పోస్ట్‌లు

జూన్ 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

విద్యా రంగంలో కీల‌క మార్పు - ఉన్న‌త విద్యా మండ‌లి నిర్ణ‌యం

చిత్రం
తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళం పూర్తి మెజారిటీ సాధించి రాష్టంలో  బ‌ల‌మైన అధికార ప‌క్షంగా కొలువు తీర‌డంతో కేసీఆర్ త‌న ర‌థాన్ని రుయ్ మంటూ ప‌రుగులు పెట్టిస్తున్నారు. పాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రిచేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.  ఈసారి అనూహ్య‌మైన రీతిలో ప‌వ‌ర్‌లోకి రెండోసారి వ‌చ్చింది. థంబింగ్ మెజారిటీని సాధించి ఔరా అనిపించింది. రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా పెన్ష‌న్ సౌక‌ర్యాన్ని , ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ..మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదుపు త‌ప్పిన విద్యా వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దేశ‌మంత‌టా మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ ప‌రిధిలోకి విద్యా శాఖ వ‌స్తుంది.  ఇందులో భాగంగా యూనివ‌ర్శిటీలు, ఇత‌ర కాలేజీల‌లో కామ‌న్ సిల‌బ‌స్ వుండాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌తి విశ్వ విద్యాల‌యంలో కామ‌న్ సిల‌బ‌స్ ఉండేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది  స‌ర్కార్. క్రెడిట్స్, గ్రేడింగ్, ఎగ్జామ్ సిస్టం మొత్తం ఒకే రకంగా ఉండాల‌ని , డిగ్రీ విధానంలో మార్పులకు శ్రీ‌కారం చుట్టింది. థ‌ర్డ్ ఇయ‌ర్ లోను లాంగ్వేజ్ స‌బ్జెక్ట్స్ త‌ప్ప‌...

రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న దీక్షితులు - టీటీడీలో స‌మస్య‌లు కోకొల్ల‌లు

చిత్రం
పాలిటిక్స్ ఎప్పుడూ ప‌వ‌ర్ చుట్టే తిరుగుతూ వుంటాయి. ఆ సీట్ల‌కు వుండే అధికారం అలాంటిది. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగి ..శ‌క్తివంత‌మైన ఆల‌యంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు పేరుంది. లెక్క‌లేనంత డ‌బ్బులు, లెక్కించ‌లేనంత బంగారం, వ‌జ్రాలు, వైఢూర్యాలు, చిల్ల‌ర నాణేలు, ఆస్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే క‌నీసం ఏడాది ప‌డుతుంది. దీనిపై పెత్త‌నం చెలాయించేందుకు అటు స్వాములు, పీఠాధిప‌తులు, ఇటు రాజ‌కీయ నాయ‌కులు  నానా తంటాలు ప‌డుతుంటారు. తిరుమ‌ల కొండ‌పై కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, వెంగ‌మాంబ అమ్మ వార్ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు వున్నారు. ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటారు. లెక్క‌లేనంత కానుకలు హోండీల ద్వారా స‌మ‌ర్పించుకుంటారు.  జీవితంలో ఒక్క‌సారైనా తిరుమ‌ల‌ను సంద‌ర్శించు కోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అంత‌గా స్వామి, అమ్మ వార్లు భాగ‌మై పోయారు. వారిని మ‌న‌స్ఫూర్తిగా కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని, స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌గ‌లుగుతామ‌ని, నిశ్చింత‌గా జీవితాన్ని సాగించ‌వ‌చ్చ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. ప్ర‌తి రోజు...

ఇండియాకు యుఎస్ షాక్ - అబ్బా..ట్రంప్ ..దెబ్బ ..!

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన కొత్త స‌ర్కార్‌కు అమెరికా స‌ర్కార్ దెబ్బ కొట్టింది. ఇండియాకు జీఎస్టీ ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏకంగా 2 వేల వ‌స్తువుల‌పై బాదుడుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అగ్ర‌రాజ్యం అన్నంత ప‌ని చేసింది. రెండు నెల‌ల కింద‌ట అమెరికా సెనేట్‌లో వెల్ల‌డించిన విధంగా మ‌న దేశానికి ప్రాధాన్య వాణిజ్య హోదాను తొల‌గిస్తున్న‌ట్లు ఆ దేశ అధ్య‌క్షుడు వెల్ల‌డించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే ఈ నెల 5వ తేదీ నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది. త‌మ మార్కెట్ల‌కు స‌మాన‌మైన‌, హేతుబ‌ద్ధ‌మైన అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో భార‌త్ వైఫ‌ల్యం చెంద‌డం వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని యుఎస్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జీఎస్టీ ర‌ద్దు వ‌ల్ల ఇక నుంచి ఇండియా 5.6 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తుల‌పై సుంకాలు చెల్లించాల్సి వ‌స్తుంది. దీంతో 38 వేల 964 కోట్ల రూపాయ‌ల భారం మ‌న‌పై ప‌డుతుంది. ఇదే త‌గిన స‌మ‌యమ‌ని తాము భావిస్తున్నందు వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌మావేశంలో ప్ర‌క‌టించారు. మే 5 నుంచే ఈ నిర్ణ‌యం తీసు కోవాల‌ని అనుకున్నామ‌ని....

