రజలు మీకు రుణపడి ఉన్నారు. అయితే సమాజంలో సగభాగం కలిగిన మహిళలు, యువతులు, బాలికలకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత మాత్రం మీమీదే ఉందని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ. రక్షణ కల్పించడంలో పోలీసులు సమర్థవంతమైన పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. పుణెలో 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో మోడీ ప్రసంగించారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. ఎన్ని చట్టాలు చేసినా ఇంకా ఎక్కడో ఒక చోట దారుణం జరుగుతోంది. మరింత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధారణ పౌరుల నమ్మకాన్ని చూరగొనేందుకు, పోలీసింగ్‌ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలని మోడీ సూచించారు. పోలీసు అధికారులు నిత్యం విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తనకు తెలుసన్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నా సివిల్‌ స...

బూతు చూస్తే జైలుకే

చిత్రం
తెలిసీ, తెలియక ఒకవేళ పోర్న్ గనుక చూస్తే ఇక జైలుపాలు కాక తప్పదు. ఈ విషయాన్ని తమిళ పోలీసులు అందరికంటే ముందంజలో ఉన్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్‌లు, ఆన్‌లైన్‌ సౌకర్యంతో స్మార్ట్‌ టీవీలు ఉన్నాయి కదా అని అదే పనిగా గంటల కొద్ది అశ్లీల వీడియోలను వీక్షిస్తే, ఇక సైబర్‌ క్రైంకు చిక్కినట్టే. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. హెచ్చరికల్ని ఖాతరు చేయకుంటే, ఏడేళ్లు జైలు శిక్ష విధించేందుకు తగ్గట్టుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో పోర్న్‌ వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని గుర్తించి, వారికి క్లాస్‌ పీకేందుకు సైబర్‌ క్రైం సిద్ధం అయింది. ఈ మేరకు ఓ యువకుడికి పోలీసు లు వార్నింగ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో కలకలం రేపుతోంది. పోర్న్‌ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వే తేల్చి చెప్పింది. ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యే ఈ వెబ్‌ సైట్లను అరికట్టడం సైబర్‌ విభాగానికి పెద్ద సమస్యే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలల మీద లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు  పెరిగి ఉన్నా...

జోరుకు విండీస్ బ్రేక్

చిత్రం
గెలుపు ఊపులో ఉన్న టీమిండియాకు విండీస్ బ్రేక్ వేసింది. అటు బ్యాటింగ్ లోను..ఇటు బౌలింగ్ లోను మన ఆటగాళ్లు చతికిల పడ్డారు. మొత్తానికి భారత్‌ ఆట గాడి తప్పింది. వేగం పెంచాల్సిన చోట వికెట్లను  కోల్పోవడం..ఆ తర్వాత ఏమాత్రం జోరందు కోలేక పోవడం టీమిండియా భారీ స్కోరుకు కళ్లెం వేసింది. విండీస్‌ ముందుగా బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. అనంతరం బ్యాటింగ్‌ మెరుపులతో సులువుగా నెగ్గింది. కీలక దశలో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా వారికి కలిసొచ్చింది. మొత్తం మీద ప్రత్యర్థి దెబ్బకు భారత్‌ తల వంచింది. బ్యాటింగ్‌లో ఎదురు దాడి, బౌలింగ్‌లో వాడి లేక రెండో టి20లో టీమిండియా ఓడింది. రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో విరాట్‌ కోహ్లి బృందాన్ని ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్‌ దూబే దుమ్ము రేపాడు. 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. పంత్‌ 22 బంతుల్లో 33 పరుగులు చేయడం తో ఆ మాత్రం స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. సిమన్స్‌ 4...

