మొబైల్స్ హవా..పేమెంట్స్ భళా


కానీ దానికి, అయిన దానికి ప్రతి ఒక్కరు మొబైల్ వాడడం అన్నది అవసరంగా, విడిపించు కోలేని వ్యసనంగా మారింది. ఇక భారతదేశంలో నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి అయ్యాక డిజిటల్ టెక్నాలజీకి మరింత ప్రయారిటీ పెరిగింది. ప్రస్తుతం అన్ని లావాదేవీలు స్మార్ట్ ఫోన్స్ ద్వారానే కొనసాగుతున్నాయి. గుండు సూది నుంచి ప్రతి వస్తువును ఆన్ లైన్ లోనే కొంటున్నారు మనోళ్లు. రోజూ కోట్లాది రూపాయల వ్యాపారం వీటి ద్వారా సాగుతోంది. కొనుగోళ్లు, ఆన్‌‌లైన్ పేమెంట్లు రాకెట్ కంటే వేగంగా పెరిగి పోతున్నాయి. 88 శాతం ఇండియన్ కన్జూమర్లు మొబైల్ ఫోన్లు ద్వారానే కొనుగోళ్లు చేపడుతున్నారని, ఆన్‌‌లైన్‌‌లో చెల్లింపులు చేస్తున్నారని పేపాల్, ఐపీఎస్‌‌ఓఎస్‌‌ ఎంకామర్స్ రిపోర్ట్‌‌ వెల్లడించింది.

ఎం కామర్స్ పేరుతో పేపాల్ ఈ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. ఇండియాలో, ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ కామర్స్ ఎలా  ఉందనే విషయంపై పేపాల్ ఏర్పాటు చేసిన ఐపీఎస్‌‌ఓఎస్ ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో సుమారు 22 వేల మంది కన్జూమర్లు, 4 వేల మంది బిజినెస్‌‌ రెస్పాండెంట్లపై ఈ సర్వే చేపట్టారు. దీనిలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. ఇండియా ఎం కామర్స్‌‌ను అంది పుచ్చు కోవడంలో ముందంజలో ఉందని పేర్కొంది. డిమాండ్‌‌ను అందు కోవడానికి 81 శాతం మర్చంట్లు మొబైల్ పేమెంట్లను యాక్సప్ట్‌‌ చేస్తున్నారని పేపాల్ రిపోర్టు చెప్పింది. గ్లోబల్‌‌గా మాత్రం సగటున 63 శాతం మంది మర్చంట్లు మాత్రమే మొబైల్ పేమెంట్లను యాక్సప్ట్ చేస్తున్నారని పేర్కొంది.

ఎం కామర్స్‌‌లో యాప్స్‌‌ చాలా పాపులర్ సాధించాయని, 98 శాతం మంది ఇండియన్ మొబైల్ షాపర్లు యాప్స్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారని చెప్పింది. గ్లోబల్‌‌గా ఈ పర్సంటేజ్ 90 శాతంగా ఉందని పేపాల్ వివరించింది. యాప్‌‌ లలో బిల్లు పేమెంట్లు, ఫ్యాషన్ కీలక రంగాలుగా ఉన్నట్టు  పేర్కొంది. సమయం ఆదా, తేలిక లావాదేవీలు, మొబైల్ కామర్స్‌‌కు కీలకంగా ఉంటున్నాయని తెలిపింది. ఇండియాలో సోషల్ కామర్స్ అడాప్షన్ కూడా పెరుగుతోందని రిపోర్టు తెలిపింది. గత ఆరు నెలల్లో 57 శాతం కొనుగోళ్లు సోషల్ కామర్స్ ద్వారా జరిగాయని పేర్కొంది. సోషల్ కామర్స్ కొనుగోళ్లలో యంగర్ జనరేషన్ ముందంజలో ఉంది. రాబోయే కాలంలో ప్రపంచం ఇందులోనే జీవిస్తుందన్న మాట.

కామెంట్‌లు