రియల్ ఎస్టేట్ కు ఎస్బీఐ ఊతం
ఇప్పటికే దేశ ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీంతో ఉద్దీపన చర్యలు చేపట్టింది ఆర్థిక శాఖ. అయినా ఏరోజు వరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అలాగే నిర్మాణ రంగం కూడా మందగమనంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలని ఎస్బీఐ డిసైడ్ అయ్యింది. దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ‘సప్నా ఆప్కా, భరోసా ఎస్బీఐ కా’ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఎస్బీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తి కాక పోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీగా తీసుకొస్తున్న ఈ పథకాన్ని తొలుత ముంబై నగరంలో ప్రారంభించింది.
ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ప్రారంభించిన ఈ పథకాన్ని క్రమంగా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రేరా, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కు పోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీష్ కుమార్ భరోసా ఇచ్చారు.
సొంతింటి కల సాకారం కోసం బ్యాంకు రుణాలు తీసుకొని మరీ సొమ్మును పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి, అవి సమయానికి పూర్తి కాక మధ్యలో నిలిచి పోవడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు బ్యాంకు తెలిపింది. ఈ పథకం గరిష్టంగా 2.5 కోట్ల విలువ ఉన్న గృహాలకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సుమారు 50 కోట్ల నుంచి 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. బిల్డర్ గడువులోగా వినియోగదారునికి ఇంటిని అందించలేక పోతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ను బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం బిల్డర్ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. ఈ కొత్త పథకం వల్ల అటు వినియోగదారులు ఇటు బిల్డర్లకు మేలు జరుగుతుందని ఎస్బీఐ అంటోంది.
ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ప్రారంభించిన ఈ పథకాన్ని క్రమంగా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రేరా, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కు పోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీష్ కుమార్ భరోసా ఇచ్చారు.
సొంతింటి కల సాకారం కోసం బ్యాంకు రుణాలు తీసుకొని మరీ సొమ్మును పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి, అవి సమయానికి పూర్తి కాక మధ్యలో నిలిచి పోవడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు బ్యాంకు తెలిపింది. ఈ పథకం గరిష్టంగా 2.5 కోట్ల విలువ ఉన్న గృహాలకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సుమారు 50 కోట్ల నుంచి 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. బిల్డర్ గడువులోగా వినియోగదారునికి ఇంటిని అందించలేక పోతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ను బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం బిల్డర్ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. ఈ కొత్త పథకం వల్ల అటు వినియోగదారులు ఇటు బిల్డర్లకు మేలు జరుగుతుందని ఎస్బీఐ అంటోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి