పోస్ట్‌లు

జూన్ 4, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం - ఆప్ అసాధార‌ణ నిర్ణ‌యం - 700 కోట్ల ఖ‌ర్చు

చిత్రం
మ‌హిళా సంక్షేమ‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి చెబుతూ వ‌స్తోంది. ఆ దిశ‌గా అసెంబ్లీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయి. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 7 లోక్‌స‌భ సీట్ల‌ను ఆప్ కోల్పోయింది. అన్ని సీట్ల‌లో క‌మ‌లం కాషాయ జెండాను ఎగుర వేసింది. మొద‌ట్లో కాంగ్రెస్‌తో దోస్తీ క‌ట్టాల‌ని నిర్ణ‌యించినా ఎందుక‌నో కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఆ రెండు పార్టీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఏదో రకంగా మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ఆప్ అధినేత కేజ్రీవాల్ శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేశారు కేజ్రీ. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ..ఏరాష్ట్రంలో లేని విధంగా మ‌హిళంద‌రికి మెట్రో రైళ్ల‌లో, ప్ర‌భుత్వ బ‌స్సుల్లో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి ప్ర‌యాణం చేసినా ఉచితమేనంటూ ప్ర‌క‌టించారు.  మ‌రో రెండు నెల‌ల్లో ఈ స్కీం అమ‌లు లోకి వ‌స్తుంద‌ని సీఎం కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. త‌క్ష‌ణ‌మే ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎం ఆదేశించా...

ప్ర‌భుత్వ బ్యాంకుల్లో దొంగ‌లు ప‌డ్డారు - స్ప‌ష్టం చేసిన ఆర్బీఐ - ప్ర‌జ‌ల సొమ్ము ప‌రుల పాలు

చిత్రం
రుణాలు మంజూరు చేసే విష‌యంలో రైతుల‌ను, సామాన్యుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టే ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు ప్ర‌జ‌ల సొమ్మును ప‌రుల‌పాలు చేశాయి. ఈ విష‌యాన్ని సాక్షాత్తు భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు, బ్యాంకుల‌కు క‌ష్టోడియ‌న్‌గా భావించే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. ల‌క్ష‌లు కాదు ఏకంగా 71 వేల 500 కోట్ల రూపాయ‌ల మేర మోసం జ‌రిగిందంటూ స‌మ‌చార హ‌క్కు చ‌ట్టం కింద అడిగిన ప్ర‌శ్న‌కు జవాబు ఇచ్చింది. ఇంత‌గా లెక్క‌లేనంత‌గా మోసాలు జ‌రిగినా ఈ బ్యాంకులు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే గ‌తంలో మోదీ స‌ర్కార్ తీసుకున్న నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వ బ్యాంకులంటేనే న‌మ్మ‌కం పోయింది. బ్యాంకుల్లోని చ‌ట్టాల‌లో నెల‌కొన్న లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని అక్ర‌మార్కులు అప్ప‌నంగా డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని తెలిపింది. ఇలాంటి మోసాల‌కు దిక్కు లేకుండా పోయింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 6 వేల 800 మోసాలు జ‌రిగాయ‌ని, వీటి విలువ సుమారు 71 వేల కోట్ల‌కు పైమాటేన‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌కు ముందు ఏడాది అంటే 2017-18లో 5 వేల 916 కేసులు న‌మోదు కాగ...

పెరుగుతున్న నిరుద్యోగం - ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం

చిత్రం
నీళ్లు, నిధులు , నియామ‌కాలు పేరుతో సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసిన తెలంగాణ‌లో ఇపుడు నిరుద్యోగులు అన్న‌మో రామ‌చంద్ర అంటున్నారు. త‌మ ప్రాంతానికి స్వేచ్ఛ ల‌భిస్తే, త‌మ‌కంటూ స్వ‌యం పాల‌న వ‌స్తే బ‌తుకులు బాగు ప‌డ‌తాయ‌ని క‌ల‌లు క‌న్న ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఇపుడు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన వెంట‌నే కాంట్రాక్టు ఎంప్లాయిస్‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇపుడ‌ది నీటి మూట‌గానే మిగిలింది. దాదాపు 2 ల‌క్ష‌ల 50 వేల‌కు పైగా ఖాళీలు ఉన్నాయి. వివిధ డిపార్ల‌మెంట్ల‌లో ఇప్ప‌టికీ ప‌ని భారంతో ఇత‌ర సిబ్బంది లెక్క‌కు మించి ప‌ని చేస్తున్నారు. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ..ఏకంగా రెవిన్యూ డిపార్ట్‌మెంట్ ను ఇత‌ర శాఖ‌లోకి మార్చేస్తానంటూ ప్ర‌క‌టించారు. దీంతో ఆ శాఖ‌కు చెందిన ఉద్యోగులు, సిబ్బందిలో అభ‌ద్ర‌తా భావం నెల‌కొంది. విప‌క్షాల‌తో పాటు నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్ర‌జా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. త‌క్ష‌ణ‌మే ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌మ‌ని కోరుతున్నాయి. అయినా ఈరోజు వ‌ర‌కు స...

విద్యాదానం ..మ‌హ‌ద్భాగ్యం - దాత‌లకు విన్న‌పం

చిత్రం
రెండోసారి కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం మెల మెల్ల‌గా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. గ‌తంలో అమ‌లు చేసిన కార్య‌క్ర‌మాల స్థానంలో కొత్త వాటిని చేర్చి..స‌మాజాభివృద్ధిలో కీల‌క భూమిక పోష‌ఙంచేలా చేస్తోంది. త్రిభాషా విధానాన్ని అమ‌లు చేయాల‌ని సంక‌ల్పించ‌గా ఆదిలోనే అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో వెన‌క్కి త‌గ్గింది. మ‌రో వైపు తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి మంచి ఆలోచ‌న చేసింది. అన్ని యూనివ‌ర్శిటీ ప‌రిధిలోని డిగ్రీ కోర్సుల‌లో ఒకే సిల‌బ‌స్ వుండేలా నిర్ణ‌యించింది. ఆ మేర‌కు ఎక్స్‌ప‌ర్ట్స్‌తో సిల‌బ‌స్‌ను రూపొందించేలా చేసింది. దీని వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వు విద్యార్థుల‌కు. గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛందంగా వంట గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకునే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇదే స్ఫూర్తితో మోదీ స‌ర్కార్ నిరుపేద విద్యార్థుల కోసం ఇంకో ప‌థ‌కానికి శ్రీ‌కారం చుడుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకునే పూర్ స్టూడెంట్స్ కోసం బోధ‌న ఖ‌ర్చును భ‌రించేందుకు ఎవ‌రైనా ముందుకు వ‌స్తే..ట్యాక్స్ ఎక్షం...

హ‌మ్మ‌య్య‌..బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విప్ర‌కాష్

చిత్రం
టీవీ9 వ్య‌వ‌స్థాప‌కుడిగా , బ్రాడ్‌కాష్టింగ్ జ‌ర్న‌లిస్ట్ గా పేరొందిన ర‌విప్ర‌కాష్ ఎట్ట‌కేల‌కు మౌనం వీడారు. ఎన్నో ట్విస్టులు..అనుమానాలకు పుల్ స్టాప్ పెడుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆయ‌న కొంత కాలం పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ర‌విప్ర‌కాష్ ను ప‌ట్టుకునేందుకు హైద‌రాబాద్ సీపీ పోలీసులు గాలింపులు చేప‌ట్టారు. అయినా ఈ మీడియాధిప‌తి చిక్క‌లేదు. ఆ మ‌ధ్య కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. త‌న‌ను కావాల‌ని ఇరికించార‌ని, తాను నిబ‌ద్ధ‌త క‌లిగిన జ‌ర్న‌లిస్టునంటూ..స‌మాజ హితం కోస‌మే ప‌నిచేస్తున్నానని చెప్పారు. కానీ పోలీసులు  మాత్రం త‌మ ప‌ట్టు వీడ‌లేదు. ఎందుక‌నో ఇంత డ్రామా న‌డిచింది. కేసులు న‌మోదు చేసిన‌ప్పుడే ..సీపీ ఎదుట హాజ‌రై వుంటే ఇంత త‌తంగం జ‌రిగి ఉండేది కాదు. స్టోరీ మేకింగ్‌లో కింగ్ మేక‌ర్‌గా, వేలాది మందిని ఇంట‌ర్వ్యూ చేసిన ఈ జ‌ర్న‌లిస్టు చివ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు, వివ‌ర‌ణ ఇచ్చేందుకు నానా తాత్సారం చేశారు. దీనిపై సీనియ‌ర్లు ఆయ‌న తీరును త‌ప్పు ప‌ట్టారు. అజ్ఞాతం వీడిన ర‌విప్ర‌కాశ్ ..సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైం ఠాణాలో పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌య‌మే వ‌స్తాన‌ని ముందస్తుగా స‌మాచారం ఇవ్వ‌డంతో ఇన్వెస...