ఈ పాపం పంతుళ్లు..పేరెంట్స్ దే

చిత్రం
అవును..ఇది ముమ్మాటికీ వాస్తవం కూడా. వినేందుకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ బుద్దులు నేర్పాల్సిన పంతుళ్లు..ప్రాణం పోయడమే కాదు నీతిమంతంగా, ధర్మ బద్దంగా ఎలా బతకాలో, విలువలను ఎలా కాపాడు కోవాలో నేర్పించాల్సింది మాత్రం కన్నవారిదే. దీనిని కాదనలేం. పొద్దస్తమానం వస్తువుల వ్యామోహంలో పడి, ఫక్తు ఉన్న ఒక్క జిందగీని నాశనం చేస్తున్న ఈ పాపం మాత్రం వీళ్లదే. ఇది కాదనలేని సత్యం. ప్రపంచం తన దారిన తాను వెళ్లి పోతోంది. అలాగని కాలంతో పోటీ పడగలమా. ఎన్నో ఆవిష్కారణలు, మరెన్నో సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా బతుకు జెర్నీలో నిత్యం ఆటుపోట్లు, అష్టకష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. నేర్చు కోవడానికి, మనల్ని మనం సంస్కరించు కోవడానికి లెక్కలేనన్ని దారులు, మార్గాలు ఉన్నాయి. వీటిని వెతికి పట్టుకుని ప్రాక్టీస్ చేయడమే మిగిలి ఉన్నది. ఏదీ ఊరికే, సులభంగా రాదు. జిందగీ అంటేనే మనతో మనం యుద్ధం చేయడమే కాదు ఇతరులతో పోటీ పడటం కూడా. మనం ఈ లోకంలో ఉన్నామంటే అదృష్టం అనుకోవాలి. అంటే అర్థం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్న మాట. ఒకప్పుడు కలిసి మాట్లాడుకునే వీలుండేది. ఇప్పుడు కలవాలంటే దానికో ప్రత్యేక సమయం కావాల్సి వస్తోంది....

జీవన యానం..చంద్ర హాసం

చిత్రం
జీవితంలో అత్యున్నతమైన వృత్తి ఏదన్నా ఉందంటే అది జర్నలిజం. ఒక్కసారి అందులోకి ఎంటరైతే చచ్చేంత దాకా అందులోనే. రాయడం, చదవడం, పరిశీలించడం, సమాజాన్ని, బతుకుని ఆవిష్కరించడం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే సాధ్యం. తెలుగు ప్రచురణ, ప్రసార మాధ్యమాల్లో మొదటి శ్రేణి సంపాదకులలో సతీష్ చందర్ ఒకరు. అయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి అక్షరంతో అంతరిక్ష ప్రయోగం అనే ట్యాగ్ లైన్ తో వార్త దినపత్రిక సంచలనం సృష్టించింది. ఇరవై ఏళ్ళ కిందటితో..ఇప్పటితో పోలిస్తే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతగా అంటే ఊహించలేనంత. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చాక లక్షలాది మందికి స్కోప్ ఏర్పడింది. లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో పాత్రికేయ విలువలకు కట్టుబడి బతుకు ప్రయాణం చేస్తున్న లబ్దప్రతిష్ఠులైన సంపాదకుల వద్ద పని చేసే భాగ్యం నాకు కలిగింది. ఇది ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. జగమెరిగిన జర్నలిస్టులైన వాళ్ళు, ఎడిటర్స్ ఎబికె ప్రసాద్, సతీష్ చందర్, రామచంద్ర మూర్తి, కె.శ్రీనివాస్, మురళిలతో పాటు న్యూస్ ఎడిటర్స్ లక్ష్మణ్ రావు, వేణుగోపాల్, నాంచారయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తారసపడ్డారు. వారితో ఎంతో నే...

