పోస్ట్‌లు

ఆగస్టు 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బంగారానికి భలే గిరాకీ ..పసిడి పైపైకి ..!

చిత్రం
బంగారాన్ని ఇండియాలో భలే కొనుగోలు చేస్తున్నారు . దీంతో ఎక్కడలేని డిమాండ్ పసిడికి ఉంటోంది . మహిళలు లెక్కకు మించి కొనుగోలు చేస్తున్నారు . ధరలు అమాంతం పెరిగి పోయాయి . బ్యాంకు లు సైతం లాకర్లలో బంగారంతో నిండు కుంటున్నాయి . జనంతో పాటు బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి . కొనుగోలు శాతం 13 కు పైగా చేరుకోవడం మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది . పవిత్రమైన రోజులు రావడం తో పాటు ఆషాడం కారణంగా నగల దుకాణాదారులు భారీగా ఆఫర్స్ ఇవ్వడం తో కొనుగోలుదారులు , మహిళలు , వ్యాపారులు ఎక్కువగా బంగారాన్ని కొంటున్నారు. దీంతో భలే ఛాన్స్ లే అనుకుంటూ మా ఇల్లు బంగారం కావాలని తెగ కొనేస్తున్నారు . ఇంకొన్ని షాపులలో అయితే లెక్కకు మించి కొనుగోలు చేస్తుండటం కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి . ఇప్పుడు పసిడి ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముకునేలా చేస్తున్నాయి . ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో గోల్డ్ 213.2 టన్నులకు చేరుకున్నట్టు డబ్ల్యూజీసీ ప్రకటించింది. 2018 రెండో క్వార్టర్‌‌‌‌లో ఈ డిమాండ్ కేవలం 189.2 టన్నులుగా మాత్రమే ఉండేది. వాల్యు టర్మ్స్‌‌లో చూస్తే గోల్డ్ డిమాండ్ 17 శాతం పెరిగి రూ.62,422...

కాంగ్రెస్ కు త్వరలో కొత్త సారధి ..?

చిత్రం
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకోని రీతిలో ఓటమి వెక్కిరించడంతో ఎటూ పాలు పోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది . బీజేపీ కొట్టిన దెబ్బకు ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇక తాను కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు . దీంతో వేలాది మంది కార్యకర్తలు , అభిమానులు రాహుల్ ఉండాలని కోరారు. అయినా ఆయన ఒప్పుకోలేదు . పార్టీకి చెందిన శ్రేణులు , పెద్దలు , సీనియర్లు అంతా ఆయనే ఉండాలని పట్టుపట్టారు . రాహుల్ గాంధీ మాత్రం ఇక చాలని , ఈ భారాన్ని మోయలేనని స్పష్టం చేశారు . ఉత్తర ప్రదేశ్ లో మంచి పట్టు కలిగిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా రాహుల్ పోటీ చేసిన అమేథీ లో పరాజయం పాలయ్యారు . దీంతో పార్టీ పగ్గాలు తనకు వద్దని తేల్చి చెప్పారు .  సీనియర్లు మాత్రం రాహుల్ ఉండాలని పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు . అయినా రాహుల్ ససేమిరా అన్నారు . సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ లలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో కోరాయి . వేరే ఎవ్వరిని నియమించినా తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి . గతం లో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది . మొత్తం మీద పార్ట...

పవర్ బిల్లులు చెల్లిస్తేనే భవిష్యత్ ..లేకపోతే పదవులు ఫట్..!

చిత్రం
సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు . ఇలా ఎంత కాలం విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు . సర్పంచులు , గ్రామ కార్యదర్శులు , ముసిపల్ చైర్ పర్సన్లు , కార్పొరేట్ లను హెచ్చరించారు .గ్రామ పంచాయతీలు , పురపాలక సంఘాలు ఇంత దాకా వచ్చినా కూడా ఇంకా బకాయిలు ఉండడం దారుణమన్నారు . పాత బకాయిలు ఉంటె వన్ టైం కింద సెటిల్ మెంట్ చేస్తామని చెప్పారు . విద్యుత్ సంస్థల బకాయిలను జీరో కు తీసుకు రావాలని ఆదేశించారు అధికారులను . ప్రభుత్వ ఆఫీసులకు ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు . నగరాలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు కోసం కొత్తగా పాలసీని తీసుకు వస్తామని వెల్లడించారు.  ఇక నుంచి విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించక పోతే సర్పంచ్ , గ్రామ కార్యదర్శి ,, మున్సిపల్ చైర్ పర్సన్ , కమీషనర్ల పై వేటు వేస్తామని సీఎం హెచ్చరించారు . రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు . కనురెప్ప పాటులో కూడా కరెంట్ పోవడం లేదని ..ఒక వేళ పోతే ఆయా పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు . ఇప్పటికే విద్యుత్ పరంగా దేశానిక...

గోదావరి గల గల ..కృష్ణమ్మ ..జూరాల కళ కళ ..!

