పోస్ట్‌లు

నవంబర్ 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

విప్లవ ధృవతార..ఈ తరం చేగువేరా

చిత్రం
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన యోధుడు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా మారిన ధీరుడు. జనం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మానవుడు. తెలంగాణ మాగాణంపై మరిచి పోలేని చరిత్రకు నాంది పలికిన నాయకుడు. తాను దారుణ హత్యకు గురై 47 ఏళ్ళు అవుతున్నా, కొన్ని తరాలు గడిచినా, నాలుగు దశాబ్దాలు పూర్తయినా నేటికీ జార్జి రెడ్డి ప్రజల గుండెల్లో ప్రవహిస్తూనే వున్నాడు. జనాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఆయన మరణం లక్షలాది మందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉన్నది. ఇంతలా వెంటాడుతున్న ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటికీ ఉందంటూ మేధావులు, ప్రజాస్వామిక వాదులు చెబుతూనే వున్నారు. తాజాగా జార్జి రెడ్డి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు టాలీవుడ్‌లో వీరుల కథల ట్రెండ్‌ నడుస్తోంది. తొలి స్వాతంత్ర్య సమర యోధుడు నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన సైరా నరసింహారెడ్డి చిత్రం సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అదే కోవలో విప్లస్ఫూర్తి కలిగిన, మనం మరిచి పోయిన వీరుడు జార్జి రెడ్డి కథను దళం డైరెక్టర్ జార్జి రెడ్డి పేరుతో సినిమా తీశాడు. భగత్‌ సింగ్‌, చెగువేరా, మార్క్స్ పుస్తకాలు చదివాడు. అన్యాయాన్ని ప్రశ్నించాడు. న్యాయం కోసం నిలబడ్డాడు. సిద్ధాం...

సరిలేరు నీకెవ్వరు..బాస్

చిత్రం
ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ రేంజ్ ను సృష్టించుకుని, పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఇమేజ్ కలిగిన హీరో గా వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎఫ్ -2 సినిమా తీసి 100 కోట్లు కొల్లగొట్టి చరిత్ర తిరిగేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి సారిగా మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అంటూ సినిమా తీస్తున్నారు. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీపై. దాదాపు వరల్డ్ వైడ్ గా ఇప్పటికే మార్కెట్ సమకూరింది ఈ సినిమాకు. రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్ తో తీసిన మూవీస్ అనిల్ కు మంచి పేరు తీసుకు వచ్చాయి. మహేష్ బాబు మాత్రం అనుకోని రీతిలో రావిపూడికి అవకాశం ఇచ్చాడు. ప్రిన్స్ తో గీత గోవిందం సినిమాతో తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ను సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఎంపిక చేశారు దర్శకుడు. ఇప్పటికే అటు తమిళ్, ఇటు కన్నడ, హిందీ సినీ రంగాలకు చెందిన పలువురు స్టార్ హీరోయిన్స్ మహేష్ తో నటించాలని ఉవ్విల్లూరుతారు. కానీ అందరిని కాదనుకుని రష్మికకు ఛాన్స్ దక్కింది. సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తయినట్టు సమాచారం. తాజాగా సరిలేరు నీకెవ్వరు టీజర...

కమలానిదే మరాఠా పీఠం

చిత్రం
మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న వాస్తవాన్ని రూడీ చేశారు మోడీ, అమిత్ షా. గత కొన్ని రోజులుగా మహాభారతాన్ని తలపింప చేసింది మారాఠా రాజకీయం. ఇదే సమయంలో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఏకంగా మరోసారి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ట్రబుల్ షూటర్లు. దేశమంతటా ఎంతో ఉత్కంఠకు దారి తీసింది మహా నాటకం. ఏ రాజకీయ పార్టీ కొలువు తీరుతుందోనని చర్చ జరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒకవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రచారం చేశాయి. అయితే ఏ ఒక్క పార్టీకి మెజార్టీ రాలేదు. ఇదే సమయంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాగా మరాఠా పీఠం తమకు కావాలంటూ శివసేన పట్టుపట్టింది. దీనిని అమిత్ షా , మోదీ ఒప్పుకోలేదు. పరిస్థితి చేయి దాటడంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ జోక్యం చేసుకున్నా ఒప్పుకోలేదు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే. కాంగ్రెస్, ఎన్సీపీ చీఫ్ లు సోనియా, శరద్ పవార్ లతో కలిసి శివసేన చీఫ్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. చెరో సగం అధికారం పంచుకునేలా ఒప్పందం కూడా కుదిరింది. ఈ మేరకు రాష్ట్రపతి పాలన కూడా...

పని చేయని రాందేవ్ మంత్రం

చిత్రం
నిన్నటి దాకా దేశవ్యాప్తంగా హవా చెలాయించిన ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ బాబా మంత్రం ఇప్పుడు ఎక్కడా పని చేయడం లేదు. రామ్ దేవ, ఆచార్య బాలకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో పతంజలి పేరుతో ఓ సంస్థను స్థాపించారు. స్థానికత, సాంప్రదాయత, దేశ సంస్కృతి కలగలిసేలా ప్రతి చోటకు ఇది విస్తరించింది. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ కూడా కొలువు తీరడంతో మన బాబాకు అన్ని మార్గాలు కలిసి వచ్చాయి. దీంతో దేశమంతటా పతంజలి పేరు మారు మోగింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్ కు విపరీతమైన ఆదరణ లభించింది. పతంజలి కొట్టిన దెబ్బకు విదేశీ కార్పొరేట్ కంపెనీలు ఒక్కసారిగా నష్టాలకు లోనయ్యాయి. ప్రతి ఇంటిల్లిపాదికి, అన్ని పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా, అందరూ వాడుకునేలా, సరసమైన ధరల్లో ఉండేలా చేసింది. పతంజలి గ్రూప్ అమ్మకాల్లో రికార్డులను తిరుగ రాసింది. 2011–2017 మధ్య దీని ఆదాయం10 వేల కోట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే గత ఏడాది నుంచి మాత్రం ఆదాయాలు గణనీయంగా తగ్గడం గమనార్హం. ఇది తయారు చేసే టూత్‌‌ పేస్టు, సబ్బులు, పిండి, తేనె, నెయ్యికి విపరీతంగా గిరాకీ ఉండేది. పతంజలి ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శిం...

మొబైల్స్ హవా..పేమెంట్స్ భళా

చిత్రం
కానీ దానికి, అయిన దానికి ప్రతి ఒక్కరు మొబైల్ వాడడం అన్నది అవసరంగా, విడిపించు కోలేని వ్యసనంగా మారింది. ఇక భారతదేశంలో నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి అయ్యాక డిజిటల్ టెక్నాలజీకి మరింత ప్రయారిటీ పెరిగింది. ప్రస్తుతం అన్ని లావాదేవీలు స్మార్ట్ ఫోన్స్ ద్వారానే కొనసాగుతున్నాయి. గుండు సూది నుంచి ప్రతి వస్తువును ఆన్ లైన్ లోనే కొంటున్నారు మనోళ్లు. రోజూ కోట్లాది రూపాయల వ్యాపారం వీటి ద్వారా సాగుతోంది. కొనుగోళ్లు, ఆన్‌‌లైన్ పేమెంట్లు రాకెట్ కంటే వేగంగా పెరిగి పోతున్నాయి. 88 శాతం ఇండియన్ కన్జూమర్లు మొబైల్ ఫోన్లు ద్వారానే కొనుగోళ్లు చేపడుతున్నారని, ఆన్‌‌లైన్‌‌లో చెల్లింపులు చేస్తున్నారని పేపాల్, ఐపీఎస్‌‌ఓఎస్‌‌ ఎంకామర్స్ రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఎం కామర్స్ పేరుతో పేపాల్ ఈ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. ఇండియాలో, ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ కామర్స్ ఎలా  ఉందనే విషయంపై పేపాల్ ఏర్పాటు చేసిన ఐపీఎస్‌‌ఓఎస్ ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో సుమారు 22 వేల మంది కన్జూమర్లు, 4 వేల మంది బిజినెస్‌‌ రెస్పాండెంట్లపై ఈ సర్వే చేపట్టారు. దీనిలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. ఇండియా ఎం కామర్స్‌‌...

