పోస్ట్‌లు

జూన్ 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇంజ‌నీరింగ్ వేస్ట్..ప‌కోడీ బిజినెస్ బెస్ట్

చిత్రం
ప్ర‌తి ఒక్క స్టూడెంట్ క‌ల ఇంజ‌నీరింగ్ ప్రొఫెష‌న‌ల్ కావ‌డం. ఐపీ ఎక్స్‌ప‌ర్ట్స్‌గా కోట్లాది రూపాయ‌లు సంపాదించాల‌ని క‌ల‌లు కంటారు. ఆ దిశ‌గా రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తారు. ల‌క్ష‌లు వెచ్చించి కోచింగ్ సెంట‌ర్లు, కాలేజీ క్యాంప‌స్‌ల‌లో కుస్తీలు ప‌డుతుంటారు. ఐటీ పుణ్య‌మా అంటూ ఇండియా వ్యాప్తంగా య‌మ క్రేజ్ పెరిగింది ఈ కోర్సుల‌కు. ఆల్ ఇండియాలో ఆయా ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు ఎన‌లేని డిమాండ్. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ ఐ టీలు, త్రిబుల్ ఐటీలు, ఐఐటీహెచ్‌ల‌కు ప్ర‌యారిటీ ఎక్కువ‌. ఎందుకంటే వీటిల్లో సీటు దొర‌కితే చాలు ఇక లైఫ్ లో బోర్ అంటూ ఉండ‌దు..ఫుల్ ఎంజాయ్. నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. మూడో ఏట‌నే కంపెనీలు వ‌చ్చి వాలిపోతాయి. జెమ్స్ లాంటి కుర్రాల‌ను ఎంపిక చేసుకుంటాయి. వారికి బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తాయి. అందుకే వాటిపై అంత మోజు. ఇంజ‌నీరింగ్ సీటు వ‌చ్చిందంటే ఓ యుద్ధం చేసిన‌ట్లు లెక్క‌. ఎక్క‌డలేనంత‌టి ఆనందం కూడా. కానీ ఇది మాత్రం డిఫెరెంట్ స్టోరీ. ఎవ‌రైనా గేట్ లో ర్యాంక్ వ‌స్తే అదే చాల‌నుకుంటారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ కుర్రాడు సాగ‌ర్ మాత్రం ఇంజ‌నీరింగ్ చేసే కంటే రోడ్డుపై ప‌కోడీ వ్యాపారం బ...

తాగినోళ్ల‌కు తాగినంత..తెలంగాణ‌లో మ‌స్తు మ‌జా

చిత్రం
పోరాటాలు, త్యాగాలు, బ‌లిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ‌లో మ‌స్తుగ తాగుతున్న‌రు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్న‌రు. ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ..ఎప్పుడు ప‌డితే అప్పుడు మ‌ద్యం షాపులు ఉండ‌డంతో ఖ‌ర్చు పెడుతున్న‌రు. తాగొచ్చి భార్య‌ల‌ను దంచుతున్న‌రు. రోడ్ల మీద‌నే ప‌డి పోతున్న‌రు. ఇంకేం స‌ర్కార్‌కు ఆదాయం రాబ‌ట్టే. జ‌నమేమో ద‌వ‌ఖానాల ప‌డ‌వ‌ట్టిరి. అయినా సోయి లేకుండా తాగొస్తుండ‌డంతో మ‌హిళ‌లు ల‌బోదిబోమంటున్న‌రు. గల్లీ గ‌ల్లీకి ఓ దుకాణం ద‌ర్శ‌న‌మిస్తోంది. పొద్దున‌..రాత్రి దాకా బార్లా తెర‌వ‌డంతో బాటిళ్లే బాటిళ్లు ప‌గులుతున్న‌యి. బీర్లు, బ్రాందీలు, విస్కీలు, వోడ్కాలు , క‌ల్లు మ‌స్తుగ దొరుకుతుంది. ఇంత‌కు ముందైతే నిబంధ‌న‌లుండేవి. ఇపుడు అది కూడా ఎత్తేసిండ్రు. మందు బాబుల పంట పండుతోంది. పండ్లు తోమకుండానే దుకాణాల సంది తిరుగుతున్న‌రు. ఫుల్‌గా తాగి జై కేసీఆర్ అంటున్న‌రు. సార‌మ్మ సార‌..నా పాణ‌మైతివి అంటూ పాడుతున్న‌రు. ఇరు రాష్టాల్లో తాగేందుకు నీళ్లు దొరుక‌త‌లేవు..సాగు చేద్దామంటే చుక్క నీరందుత లేదు. కానీ మ‌ద్యం మాత్రం కావాల్సినంత ..ఎంత తాగితే అంత స్టాకు ఉంటోంది. వ‌ళ్లు గుళ్ల‌యినా ప‌ట్టించుకుంట లేరు. తాగి ప‌డిప...

అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుకు ఎన‌లేని డిమాండ్ - భారీ ఎత్తున ఫీజుల మోత

చిత్రం
వ్య‌వ‌సాయం దండుగ కాదు పండుగ అంటూ ఏనాడైతే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించాడో అప్ప‌టి నుంచి ప్ర‌తి ఒక్క‌రు అగ్రిక‌ల్చ‌ర్ జ‌పం చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రు అగ్రిక‌ల్చ‌ర్ ఫార్మింగ్, టిష్యూ క‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్, నేచుర‌ల్ ఫార్మింగ్, పండ్ల తోట‌లు, అగ్రి బిజినెస్ అంటూ ఫోటోల‌కు ఫోజులిస్తున్నారు. మ‌రో వైపు మ‌హేష్ బాబు తాజా సినిమాలు వ్య‌వ‌సాయం ప్ర‌ధానంగా బేస్ చేసుకుని తీయ‌డంతో జ‌న‌మంతా ఆ వైపు చూస్తున్నారు. అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీ కొత్త కోర్సుల‌కు శ్రీ‌కారం చుడుతోంది. ఎక్క‌డ‌లేని డిమాండ్ ఉంటోంది. పొద్ద‌స్త‌మానం భూమినే న‌మ్ముకుని కొన్నేళ్లుగా సాగు చేసుకునే రైతుల గోస ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. రైతు బంధు ప‌థ‌కం పేరుతో బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తున్నా..ఆ డ‌బ్బుల‌న్నీ తాగేందుకే ఖ‌ర్చు చేస్తున్నారు. సాగును ప‌క్క‌న పెట్టారు. ఇక జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీలో ఫ‌స్ట్ టైమ్ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సును ఇంట్ర‌డ్యూస్ చేస్తోంది. ఈ ఏడాది నుంచే ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. ఎంసెట్ ర్యాంకుల ద్వారా 75 సీట్లు భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్ర‌వాస భార‌తీయుల కోటాలో 25 సీట్లు కేటాయించార...

రాజ‌గోపాల్‌రెడ్డి సంచ‌ల‌నం - కాంగ్రెస్ లో క‌ల‌క‌లం

చిత్రం
తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఎప్పుడూ రాజుకుంటూనే వుంటాయి. ఇక్క‌డి జ‌నాల‌కు చైత‌న్యం ఎక్కువ‌. అందుకే ఎవ‌రు మాట్లాడినా అది వైర‌ల్ అవుతూనే వుంటుంది. ఏపీ, టీఎస్ పాలిటిక్స్‌లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్, జేసీల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ వుంది. న‌ల్ల‌గొండ జిల్లాలో అన్న‌ద‌మ్ములిద్ద‌రికి మంచి ప‌ట్టుంది. ప్ర‌జ‌ల మ‌ధ్య వీరిద్ద‌రూ ఎక్కువ‌గా వుండ‌డం ప్ల‌స్ పాయింట్. ఈసారి సీన్ రివ‌ర్స్ అయింది. త‌మ్ముడు ఎంపీగా గెలిస్తే..అన్న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. తాజాగా అన్న రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇంఛార్జ్ తో పాటు రాష్ట్ర బాధ్య‌త‌లు చూస్తున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ పై పార్టీ ప‌రంగా తీవ్ర చ‌ర్చ‌లు జ‌రిగాయి. మ‌రో వైపు పార్టీ హై క‌మాండ్ వేచి చూసే ధోర‌ణి అవ‌లంభిస్తోంది.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌ని, దానికి సరైన నాయ‌క‌త్వం లేద‌ని, అందువ‌ల్ల‌నే ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓట‌మి కొనితెచ్చుకుందని వ్యాఖ్యానించారు. రాజ‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా కొంద‌రు నిలిస్తే మ‌రికొంద‌ర...

