పోస్ట్‌లు

అక్టోబర్ 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ట్రబుల్ షూటర్ కు సోనియా పరామర్శ

చిత్రం
దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన ఈ పార్టీకి చెందిన అతిరథ మహారథులు, దిగ్గజ నాయకులు ఒక్కరొక్కరు పార్టీని వీడడమో లేదా అరెస్టులు కావడమో జరుగుతోంది. పార్టీని ఒకే తాటిపైకి తీసుకు రాగలిగే నాయకత్వ లేమి కొరవడింది. దేశ మంతటా కాషాయ జెండాలు రెపరెప లాడుతున్నాయి. మోడీ చరిష్మా ముందు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల ఇమేజ్ ఏ మాత్రం పని చేయడం లేదు. ఇప్పటికే రెండు మూడు చోట్ల తప్పా ఎక్కడా కాంగ్రెస్ పవర్ లో ఉన్న దాఖలాలు లేవు. రాహుల్ గాంధీ తోనైనా కాంగ్రెస్ గట్టెక్కుతుందనుకుంటే ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది. ఇక కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోయింది ఆ పార్టీ. ఊహించని ఓటమితో రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసే పనిలో పడ్డారు. పార్టీ పరంగా వత్తిళ్లు రావడంతో తన మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని తల్లి సోనియా గాంధీ కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో అదును...

ఇన్ఫోసిస్ మరో సత్యం కానున్నదా..?

చిత్రం
నిన్నటి దాకా ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో ఉన్న బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ మరో సత్యం కంపెనీ కానున్నదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఐటీ రంగ నిపుణులు. గత ఆరేళ్లలో మొదటిసారిగా ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ పడిపోయాయి. సీఈవో, సీఎఫ్‌వోలపై సిబ్బంది తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఈవో సలిల్‌ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు కుదేలైంది. ఏకంగా 16 శాతం పతనమైంది. మరోవైపు స్వల్ప కాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపించేందుకు ఖాతాలు గోల్‌మాల్‌ చేయిస్తున్నారని, సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని స్పష్టం చేశారు. అంతర్గత ఆడిటర్లు ఈవైతో ఆడిట్‌ కమిటీ సంప్రతింపులు జరుపుతోందని, స్వతంత్ర విచారణ కోసం న్యాయ సేవల సంస్థ శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కోని నియమించు కున్నామని నీలేకని తెలిపారు. సంస్థలో అనైతిక విధానాల పేరిట ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ఒక బోర్డు సభ్యుడికి గుర్తు త...

టాప్ పొజిషన్ లో ఐఐటి బాంబే

చిత్రం
ఓ వైపు ఆర్ధిక మాంద్యంతో తల్లడిల్లుతున్న భారత్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు ఉన్నత విద్యను అందించడంలో ఆయా విశ్వ విద్యాలయాలతో పాటు ఐఐటీలు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆసక్తికరమైన ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీలు ప్రపంచ దేశాలను విస్తు పోయేలా చేస్తున్నాయి. నాణ్యమైన విద్యను బోధించడంలోనూ, వసతి సౌకర్యాలను కల్పించడం లోనూ అన్నిటికంటే ముందంజలో ఉన్నాయి. ఈ ఐఐటీలతో పాటు యూనివర్సిటీస్ కూడా తామేమి తీసి పోమంటూ విద్యా అభివుద్దిలో దూసుకు పోతున్నాయి. వీటిలో చదివిన విద్యార్థులకు భారీ ప్యాకేజీలు ఇస్తూ నియమించుకుంటున్నాయి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు. ఇదిలా ఉండగా కోర్సులు పూర్తి కాకుండానే ఆయా ఇన్సిట్యూట్స్ దగ్గరకు వెళ్లి క్యాంపస్ సెలెక్షన్స్ చేసుకుంటున్నాయి. యూనివర్సిటీల మాటేమిటో కానీ ఇండియాలోని ఐఐటీలకు ఎనలేని డిమాండు ఉంటోంది. ఇందులో సీట్స్ రావాలంటే భారీగా ఖర్చు చేయడంతో పాటు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ చదువుకున్న వారు దేశాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకుంటున్నారు. కోట్లాది మందిని ప్రభావితం చేసేలా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. కాగా 2020 సంవత్సరానికి గాను క్యూఎస్‌ ఇండియా యూనివర్సిటీ ...