అమ్మకానికి బీపీసీఎల్‌ రెడీ

చిత్రం
కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలను నిర్వీర్యం చేయడమో లేదా వాటిని గంప గుత్తగా అమ్మడమో టార్గెట్ గా పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ లక్ష్యం ఏనాడో మరిచి పోయింది. భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలు ఉండ కూడదని, స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలనేదే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. మోదీ దీనికి విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా విశిష్టమైన సేవలు అందజేసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీని ఇప్పుడు జవసత్వాలు లేకుండా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయి. దాదాపు 80 వేల మందికి పైగా ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా దేశంలోనే అతి పెద్ద ఆయిల్ నెట్ వర్క్ కలిగిన సంస్థగా పేరొందిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ను పూర్తిగా దారాదత్తం చేసేందుకు దుకాణం తెరిచారు మన గ్రేట్ పీఎం. ప్రభుత్వ రంగ సంస్థలకు దీనిని ఇవ్వబోమంటూ తేల్చి చెప్పారు. బహుళ జాతి ప్రైవేట్‌ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐఒసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు ఇందు కోసం బిడ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఐఓసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు...

ఇక నాగబాబు కనిపించడు

చిత్రం
కొణిదెల నాగ బాబు సినిమాల్లో నటుడి కంటే ఎక్కువగా బుల్లితెరలో పేరు తెచ్చుకున్నారు. మోస్ట్ పాపులర్ యాక్టర్ గా వినుతికెక్కారు. మెగా ఫ్యామిలీలో నాగబాబుది ప్రత్యేకమైన శైలి. ఆయన ఎప్పుడూ కూల్ గా ఉంటారు. పూర్తిగా పాజిటివ్ లుక్ తో అలరిస్తూ వస్తున్నారు కొన్నేళ్లుగా. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా, నటుడిగా, నిర్మాతగా పలు కీలక విభాగాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చేసిన సినిమాలు కొన్ని ఆడాయి. ఇంకొన్ని కోలుకోలేని రీతిలో నష్టాలకు గురిచేసాయి. ఆర్ధిక పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురైన సమయంలో అదృష్టం బుల్లితెర రూపంలో వచ్చింది. అదే తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టీవీ ఛానల్ గా కొనసాగుతూ వస్తున్న ఈటీవి నాగబాబు, నటి రోజా లు న్యాయ నిర్ణేతలుగా చేపట్టిన జబర్దస్త్ కార్యక్రమం మరింత పాపులర్ అయ్యింది. ఈ ఒక్క ప్రోగ్రాం ను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ఈటీవికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. యూట్యూబ్ లో ఈ ప్రోగ్రాం వీక్షించే వారి సంఖ్య లక్షలను దాటుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత డిమాండ్ ఉందో. ఈ ప్రోగ్రాం కు హైలైట్ గా నిలిచారు నాగబాబు, రోజా. అయితే జబర్దస్త్ షో ఏకంగా గత ఏడేళ్లుగా తెలుగు బుల్లితెరపై న...

ట్రావెలర్స్ కోసం నిఘా యాప్

చిత్రం
ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా, టెక్నాలజీలో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నా మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లైంగిక వేధింపులు మరీ ఎక్కువై పోయాయి. తాజాగా డ్యూటీల కోసం ప్రతి ఒక్కరు ప్రైవేట్ రూట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. కాగా క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ అడపా దడపా ఫిర్యాదులు వస్తున్న విషయం తెల్సిందే. విదేశాల్లో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్‌వర్క్‌ కలిగిన ‘ఉబర్‌’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టబోతోంది. అదే వాయిస్‌ ఆడియో రికార్డింగ్‌ ఫీచర్‌. ఎందుకంటే డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడం కోసం. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రవేశ పెట్టి, ఆ తర్వాత అమెరికాకు విస్తరిస్తామని ఉబర్‌ యాజమాన్యం తెలిపింది. కారులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపయోగ పడుతుందని పేర్కొంది. అదే విధంగా ఈ ఆడియో రికార్డిం...