పోస్ట్‌లు

డిసెంబర్ 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

గూగుల్ సెన్సేషనల్

చిత్రం
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మరోసారి జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎక్కువ శాతం గూగుల్ క్రియేట్ చేసిన క్రోమ్ ను వాడుతున్నారు. లక్షల్లో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఏకంగా ప్రతి రోజు ట్రిలియన్స్ లలో ఉంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఐటీ కంపెనీ తాజాగా గూగుల్‌ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్‌ ను ప్రవేశ పెట్టింది. ఇక నుంచి గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ అందరికీ  అందుబాటులో రానుంది. ఈ రియల్‌ టైమ్‌ ట్రాన్సలేషన్‌ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్‌ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతో హెల్ప్‌ ఫుల్‌గా ఉండ నుంది. ఈ ఏడాది కన్జుమర్‌ ఎలక్ట్రానిక్‌ షో లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ గురిం...

మదుపరులకు భలే లాభం

చిత్రం
భారతీయ మార్కెట్ లో మదుపరులకు భలే ఛాన్స్ దక్కనుంది. ఏ మేరకు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ను స్టార్ట్ చేసింది. కానీ కొద్దీ కాలం పాటే ఈ అవకాశం అందుబాటులో ఉండడం మాత్రం ఇబ్బందికరం. ఎలాంటి రిస్క్‌ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఈ ఇష్యూను పరిశీలించొచ్చు. దీని ద్వారా కనీసం  7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇండియాలో ఇదే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌   అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ డెట్‌ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్‌ ఈటీఎఫ్‌ను అందించడం. ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఈటీఎఫ్‌లు పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్‌ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్‌కు అనుగుణంగానే ఉంటాయి. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సంబంధించి భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌   2023 - 2030 సూచీలను ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసింది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూ...

ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు

చిత్రం
తాను దమ్మున్న నాయకుడినని ప్రూవ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. గత కొన్నేళ్లుగా వెట్టి చాకిరీ చేస్తూ, ఉద్యోగ భద్రత అంటూ లేకుండా నానా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు కొండంత భరోసా ఇచ్చారు. అంతే కాదు మీకందరికీ తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని వంద శాతం నెరవేర్చాడు. ఇక ఏపీఎస్ ఆర్టీసీ లో పని చేస్తున్న 52 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. జగన్ జగ మొండి..తాను మాట ఇచ్చాడంటే చాలు ఇక వెనుదిరిగి తీసుకోవడం అంటూ జరగదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళ్లడమే. ఏకంగా అసెంబ్లీలో ఆర్టీసీని విలీనం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి సభ సాక్షిగా ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఇక నుంచి ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ. ఇందులో పని చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులే. వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మీరంతా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధం కావాలి. ఆర్టీసీని ఆదాయం గడించే సంస్థగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు....