పోస్ట్‌లు

మే 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దౌడు తీస్తున్న డెయిలీ హంట్ - భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్

చిత్రం
దేశ వ్యాప్తంగా న్యూస్ విష‌యంలో ట్రెండింగ్ సృష్టిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్న డెయిలీ హంట్ కు భారీ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది సాఫ్ట్ బ్యాంక్ . కంటెంట్ విష‌యంలో , న్యూస్ విష‌యంలో డైలీ హంట్ దూసుకెళుతోంది. తాజా వార్త‌ల‌ను, విశేషాల‌ను, ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను యాప్‌లో పొందు ప‌రుస్తోంది. దీంతో త‌క్కువ టైంలోనే భారీగా స్పంద‌న వ‌చ్చింది. డిజిట‌ల్ టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు న్యూస్‌ను, వ్యూస్‌ను పొందుప‌రుస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. 150 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టింది సాఫ్ట్ బ్యాంక్ . ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇండియ‌న్ న్యూస్ స్టార్ట‌ప్‌ల‌లో ఇదో రికార్డు అని చెప్పాలి. ఇపుడు సాఫ్ట్ బ్యాంకు డెయిలీ హంట్ కంపెనీగా మారి పోయింది. జ‌పాన్ లో సాఫ్ట్ బ్యాంకుకు ఎక్క‌డ‌లేని జ‌నాద‌ర‌ణ ఉంది. బ్యాంకింగ్ రంగంలో అత్యున్న‌త‌మైన స్థానంలో ఉన్న సాఫ్ట్ బ్యాంకు ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ట‌ప్ కంపెనీల‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. అందులో భాగంగానే డైలీ హంట్ ను టేకోవ‌ర్ చేసింది. రీజిన‌ల్ లాంగ్వేజెస్ ప్ర‌ధానంగా ఈ న్యూస్ ప‌నిచేస్తోంది. ఇందులో కంటెంట్ మిగ‌తా వాటికంటే భిన్నంగా అప్ లోడ్ చేయ...

ఇండియ‌న్ పీపుల్స్ మేనేజ‌ర్స్ వీళ్లే - 100 మందితో ఫోర్డ్స్ జాబితా

చిత్రం
ప్ర‌పంచంలో పేరొందిన ఫోర్బ్స్ తాజాగా ఇండియాలో అత్యున్న‌త‌మైన మేనేజ‌ర్లు ఎవ‌ర‌నే దానిపై స‌ర్వే చేసి 100 మంది తో జాబితా వెల్ల‌డించింది. ఇందులో పురుషుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా చోటు ద‌క్కించుకున్నారు. ఆయా కంపెనీల‌ను లాభాల బాట ప‌ట్టించ‌డం, ఉద్యోగుల‌కు స్ఫూర్తిగా నిల‌వ‌డం, విలువ‌ల‌కు పెద్ద పీట వేయ‌డం, త‌దిత‌ర అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుని సంస్థ ఎంపిక చేసింది. ఎంపికైన వారిలో జూనియ‌ర్ మేనేజ‌ర్స్ తో పాటు సీనియ‌ర్లు కూడా ఉన్నారు. మొద‌టి స్థానంలో అభిషేక్ కుల్‌క‌ర్ణి నిలిస్తే..రెండో స్థానంలో అయిక్రా త్యాగి నిలిచారు. వీరితో పాటు అలోక్ ప్ర‌తాప్ సింగ్, అమిత్ ర‌మ‌ణి, అనిల్ ఖ‌న్నా, అంకుర్ షా, అంశుల్ జైన్, అనిఫ్ ఖాన్, అరున్ ఎం విజ‌య‌న్, ఆషిష్ జోషి, అషీమా రూణా చోటు ద‌క్కించుకున్నారు. బాన్సి రైజా, బ్రిజేష్ సింగ్, దేబ‌షిస్ పాండా, దీప‌క్ శ్రీ‌వాత్స‌వ‌, ధ‌ర్మేంద్ర జైన్, దిలీప్ కుమార్ కందేల్ వాల్, డాక్ట‌ర్ అంకితా సింగ్, డాక్ట‌ర్ అరుణ్ బాల‌కృష్ణ‌న్, డాక్ట‌ర్ రేష్మా తివారీ, డాక్ట‌ర్ శిఖా తివారీ, ఫ‌యాజ్ ఇంజ‌నీర్, గ‌గ‌న్ జ్యోత్, ఎస్. గ‌ణేష‌న్, గౌర‌వ్ సేఠ్, గురుజోధ్ పాల్ సింగ్, హ‌రి చ‌ర‌ణ్ రావు, హ‌రీష...

బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా

చిత్రం
పోలింగ్ ముగిసింది..ఓట్ల లెక్కింపే మిగిలింది. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జ‌నం ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా జాతీయ స్థాయిలో పేరున్న నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీలో తిరిగి ప‌వ‌ర్‌లోకి వ‌స్తామని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ గంద‌ర‌గోళం సృష్టించేందుకు య‌త్నిస్తోంద‌ని..స‌ర్వేలు ఎంత‌గా బాకాలు ఊదినా ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌ని ఆయ‌న అంటున్నారు. మ‌రో వైపు వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్న‌డూ లేనంత‌గా ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. ఆనందాన్ని త‌ట్టుకోలేక పోతున్నారు. తండ్రి చ‌నిపోయిన‌ప్పుడే ఉమ్మ‌డి ఏపీకి సీఎం కావాల‌ని ఎమ్మెల్యేల‌తో సంత‌కాలు కూడా చేయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. జ‌గ‌న్ మొద‌టి నుంచి తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. బీజేపీతో లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారు. ఆ త‌ర్వాత త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకు హైద‌రాబాద్‌లో గులాబీ బాస్ కేసీఆర్‌తో చెలిమి చేశారు. ఎంఐఎం కూడా ఆయ‌న‌కే వ‌త్తాసు ప‌లికింది. ప‌సుపు కుంకుమ‌, రైతుబంధు ప‌థ‌కాల వ‌ల్ల ల‌క్ష‌లాది మందికి ల‌బ్ధి చే...

బిగ్ ఆఫ‌ర్ కొట్టేసిన లివ్ స్పేస్

చిత్రం
ఐటీ అంటేనే బెంగ‌ళూరు. ఇండియాకు స్వ‌ర్గ‌ధామంగా విరాజిల్లుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ పొరుగు సేవ‌లను ఇక్క‌డి ఐటీ కంపెనీల‌తో అనుసంధాన‌మై ప‌నిచేస్తున్నాయి. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ‌చ్చి ప‌డిన ఐటీ కంపెనీల పుణ్య‌మా అని ల‌క్ష‌లాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తున్నాయి. అంకురాల‌కు, ఆంట్ర‌ప్రెన్యూర్ల‌కు విప‌రీత‌మైన స్కోప్ ల‌భిస్తోంది. దీంతో ఔత్సాహికులు, యంగ్ ఛాప్స్ అంతా ఐటీ జ‌పం చేస్తున్నారు. జీవితానికి స‌రిప‌డా వేత‌నాలు ఉండ‌నే ఉన్నాయి. క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటున్నారు. ఎప్పుడూ లేనంత‌గా గ‌త 10 సంవ‌త్స‌రాలుగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీకి సంబంధించి..అనుబంధంగా ఉన్న కోర్సుల‌ను చ‌దివేందుకు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల నుండి ఇండియాకు వ‌స్తున్నారు చ‌దివేందుకు. అంత‌టి డిమాండ్ ఉంటోంది ఇక్క‌డి కాలేజీలు, సంస్థ‌ల‌కు. ఎంఐటీలు, ఐఐటీలు, ఎంఐటీలు వాటిలోనివే. హెవీ పోటీ ఉంటోంది వీటికి. ల‌క్ష‌లాది మంది ప్ర‌తి ఏటా జేఇఇ మెయిన్స్, అడ్వాన్స్ కు ప్రిపేర్ అవుతారు. వీరిలో కొద్ది మందికి మాత్ర‌మే ఛాన్స్ వ‌రిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టా...

భాగ్య‌న‌గ‌రం అద్భుతం..ప్రేమ అజ‌రామ‌రం

చిత్రం
నియాన్ లైట్ల వెలుతురులో నా న‌గ‌రం వెలిగి పోతోంది. గుండె గుండెలో ప్రేమ జ‌ల్లుల‌ను చ‌ల్లుకుంటూ. రంజాన్ వేళ‌ల్లో నిండు చంద‌మామ క‌దులుతూ వుంటే..లాడ్ బ‌జార్ లో గాజుల గ‌ల‌గ‌ల‌లు హృద‌యాల‌పై చెర‌గ‌ని రాగాల‌ను అద్దుతాయి. అప్పుడే పూసిన పూలు..విచ్చుకున్న పెద‌వుల మ‌ధ్య న‌వ్వుల కేరింత‌లు..కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌నం ఒక‌రినొక‌రు చూసుకుంటూ స‌ముద్రంలోని ఇసుక రేణువుల్లా త‌చ్చ‌ట్లాడుతూ వుంటే ..మ‌ళ్లీ ప్రేమ‌త‌న‌పు జ్ఞాప‌కాలు మ‌న‌సులో చిగురిస్తాయి. ప్రేమంటే గుండెల క‌ల‌యిక‌. తాను ప్రేమించిన ..త‌న కోసం జీవితాన్ని అర్పించిన భాగ్‌మ‌తి కోస‌మే క‌దా ఈ న‌గ‌రం రూపు దిద్దుకున్న‌ది. అదే భాగ్య‌న‌గ‌ర‌మై భాసిల్లుతోంది. కోట్లాది ప్ర‌జ‌ల ఆత్మ‌ల‌న్నీ ఒక్క‌టై న‌గ‌రాన్ని అల్లుకు పోయేలా చేస్తోంది. ఈ ప్రాంతంలో అడుగు పెడితే చాలు ప్రేమ ఉప్పొంగుతుంది. వెల్లువ‌లా చుట్టేస్తుంది. అటు చూస్తే చార్మినార్ ..న‌గ‌ర‌పు వాసుల ఉమ్మ‌డి ఆస్తి. ప్ర‌పంచానికే పాఠం నేర్పిన చ‌రిత్ర ఈ న‌గ‌రానిదే. త‌రాలు మారినా వ‌న్నె త‌గ్గ‌లేదు. అప్ర‌హ‌తిహ‌తంగా త‌న ఖ్యాతిని దిగంతాల‌కు వ్యాపించేలా భాగ్య‌న‌గ‌రం త‌న‌ను తాను మ‌లుచుకుంది. ప్రేమ కోసం కోట్లాది...