చిత్రం
నిన్నటి దాకా నీళ్ల కోసం అల్లాడిన రైతులు ఇప్పుడు ఆనందంలో తేలుతున్నరు. తాగు నీళ్ల కోసం ..సాగు నీళ్ల కోసం అల్లాడి పోయిండ్రు . ఎక్కడ చూసిన ఎండిన పంటలు ..నెర్రెలు బారిన పొలాలు ..మట్టి బిడ్డలను ఆందోళలనకు గురై చేసినవి. అటు ముంబై ని వరదలు ..వర్షాలు ముంచెత్తినవి . జనాన్ని అతలా కుతలం చేసినవి . భారీగా కురుస్తున్న  వర్షాల దెబ్బకు జన జీవనం స్థంభించి పోయింది . యెడ తెరిపి లేకుండా కురుస్తున్న వానల తో గోదావరి , కృష్ణమ్మ , తుంగభద్ర , మంజీరా , తదితర నదులన్నీ నిండి పోయినవి . దీంతో ప్రాజెక్టులు జలకళతో కళకళ లాడుతున్నవి.  కృష్ణమ్మ నిండు కోవడంతో అటు జూరాలకు భారీ ఎత్తున వరద నీరు ఎగువన ఉన్న కర్ణాటక నుండి నీరు వచ్చి చేరుతోంది . దీంతో జూరాల ఆయకట్టు రైతులు సంతోషం లో మునిగి తేలుతున్నరు. ఇప్పటికే వరద తీవ్రత పెరగడంతో 24 గేట్లు ఎట్టి వేశారు . లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అటు గోదావరిలోను వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది . దీంతో మేడిగడ్డ బ్యారేజి కూడా నిండి పోయింది . ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తిగా నిండి పోయింది . అధికారులు 57 గేట్లు తెరిచి దిగువకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని ది...

వ్యాపారం ..విషాదం ..రాజకీయం ..సిద్దార్థ జీవితం..!

చిత్రం
కోట్లాది రూపాయల వ్యాపారం ..లెక్క లేనంతటి ఆస్తులు ..వేలాది మందికి కొలువులు ఇచ్చిన ఈ విజయవంతమైన బిజినెస్ మెన్ చివరకు మనసుకు శాంతి కరువై జీవితం నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. వ్యాపారంలో వున్నా వారు ..రావాలని అనుకున్న వారు సిద్దార్థ జీవితం ఒక లెసన్ గా తీసుకోవాలి. కాఫీ కింగ్ గా మార్చిన ఘనత ఆయనదే . చిక్ మంగళూరు కు చెందిన ఈ అరుదైన వ్యాపార వేత్త గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పులు ఎక్కువగా ఉండటం ..ఉన్న ఆస్తులు అమ్మితే ఎక్కడ తన కంపెనీ బ్రాండ్ విలువ తగ్గిపోతుందని భావించిన ఆయన చివరకు ఆత్మహతే శరణ్యమని నమ్మారు. వేలాది మందిని శోక సంద్రంలో నెట్టేశారు.  గౌతమ్ సిద్దార్థ ఆత్మహత్య కార్పొరేట్ రంగాన్ని కుదిపేసింది. ఆయన మరణం పలు వ్యాపార వేత్తలను ఆలోచించుకునేలా మార్చేసింది. ఈ విషయం నిజం కాదేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు కొందరు. కానీ అనుకోనిది జరిగింది . తీవ్రమైన వత్తిళ్ళను ఆయన కొంత కాలం పాటు ఎదుర్కొన్నారు . ఇది ఒక రకంగా మానసికంగా చితికి పోయారు .రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబమే అయినా ..సిద్దార్థ ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికి అర్థం కావడం లేదు .కాఫీ డే ను స్థాపించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్న సమయం...

లాభాల బాటలో రెడ్డీస్

చిత్రం
ఫార్మా రంగం ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. తెలంగాణాలో లెక్కలేనన్ని ఔషధ కంపెనీలు కొలువు తీరాయి . మరికొన్ని కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ప్రభుత్వం ప్రమాదకర పరిశ్రమల జాబితాలోకి నెట్టి వేశాయి . తాజాగా డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి . రెవ్ లిమిడ్ బ్రాండ్ ఔషధం అమ్మకంలో భారీ ఆదాయం సమకూరింది ఈ కంపెనీకి. జూన్ మాసాంతానికి ముగిసే నాటికి నికర లాభం పెరిగి 662 , 80 కోట్లకు చేరుకుంది . క్యాప్సూల్స్ బ్రాండ్ ను కెనెడా కంపెనీకి అమ్మేసింది . ఈ ఒప్పందం ద్వారా రెడ్డీస్ గ్రూప్ కు మరో 350 కోట్ల ప్రాఫిట్ దక్కింది. ఈ ఆదాయం వల్ల కంపెనీకి కొంత బలం చేకూరింది. ఏప్రిల్ - జూన్ కు సంబంధించి 3 శాతం పెరిగి 3 వేల 844 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయంలో గ్లోబల్ జెనరిక్ వ్యాపారం ద్వారా 3 వేల 298 కోట్లు . ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 1632 కోట్లు.రెడ్డీస్ కంపెనీ అయిదు కొత్త ప్రోడక్ట్స్ ను తీసుకు వచ్చింది . టెస్టోస్టిరోన్ జెల్ , విటమిన్ కె , టొబ్రామైసిన్, ఓటీసి కాల్షియం , కార్పొనేట్ తో పాటు మరో మందును మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది . మరి కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముడు పోక పోవడంతో భారీగా నష్టాలను చవి ...