పోస్ట్‌లు

సెప్టెంబర్ 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దార్శనికుడు..తెలంగాణ యోధుడు..బాపూజీ వర్ధిల్లు

చిత్రం
ప్రపంచానికే పాఠం నేర్పిన తెలంగాణ మాగాణంలో ఎందరో వీరులున్నారు. మహోన్నతమైన మానవులను, మార్గదర్శకులను కన్నది తెలంగాణ తల్లి. పోరాటాలకు, ఉద్యమాలకు, బలిదానాలకు, ఆత్మతగాలకు నిలువెత్తు రూపం ఈ ప్రాంతం. ఉద్విగ్న చరిత్రకు ప్రతీకగా నిలిచిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కరడు గట్టిన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అన్ని రంగాల్లో దోపిడీకి లోనైన ఈ ప్రాంతపు విముక్తి కోసం జరిగిన ప్రతి సందర్భంలోను కొండా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల్లో బాపూజీ కీలకంగా వ్యవహరించారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పుట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. అదే సమయంలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో నిలుచున్నారు. 1952లో ఆసిఫాబాదు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసు వేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి గెలిచారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంల...

నో పాలిటిక్స్..మూవీస్ బెటర్..తలైవా, కమల్ లకు మెగా హితబోధ..!

చిత్రం
భారతీయ సినిమా రంగంలో ఆయనకు ఓ చరిత్ర ఉంది. తెలుగు సినిమా రంగాన్ని ఆయన కొన్నేళ్ల పాటు తన ప్రభావాన్ని చూపిస్తున్న ఒకే ఒక్క నటుడు. వన్ అండ్ ఓన్లీ హీరో, లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు తన మనసులో ఉన్న దానిని ఇన్నాళ్లకు బయట పెట్టారు. ఏకంగా తన తోటి నటులు ఇండియాలో పేరున్న తమిళ్ తలైవా రజనీకాంత్, విలక్షణమైన యాక్టర్ కమల్ హాసన్ లకు పాలిటిక్స్ వద్దే వద్దంటూ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ రంగం పూర్తిగా కలుషితమై పోయిందని, దానిలో మనలాంటి నటులు నెగ్గుకు రావడం కష్టమన్నారు. ఇప్పటికే కమల్ హాసన్ తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. మరో వైపు కోట్లాది ఫ్యాన్స్ కలిగిన రజనీకాంత్ కూడా పార్టీని స్థాపించాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్ తో ఆయన సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇక బీజేపీ హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా కూడా తలైవాను బీజేపీలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు కనిపించారు. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్ ...

అభాగ్యనగరం..అతలాకుతలం..!

చిత్రం
విశ్వ నగరంగా, ఐటీ హబ్ గా, సైబరాబాద్ గా ఎంతో పేరున్న హైదరాబాద్ ఉరఫ్ భాగ్యనగరం ఇప్పుడు దిక్కులేనిదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఈ నగరం పూర్తిగా అతలాకుతలమైంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడ చూసినా నీళ్ళే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం నగరవాసుల పాలిట శాపంగా మారింది. ఇక మెట్రో రైళ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పెచ్చులు ఊడి పడిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. ఇటీవలే పెచ్చులు ఊడిపడి మౌనిక అనే వివాహిత చని పోయింది. మెట్రో రైల్ గురించి గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కార్ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ పై కఠిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. 20 లక్షలు సాయం ప్రకటించినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాని పరిస్థితి. నాణ్యతను పరిశీలించే అధికారులు ఎలా క్లియరెన్స్ సెర్టిఫికెట్ ఇచ్చారో వారికే తెలియాలి. హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఇప్పుడు వర్షాలు పెను సవాల్ గా మారాయి. చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడై పోతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. గతంలో ఎప...

ఒప్పుకోని ఫ్యాన్స్ - ఆలీకి తిరిగి ఛాన్స్

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద బిగ్ రియాల్టీ షో గా ఇప్పటికే పేరు పొందిన స్టార్ మా టీవీ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాం లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అప్పూర్వమైన రీతిలో ఆదరణ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ పై కొంత వ్యతిరేకత వ్యక్తమైనా ప్రోగ్రాంకు రేటింగ్ పెరుగుతోంది. దీంతో స్టార్ టీవీ యాజమాన్యం రీజినల్ సెక్టార్స్ లలో దీనిని ఆయా ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తినకుండా ప్లాన్ చేసింది. కన్నడలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో స్టార్ టీవీ మా టీవీని కొనుగోలు చేశాక వినోద రంగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. మొదటగా బిగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న సెలెబ్రెటీస్ ను ఎంపిక చేసింది. అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ను టెలికాస్ట్ చేసింది. ఇది హిందీలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి మాతృక. దీనిని మొదటగా తెలుగు నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం కు విపరీతమైన రీతిలో ఆదరణ లభించింది. మా టీవీకి భారీ ఆదాయం కూడా సమకూరింది. మరో వైపు తెలుగు బుల్లి తెరమీద ఇప్పటికే జీ తెలుగు, ఈటీవి, జెమిని, తది...

మోదీ ఫస్ట్..ధోనీ బెస్ట్..బిల్ గేట్స్ టాప్ నెంబర్ వన్

చిత్రం
భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ హవా రోజు రోజుకు  పెరుగుతూనే ఉన్నది. తాజాగా యుగోవ్ అనే సంస్థ మోస్ట్ పాపులర్ పెర్సనాలిటీస్ ఎవరనే దానిపై ప్రతి ఏటా జాబితా వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పటికే టీమిండియా సారధ్యం నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా 42  వేల మందితో నిర్వహించిన సర్వేలో 8.58 శాతం మంది ధోనీనే ఇష్టపడ్డారు. మోడీ 15.66 శాతం ఓట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచారు. ఇండియా స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌  కేటగిరీలో ధోనీ తర్వాత సచిన్‌‌ రెండో స్థానంలో నిలవగా.. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ మూడో స్థానం దక్కించు కున్నాడు. కాగా మహిళల విభాగంలో లెజెండరీ బాక్సర్‌‌‌‌ మేరీ కోమ్‌‌ 10.36 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక పోతే వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్స్ పర్సన్స్ లో బిల్ గేట్స్ మొదటి స్థానం దక్కించుకున్నారు. మాజీ అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో ప్లేస్ లో ఉన్నారు. మూడో స్థానంలో జాకీ చాన్, నాలుగో ప్లేస్ లో జిన్ పింగ్, ఐదో స్థానంలో చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకులు జాక్ మా నిలిచారు. నరేంద్ర మోడీ...