పోస్ట్‌లు

జులై 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క‌ర్నాట‌కం..ఆద్యంతం ర‌స‌వ‌త్త‌రం..స్పీక‌రే సుప్రీం..ఢిల్లీకి చేరిన రాజ‌కీయం ..!

చిత్రం
అంతులేని ట్విస్టుల‌తో రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠ‌కు..ఉద్వేగానికి లోను చేస్తున్న క‌న్న‌డ నాట రాజ‌కీయం మ‌రింత హీట్ ను పుట్టిస్తూ దేశ రాజ‌కీయాల‌లో కొత్త చ‌రిత్ర‌కు తెర లేపింది కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం. ఏం జ‌రుగుతుందో తెలుసుకునే లోపే అంతా మారిపోతున్నాయి ప‌రిస్థితులు. బ‌ల నిరూప‌ణ జ‌ర‌గాల్సిందేనంటూ విప‌క్ష నేత యెడ్యూర‌ప్ప డిమాండ్ చేశారు. బేష‌ర‌తుగా జ‌రిపి తీరాల్సిందేనంటూ త‌న అనుచర ఎమ్మెల్యేల‌తో క‌లిసి విధాన స‌భ‌లో నిర‌స‌న‌కు దిగారు. అయినా స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ స‌సేమిరా అన్నారు. త‌న‌కు విశేష‌మైన అధికారాలు ఉన్నాయ‌ని, త‌న‌ను ఎవ‌రూ నియంత్రించ లేర‌ని, తాను భార‌త రాజ్యాంగ బ‌ద్దంగానే న‌డుచుకుంటున్నాన‌ని స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. దీంతో క‌న్న‌డ రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేసింది. దీనిపై క‌మ‌ల‌నాథులు భ‌గ్గుమ‌న్నారు. సంకీర్ణ స‌ర్కార్ నుండి 15 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యార‌ని, వారి శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర సంకీర్ణ ముఖ్య‌మంత్రి కుమార స్వామితో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గుండూరావులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో క‌న్న‌డ పాలిటిక్స్ దేశ రాజ‌ధా...

ఐటీ మార్కెట్ లో విప్రో కంపెనీదే హ‌వా

చిత్రం
ఐటీ దిగ్గ‌జ కంపెనీగా పేరొందిన బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న అజీమ్ ప్రేమ్‌జీ నేతృత్వంలోని విప్రో కంపెనీ త‌న హ‌వాను కొన‌సాగిస్తోంది. 2 వేల 388 కోట్ల ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌డించింది. గ‌ణ‌నీయంగా గ‌త ఏడాది కంటే ఈ సారి పెంచుకుంది. జూన్ క్వార్ట‌ర్ వ‌ర‌కు చూస్తే 12 శాతం పెరిగింది. సీక్వెన్షియ‌ల్‌గా చూస్తే 4 శాతం త‌గ్గింది. గ‌త క్యూ1 లో 13 వేల 978 కోట్లుగా ఉండ‌గా 5 శాతం ఆదాయం వృద్ధితో 14 వేల 716 కోట్ల‌కు పెరిగిందని విప్రో కంపెనీ వెల్ల‌డించింది. ఇటీవ‌ల ఫ‌లితాల వెల్ల‌డిలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల కంటే విప్రో రెవిన్యూ విష‌యంలో వెనుక‌బ‌డి పోవ‌డం గ‌మ‌నార్హం. టీసీఎస్ కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధితో 38 వేల 172 కోట్ల‌కు చేరుకోగా, ఇన్ఫోసిస్ కంపెనీ ప్రాఫిట్ 14 శాతం వృద్ధితో 21 వేల 803 కోట్ల‌కు ఆదాయం పెరిగింది. విప్రో కంపెనీకి కీల‌క‌మైన విభాగం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీనే. ఈ విభాగం ఆదాయం 2 శాతం త‌గ్గి 203 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుంద‌ని కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం రెండో క్వార్ట‌ర్‌లో ఈ విభాగం ఆదాయం 204 -208 కోట్ల డాల‌ర్ల రేంజ్‌లో ఉండొచ్చ‌ని అంచ‌నా వేసింది. అయిత...