మేం క్షేమం..అజ్ఞాతంలో లేం

చిత్రం
కల్కి పేరుతో కలియుగంలో వెలసిన దేవుళ్లుగా ప్రచారం చేసుకుంటూ భక్తుల బలహీనతలు క్యాష్ చేసుకుంటూ కోట్లాది రూపాయలతో పాటు లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టి, ఆశ్రమాల పేరుతో అడ్డగోలు దందా చేపట్టిన ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. తాజాగా ఏకకాలంలో కల్కి ఆశ్రమాలపై ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. కోట్లాది రూపాయల నోట్ల కట్టలు, ఫారిన్ కరెన్సీ, కేజీల కొద్దీ ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్స్ బయట పడ్డాయి. ఐటీ శాఖకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించక పోవడం, సమర్పించిన వాటిలో తేడాలు రావడంతో ఐటీ రంగంలోకి దిగింది. వారు విస్తు పోయేలా ఆశ్రమాలలో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు, విలువైన వస్తువులు దొరికాయి. తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వీరు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం ఓ వీడియోను విడుదల చేసింది. తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయ్‌కుమార్‌ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లి పోయామంటూ కథనాలు వస్తున్నాయని, కానీ, తాము వెళ్లలేదని, ఇక్కడే హాయిగా ఉన్నామంటూ వదంతులు నమ్మ వద్దని కోరారు. అయితే కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాల...

జూరాల గల గల .. శ్రీశైలం కళ కళ

చిత్రం
మహారాష్ట్ర, కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాల దెబ్బకు వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న. నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు రాగా.. అధికారులు 25 గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని వదిలారు. మరో వైపు తుంగభద్ర లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,45,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువ నదిలోకి 1,56,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.  కృష్ణానదికి ఉప నది అయిన కర్ణాటక లోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు కాగా ఎగువ నుంచి 1,44,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 33 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా స్టేజీ–1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల కుడి ప్రధాన కాల్వకు 822,...

బెయిల్ వచ్చినా జైలుకే

చిత్రం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పటి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కు కాలం కలిసి రావడం లేదు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు చిదంబరం హల్ చల్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు తీరడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. మోడీ, అమిత్ షా లు ఇప్పుడు ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నారు. దేశమంతటా కాషాయ జెండా ఎగరాలని, ఆ దిశగా పావులు కదుపుతున్నారు. తమకు అడ్డు వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. అంతే కాకుండా ఆయా నాయకుల ఆర్ధిక మూలాల మీద దెబ్బకొడుతూ కోలుకోలేకుండా చేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్న ప్రతి పార్టీపై వీరిరువురు కన్నేసి ఉంచారు. ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే అమిత్ షా ఎంటర్ కావడం, ఆపై ఐటీ దాడి చేయడం, అనంతరం సీబీఐ రంగం లోకి దిగడం జరుగుతోంది. దీంతో విపక్షాలకు వాయిస్ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ను టార్గెట్ చేశారు. రేపో మాపో ఆయన కూడా జైలుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగిలి ఉన్నది నారా చంద్ర బాబు నాయుడు, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో కీలకమైన రాజకీయ వేత్తగా, ...

ఇక మాటల్లేవ్ ..మాట్లాడు కోవడాల్లేవ్

చిత్రం
కార్మికులు తమంతకు తామే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు. ఇక వారితో మాటల్లేవ్ ...మాట్లాడు కోవడాలు లేవు. ఉన్నదల్లా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేయడం, కొత్త వారిని నియమించు కోవడం మాత్రమే మిగిలి ఉంది. డోంట్ కేర్. జీతాలు ఇచ్చే సంస్థపై పోరాటమా, వారు అడిగినవన్నీ చేశాం. ఇక ఎలాంటి పరిస్థితుల్లో వారిని తీసుబోమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ . విలీనం డిమాండును వారే వదులుకున్నారు. ఇక వారితో చర్చలు ఎందుకు జరపాలంటూ ప్రశ్నించారు. రవాణా శాఖపై సమీక్ష చేపట్టారు. వెయ్యి అద్దె బస్సులకు నోటిఫికేషన్‌ వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులు కున్నందున, దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని సీఎం తేల్చి చెప్పారు. ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక...

