పోస్ట్‌లు

జూన్ 27, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

చ‌దువు కోసం ఏపీ స‌ర్కార్ చేయూత

చిత్రం
ఏ ఒక్క‌రు పేద‌రికం కార‌ణంగా చ‌దువు కోకుండా వుండడానికి వీలు లేదు. ప్ర‌తి ఒక్క‌రు అక్షరాలు నేర్వాలి. విద్య లేక పోతే జీవితానికి అర్థం అంటూ ఏమీ ఉండ‌దు. తాము చ‌దువుకుంటూ ఇత‌రుల‌కు నేర్పేలా ఎద‌గాలి. అప్పుడే ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బుల‌కు సార్థ‌క‌త చేకూరుతుంది. ఇందు కోసం స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికైనా సిద్ధంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, యువ నాయ‌కుడు జ‌గ‌న్మ్‌హ‌న్ రెడ్డి. విద్యా శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం ..కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. పేద‌ల‌కు అండ‌గా ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే వారికి అమ్మ ఒడి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ కాలేజీల‌తో పాటు ప్రైవేట్ క‌ళాశాల‌ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డుదారుల‌కు మ‌రింత ల‌బ్ధి చేకూరుతుంది. అర‌కులో గిరిజ‌న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా గిరిజ‌న విశ్వ విద్యాల‌యం, వైద్య క‌ళాశాలను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. వృత్తి విద్య‌ల‌కు సంబంధించి ఫీజుల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పాఠ‌శాల‌ల‌ల నిర్మాణంలో గ‌త స‌ర్కార్ తీసుక...

కాఫీపై క‌న్నేసిన కోలా..!

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా అతి పెద్ద పానీయాల సంస్థ‌ల‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న కోకాకోలా కంపెనీ తాజాగా కాఫీ రంగంలోకి ఎంట‌ర్ అయ్యేందుకు పావులు క‌దుపుతోంది. ఈ మేర‌కు ఆయా దేశాల‌లోని ఏయే ప్రాంతాల్లో కాఫీ పంట‌, సాగు, మార్కెటింగ్ అవుతుందో దృష్టి సారించింది. త‌న అనుచ‌ర వ‌ర్గంతో జ‌ల్లెడ ప‌డుతోంది. లోక‌మంత‌టా నీళ్లు దొర‌క‌వేమో కానీ కోలా, పెప్సీ కంపెనీల‌కు చెందిన కూల్ డ్రింక్స్ దొరక‌డం స‌హ‌జం. అంత‌లా వ‌ర‌ల్డ్ మార్కెట్‌పై త‌మ ప‌ట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నాయి. గ‌త 10 నెల‌ల కింద‌ట బ్రిట‌న్‌కు చెందిన కోస్టా కాఫీని 5.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో స్వంతం చేసుకుంది కొకో కోలా కంపెనీ. తాజాగా ఇండియాలో అత్యంత పేరొందిన ఫ్లేవ‌ర్‌గా కేఫ్ కాఫీ డేలో వాటా చేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.  బెంగ‌ళూరు కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ యాజ‌మాన్యంతో ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది ప్రారంభంలో మైండ్ ట్రీలో త‌న‌కున్న వాటాను కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ విక్ర‌యించారు. కొకో కోలా సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ టి. కృష్ణ కుమార్ ప్ర‌స్తుతం అట్లాంటాలో వుంటూ ఈ చ‌...

బౌల‌ర్ల ప్ర‌తాపం - భార‌త్ విజ‌యం - ఇంటిదారి ప‌ట్టిన విండీస్..

చిత్రం
స‌మిష్టిగా ఆడితే ఏ జ‌ట్ట‌యినా ఈజీగా విజ‌యం సాధిస్తుంద‌న‌డానికి విండీస్ తో జ‌రిగిన మ్యాచే. ప్ర‌పంచ కప్ టోర్న‌మెంట్‌లో ఒక్కో విక్ట‌రీ సాధిస్తూ ఇండియా క్రికెట్ జ‌ట్టు త‌న సెమీ ఫైనల్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఇత‌ర జ‌ట్ల‌కు స‌వాల్ విసురుతోంది. అటు బౌలింగ్‌లోను, ఇటు బ్యాటింగ్‌లోను రాణిస్తూ వ‌స్తున్న ఈ జ‌ట్టు ..క‌ప్‌పై క‌న్నేసింది కోహ్లి సేన‌.భార‌త బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో విండీస్ ఆట‌గాళ్లు ఏ మాత్రం పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక పోయారు. కేవ‌లం 143 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యారు. దీంతో ఇండియా జ‌ట్టు నాకౌట్‌కు మ‌రింత చేరువైంది. క‌రేబియ‌న్ల జ‌ట్టులో పంచ్ హిట్ట‌ర్స్ గా పేరున్న క్రిస్ గేల్, సై హోప్, హెట్మ‌య‌ర్ , బ్రాత్ వైట్ ల‌లో ఎవ‌రో ఒక‌రు నిల‌బ‌డినా ఇండియా నిర్దేశించిన టార్గెట్ అంత పెద్ద‌దేమీ కాదు.  బౌల‌ర్లు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. వీరి బంతులను ఎదుర్కోవ‌డానికి, ప‌రుగులు చేసేందుకు విండీస్ బ్యాట్స్ మెన్స్ ఇబ్బందులు ప‌డ్డారు. స్కోర్ పెంచడం కంటే డిఫెన్స్ ఆడ‌డం మొద‌లు పెట్టారు. బ్యాటింగ్ క‌ఠినంగా సాగిన ఈ మైదానంపై మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు జ‌ట్టును నిల‌బెట్టారు. ఈ గెలుపుతో సెమీ...