క్రియేటివిటికి అద్దం ప‌ట్టిన చిత్రాలు

చిత్రం
యూత్ అంతా ఇపుడు స్మార్ట్ ఫోన్ల‌లో టైంపాస్ చేస్తుంటే హైద‌రాబాద్‌లోని ఆక్రిడ్జ్ స్కూల్‌లో చ‌దువు అభ్య‌సిస్తున్న 14 ఏళ్ల త‌మ‌న్నా అగ‌ర్వాల్ పెయింటింగ్స్ తో ఆక‌ట్టుకుంటోంది. చ‌దువుతో పాటు క్రియేటివిటి క‌లిగిన ఈ అమ్మాయి చిత్రాల ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొంద‌రు స్టూడెంట్స్ సినిమాలు, క్రికెట్ , గేమ్స్, వీడియోస్‌ల‌లో మునిగి పోతుంటే ఈ అమ్మాయి మాత్రం త‌న లోకమే వేరంటూ ముందుకెళుతోంది. ఆర్ట్ ఈజ్ ది ఫామ్ ఆఫ్ డిఫ‌రెంట్ వే. క‌ళ జీవితాన్ని ప్ర‌తిఫ‌లించే సాధనాల‌లో అత్యుత్త‌మ‌మైన‌ది. సాహిత్య రంగంలో క‌ళ‌కు అజ‌రామ‌మైన చోటు ద‌క్కింది. క‌విత్వం లైఫ్‌ను ఆవిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తే..క‌ళ ..పెయింటింగ్స్ దానిని ప్ర‌తిఫ‌లించేలా చేస్తాయి. క‌ళాత్మ‌క‌త అనేది కొంద‌రికి పుట్టుక‌తో వ‌స్తే మ‌రికొంద‌రికి క‌ష్ట‌ప‌డితే ద‌క్కుతుంది.  అమేజింగ్ క‌ల‌ర్స్‌ను ఉప‌యోగిస్తూ చిత్రాల‌కు ప్రాణం పోసింది త‌మ‌న్నా అగ‌ర్వాల్. పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క‌త పెంపొందించేందుకు ఆక్రిడ్జ్ స్కూల్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ యంగ్ ఆర్టిస్ట్ ఇదే స్కూల్‌లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుకుంటోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో టాప్ స్కూళ్ల‌లో ఆక్రిడ...

బిగ్ ఆఫర్ కొట్టేసిన బైజు - ఖ‌తార్ కంపెనీ పెట్టుబ‌డి

చిత్రం
ఇండియాకు చెందిన స్టార్ట‌ప్‌లు దిగ్గ‌జ కంపెనీల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. భారీగా పెట్టుబ‌డులు అందుకుంటున్నాయి. తాజాగా ఖ‌తార్ కంట్రీకి చెందిన సావ‌రిన్ ఫండ్ అండ్ ఓల్ వెంఛ‌ర్స్ 150 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఆన్‌లైన్‌లో విద్యా బోధ‌న‌ను వినూత్నంగా స్టార్ చేసింది బైజు కంపెనీ. ఒక‌ప్పుడు చ‌దువు కోవాలంటే నానా ఇబ్బందులు. వాట‌న్నింటిని దూరం చేస్తూ బైజు ఆన్ లైన్‌లోనే క్లాసులు చెప్పిస్తోంది. ఆయా స‌బ్జెక్టుల నిపుణుల‌తో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తూనే..పిల్ల‌ల‌కు , విద్యార్థుల‌కు చేదోడుగా ఉంటోంది. బైజు వ‌ల్ల ల‌క్ష‌లాది మందికి మేలు జ‌రుగుతోంది విద్యా ప‌రంగా. కంటెంట్ విష‌యంలోను..ఆయా స‌బ్జెక్టుల ప‌రంగా బైజు కంపెనీ క్వాలిటీని కాపాడుకుంటూ వ‌స్తోంది. ఖ‌తార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ , ఖ‌తార్ గ‌వ‌ర్న‌మెంట్స్ సావ‌రిన్ వెల్త్ ఫండ్ తో పాటు శాన్ ఫ్రాన్సిస్‌కో కేంద్రంగా ప‌నిచేస్తున్న ఓల్ వెంచ‌ర్స్ బైజుకు స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌చ్చాయి. భారీ ఎత్తున పెట్ట‌బుడులు పెడుతున్న‌ట్లు వెల్ల‌డించాయి. ఈ పెట్టుబ‌డి వ‌ల్ల ఇత‌ర దేశాల్లో కూడా ఆన్‌లైన్‌లో చ‌దువు కునేందుకు ఎక్కువ డిమాండ్ ఉంటోం...