కలిసిన కంటెస్టెంట్స్

చిత్రం
ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే కాలం మన చేతుల్లేదు కనుక. నిన్నటి దాకా సామాన్యులుగా ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే పాపులర్ అవుతున్నారు. వైరల్ గా మారిపోతున్నారు. యూట్యూబ్ స్టార్స్ గా వెలిగి పోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ టాలెంట్ ఉంటే చాలు బతికేస్తున్నారు. ట్రెండ్ సృష్టిస్తూ దుమ్ము రేపుతున్నారు. సింగర్ గా ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ఒకే ఒక్క బిగ్ బాస్ రియాల్టీ షోతో ఇండియన్ స్టార్ అయి పోయాడు. అలాగే ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న ప్రముఖ యాంకర్ శ్రీ ముఖి, రాహుల్ లు ఒక్కటయ్యారు. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను శ్రీ ముఖి పోస్ట్ చేశారు. నిమిషాల్లో ఇది ట్రోల్ అయ్యింది. గతం గతః.. అసలు రిలేషన్‌షిప్‌ ఇప్పుడే మొదలైంది అంటూ క్యాప్షన్‌తో పాటుగా హార్ట్‌ సింబల్‌ను జత చేశారు. అంతే కాదు రాహుల్‌ సైతం శ్రీముఖి షేర్‌ చేసిన ఫొటోను రీపోస్ట్‌ చేయడం విశేషం. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్‌ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మీరిద్దరు ఇలా కలిసి పోవడం బాగుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా, పున్ను సంగతి ఏంట...

సరిహద్దులు దాటిన స్నేహం

చిత్రం
నిన్నటి దాకా ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య స్నేహం ప్రమాదంలో పడింది. కాశ్మీర్ విషయంలో భారత్ పై, దేశ ప్రధాని మోదీజీపై నానా రకాలుగా కామెంట్స్ చేసిన పాకిస్తాన్ తన ధోరణిని మార్చు కోవడం లేదు. అంతర్జాతీయంగా ఇండియాను ఏకాకిగా చేయాలనుకున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు తానే ఏకాకి అయ్యారు. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అగ్ర దేశాలు నచ్చ చెప్పినా పాక్ వినలేదు. ఓ వైపు సరిహద్దుల వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా, మాజీ క్రికెటర్, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దుకు మాత్రం ఆ దేశంలో ఊహించని రీతిలో స్వాగతం లభిస్తోంది. ఈ విషయంలో మాత్రం క్రీడాభిమానులు విస్తు పోతున్నారు. ఇమ్రాన్ కు సిద్ధూ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకించి ఇన్విటేషన్ కూడా పంపించారు. ద్వేషం అన్నది పొలిటికల్ లీడర్ల మధ్యే ఉంటుందని, అది ఆటల్లో ఉండదని మరోసారి నిరూపించారు ఇండియన్స్. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురి పిస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ స్వర్ణం గెలిచాడు. నేరుగా టోక్యో ...

మనం మనుషులం కాలేమా.?

చిత్రం
ఈ దేశంలో నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు, ఆర్ధిక మోసాలు లెక్క లేనంతగా పెరిగాయి. జాతి యావత్తు దేశ స్వాతంత్రం కోసం ఒక్కటై పోరాడింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బలిదానాలు, త్యాగాలు, ఆత్మార్పణలు చేసుకున్నారు. ప్రపంచానికే పాఠం నేర్పిన మహోన్నతమైన చరిత్ర, వారసత్వం కలిగిన ఘనత ఈ దేశానికే ఉన్నది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహాత్ముడు పుట్టింది ఇక్కడే. లోకం విస్తు పోయేలా రాజ్యాంగాన్ని రాసిన కథానాయకుడు బాబా సాహెబ్ అంబెడ్కర్ ఇక్కడి వాడే. ఉరి కొయ్యలను ముద్దాడిన రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్ లు ఈ మట్టిలో మొలకెత్తిన బిడ్డలే. మనకంటూ పాలకులున్నారు. ప్రజలు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకునే అతి పెద్ద దేశం మనది. ఇంతటి విశాలమైన, సువిశాలమైన కంట్రీ ఈ ప్రపంచంలోనే లేదంటే నమ్మగలమా. 1947 లో సిద్దించిన స్వేచ్ఛ నేటికీ విరాజిల్లుతూనే ఉన్నది. ఎన్నో కులాలు, మతాలు, జాతులు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. దారుణ మారణకాండలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో ఫ్రీడమ్, భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వం ఇక్కడ కొలువై ఉన్నది. ఎక్కడివారైనా ఇక్కడికి రావొచ్చు..వెళ్లొచ్చు. ఈజీగా బతకొచ్చు. ...