పోస్ట్‌లు

నవంబర్ 17, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

టిక్ టాక్ సెన్సేషన్..ఇండియా నంబర్ వన్

చిత్రం
సోషల్ మీడియాలో ఇప్పుడు చైనాకు చెందిన టిక్ టాక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో తాజా సమాచారం మేరకు అత్యధికంగా ఈ టిక్ టాక్ వీడియో యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నిమిషాల లోపే ఆడియో, వీడియోలను తయారు చేసుకునే వీలుండటం, క్షణాల్లోపే వరల్డ్ వైడ్ గా పాపులర్ కావడం జరుగుతోంది. చిన్నారుల దగ్గరి నుంచి వృద్ధుల దాకా అంతా టిక్ టాక్ జపం చేస్తున్నారు. నిన్నటి దాకా గేమ్స్ తో కుస్తీ పట్టిన జనం ఇప్పుడు టిక్ టాక్ లోనే జీవితం గడుపుతున్నారు. ఇక దీని ప్రభావానికి కోట్లాది మంది యూజర్స్ దీనిని వాడకుండా ఉండలేక పోతున్నారు. అంతలా టిక్ టాక్ మెస్మరైజ్ చేసేస్తోంది. ఇదిలా ఉండగా టిక్ టాక్ యాప్ సామాజిక మధ్యమ విభాగంలో ప్రపంచ చరిత్ర సృష్టించింది. దీని వీడియో యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ ప్లే సహా యాప్‌ స్టోర్‌ నుంచి 150 కోట్ల డౌన్‌ లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్‌ ఇన్‌స్టాల్స్‌తో భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది. టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం భారత్‌ నుంచే కావడం గమనార్హం. 2019లో టిక్‌టాక్‌ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్‌ లోడ్స్‌ సాధించిందని మొబైల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌...

కార్మికుల ఆందోళన..ఫిట్‌మెంట్‌ పెరిగేనా

చిత్రం
ఓ వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతుండగా ఇంకోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వేతన సవరణ కోసం పట్టుబడుతున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం పీఆర్‌సీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయడం ఆనవాయితీ. పీఆర్‌సీ 25 శాతం వరకు ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పీఆర్‌సీలో గత ఫిట్‌మెంట్‌కు అదనంగా 63 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ చైర్మన్‌కు నివేదికలు అంద జేశాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంత మొత్తం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం నివేదిక నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. ఆ వెంటనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగులతో సమావేశమై ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. పీఆర్‌సీ నివేదికను 12 రోజుల్లో సమర్పించాలంటూ పీఆర్‌సీ చైర్మన్‌ బిస్వాల్‌ను సీఎం  ఆదేశించారు. ఫిట్‌మెంట్‌ ఆధారంగానే వేతనాల పెంపుదల ఉండనుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఫిట్‌మెంట్‌ సాధనకు సీఎంను ఒప్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 లక్షల మంది ఉద...

దేశం కోసం కలిసి సాగుదాం

చిత్రం
స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగుదామని భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కోరారు. మహారాష్ట్ర రాజకీయాలతో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్బంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. మనది విశాల కుటుంబమని, ప్రజల కోసం సమిష్టిగా పని చేద్దామని ఈ  ప్రధాని మోదీ భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీయేకు పట్టం కట్టారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో స్వల్ప విభేదాలు, వైరుధ్యాలు ఎన్డీయేను బలహీన పరచలేవని మోదీ వ్యాఖ్యానించారు. మ రోవైపు ఎన్డీయే భేటీ సానుకూలంగా జరిగిందని, తమ కూటమి దేశంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అద్దం పడుతుందని సమావేశానంతరం ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. రైతులు, యువత, మహిళలు, నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధించే వరకూ తాము ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకోమని స్పష్టం చేశారు.కాగా, శివసేన కీలక ఎన్డీయే భేటీకి హాజరుకాక పోవడం క...

రామ్‌దాస్‌ సెన్సేషన్ కామెంట్స్

చిత్రం
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, రిపబ్లిక్‌​ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అంథ్‌వాలే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఎన్డీయే పక్షాలు ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఏయే అంశాలు చర్చించాలని సుదీర్ఘంగా ఈ మీటింగ్ లో చర్చించారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, పార్లమెంట్ సభ్యులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేమీ లేదని రాందాస్ ఈ సందర్బంగా అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కూటమిగా పోటీ చేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టు బట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించక పోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇ...

అతడైతే ఆ ఒక్కటి ఓకే

చిత్రం
  ఆయన కోసం షరతులు సడలిస్తానంటోంది నటి తమన్నా. హీరోయిన్లకు ఒకటి కాదు, రెండు కాదు నాలుగు నాలుకలు ఉంటాయని ఈ అమ్మడి విషయంలో నిజమవుతోంది. ఎందుకంటే ఒకసారి కాదన్నదే మరోసారి అవునంటారు. తమన్నా తంతూ ఇదే. గ్లామరస్‌ పాత్రల తోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన తమన్నా బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. అవసరం అయితే అభినయం లోనూ సత్తా చాటు తానంటున్న తమన్నా ఇకపై గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటిస్తానని ఇటీవల చెప్పింది. అయితే ఆ నిర్ణయానికి కట్టుబడినట్లు కనిపించట్లేదు. తాజాగా విశాల్‌తో జతకట్టిన యాక్షన్‌ చిత్రంతో తనకే సొంతమైన అందాలను తెరపై పరిచేసింది. లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో ఇప్పుటి వరకూ నటించ లేదు, ఇకపై నటించను కూడా అని చెప్పేసింది కూడా. తాను చిత్రాలను అంగీకరించే ముందు దర్శక, నిర్మాతలకు విధించే షరతు ఇదేనని పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆ షరతును ఒకే ఒక్క నటుడికి మినహాయింపు అంటోంది. ఆ లక్కీ నటుడెవరంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అట. ఆ నటుడితో లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది.   ఈ అమ్మడికి బాలీవుడ్‌లో స్...

