పోస్ట్‌లు

ఆగస్టు 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

లోకల్ పాలనకే పవర్స్ .. అధికారాల బదలాయింపు..త్వరలో ఖాళీల భర్తీ..!

చిత్రం
పల్లెల్లో పాలనకు పూర్తి పవర్స్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు . అంతే కాకుండా అధికారాల బదలాయింపు పూర్తిగా అప్పగిస్తామని పేర్కొన్నారు . నిధులు మంజూరు, పోస్టుల కుదింపు , విధులు , బాధ్యతలు కూడా తేల్చుతామని స్పష్టం చేసారు . గ్రామ పంచాయతీలు , జిల్లా పరిషత్ లు , మండల పరిషత్ లు నామ్ కె వాస్తేగా ఉన్నాయని, , వాటిని ప్రక్షాళన చేస్తే  కానీ పాలన గాడిన పడదని అందుకే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏయే పోస్టుల్లో ఎవరెవరు ఉండాలి , వారికి ఎలాంటి భాద్యతలు ఉండాలో కూడా నిర్ణయమిస్తామని తెలిపారు .  కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ చట్టం వల్ల గ్రామాలు , మండలాలు , జిల్లా పరిషత్ లు మరింత బలోపేతం అవుతాయని కేసీఆర్ చెప్పారు .దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తి పారదర్శకత ఉండటం వల్ల పని చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు , సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేవో చూసేందుకు మానిటరింగ్ వ్యవస్థ  చూసుకుంటుందన్నారు. ఈ మేరకు 60 రోజుల పాటు కొత్తగా కార్యాచరణ ప్రణాలికను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల...

ముంచుకొస్తున్న ఉపద్రవం ..భయపడుతున్న మార్కెట్ రంగం

చిత్రం
భారతీయ వ్యాపార రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్న రిలయన్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ఆదాయంలో పరుగులు తీస్తూనే ఉన్నా .. దాంతో పాటే అప్పులు కూడా పెరుగుతూ వస్తున్నాయి . టెలికం రంగంలో నంబర్ వన్ లో ఉన్న ఈ కంపెనీకి మిగతా రంగాలలో అంత గా వర్కవుట్ కాలేదన్నది మార్కెట్ వర్గాల అంచనా. ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీ లు రెండు వర్గాలుగు విడిపోయారు. ఇప్పుడు ఇండియాలో ముఖేష్ ఆధ్వర్యంలోని రిలయన్స్ కంపెనీయే తన హవాను కొనసాగిస్తోంది. దేశంలో అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్తగా ముకేశ్ అంబానీ పేరు పొందారు . ఆ మేరకు ఆయన తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు . కొత్త ప్రాజెక్ట్ లతో ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్ ను షేక్ చేస్తున్నారు . అయితే ఇటీవల భారత్ లో కంపెనీలు , వాటి యజమానులు వాటిని నిర్వహణ భారం ఎక్కువ కావడంతో లెక్కకు మించి అప్పులు చేస్తున్నారు . అవి తడిసి మోపెడవుతున్నాయి . తాజాగా కర్ణాటకలో కింగ్ మేకర్ గా ఉన్న సిద్దార్థ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు .ఇంకో వైపు విజయ్ మాల్యా ఇండియాకు రావాలంటే జంకుతున్నారు . ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది . మోదీ కొలువు తీరాక భారత ఆర్ధిక పరిస్థితి రెంటికి చెందిన రేవడి లా తయారైంది . తాజాగా ముకేశ్ ఆధ్వర్య...