ఆభ‌ర‌ణాల రంగంలోకి రిల‌య‌న్స్

చిత్రం
రిల‌య‌న్స్ అంటేనే ఇండియా..భార‌త్ అంటేనే రిల‌య‌న్స్ అనే స్థాయికి చేరుకుంది రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్. ఓ వైపు టెలికాం రంగంలో జియో దెబ్బ‌కు ఇత‌ర కంపెనీలు డీలా ప‌డిపోతే ఈ ఒక్క కంపెనీ మాత్రం రికార్డుల బ్రేక్ చేస్తూ ప్రపంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేసింది. ఒకే ఒక్క రోజులో జియో లాంచ్ చేసిన రోజే ఏకంగా 5 కోట్ల మందికి పైగా స‌బ్‌స్క్రైబ‌ర్స్‌గా చేరారు. ఇత‌ర టెలికాం ఆప‌రేట్స్ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, త‌దిత‌ర కంపెనీల‌కు చెందిన వినియోగ‌దారులు జియోలోకి మారిపోయారు. దీంతో గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని గ‌డించింది ఈ కంపెనీ. రిల‌య‌న్స్ ఆధ్వ‌ర్యంలో ఫుట్ వేర్, రిల‌య‌న్స్ డిజిట‌ల్ , టెలికాం, ఫ్యాష‌న్స్, ట్రెండ్స్..లాజిస్టిక్ త‌దిత‌ర రంగాల‌కు విస్త‌రించింది. దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల రిల‌య‌న్స్ స్టోర్‌ల‌ను ఏర్పాటు చేసింది. త‌న వ్యాపారాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ ఆదాయాన్ని గ‌డిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్ర‌తి సెంట‌ర్ ప్లేస్‌లో రిల‌య‌న్స్ పెట్రోల్ బంకుల‌ను ఏర్పాటు చేసింది. వాటి స్థ‌లాల విలువ లెక్కించ‌లేనంత‌గా పెరిగింది. అన్ని క‌లిపి అమ్మితే ఏకంగా 1000 కోట్ల‌కు పైగా ఉంటోంద‌ని మార్కెటింగ్ వ‌ర్గాల అంచ‌నా. ఇండ...

పుర‌పాలిక ఎన్నిక‌ల‌కు ఎందుకంత ఆత్రం..?

చిత్రం
తెలంగాణ అంటేనే ఎన్నిక‌ల‌కు పెట్టింది పేరు. స‌ర్కార్ ఎన్నిక‌ల జ‌పం చేస్తోంది. పాల‌న ప‌డకేసింది. జిల్లా క‌లెక్ట‌ర్లు బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు అవినీతి రాజ్య‌మేలుతోంది. అక్ర‌మాల‌కు అన్ని కార్యాల‌యాలు అడ్డాగా మారాయి. బ‌ర్త్ , డెత్ స‌ర్టిఫికెట్లు, ఆదాయ‌, కులం, స్థానిక స‌ర్టిఫికెట్లు ఇవ్వాలంటే త‌డ‌పాల్సిందే. అడ్మినిస్ట్రేష‌న్ ప‌రంగా ఆజ‌మాయిషీ చేసే వారు క‌రువ‌య్యారు. మున్సిపాల్టీలు ప‌ర్మిష‌న్స్ కావాలంటే మ‌రో జ‌న్మ ఎత్తినంత ప‌న‌వుతోంది. ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన వారే కాటేస్తున్నారు. శాస‌న‌మండ‌లి, విధాన‌స‌భతో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. ఇపుడు పుర‌పాలిక ఎన్నిక‌లు మిగిలాయి. దీనికి తెర తీసింది టీఆర్ఎస్ స‌ర్కార్. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో పిటిష‌న్స్ దాఖ‌ల‌య్యాయి. మున్సిప‌ల్ పోల్స్‌పై ఎందుకంత‌టి ఉరుకులాట అంటూ ధ‌ర్మాస‌నం ఆగ్రహం వ్య‌క్తం చేసింది. వ్య‌క్త‌మైన అభ్యంత‌రాల‌ను ప‌ట్టించుకోనంత‌టి అవ‌స‌రం ఏమొచ్చిందంటూ ప్ర‌శ్నించింది. స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు పేరుకు పోయాయి తెలంగాణ అంత‌ట. ఎన్నో ఏళ్లుగ...