మహా రగడ..షాపై రౌత్ ఫైర్

చిత్రం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కానేలేదు. అప్పుడే ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అది ఇంతటితో ఆగేలా లేదు. ఇప్పటికే బీజేపీ సర్కారులో మంత్రి పదవికి శివ సేన పార్టీ వైదొలిగింది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనల మధ్య జరిగిన ఒప్పందంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అసత్యాలు చెబుతున్నారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచు కోవాలనే శివసేన డిమాండ్‌ పట్ల అమిత్‌ షా అవాస్తవాలు మాట్లాడు తున్నారని దుయ్య బట్టారు. రొటేషనల్‌ సీఎం అంశంపై అమిత్‌ షా ప్రధాని నరేంద్ర మోదీకి తెలియ కుండా దాగుడు మూతలు ఆడారని మండి పడ్డారు రౌత్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్‌ కొనసాగుతారని చెప్పడం ప్రస్తావిస్తూ..జన బాహుళ్యంలో మోదీకి ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఆ సమయంలో తాము ఆక్షేపించ లేదని స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివ సైనికుడేనని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సైతం పలు సభల్లో ప్రస్తావించారని గుర్తు చేశారు. రొటేషనల్‌ సీఎం ప్రతిపాదన తమ ఒప...

ఏఎన్నార్‌ ఎప్పటికీ హీరోనే

చిత్రం
తెలుగు సినిమా ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వర్ రావు బతికే ఉంటారని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాకుండా ఎప్పటికైనా  అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుందని వ్యాఖ్యానించారు. ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కినేని భౌతికంగా మన మధ్య లేక పోయినా, మన మనస్సులో జీవించి ఉన్నారని చెప్పారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్‌ జీవితం నాలో స్ఫూర్తి నింపింది. మా అమ్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. డెలివరీ సమయంలో కూడా అక్కినేని సినిమా చూడాలంటూ అమ్మ పట్టుబట్టి మరీ చూశారట. అందుకే నేమో ఆమె కడుపులో ఉన్న నాకు సినిమాలు అంటే ఇష్టం ఏర్పడిందేమో. అక్కినేని గారితో ‘మెకానిక్‌ అల్లుడు’ చిత్రంలో కలిసి నటించా. ఆయన చాలా బాగా మాట్లాడే వారు. నాగేశ్వర్ రావు దగ్గరి నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు.  అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్‌ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి, రేఖలకు అక్కినేని పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితమైన నిర్ణయం. భారతదేశంతో పాటు ముఖ్యంగా దక్షిణాది గర్వించ...

దేశం మెచ్చిన అసామాన్యుడు

చిత్రం
అంతులేని అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన భారత దేశంలో న్యాయ వ్యవస్థకు గణనీయమైన గౌరవాన్ని తీసుకు వచ్చారు ఈశాన్య రాష్ట్రాల నుంచి అత్యున్నత స్థానం అధిరోహించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. పని చేసింది కేవలం 13 నెలల కాలమే కావొచ్చు. కానీ ఈ దేశం బతికి ఉన్నంత కాలం గుర్తుండి పోయేలా, పలు చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఆయనే ఆ ప్రాంతం నుంచి మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉన్నారు. ఇది కూడా ఓ రికార్డు. ఇప్పటి వరకు భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు కు 46 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పని చేశారు. కానీ ఆ పదవికి మరింత వన్నె తెచ్చింది మాత్రం రంజన్ పని చేసిన కాలం లోనే. పలు కీలక మైన, కొన్నేళ్లుగా పేరుకు పోయిన కేసుల బూజు దులిపారు. అంతే కాదు పూర్తి పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచార చట్టం పరిధిలోకి సిజెఐ కూడా వస్తుందని తేల్చి చెప్పారు. న్యాయం, ధర్మం అంగడి సరుకుగా మారి పోయిన ప్రస్తుత తరుణంలో గొగోయ్ బాధ్యతలు చేపట్టాక వాటి స్వరూపాన్ని మార్చేశారు. జడ్జీలు అంటే మామూలు మనుషులు అనుకుంటే పొరపాటు. వాళ్ళను దైవానికి ప్రతి రూపాలుగా భావిస్తారు బాధితులు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ...

అశ్వత్థామ రెడ్డి అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోక పోవడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరవధిక దీక్షకు దిగారు. ఆయా నేతల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వైద్యులు వెంటనే చికిత్స చేయాలని సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా ఇంట్లోనే ఉంటూ తలుపు మూసుకుని దీక్షకు దిగిన మరో లీడర్ రాజిరెడ్డి తలుపులు పగులగొట్టారు. ఆయనను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే క్రమంలో ఆయనను తరలిస్తుండగానే రాజి రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఇంకో వైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తరలించే క్రమంలో పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయినా పోలీసులు వినిపించు కోలేదు. అశ్వత్థామరెడ్డిని ఆయన నివాసం నుంచి పో...