దాతృత్వంలో శివ్ నాడార్ టాప్

ప్రపంచంలో లెక్కలేనంత మంది ధనవంతులు ఉన్నారు. పట్టలేనంతగా కరెన్సీ, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు ఉన్నాయి. కానీ అంత కంటే ఎక్కువగా పేదలు కాలే కడుపులతో చావుకు దగ్గరవుతున్నారు. ఇక ఇండియా పరంగా చూస్తే జనాభా 130 కోట్లు ఉన్నా వీరిలో కేవలం 10 శాతం మంది చేతుల్లో మాత్రమే సంపద పోగై ఉన్నది. వీరిలో ఎక్కువగా దేశానికి పన్ను చెల్లించకుండా అక్రమ మార్గాల్లో, హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించి, అక్కడి బ్యాంకుల్లో దాచుకున్న వారే. వీరిలో ఇప్పటికే వేలాది మంది స్విస్ బ్యాంక్ లో దాచుకున్న వారున్నారు. మరో వైపు కోట్లాది ఆస్తులు, డబ్బులున్నా ఒక్క పైసా పేదల కోసం, సమాజ అభివృద్ధి కోసం పాటు పడిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా కొందరు డబ్బున్న మారాజులు మాత్రం తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నారు చెన్నైకి చెందిన పారిశ్రామిక టెక్ దిగ్గజం శివ్ నాడార్. తాజాగా ఇండియాలో దేశ ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా, తమ సంస్థల ద్వారా చేస్తున్న కృషి ఆధారంగా దాతల జాబితాను..రూపొందించారు. ఈ జాబితాలో ప్రముఖ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన రెండో స్థానంలోఉండ...