ప్ర‌పంచాన్ని నివ్వెర ప‌రిచిన జియోమీ - విద్యుత్ బైక్‌ను లాంఛ్ చేసిన చైనా

చిత్రం
లోకంలో కొత్త వ‌స్తువును త‌క్ష‌ణ‌మే రూపొందించాలంటే చైనా దేశం త‌ర్వాతే ఏదైనా. ఇప్ప‌టికే త‌క్కువ ధ‌ర‌లో..అంద‌రికీ అందుబాటులో ..అన్ని ఫీచ‌ర్స్ వుండేలా మొబైల్స్, యాక్సెస‌రీస్‌, టీవీల‌ను రూపొందిస్తూ వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్న‌ది జియోమి. అంద‌రూ రెడ్ మిగా పిలుస్తారు. ఇపుడు ప్ర‌పంచాన్ని నివ్వెర పోయేలా చేసింది ఆ కంపెనీ. ఏకంగా కేవ‌లం విద్యుత్ తో న‌డిచే బైక్‌ను త‌యారు చేసింది. ఆక‌ట్టుకునే డిజైన్‌తో ..అంద‌రికీ సౌక‌ర్యంగా ఉండేలా తీర్చిదిద్దింది. ఇంకేం ఇపుడంతా దానిని స్వంతం చేసుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నం పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి చైనాలో ఈ కంపెనీ తాజాగా విడుద‌ల చేసింది. ఇంకేం లోకమంత‌టా ఈ బైక్ ..వైర‌ల్‌గా మారింది. ఇదీ చైనాకున్న స‌త్తా ఏమిటో మ‌రోసారి నిరూపించుకుంది. ఈ విద్యుత్ సాయంతో న‌డిచే బైక్ పేరు హిమో టి1. 14000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం దీని స్వంతం. దీనిని ఇండియ‌న్ మార్కెట్‌లో స్వంతం చేసుకోవాలంటే..మీ ద‌గ్గ‌ర 30 వేల రూపాయ‌లు వుంటే చాలు. ఎంచ‌క్కా ఈ బుల్లి బైక్ మీద స్వారీ చేయొచ్చు. ఎలాంటి టెక్నిక్ వుండాల్సిన ప‌నిలేదు. ఎక్కువ నాలెడ్జ్ కూడా అక్క‌ర్లే...

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ - మ‌రిచి పోని మ‌ధుర క్ష‌ణాలు