జగమీత్ కింగ్ మేకర్..ట్రూడో కే ఛాన్స్

చిత్రం
కెనడాలో లిబరల్ పార్టీ అతి కష్టం మీద మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ప్రవాస భారతీయుడైన జగ్మీత్‌ సింగ్ ఇప్పుడు కీలకంగా మారారు. అయన సపోర్ట్ ఇవ్వకపోతే ట్రూడో ఎన్నిక కష్టమవుతుంది. అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్‌ డిస్ర్టిక్ట్స్ కు గానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ 121లో గెలిచింది. దీంతో ఇతరుల మద్దతుతో లిబరల్‌ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇండియన్‌ కెనడియన్‌ అయిన జగీ్మత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్‌ పార్టీ 24 సీట్లు గెలుచుకుని ‘కింగ్‌ మేకర్‌’గా అవతరించింది. అయితే, 2015 నాటి ఎన్నికల కన్నా ఈ సారి ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య తగ్గింది. ఆ ఎన్నికల్లో ఎన్‌డీపీ 44 సీట్లు గెల్చుకుంది. బ్లాక్‌ క్యూబెకాయిస్‌ 32, గ్రీన్‌ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి. బ్లాక్‌ క్యూ బెకాయిస్, గ్రీన్‌ పార్టీ ట్రూడో ప్రభుత్వంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్ప...

బెట్టు వీడండి ..మెట్టు దిగండి..తగ్గితే తప్పేమిటి..హైకోర్టు

చిత్రం
గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయినా చర్చలకు పిలవాల్సింది పోయి, సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. ఇరువురూ మెట్టు దిగడం లేదు. ఓ వైపు కార్మికులు ఇంకో వైపు ప్రభుత్వం మధ్య ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ఇరువురికి తెలుసు. కార్మికులు సమ్మె చేయడం అన్నది వారి హక్కు. కాదనలేం. సెల్ఫ్ డిస్మిస్ అన్న పదం ఏ డిక్షనరీలో లేదు. చేసిన పనికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో ఎండీని నియమించలేదు. ఇంకో వైపున ప్రైవేట్ వాహనాల కోసం టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇదెలా సాధ్యమని కోర్టు ఆర్టీసీ సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా ఎంత కాలం జరుగుతుంది. దీనికి పరిషాకారం మార్గం చూపించాల్సింది ప్రభుత్వమే. ప్రజలు మౌనంగా ఉన్నారని అనుకుంటే పొరపాటే. వారి ఆగ్రహం మంచిది కాదు. దీనిపై దృష్టి సారించి, కార్మికులతో చర్చలు జరపండి. ఇరు వర్గాలు పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించాలని, ఇద్దరూ ఒక మెట్టు దిగాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలని, చర్చల ద్వారానే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని పేర్కొంది. ఆర్టీసీ స...

సంస్కరణలకు శ్రీకారం..సామాన్యులకు అందలం

చిత్రం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమూలమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రాజకీయాలకు, బడా బాబులకు, డబ్బున్న మారాజులకు, పొలిటికల్ లీడర్లు, వీఐపీలకు పెద్దపీట వేస్తూ ..అడుగులకు మడుగులు వత్తుతూ తిరుమలను భ్రష్టు పట్టించారు.ఇదే సమయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక వీటన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి తో పాటు పూర్తి పాలక మండలిని నియమించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం విఐపీలకంటే సామాన్యులకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే ప్రక్షాళన షురూ అయ్యింది. సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. వారికి పార దర్శకంగా గదులు కేటాయిస్తోంది. గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో ఉచితంగా లాకర్‌ సౌకర్యం కల్పిస్తోంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల అందు బాటులోకి పద్మనాభ నిలయంతో కలిపి మొత్తం 5 యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. యాత్రికులు తమ సామగ్రిని ఇందులో భద్ర పరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లి రావచ్చు. తలనీలాల సమర్పణకు మినీ కల్యాణకట్ట, మరుగుదొడ్లు, స్నానపు గదులు, జల ప్రసాదం, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు ఉన...

