పోస్ట్‌లు

అక్టోబర్ 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆత్మరక్షణలో పాకిస్తాన్..సై అంటున్న భారత్

చిత్రం
నిన్నటి దాకా అంతర్జాతీయ వేదికలపై బీరాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి పోయిందా. అవుననే అనిపిస్తోంది ప్రస్తుత నెలకొన్న పరిస్థితులను చూస్తే. ఓ వైపు ఇండియాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మరో వైపు భారత దేశంలోకి ఉగ్రమూకలను పంపిస్తున్న పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి ఇతర దేశాలు. దెబ్బకు ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా మారింది పాక్. దౌత్య పరంగా ఇండియా పూర్తిగా సక్సెస్ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా పీవోకే పై కన్నేశారు. దాడి చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకో వైపు భారత ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అరబ్ దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆ మేరకు అటు వైపు నుంచి పూర్తి మద్దతు లభించేలా చేశారు. దోవల్ దెబ్బకు ఇంటర్నేషనల్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుండి ఇతర చోటుకు మారిపోయాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆయన ఉన్నంత వరకు ఇండియాను ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేమని పాకిస్థాన్ ఆర్మీ భావిస్తోంది. ఒక్కసారి కమిట్ అయినా లేదా ధోవల్ రంగంలోకి దిగారంటే ఇక వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. ప్రతి సారి ప్రమాదకరంగా, చెవిలో జోరీగ లాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుండటం...

విద్యా శాఖ నిర్లక్ష్యం..నిరుద్యోగుల పాలిట శాపం

చిత్రం
కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఎందరో బలిదానాల సాక్షిగా కొత్త రాష్ట్రం కొలువు తీరింది. ఇక తమ బతుకులు బాగు పడతాయని, తమకందరికీ ఉద్యోగాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ దాదాపు ఆరు ఏళ్ళు కావస్తున్నా నేటికీ కొలువుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఊసెత్తడం లేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్టీ పరీక్ష చేపట్టింది. సెలెక్షన్ లిస్ట్ కూడా ప్రకటించింది. కానీ రెండు ఏళ్ళు గడుస్తున్నా నేటికీ నియామక పత్రాలు అందజేయలేదు. తక్షణమే తమకు అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుతూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. మరో వైపు 40 వేలకు పైగా వివిధ పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు వరకు వాటిని భర్తీ చేసిన పాపాన పోలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఒకే ఒక్క సారి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై పలు ఆరోపణలు వచ్చాయి. అయినా సర్కార్ నుంచి స్పందన కనిపించలేదు. మరో వైపు ఎంసె...

స్వామి అనుగ్రహం..జీవితం ధన్యం

చిత్రం
ఆ దేవదేవుడు, ఏడుకొండలపై వెలసిన శ్రీనివాసుడు, పద్మావతమ్మల అనుగ్రహం వల్లనే తనకు కొండపై ఉండే భాగ్యం కలిగిందని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మెన్, ప్రముఖ నటుడు పృథ్వి స్పష్టం చేశారు. ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈ పదవి తనను వరించిందన్నారు. ఇప్పటికే పేరున్న వాళ్ళు తమకు అవసరం లేదంటున్నారు. ఇక్కడే, ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎంతోమంది టాలెంట్ కలిగిన వాళ్ళున్నారని, ఇక నుంచి వారికే అన్నిటా అవకాశాలు కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం కలిగిన నటుడిగా ఆయనకు పేరుంది. నటుడిగా ఇప్పటికే వంద శాతం మార్కులు పడ్డాయి. గత ఎన్నికల్లో హార్డ్ కోర్ గా వైసీపీ పార్టీ గెలుపు కోసం పృధ్వి కష్టపడ్డారు. ఆయన పనితీరు గమనించిన ఏపీ సీఎం జగన్ భక్తి ఛానల్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఛానల్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చే పనిలో నిమగ్నం అయ్యారు. రేయింబవళ్లు కష్టపడుతున్నారు. జీవితంలో ఇంతకు మించిన పదవి ఇంకేముంటుందని ప్రశ్నించారు. ఎస్వీబీసీ చైర్మన్‌ కావటం స్వామి ఇచ్చిన వరం. ప్రపంచ వ్యాప్తంగా స్వామి, అమ్మ వార్లకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. నాకంటే గొప్పవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ సేవ చేసుకునే భాగ్యాన్...

ఆర్టీసీని కాపాడుకోలేమా..?