హైద‌రాబాద్‌లో హాటెస్ట్ స్టార్ట‌ప్స్ ఇవే

చిత్రం
భాగ్య‌న‌గ‌రంలో అంకురాలు లెక్క‌లేన‌న్ని పుట్టుకొస్తున్నాయి. ఐడియాలు వుండ‌టం వేరు..వాటిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చి విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం వేరు. జ‌స్ట్ ప‌ట్టుమ‌ని 20 ఏళ్లు కూడా నిండ‌ని యువ‌తీ యువ‌కులు అద్భుతంగా క‌ల‌లు కంటున్నారు. త‌మ కాళ్ల మీద నిల‌బ‌డాల‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. కాన్ఫిడెన్స్ లేవ‌ల్ పెరిగి పోతోంది వీరికి. డిఫ‌రెంట్ గా ఆలోచించ‌డం..స‌మాజానికి ..దేశానికి ప‌నికి వ‌చ్చేలా ప్రాజెక్టును త‌యారు చేసుకోవ‌డం ..ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌డం..ప‌ది మందికి ఉపాధి క‌ల్పించ‌డం..ప‌ది కాలాల పాటు కంపెనీ ఉండేలా స్టార్ట‌ప్స్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం. టీ హ‌బ్ స్టార్ట్ అయ్యాక‌..స్టార్ట‌ప్‌ల సంద‌డి మ‌రింత పెరిగింది. చూస్తే పిల్ల‌లు అపుడే లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేయాల‌ని అనుకోవ‌డం లేదు..త‌మ‌ను తాము నిరూపించు కోవాల‌ని కోరుకుంటున్నారు.ఒక‌ప్పుడు..జ‌ల్సాలు..ప‌బ్‌లు..రెస్టారెంట్‌లు..మందులు..విందులు..ఇలా టైంను వేస్ట్ చేసే వాళ్లు..ఐటీలో పెను మార్పులు వ‌చ్చాక ..కాలానికి ఎదురీదుతున్నారు. ఇత‌రులతో పోటీ ప‌డుతున్నారు. ఇదంతా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలోనే క్రియేట్ చేస్తున్నారు. ఎక్క‌డ కూడా ఒక‌రిపై మ‌రొ...

స‌ర్వేల‌న్నీ ఒకే మాట‌..ఒకే బాట‌..అన్నీ గంప గుత్తే

చిత్రం
దేశ వ్యాప్తంగా 17వ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఏడు ద‌శ‌ల్లో జ‌రిగాయి. కొన్ని చెదురుమ‌దురు సంఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ పూర్త‌యింది. ఇక స‌ర్వే సంస్థ‌లు పొలోమంటూ ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ప్రీ పోల్ స‌ర్వేల ఫ‌లితాలు ప్ర‌క‌టించాయి. అస‌లు ఏయే పార్టీల‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయో కూడా చెప్పేశాయి. అన్నీ ఒకే రాగం ఆలాపించాయి. అదేమిటంటే మోదీ తిరిగి అధికారంలోకి రానున్నార‌ని ఇవే స్ప‌ష్టం చేశాయి. ఇంకా ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఎవ‌రు ఎవ‌రికి ఒటు వేశారో తెలియ‌దు. కానీ స‌ర్వేల‌న్నీ క‌మ‌లానికే మ‌ద్ధ‌తు ప‌లికాయి. స‌ర్వేలకు ఉన్న ప్రాతిప‌దిక‌త ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కు అర్థం కాలేదు. క‌నీసం ప్ర‌తిప‌క్షాలు, ప్రాంతీయ పార్టీలు అడ్ర‌స్ లేకుండా పోయాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టిక‌ప్పుడు నిజ‌మైన స‌ర్వే చేప‌డితే ..ఎక్క‌డ చూసినా ప్ర‌జా వ్య‌తిరేక‌త తీవ్ర స్థాయిలో ఉంది. జ‌నాన్ని త‌మ వైపు తిప్పుకోవ‌డంలో, వారిని ఓట్లుగా మల్చుకోవ‌డంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర‌ప‌క్షాలు ఘోరంగా వైఫ‌ల్యం చెందాయి. చంద్ర‌బాబు అన్న‌ట్టు స‌ర్వేల మాట‌లు న‌మ్మ‌కండి. నాకు పూర్తి విశ్వాసం ఉన్న‌ది..తిరిగి మేం అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చ...