దుమ్ము రేపుతున్న రాములో రాములా

చిత్రం
మాటల మాంత్రికుడు, సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో..సినిమాకు సంబంధించి రెండో సాంగ్ టీజర్ ను చిత్ర బృందంవిడుదల చేశారు. మొదటి సాంగ్ ను సిరివెన్నెల రాయగా అది యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇక త్రివిక్రమ్, బన్నీ ల కాంబినేషన్స్ లలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. బ్లాక్ బ్లస్టర్ గా నిలిచాయి. మరోసారి వీరిద్దరూ కలిసి ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలని బన్నీ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్‌, బన్నీ డైలాగ్స్ , ఫస్ట్ సాంగ్‌ హిట్‌ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్‌ సంగీతం అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాసర్ల శ్యామ్‌ దీనిని రాశారు. ఇక ఈ పాట కూడా మాస్‌ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన త...

మోదీ అద్భుతం..ఆలోచనలు ఆచరణీయం

చిత్రం
భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై ప్రపంచ మంతటా ప్రసంశలు కురుస్తున్నాయి. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు పలు అంశాలు, సమస్యలపై చర్చించారు. మోదీ ఆలోచనలు అద్భుతం అని అభిజిత్ ప్రసంశలతో ముంచెత్తారు. ప్రధాన మంత్రి భారత దేశం గురించి ఆలోచిస్తున్న తీరు అద్వితీయమని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. మోదీతో సమావేశ మైనందుకు చాలా సంతోషంగా ఉందని అభిజిత్ పేర్కొన్నారు. పీఎం తనతో మాట్లాడటానికి చాలా సమయం కేటాయించారన్నారు. అపూర్వమైన భారత దేశం గురించి తన ఆలోచనా తీరును ఆయన వివరించారని చెప్పారు. విధానాల గురించి వినేవాళ్ళు ఉంటారని, కానీ వాటి వెనుక ఉన్న ఆలోచనల గురించి వినేవాళ్ళు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ప్రధానంగా పరిపాలన గురించి మాట్లాడారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఉండే అపనమ్మకం పరిపాలనపై ఎలా పడుతుందో వివరించారని తెలిపారు. కాబట్టి పరిపాలన ప్రక్రియపై ఉన్నత వర్గాల నియంత్రణ వ్యవస్థలను సృష్టిస్తుందని, బాధ్యతా యుతమైన ప్రభుత్వాన్ని కాదని తెలిపారు. ఈ ప్రక్రియలో తాను బ్యూరోక్రసీని ఏ విధంగా స...

అశ్వత్థామ..ఆర్టీసీ ఆర్మీ

చిత్రం
ఎవరీ అశ్వత్థామ రెడ్డి. నిన్న మొన్నటి దాకా కేవలం ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల నాయకుడు. వృత్తి రీత్యా డ్రైవర్ . కానీ ఇప్పుడు తెలంగాణాలో విస్మరించలేని నాయకుడుగా ఎదిగాడు. అంతే కాకుండా వేలాది మంది కార్మికుల న్యాయపరమైన హక్కుల సాధన కోసం ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఢీకొంటున్నాడు. మొత్తం తెలంగాణాలో ఇప్పుడు టాప్ లీడర్లలో అశ్వత్థామ రెడ్డి ఒకరుగా నిలిచారు. గూగుల్ సర్చింగ్ లో సైతం మనోడి గురించే అధికంగా వెతుకుతున్నారు. ఇవ్వాళ తెలంగాణాలో నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్నా కొంత మంది మాత్రమే నోరు మెదుపుతున్నారే తప్పా కేసీఆర్ తో నేరుగా ఢీకొనే స్థాయిలో లేరు. అయితే పోరాటానికి పెట్టింది పేరైన పాలమూరు జిల్లాకు చెందిన వారే కేసీర్ ను ఢీకొనడం యాదృచ్చికం అనుకోవాలి. ప్రస్తుతం ఢీ అంటే ఢీ అంటూ ఇటు రాష్ట్రంలో అటు దేశంలో సెన్సేషన్ లీడర్లుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. మోస్ట్ పాపులర్ లీడర్లుగా పేరొందిన వారిలో మొదటగా చెప్పు కోవాల్సింది రావుల చంద్ర శేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ భారత సింహ్మా రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి, థల్లోజు...