చిత్రం
భారతదేశంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సంస్థగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పేరున్నది. వేలాది మంది ఈ సంస్థలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు దీనినే నమ్ముకుని బతుకుతున్నాయి. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు రోడ్డెక్కారు. శాంతియుతంగా ఆందోళన బాట పట్టారు. పండుగ వేళ పస్తులతో ఉన్నప్పటికీ తమ సమ్మె కొనసాగి తీరుతుందని స్పష్టం చేశారు. గతంలో ఏలిన పాలకులు ఈ సంస్థను జేబు సంస్థగా మార్చేశారు. వందలాది మంది ఇందులో అక్రమంగా కొలువులు పొందారు. తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని, ఆర్టీసీని కోలుకోకుండా చేశారు. దీనిపై ఆజమాయిషీ లేకుండా పోయింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తమ ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ఏడాది పడుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కువగా నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఆర్టీసీ సంస్థ కార్మికులేనని చెప్పక తప్పదు. ఒకే ఒక్క సంతకంతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలంణగణా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెల...

ఆర్టీసీకి సీఎం కాయకల్ప చికిత్స

చిత్రం
మేం ఎవ్వరినీ తొలగించలేదు. కానీ ఆర్టీసీ కార్మికులు వాళ్లంతకు వాళ్ళే తొలగి పోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులను, సిబ్బందిని తీసుకునే ప్రసక్తి లేదు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తాము నియమ నిబంధనలకు లోబడి ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమిపబడ్డామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. ఈ సీఎం కొన్ని రోజులే ఉంటారని, కానీ తాము కొన్నేళ్లుగా పని చేస్తామని అది సీఎం గుర్తిస్తే మంచిదన్నారు. ఇలా ఉండగా ఆర్టీసీపై పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంఘాలు సమ్మె చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది, ప్రస్తుతం సంస్థలో కేవలం 1200 మంది మాత్రమే ఉన్నారని మా లెక్కల్లో తేలింది. మిగతా వాళ్లంతా నిన్నటితో డి స్మిస్ అయినట్టే. కొత్త వారిని తీసుకుకోవాలని ఆదేశించాం. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. ఎవ్వరిని ఉపేక్షించబోమని కేసీఆర్ అన్నారు. తాము కార్మికుల సంక్షేమాన్ని  దృష్టిలో పెట్టుకుని కొంత వెసలుబాటు ఇచ...

అమ్మకాల్లో షావోమీ సెన్సేషన్

చిత్రం
ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో చైనా కంట్రీకి చెందిన షావోమీ కంపెనీ రికార్డ్ బ్రేక్ చేసింది. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ కంపెనీ అమ్మకాల్లో మాత్రం దుమ్ము రేపుతోంది. ఇదే కంపెనీకి చెందిన 53 లక్షలకు పైగా డివైజ్ లను విక్రయించింది. ఈ ఫెస్టివ్ సీజన్ లో ఏ కంపెనీకి లేనంతటి ఆదరణ షావోమి కి లభించింది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా మొబైల్స్ ను రూపొందించింది. కొత్త ప్రోడక్ట్స్ ను ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి ఇంట్రడ్యూజ్ చేస్తూ మెస్మరైజ్ చేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యాపిల్ మొబైల్ తో పాటు శాంసంగ్ మొబైల్ పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోవడంతో షావోమీ కంపెనీ నిర్వాహకులు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. ఆయా మొబైల్స్ తీసుకున్న కొనుగోలుదారులకు బిగ్ ఆఫర్స్ కంపెనీ ప్రకటించింది. గతంలో ఆఫ్ లైన్ లో మొబైల్స్ విక్రయిస్తే ప్రస్తుతం తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది షావోమీ. కొత్త ప్రాడక్ట్స్ , డివైజెస్ , స్మార్ట్ ఫోన్స్ అన్నింటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. దీంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో దుమ్ము రేపుతున్న సదరు కంపెనీ బడా కంపెనీలకు షా...

