చిన్మయి సీరియస్ కామెంట్స్

సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సెలెబ్రెటీగా పేరొందిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఏది మాట్లాడినా, లేదా ఏదైనా పోస్టు చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, పడుతున్నారో ఇటీవలే చెప్పింది. అంతే కాదు సినీగేయ రచయిత వైరముత్తు పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గొప్ప సింగర్ గా ఉన్న చిన్మయి సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తుంది. అంతే కాకుండా బాధితులకు మద్దతుగా తాను నిలబడుతుంది. దీంతో ఆమె ఫైర్ బ్రాండ్ విమెన్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మగాళ్లు ఆడవాళ్ళ విషయంలో చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యింది. మగాళ్ల చూపులన్నీ మహిళల వక్షోజాలపైనే ఉంటుందా అంటూ ప్రశ్నించింది. ఓ మహిళ ఎదుర్కొన్న షాకింగ్ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి వద్దకు వెళ్లాడు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన ఆ యువతిని చూసి అన్నీ కనిపిస్తున్నాయి చున్నీ కప్పుకోండి అన్నాడట. దీంతో ఆమెకు ఒళ్లుమండింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి పేర్కొంది. స్వ...