పోటెత్తునున్న వరదలు..పొంగుతున్న నదులు..నిండుకుండలా ప్రాజెక్టులు

చిత్రం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు జనం విలవిలలాడి పోతున్నారు. భారీగా వస్తున్న వరద నీటికి ప్రాజెక్టులు జలకళను సంతరించు కున్నాయి . తుంగభద్ర ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది జూరాల ప్రాజెక్ట్ ఇప్పటికే నిండి పోయింది . దీంతో నీటిని దిగువకు వదిలారు . మరో వైపు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది . భద్రాచలం వద్ద రెండో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. కృష్ణమ్మ నీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పోయింది . నాలుగు గేట్లను తెరిచారు . అక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. నాగార్జున సాగర్ కు నీళ్లు ప్రవహిస్తున్నాయి . అది కూడా రెండు మూడు రోజుల్లో నిండుకునే వీలుంది . తెలంగాణ, ఏపీలలో విస్తారంగా వర్షాలు కురిశాయి . ఇంకొన్ని చోట్ల వానలు పడుతున్నాయి . ఇక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు ఉత్తరాదిన నదులు పొంగి పొర్లుతున్నాయి. అకాల వర్షాల దెబ్బకు దేశ వ్యాప్తంగా 50 మందికి పైగా మృతి చెందారు. మరి కొన్ని చోట్ల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది . ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది . ఆల్మట్టి , నారాయణపూర్ ల నుండి జూరాల ప్రాజెక్ట్ కు 6 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చ...

ఎన్నికలకు ఎప్పుడైనా రెడీ..పాగా కోసం బీజేపీ పక్కా స్కెచ్

చిత్రం
ఇండియాలో ఇప్పుడు బీజీపీ హవా నడుస్తోంది . ఆ పార్టీ ఇప్పుడు ఏది అనుకుంటే అది అవుతోంది. ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా కొలు తీరారో ఇక అప్పటినుంచి తమ ప్రణాళికలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇందు కోసం వారికి ఏ పార్టీ పైన గానీ లేక ఇంకెవ్వరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు . ఎందుకంటె గత లోకసభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  ఇప్పటికే పలు రాష్ట్రాలలో కాశ్య జెండాను ఎగుర వేశారు. దీనికి మోదీ , షా లా పక్కా ప్లాన్ సక్సెస్ అయ్యింది . రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వన్ నేషన్ వన్ పార్టీ ..వన్ కంట్రీ అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. తాజాగా సౌత్ లో కీలకంగా ఉన్న కర్ణాకటలో సంకీర్ణ సర్కార్ కు చెక్ పెట్టింది బీజీపీ . దేశ వ్యాప్తంగా కమలాన్ని వికసింప చేయల్లన్న టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు మోదీ అండ్ షా . దేశ ఆర్ధిక రంగాన్ని శాసించే మహారాష్ట్రలో బీజేపీ , శివసేన కలిసి సర్కార్ ను ఏర్పాటు చేశాయి . ఇప్పుడు ఆ రాష్ట్రంలో స్వంతంగా అధికారం లోకి రావాలని స్కెచ్ వేసింది . మరోసారి పవర్ లోకి రావాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు...

పార్టీకి పట్టం ..అమ్మకే అందలం

చిత్రం
ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకీ సోనియా గాంధీనే దిక్కయ్యింది. నిన్నటి దాకా తమ కుటుంబీకులు ఎవ్వరూ పార్టీ పగ్గాలు తీసుకునే పరిస్థితుల్లో లేమంటూ తల్లీ , కొడుకు , కూతురు స్పష్టం చేసారు. ఆమె గతంలో అదే పార్టీకి పూర్తిగా బాధ్యతలు చేపట్టారు. వయసు మీద పడటం, భాద్యతలు పెరగడంతో ఆమె అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు . తన కుమారుడు రాహుల్ గాంధీకి పదవిని కట్టబెట్టారు .రాహుల్ హయాంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వస్తారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. ఏకంగా పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాను సైతం అందుకోలేక పోయింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు .ఆయన నిర్ణయాన్ని తాము ఒప్పుకోబోమంటూ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు , సీనియర్లు స్పష్టం చేశారు. సోనియా కుటుంబం నుంచి రాహుల్ గాంధీ కాకపోయినా కనీసం ప్రియాంకా గాంధీ కి పగ్గాలు ఇవ్వాలని మరి కొంత మంది కోరారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమెధీలో రాహుల్ ఒడి పోగా . యూపీలో ప్రియాంక గాంధీ స్వతహాగా ప్రచారం చేసినా ఫలితం...