పోస్ట్‌లు

ఏప్రిల్ 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

కోట్లు దాటిన వ్యాపారం - ఆన్‌లైన్లో ఆహారం

చిత్రం
ఎక్క‌డికైనా వెళితే ఏమేం హోట‌ళ్లు ఉన్నాయో వెదికే బాధ త‌ప్పింది జ‌నాలకు. ఆక‌లి వేస్తే చాలు..ఏమైనా ఏదైనా తినేయొచ్చు క్ష‌ణాల్లో. ఈ కామ‌ర్స్ పుణ్య‌మా అని ఆన్‌లైన్‌లో టిఫిన్లు, భోజ‌నాలు, ఇత‌ర తిను పదార్థాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ల‌భిస్తున్నాయి. బిర్యానీ అంటేనే ప్ర‌పంచంలోనే పేరొందిన హైద‌రాబాద్ ప్యార‌డైజ్ ఆదాయం నెల‌కు వంద కోట్ల‌కు పైమాటే. అటు రెస్టారెంట్ల‌తో పాటు ఆన్ లైన్ లో ఆర్డ‌ర్ చేస్తే చాలు ప్రపంచంలో ఎక్క‌డికైనా పంపించే ఏర్పాటు చేసింది యాజ‌మాన్యం. డెలివ‌రీ సిస్టం మారి పోయింది. ర‌వాణా స‌దుపాయాలు పెరిగాయి. టెక్నాల‌జీ ఆహార‌ప‌దార్థాల‌కు ఉప‌యోగ ప‌డుతోంది. ముందుగా చెప్పాల్సి వ‌స్తే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గురించి చెప్పుకోవాలి. రోజూ ల‌క్ష‌కు పైగా భ‌క్తులు తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకుంటారు. కానీ టీటీడీ ఎక్క‌డా క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా పాలు, కాఫీలు, టిఫిన్లు, రుచిక‌ర‌మైన భోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. తెలంగాణ‌లో అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కేవ‌లం 5 రూపాయ‌ల‌కే భోజ‌నాన్ని అందిస్తోంది. ఇది కూడా సేవా భావంతో చేస్తున్న‌దే కావ‌డంతో అన‌తి కాలంలోనే స‌క్సెస్ అయ్యింది. న‌గ‌రాల‌కే కాకుండా ...

ఏక‌ప‌క్ష దాడుల‌పై ఆగ్ర‌హం..మోదీ తీరుపై గ‌రం గ‌రం

చిత్రం
కేంద్రంలోని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం విప‌క్షాల‌కే కాదు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఏ ఒక్క‌రున్నా..ఏ పార్టీ అయినా స‌రే టార్గెట్ చేస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా 543 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో జ‌రుగుతున్నాయి. మొద‌టి విడ‌త పూర్త‌యింది. రెండో విడ‌త‌లో భాగంగా త‌మ‌తో క‌ల‌వ‌ని పార్టీల‌పైనే గురి పెట్టారు క‌మ‌ల‌నాథులు. మోదీ, అమిత్ షా కేసులు న‌మోదు చేయించ‌డం, ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థులు, అధిపతుల‌ను లక్ష్యంగా చేసుకునేలా ఐటీ దాడుల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన విప‌క్షాలు మోదీ తీరుపై మండిప‌డుతున్నాయి. ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలాంటి ఏక‌ప‌క్ష దాడుల‌ను స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. ఏపీలో మాజీ కేంద్ర మంత్రి సీఎం రమేష్ ఇళ్ల‌పై ఐటీ శాఖ దాడులు చేసింది. ఎలాంటి కీల‌క ఆధారాలు ల‌భించ‌లేదు. తాము ఆదాయ ప‌న్ను చెల్లిస్తున్నామ‌ని ..మోదీ కావాల‌నే త‌మ‌ను టార్గెట్ చేశారంటూ ర‌మేష్ ఆరోపించారు. క‌ర్ణాట‌క‌లోను..ఇటు త‌మిళ‌నాడులోను ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేశారు. పోలింగ్‌కు కేవ‌లం 36 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ...

అల‌వోక‌గా పంజాబ్ ..నిరాశ‌లో రాజ‌స్థాన్

చిత్రం
ఐపీఎల్ టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌ను చేజేతులారా పోగొట్టుకుంది. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ జ‌ట్టు అజింక్యా రెహానే మొద‌ట‌గా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ అటు అభిమానుల‌కు ఇటు క్రికెట‌ర్ల‌కు మంచి జోష్ ఇచ్చింది. టోర్న‌మెంట్‌లో బెంగ‌ళూరు త‌ర్వాత వ‌రుస ఓట‌ముల‌తో రికార్డు సృష్టిస్తోంది రాజ‌స్థాన్. ఇరు జ‌ట్లు ఓట‌ముల్లో సేమ్ టు సేమ్ అన్న‌మాట‌. మ‌రో వైపు పంజాబ్ జ‌ట్టు మెల్ల‌గా పుంజుకుంది. అయిదో విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి చేరుకుంది. అటు బ్యాటింగ్ లోను..ఇటు బౌలింగ్‌లోను స‌త్తా చాట‌డంతో విజ‌యం పంజాబ్ వ‌శ‌మైంది. అశ్విన్ కెప్టెన్‌గా ..బౌల‌ర్‌గా చ‌క్క‌గా రాణించాడు. ప్లే ఆఫ్ ద‌శ‌లో వెనుక‌బ‌డుతున్న ఈ ద‌శ‌లో కీల‌క విజ‌యం సాధించింది. ఆస‌క్తిక‌రంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో గెలిచింది. 183 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన రాయ‌ల్స్ జ‌ట్టు ..నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 170 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అవ‌కాశాలు ఉన్నా వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక పోయారు జ‌ట్టు...

