పోస్ట్‌లు

జనవరి 9, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండియాకు ఇరాన్ స్వాగతం

చిత్రం
ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు నిలిపి వేయాలని కోరుతోంది. ఇప్పటికే శాంతి కోసం కృషి చేస్తున్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అంతే కాక ఇరాన్, ఇండియాల మధ్య మంచి స్నేహం కూడా ఉన్నది. మరో వైపు యుఎస్ , ఇరాన్‌ ల మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చల కోసం భారత్‌ ప్రయత్నిస్తే స్వాగతిస్తామని అలీ చెగేనీ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే దేశాలలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చర్చల కోసం భారత్‌ చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. ఢిల్లీలో ఇరాన్‌ ఎంబసీ నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న అలీ చెగేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మధ్య వర్తిత్వం చేయాలని కోరారు. ఇరాన్‌ అమెరికాల మధ్య శాంతికి ఏ దేశం ప్రయత్నించినా స్వాగతిస్తామని, అలాగే భారత్‌, ఇరాన్‌ మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగా భారత్‌ మరింత చొరవ తీసుకోవాలని కోరారు. కాగా ఇరాన్‌ మిలటరీ జనరల్‌ ఖా...

బైజూస్‌లో గ్లోబల్ భరోసా

చిత్రం
ఇండియన్ అంకురాలు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షితున్నాయి. ఇప్పటికే చాలా స్టార్ట్ అప్స్ కోట్లు కొల్లగొట్టాయి. తాజాగా ఇండియాకు చెందిన బైజూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 4 కోట్ల రికార్డు డౌన్‌లోడ్లతో దూసుకు పోతున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బైజూస్‌ తాజాగా భారీ పెట్టుబడులను సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్  నుంచి 200 డాలర్లను పెట్టుబడులను కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా  ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ వ్యవస్థాపకుడు సీఈవో రవీంద్రన్  ప్రకటించారు. దీంతో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బైజూస్‌ వాల్యూ 8 బిలియన్ల డాలర్లు మించి పోతుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో  2015 లో స్థాపించబడిన బైజూస్ భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది. టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ వంటి బలమైన పెట్టుబడిదారుడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బైజూస్‌ సీఈవో తెలిపారు. విద్యార్థులు నేర్చుకునే విధానంలో పలు మార్పులు తీసుకు రావాలన్న తమ దీర్ఘకాలిక దృష్టికి, ఆవిష్కరణలకు మరో అడుగు ముందుకు పడినట్టు తెలిపారు. టైర్ 2, 3 నగర...

మేజావా మజాకా

చిత్రం
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం మరీ చిన్నదై పోయింది. క్షణాల్లో ఏదైనా వైరల్ అవుతోంది. ఇది కూడా ఓ సంచలనమే. ప్రతి రోజూ ఏదో ఒకటి సెన్సేషనల్ అవుతోంది. తాజాగా లోకంలో ఓ అద్భుతమైన వార్తకు తెర తీశాడు జపాన్ కు చెందిన అపార కుబురుడుగా ఇప్పటికే పేరొందిన యుసాకు మేజావా. మనోడు ఉన్నట్టుండి అమెరికా సైతం విస్తు పోయేలా చేశాడు.సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్‌ ఇండస్ట్రీ దిగ్గజం మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా 64.36 కోట్లు పంచి పెట్టడం హల్‌ చల్‌ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది. సోషల్‌ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన తన ట్విటర్‌లో అనుచరులు వెయ్యి మందికి ఈ నగదును పంచి పెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా ట్విటర్‌లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యి మంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి సుమారు రూ .64.36 కోట్లు అంద జేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్‌ లో రెండవ అతిపెద్ద షాపింగ్‌ సంస్థ జోజో ఇంక్‌ వ్యవస్థాపకుడైన యుసాకు చేసిన ఈ ట్వీట్‌  రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల షేర్లను సాధించింది. 9 లక్షలకు పైగా లై...

దీపికకు అనురాగ్ అండ

చిత్రం
ఇది పబ్లిసిటీ స్టంట్‌ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతవు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు అంటూ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌..బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండి పడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేక పోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్‌ ప్రమోషన్‌ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్‌ చేస్తూ.. సినిమాకు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు.  ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్‌ మాట్లాడుతూ..ఆయిషీ ఘోష్‌ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు. నీ బాధను నే...

రియల్ ఎస్టేట్ కు ఎస్‌బీఐ ఊతం

చిత్రం
ఇప్పటికే దేశ ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీంతో ఉద్దీపన చర్యలు చేపట్టింది ఆర్థిక శాఖ. అయినా ఏరోజు వరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అలాగే నిర్మాణ రంగం కూడా మందగమనంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలని ఎస్‌బీఐ డిసైడ్ అయ్యింది. దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ‘సప్నా ఆప్‌కా, భరోసా ఎస్‌బీఐ కా’  అనే పేరుతో కొత్త పథకాన్ని  ప్రారంభించింది. దీని ప్రకారం ఎస్‌బీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తి కాక పోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీగా తీసుకొస్తున్న ఈ పథకాన్ని తొలుత ముంబై నగరంలో ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్‌బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట...

ఆప్ నిలిచేనా..కమలం వికసించేనా

చిత్రం
నిన్నటి దాకా చక్రం తిప్పి మరాఠాలో బోల్తా పడిన ప్రధాని మోదీజీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర శాలు దేశ రాజధానిలో ఈసారి ఎలాగైనా సరే పాగా వేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఎప్పుడూ లేనంతగా ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. అది కూడా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలో పవర్ కోసం ఎన్నికల బరిలో ఆటో ఇటో తేల్చుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ఆప్ అందరికంటే ముందంజలో ఉందనే చెప్పాలి. ఇంకో వైపు పౌరసత్వ సవరణ చట్టం పై ఢిల్లీ వాసులు భగ్గుమంటున్నారు. తాజాగా జేఎన్ యు లో స్టూడెంట్స్ పై దాడులు దేశమంతటా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఇదంతా కావాలనే బీజేపీ దాని అనుబంధ సంస్థలు చేపట్టాయంటూ స్టూడెంట్స్ యూనియన్స్ ఆరోపించాయి. అయితే ఇప్పుడు ఎవరు హస్తినలో పాగా వేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయ పటంలోని ప్రధానమైన మూడు పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా బీజే...

దాడులపై క్రీడాలోకం ఫైర్

చిత్రం
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో దుండగుల వీరంగాన్ని భారత క్రీడాలోకం ఖండించింది. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో విద్యార్థి యూనియన్‌ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇర్ఫాన్‌ పఠాన్, అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల ట్విట్టర్‌లో స్పందిస్తూ దాడిని ముక్త కంఠంతో ఖండించారు. వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హింస భారత దేశ సంస్కృతికి విరుద్ధమైంది. కారణాలేవైనా కావొచ్చు, కానీ విద్యార్థులే లక్ష్యంగా దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ ఘటన దారుణమైనది. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఏకంగా క్యాంపస్‌లోపలే ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడి చేయడం మన దేశ ప్రతిష్టను మరింత దిగ జార్చుతుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో భయానక దాడి జరిగింద...