ద‌క్షిణాదికి మంగ‌ళం - ఉత్త‌రాదికి అంద‌లం - మోదీ, షా మంత్రాంగం

చిత్రం
తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చారు. సుస్థిర‌మైన పాల‌న‌, త‌మ బ‌తుకుల‌కు భ‌రోసా క‌ల్పించే పార్టీకే ప‌ట్టం క‌ట్టారు. స‌ర్వే సంస్థ‌లు, న్యూస్ ఏజెన్సీలు, ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు, సోష‌ల్ మీడియా సంస్థ‌లు, డిజిట‌ల్ మీడియాల‌న్నీ ఒకే సంఖ్య‌కే ప‌రిమిత‌మై పోయాయి. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ ని స‌రిగా అంచ‌నా వేయ‌లేక పోయాయి. ఒక‌టి కాదు రెండెంక‌ల సంఖ్య‌కే ప‌రిమిత‌మై పోతుంద‌ని..హంగ్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని .మోదీకి తీవ్ర‌మైన ప్ర‌జా వ్య‌తిరేకత బ‌లంగా ఉందంటూ పై పై వార్త‌లు గుప్పుమ‌న్నా అవ‌న్నీ తేలిపోయాయి. ఏ పార్టీలు ఊహించ‌ని రీతిలో క‌మ‌లం ఒక్క పార్టీనే త‌న బ‌లాన్ని నిరూపించుకుంది.  17వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. ఇది భార‌తీయ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో తిరుగులేని శ‌క్తిగా బీజేపీ అవ‌త‌రించింది. దీనికి అమిత్ షా చేసిన వ్యూహం..ప‌న్నిన ప్లాన్స్ అన్నీ వ‌ర్క‌వుట్ అయ్యాయి. ప్ర‌తిప‌క్షాల‌కు ఊపిరి ఆడ‌కుండా చేశాయి. ఈ తీర్పుతో ప్ర‌జ‌లు మాత్రం బ్ర‌హ్మాండ‌మైన గెలుపును మోదీ చేతుల్లో పెట్టారు. స‌ర్క...

స‌మాజ సంక్షేమం..రైతు రాజ్యం..మోదీ ప్ర‌భుత్వం

చిత్రం
ఊహించ‌ని రీతిలో కోట్లాది ప్ర‌జ‌లు అద్భుత‌మైన ..చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని న‌రేంద్ర మోదీకి అందించారు. మోదీ, షాల వ్యూహాలు..మూడొంతుల మెజారిటీని సాధించేలా చేసింది. ఏ పార్టీపై ఆధార‌ప‌డ‌కుండానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో 57 మంది జింబో టీంతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు మోదీ. త‌న‌దైన మార్క్‌ను ప్ర‌ద‌ర్శించారు. తెలంగాణ నుంచి ఒక్క‌రికే చోటు ద‌క్కింది. మిగ‌తా అంతా యుపీ, నార్త్ ప్రాంతాల నుండే ఎక్కువ‌గా మంత్రివ‌ర్గంలో కొలువు తీరారు. త‌న‌కు రెండోసారి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేలా చేసినందుకు కృత‌జ్ఞ‌త‌గా తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌ల‌నంటూ ఉద్వేగానికి లోన‌య్యారు మోదీజీ. ఆక‌లిని తీర్చి అన్నం పెట్టే రైతుల‌కు ఏదైనా చేయాల‌ని సంక‌ల్పించారు. ఏకంగా వారు జీవిత‌కాలంలో మ‌రిచి పోలేని విధంగా సాయాన్ని ప్ర‌క‌టించారు.  ప్ర‌తి రైతుకు ఎక‌రాకు ఏడాదికి 6 వేల రూపాయ‌ల చొప్పున ఇవ్వ‌నున్నారు. అంతేకాకుండా 60 ఏళ్లు నిండిన ప్ర‌తి రైతుకు పెన్ష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్నారు. ఇది ఒక చారిత్రాత్మ‌క నిర్ణ‌యంగా భావిస్తున్నాయి బీజేపీ శ్రేణులు. భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీజి ప్ర‌క‌టించిన ఈ రైతు ప‌థ‌కం ..దేశ ...