బజాజ్‌‌ ఫైనాన్స్‌‌ అదుర్స్

చిత్రం
ఓ వైపు భారత ఆర్ధిక పరిస్థితి మందగమనంలో కొనసాగుతుంటే మరో వైపు  బజాజ్‌‌ ఫైనాన్స్‌‌ లాభాల బాటలో పయనిస్తోంది. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేస్ ను వెనక్కి నెట్టేసింది. దాదాపు 2.32 లక్షల కోట్లకు మార్కెట్‌‌ విలువ పెరగడం విస్తు పోయేలా చేసింది. 10 ఏళ్ల కిందట 1 లక్ష పెట్టుబడి ఇప్పుడు 3.64 కోట్లైంది. ఇది ఇండియన్ మార్కెట్ లో ఓ రికార్డ్ కూడా. ఈ అయిదేళ్లో 13.61 రెట్లు బజాజ్‌‌ ఫైనాన్స్‌‌ షేరు పెరిగింది. నాన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ పైనాన్స్‌‌‌‌ రంగంలోని బజాజ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువ పరంగా స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియాని దాటేసింది. దీంతో దేశంలోని బ్యాంకింగ్‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌ లో అయిదో పెద్ద కంపెనీగా అవతరించింది. మార్కెట్  ట్రేడింగ్‌‌‌‌లో బజాజ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువ 2.32 లక్షల కోట్లను అందుకుంది. ఇదే సమయంలో ఎస్‌‌‌‌బీఐ మార్కెట్‌‌‌‌ విలువ 2.28 కోట్లుగా వుంటే తాజాగా ప్రకటించిన ట్రేడింగ్ లో ఎస్‌‌‌‌బీఐ షేర్లు 5.5 శాతం పతనమయ్యాయి. ఇండియాలోని అనేక ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు సంక్షోభం ఎదుర్కొంటుంటే మరోవైపు బజాజ్‌‌‌‌ ఫైనాన్స్...

ఐదేళ్లల్లో రెండున్నర లక్షల కొలువులు - గూగుల్ టార్గెట్

చిత్రం
ప్రపంచంలోనే అత్యంత ఆదాయంతో పాటు గణనీయమైన, నమ్మకమైన కంపెనీగా పేరున్న గూగుల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సెర్చింగ్ దిగ్గజ కంపెనీగా ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న మార్పులను స్వాగతిస్తూనే ఇంకో వైపు వేలాది మందికి ప్రపంచ వ్యాప్తంగా కొలువులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం ఇవ్వాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ విషయాన్ని గూగుల్ కంపెనీ సీఇఓ సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. అన్ని ఐటీ కంపెనీలకంటే ఎక్కువ డిమాండ్ గూగుల్ కంపెనీకి ఉంటోంది. ఎందుకంటే ఈ సంస్థలో జాబ్ చేయడం అంటే ఉద్యోగులు, నిరుద్యోగులు ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అక్కడ ఉన్నన్ని సౌకర్యాలు ఇంకే కంపెనీలో ఉండవు. ఐటీ సెక్టార్ లో పని చేసే ప్రతి ఒక్కరి కల ఏమిటంటే చని పోయే లోపు ఒక్కసారైనా గూగుల్ లో పని చేయాలని. ఉద్యోగ భద్రత, ఊహించని రీతిలో సౌకర్యాలు, అదనపు బహుమతులు, కావాల్సినంత భోజనం, ఇష్టమైన వేళల్లో పని చేసే వెసలుబాటు, కుటుంబాలతో కలిసి పోయేలా ఇంటి వాతావరణం ఉంటుంది. అందుకే మొదటి ప్రయారిటీ అంతా ఈ కంపెనీ కి ఇస్తారు ఉద్యోగులు. ఎథికల్ హ్యాకింగ్, ఆర...

అటు అరెస్టులు..ఇటు ఆందోళనలు

చిత్రం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె అరెస్టుల దాకా వెళ్ళింది. ఆర్టీసీని విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆయా సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. అంతకు ముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖతో పాటు ఆర్టీసీ యాజమాన్యానానికి నోటీసులు కూడా అందజేశారు. దసరా పండుగ సమయంలో తాము సమ్మె చేయబోతున్నామంటూ ముందస్తుగానే తెలంగాణ ప్రజానీకానికి వెల్లడించారు. ఆ మేరకు ఆర్టీసీలో ఉన్న అన్ని డిపోలలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు మొత్తం 56 వేల మంది విధులను బహిష్కరించారు. ఆందోళన బాట పట్టారు. దీంతో కార్మికులు చేస్తున్న సమ్మె విరుద్ధమని, నిర్దేశించిన గడువు లోగా విధుల్లోకి చేరాలని, లేకపోతే ఆయా విభాగాలలో పనిచేస్తున్న వారందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసి వేస్తామని హెచ్చరించారు. ఆ మేరకు సంబంధిత రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. అయినా ఆర్టీసీ జేఏసీ ఏ మాత్రం ఒప్పుకోలేదు. తమ సంస్థను ప్రభుత్వ...