డాల‌ర్లు కురిపిస్తున్న డైలాగ్స్ - పంచ్‌లు ప్రాస‌ల్లో త్రివిక్రం టాప్

చిత్రం
టెక్నాల‌జీ మారినా ..అభిరుచులలో మార్పులు చోటు చేసుకున్నా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మాత్రం ఎలాంటి ఒడిదుడుకుల‌కు లోనుకాకుండా లాభాల బాట‌ల్లో ప‌య‌నిస్తోంది. పేరుకే చిన్న సినిమాలు అయిన‌ప్ప‌టికీ భారీ విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంటున్నాయి. క్రియేటివిటీకి ప‌దును పెడుతూ సినిమాల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. మాట‌ల‌తో గుండెల్ని పిండేస్తున్నారు. మొద‌ట్లో డైలాగ్ రైట‌ర్స్ గా ప్రారంభించిన వాళ్లల్లో ఎక్కువ‌గా డైరెక్ట‌ర్లుగా మారిపోతున్నారు. స్క్రీన్ ప్లే..మాట‌లు..డైరెక్ష‌న్ అంతా వాళ్లే చూసుకుంటున్నారు. వారిలో త్రివిక్రం శ్రీ‌నివాస్ మొద‌టి వ‌రుస‌లో నిలుస్తారు. చాలా సినిమాల‌ను ఆయ‌న పోయెటిక్‌గా ..అద్భుతంగా తీస్తారు. ప్ర‌తి కేరెక్ట‌ర్ కు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం వుంటుంది. అలా వుండేలా చేస్తారు త్రివిక్రం. కేవ‌లం ఆయ‌న రాసే మాట‌ల కోసం సినిమాలు చూసే వారున్నారంటే న‌మ్మ‌గ‌ల‌మా. అవును..వాస్త‌వం కూడా. మాట‌ల్లో ప‌వ‌ర్ వుంటుంది. మ‌న చుట్టూ ఉన్న మ‌నుషులు, ప్రాంతాలే వాటికి ప్రేర‌ణ ఇస్తుంటాయంటారు ఓ సంద‌ర్భంలో ఈ డైరెక్ట‌ర్.  సంపాదించ‌డం చేత కాని వాడికి ..కూర్చుని ఖ‌ర్చు పెట్టే అర్హ‌త లేదంటారు..తండ్రి పాత్ర‌లో చంద...

ఎడిట‌ర్స్ ఛాయిస్ - అవినీతికి అంతం ఎప్పుడు ..?

ఐటీ రంగంలో దేశంలోనే టాప్ రేంజ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇపుడు ఆన‌కొండ‌లా పేరుకు పోయిన అవినీతిని నిర్మూలించ‌లేక పోతోంది. ఏ శాఖ‌కు వెళ్లినా ఉద్యోగులు లంచాలు ఇవ్వ‌నిదే ..చేతులు త‌డ‌ప‌నిదే ప‌నులు చేయ‌డం లేదు. ఓ వైపు ఉద్యోగుల‌కు భారీ ఎత్తున వేత‌నాలు అంద‌జేస్తున్నా ..లంచావ‌తారాలు మాత్రం మార‌డం లేదు. పూర్తి స్థాయిలో అవినీతి నిరోధ‌క శాఖ దాడులు చేస్తున్నా , నేరుగా టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేసినా ఆయా శాఖ‌ల సిబ్బందిలో ఎలాంటి బెదురు క‌నిపించ‌డం లేదు. ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ..క‌ట్ చేసి మ‌ళ్లీ బాజాప్తాగా డ‌బ్బులు ఇవ్వాల్సందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి వ‌చ్చాక ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌క పోతే నేరుగా ఫోన్ చేయొచ్చంటూ ఓ నెంబ‌ర్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల నుండి లెక్క‌కు మించి ఫోన్లు వెళ్లాయి. ఎక్కువ‌గా రెవిన్యూ, మున్సిప‌ల్ , ఎక్సైజ్ , త‌దిత‌ర శాఖ‌ల‌పైనే బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏకంగా అవినీతికి కేరాఫ్ గా మారి పోయిన రెవిన్యూ శాఖ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తే కానీ దారికి రా...