పాకిస్తాన్‌కు ఝ‌ల‌కిచ్చిన భార‌త్ - కొన‌సాగిన విజ‌య ప‌రంప‌ర

చిత్రం
కోట్లాది భార‌తీయుల ఆశ‌ల‌ను స‌జీవంగా వుండేలా చేసింది విరాట్ నాయ‌క‌త్వంలోని ఇండియా జ‌ట్టు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూసిన పాకిస్తాన్, ఇండియాల మ‌ధ్య జ‌రిగిన హోరా హోరీ పోరులో అంద‌రూ అనుకున్న‌ట్టుగా గానే భార‌త క్రికెట‌ర్లు చెమ‌టోడ్చారు. అద్భుత విజ‌యాన్ని స్వంతం చేసుకున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని మిగిల్చారు. పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌పంచ క్రికెట్ టోర్న‌మెంట‌ల‌లో పాక్‌పై ఓట‌మి అన్న‌ది ఎరుగ‌కుండా విజ‌యం సాధించ‌డం మామూలై పోయింది. ఇలా వ‌రుస‌గా గెలుపొంద‌డంతో అరుదైన రికార్డు భార‌త్ జ‌ట్టు పేరిట న‌మోదైంది.  శిఖ‌ర్ ధావ‌న్ గాయం కార‌ణంగా అర్ధాంత‌రంగా వైదొల‌గినా అతడి స్థానంలో ఓపెన‌ర్ గా కెఎల్ రాహుల్ సంయ‌మ‌నం కోల్పోకుండా ఆడాడు. ప‌టిష్ట‌మైన స్థితికి జ‌ట్టును చేర్చాడు. రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి భారీ స్కోరు సాధించేందుకు దోహ‌ద ప‌డ్డాడు.టోర్నీలో త‌న‌కు ఎదురే లేద‌ని మ‌రోసారి నిరూపించుకుంది కోహ్లి సేన‌. వైస్ కెప్ట‌న్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఫామ్ ప్ర‌ద‌ర్శించాడు. సూప‌ర్ సెంచ‌రీ సాధించి కీల‌క పాత్ర పోషించాడు. మ‌రో వైపు ఇండియ‌న...

ఐపాక్‌తో బాబు డీల్ ఓకేనా..?

చిత్రం
అపర చాణుక్యుడిగా, అపార‌మైన అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ‌వేత్త‌గా, నాయ‌కుడిగా నారా చంద్ర‌బాబు నాయుడుకు పేరుంది. తొమ్మిదేళ్ల పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. హైద‌రాబాద్‌ను ఐటీ ప‌రంగా ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెట్టిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే. మొద‌ట్లో తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర ప‌డిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత ఉద్య‌మాలు, పోరాటాల దెబ్బ‌కు దిగివ‌చ్చారు. స్వంతంగా కేంద్రానికి ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం లేఖ కూడా ఇచ్చారు. ఆ త‌ర్వాత అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ఉమ్మ‌డి రాష్ట్రాల ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి రాగా..ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఇరు రాష్ట్రాలు పంతాలకు పోయి..ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు ఇద్ద‌రు చంద్రులు. చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఓటుకు నోటు కేసు కూడా బాబును కొంచెం ఇబ్బంది పెట్టింది. అనంత‌రం జ‌రిగిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎ...

ఆర్థిక నిపుణుడికి ఇక సెల‌వు

చిత్రం
ఎంద‌రో ప్ర‌ధాన‌మంత్రులు ఈ దేశానికి ప్రాతినిధ్యం వ‌హించారు. దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో వున్న‌ప్పుడు ..దిశా నిర్దేశ‌నం చేయాల్సిన స‌మ‌యంలో సంయ‌మ‌నం కోల్పోకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టిన ఘ‌న‌త మ‌న్మోహ‌న్ సింగ్‌దే. అపార‌మైన విజ్ఞానం, రాజ‌కీయ ప‌రిణ‌తి సాధించిన ఈ మేధావి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే మిగ‌తా ప్ర‌ధాన‌మంత్రుల‌కంటే ఆయ‌న భిన్న‌మైన వ్య‌క్తి క‌నుక‌. ఇవాళ ఆయ‌న గురించి మ‌రింత‌గా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా వున్న‌ది. ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడూ మాట్లాడుకోలేం. భార‌త‌దేశం అత్యున్న‌త‌మైన ప్ర‌జాస్వామ్యానికి ప‌ట్టుకొమ్మ‌గా నిలుస్తోంది. జాతులు, మ‌తాలు, కులాలు, వ‌ర్గాలు, వైష‌మ్యాలు, ద్వేషాలు, ఆర్థిక అస‌మాన‌త‌లు అన్నీ వున్న‌ప్ప‌టికీ అపార‌మైన జాతి సంప‌ద కొలువై ఉన్న‌ది. అదే ఈ దేశానికి ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉప‌యోగ‌ప‌డుతూ వ‌స్తున్న‌ది. మీ దేశానికి వున్న బ‌లం ఏమిటి అన్న ప్ర‌శ్న‌కు చైనాకు చెందిన అధినేత ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. మా దేశంలో నివస్తున్న స‌మ‌స్త జ‌న‌మే మా బ‌లం అని ధీటుగా జవాబు ఇచ్చారు. అదే మ‌న్మోహ‌న్ సింగ్ ..మా ప్ర‌జ‌లే మాకు సంప‌ద అని అభివ‌ర్ణించారు ఆయ‌న‌కంటే ముందే. కాన...