చిత్రం
ఇండియా అంటేనే ఒక‌ప్పుడు హాకీ ఆట‌కు పేరుండేది. ఇదే మ‌న జాతీయ క్రీడ కూడా. కానీ ఇపుడు ఆ సీన్ మారింది. ఎప్పుడైతే క‌పిల్‌దేవ్ నేతృత్వంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ గెలిచిందో ఆ రోజు నుంచి నేటి దాకా భార‌త్ ను క్రికెట్ అల్లుకు పోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్క‌డ చూసినా క్రికెట్టే. కోట్లాది మంది భార‌తీయులు..ప్ర‌పంచ మంత‌టా ప్ర‌వాసీయులంతా క్రికెట్ అంటే చ‌చ్చి పోతున్నారు. అంత‌గా అభిమానం పెంచుకున్నారు. క్రికెట్ ఆట అత్యంత జ‌నాద‌ర‌ణ‌ను పొందుతోంది. క్రికెట్ ప్రేమికుల‌కు అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని క‌లుగ చేస్తోంది. బంతికి, బ్యాట్‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటంలో ఎవ‌రు గెలుస్తారో తెలియ‌దు కానీ ..న‌రాలు తెగిపోతాయోమోన‌న్న ఉత్కంఠ జ‌నాన్ని ఊపేస్తోంది క్రికెట్. మొద‌ట‌గా ఇంగ్లండ్‌లో ప్రారంభ‌మైన క్రికెట్ ఆట‌..ఇపుడు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించింది.  అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏది చెబితే అది వేదం. అదే శాస‌నం. ముఖ్యంగా దాయాదులైన ఇండియా, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డితే ఓ యుద్ధం జ‌రిగిన‌ట్లే భావిస్తారు ప్ర‌పంచ‌మంతా. అంత‌గా పాపుల‌ర్ అయ్యిందీ ఈ క్రికెట్. పొలిటి...

స్వామీ స‌దా స్మరామి - ఆశీస్సులు పొందిన జ‌గ‌న్

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అత్య‌ధిక సీట్ల‌ను గెలుపొంది అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌స‌భ స్థానాల్లో త‌న స‌త్తాను చాటిన వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు , ఏపీ సీఎం విశాఖ‌కు వ‌చ్చారు. ఆయ‌న‌కు అపూర్వ‌మైన రీతిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అభిమానులు జేజేలు ప‌లికారు. దారి పొడ‌వునా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు, బాణా సంచాలు పేలుస్తూ ..వేలాది మంది ఆయ‌న వెంట ప‌రుగులు తీశారు. జై జ‌గ‌న్ అంటూ నినాదాలు చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ యువ‌నేత కొట్టిన దెబ్బ‌కు అప‌ర చాణుక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు విల‌విల లాడి పోయారు. ఆ పార్టీకి ఇపుడు జ‌నం లేకుండా పోయారు. అంత‌లా ఈ యువ‌నేత త‌న స్ట్రాట‌జీని ప్లాన్ చేసుకుంటూ చాప కింద నీరులా ప‌వ‌ర్ లోకి వ‌చ్చారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోగా , 22 స్థానాల్లో ఎంపీ సీట్ల‌ను గెలుపొంది త‌న ప‌వ‌ర్ ఏమిటో రుచి చూపించారు ప‌సుపు త‌మ్ముళ్ల‌కు. అతిర‌థ మ‌హారథులు, సీనియ‌ర్ నాయ‌కులు వైసీపీ ప్ర‌భంజ‌నానికి కొట్టుకు పోయారు. అంత‌లా జ‌నం ఛీ కొట్టారు టీడీపీ శ్రేణుల్ని. ఆఖ‌రులో ప‌సుపు కుంకుమ అంటూ జ‌నాన్ని బురిడీ కొట్టించాల‌ని చూస...

ప్రాదేశిక ఎన్నిక‌ల్లో గులాబీ జెండా రెప‌రెప‌లు

చిత్రం
తాజాగా జ‌రిగిన 17వ లోక్‌స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 9 సీట్ల‌కే ప‌రిమిత‌మైన అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ తిరిగి కోలుకుంది. 17 లోక్‌స‌భ స్థానాల‌కు గాను ఒక దానిని మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకు కేటాయించ‌గా మిగ‌తా 16 స్థానాల్లో పోటీ చేసింది. హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో అనూహ్యంగా బీజేపీ 4 సీట్లు గెలుచుకోగా ..3 సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. విచిత్రం ఏమిటంటే ఎంపీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు 186 మంది ఎంపీ సీటు కోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం దేశ వ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించారు. వీరిని లైట్ గా తీసుకున్న సిట్టింగ్ ఎంపీ క‌వితకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆమె ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కొడుకు ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేతిలో 60 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది సీఎంకు భారీ దెబ్బ‌.  ఆ త‌ర్వాత జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జీవ‌న్ రెడ్డి గెల‌వ‌డం కూడా మింగుడు ప‌డ‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు. అందులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి పాలైన తాండూరుకు చెందిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి సీఎం క...