ప్ర‌జ‌ల‌పై టీఎస్ఆర్‌టీసీ ఛార్జీల మోత..?

చిత్రం
బంగారు తెలంగాణ పేరుతో ఛార్జీల మోత మోగిస్తున్న కేసీఆర్ స‌ర్కార్ మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై ర‌వాణా ఛార్జీలు పెంచేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఏకంగా టికెట్ల ధ‌ర‌లు 25 నుంచి 30 శాతానికి పెంచాల‌ని ఆర్టీసీ ఈ మేర‌కు ఓ నోట్ ఫైల్ ప్ర‌భుత్వానికి చేర‌వేసింది. త‌మ‌కు రావాల్సిన ప్ర‌యోజ‌నాల‌ను ఇవ్వ‌కుండా ఆర్టీసీ యాజ‌మాన్యం వెట్టి చాకిరి చేయిస్తోందంటూ కార్మికులు, ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు మేనేజ్‌మెంట్ కు నోటీసులు కూడా అంద‌జేశారు. ఇప్ప‌టికే మునిగి పోయేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీని కాపాడేందుకు ప్ర‌యత్నాలు చేస్తున్నామని అయినా అర్థం చేసుకోకుండా ఇలాగే ఆందోళ‌న బాట ప‌డితే తానేమీ చేయ‌లేన‌ని సాక్షాత్తు సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కార్మికులు, సంస్థ క‌లిసి దీనిని న‌డిపించాల‌ని..ఇంకెంత కాలం ఇలా న‌ష్టాల‌తో న‌డిపిస్తామంటూ ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు లాభాల బాట‌లో ప‌య‌నించిన ఏపీఎస్ఆర్టీసీని న‌ష్టాల‌పాలు చేసిన ఘ‌న‌త గ‌తంలో ఏలిన ప్ర‌భుత్వాల‌దే. స్థానికేత‌రులు ఈ సంస్థ‌లో చేరి సంస్థ‌ను నిర్వీర్యం చేశారు. అందినంత మేర దండుకున్నారు. ఇప్ప‌టికీ ఆంధ్రా, రాయ‌ల‌సీమ ప్రాంతాల‌కు చెందిన వారే తెలంగాణ రాష...

నిరాడంబ‌ర నేత‌కు నీరాజ‌నం - సారంగి స్మరామి..!

చిత్రం
అపూర్వ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకుని కేంద్రంలో థంబింగ్ మెజారిటీ సాధించి కొలువు తీరిన బీజేపీ ..స‌ర్కార్‌ను..ప్ర‌ధాన‌మంత్రిగా రెండోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన మోదీని జాతి యావ‌త్తు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతోంది. ఎందుకంటే ..ఒక సామాన్య‌మైన కుటుంబానికి చెందిన వ్య‌క్తి, సామాజిక కార్య‌క‌ర్త‌గా , స్వంత ఆస్తి అంటూ లేని నిరాడంబ‌రుడైన వ్య‌క్తి..ప్ర‌తాప్ సారంగికి కేబినెట్‌లోకి తీసుకోవ‌డం. ఇది బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యం ఇది. గ్రామ స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం తెలంగాణ‌లో 50 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చు చేస్తే..ఈ ఎంపీ మాత్రం ఒక్క పైసా ఖ‌ర్చు చేయ‌కుండానే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. త‌న‌కంటూ ఏదీ దాచు కోలేదు. స‌మాజ‌మే దేవాల‌యం..ప్ర‌జ‌లే దేవేళ్లు అనే దానికి సారంగి క‌ట్టుబడ్డారు. న‌మ్మిన విలువ‌ల కోసం త‌న ప్ర‌స్థానాన్ని సాగించారు. ప్ర‌జా సేవ‌కే త‌న జీవితాన్ని అంకితం చేశారు. ఏకంగా ఎలాంటి వాహ‌నం లేకుండానే..కేవలం ఆటోలో కేంద్ర కేబినెట్‌లో ద‌క్కించుకున్న సారంగి సాధార‌ణ వ్య‌క్తిగా దిగారు. పోలీసులు ఆయ‌న‌ను గుర్తించ‌లేదు. కానీ మోదీ ఎదురేగి తీసుకు వ‌చ్చారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రైన 8...

అమ్మ‌కే అంద‌లం ..కాంగ్రెస్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చం

చిత్రం
సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి నెట్టి వేయ‌బ‌డింది. న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ ల దెబ్బ‌కు కాంగ్రెస్ ఐసీయులోకి చేరుకుంది. 2014లోను, 2019లోను కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర‌ప‌క్ష పార్టీలు అడ్ర‌స్ లేకుండా పోయాయి. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోని స్థితిని కొనితెచ్చుకుంది. 543 లోక్‌స‌భ సీట్ల‌కు గాను 52 సీట్లు మాత్ర‌మే చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చారు కోట్లాది ప్ర‌జ‌లు. ఎంతో మంది అనుభ‌వ‌జ్ఞులు, దేశానికి దిశా నిర్దేశం చేసే నాయ‌కులు ఎంద‌రో ఆ పార్టీలో ఉన్నారు. కోట్లాది ఆస్తులు పోగేసుకున్న దిగ్గ‌జాలు క‌లిగిన ఆ పార్టీ..ఇపుడు దిక్కులేనిదైంది. అత్యంత బాధాక‌ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీకి ప‌గ్గాలు చేప‌ట్టేందుకు యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ స‌సేమిరా అంటున్నారంటే ..అర్థం చేసుకోవ‌చ్చు .కాంగ్రెస్ పార్టీ కోర్ క‌మిటీ అత్య‌వ‌స‌రంగా ఢిల్లీలో స‌మావేశ‌మైంది. రాహుల్ త‌మ‌కు వ‌ద్దంటూ ..నూత‌నంగా ఎన్నికైన ఎంపీలు తిర‌స్క‌రించారు. సోనియ‌మ్మ‌నే పార్ల‌మె...

మానుకోట మండుతున్న‌ది ..తెలంగాణ త‌ల్ల‌డిల్లుతున్న‌ది - ఈ క‌ర‌చాల‌నం ఎవ‌రి కోసం ..?

చిత్రం
నిలువెల్లా గాయాల‌ను త‌ట్టుకుని ..ఉద్విగ్న‌మైన పోరాటాన్ని ఊపిరిగా చేసుకుని ..ప్ర‌పంచం నివ్వెర పోయేలా చేసిన ఘ‌న‌త ఒక్క తెలంగాణ ప్రాంతానికి మాత్ర‌మే వున్న‌ది. ఇది చారిత్రాత్మ‌క‌మైన ఘ‌ట్టం. నూత‌న ఒర‌వ‌డికి ప్రాణం పోసింది. కోట్లాది ప్ర‌జ‌లు స్వ‌చ్ఛంధంగా త‌మ ప్రాంత‌పు అస్తిత్వం కోసం సాగించిన అరుదైన ఉద్య‌మం ఇక్క‌డిదే. ఇలాంటి పోరాటాలు, ఆందోళ‌న‌లు, స్వ‌చ్చంధ నిర‌స‌న‌లు, సంబండ వ‌ర్ణాలు ఒక్క‌టై ..ఒకే ల‌క్ష్యం కోసం ల‌క్ష‌లాది అడుగులు ఏక కాలంలో సాగింది ఇక్క‌డే. తెలంగాణ రాష్ట్రం కోసం సాగించిన అలుపెరుగ‌ని న్యాయ‌మైన డిమాండ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ధ‌తు ల‌భించింది. ప్రాంతాల‌కు , కులాల‌కు, వ‌ర్గాల‌కు అతీతంగా కూలీల నుంచి కార్పొరేట్ ఉద్యోగ‌స్తుల దాకా అంతా త‌మ ప్రాంత‌పు విముక్తి కోసం ఉద్య‌మించారు. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మేధావులు, జ‌ర్న‌లిస్టులు, నిరుద్యోగులు, వృద్దులు, పిల్ల‌లు, మ‌హిళ‌లు, దివ్యాంగులు, మైనార్టీలు, బీసీలు, ద‌ళిత బ‌హుజ‌నులు..ఇలా ప్ర‌తి ఒక్క‌రు మ‌మైక‌మై సాగారు. ఈ పోరాటం ఎంద‌రికో స్ఫూర్తినిచ్చింది. ఇంకెంద‌రికో పాఠం నేర్పింది. క‌రుడుగ‌ట్టిన స‌మైక్య‌వాదులుగా ఉన్న చంద్ర‌బాబు నాయుడ...