పోస్ట్‌లు

నవంబర్ 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

లక్ష్మారెడ్డికి లైన్ క్లియర్..?

చిత్రం
ప్రొఫెషనల్ గా డాక్టర్ కోర్సు చేసినా రాజకీయాల్లో మాత్రం ఈ వైద్యుడు వెరీ వెరీ స్పెషల్. సౌమ్యుడిగా, సహృదయుడిగా, మౌనంగా తనపని తాను చేసుకుని పోయే మనస్తత్వం కలిగిన పొలిటికల్ లీడర్ గా, తలపండిన రాజకీయ వేత్తగా, మేధావిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మారెడ్డి కి ఎంతో పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన విస్మరించలేని నాయకుడిగా ఎదిగారు. ఆ దిశగా తనను తాను మలుచుకున్నారు. అత్యంత కింది స్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ లీడర్ ఇప్పుడు జన నాయకుడిగా, ప్రజలు మెచ్చిన సేవకుడిగా మారి పోయారు. చాలా మంది పొలిటికల్ లీడర్లు ఒక్కసారి పదవి వస్తే, దక్కితే చాలు ఇక తమ కోసం పని చేసిన వారిని, తమను నమ్ముకున్న వారిని పట్టించుకోరు. కానీ ఈ డాక్టర్ సాబ్ అలా కాదు. తన ఎదుగుదల కోసం, మొదటి నుంచి తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి జీవితాన్ని ప్రసాదించిన ఘనత లక్ష్మారెడ్డి కే దక్కుతుంది. పుట్టుకతో రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన అన్ని వర్గాల వారిని ఆదరిస్తారు. చేతనైనంత మేరకు సహాయ చేస్తారు. ఎవ్వరికైనా ఆపద వస్తే చాలు వెంటనే స్పందిస్తారు. అంతే కాదు ఏకంగా తనకు జన్మను ప్రసాదించిన, తన ఉన్నతికి కారకులైన వారిని...

నల్లారి కంటే కేసీఆర్ మోస్ట్ డేంజర్

చిత్రం
ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు, ప్రజా ఉద్యమ కారుడు మందకృష్ణ మాదిగఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. వారి తరపున మందకృష్ణ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవన్నారు. అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని న్యాయం, ధర్మం అంతా ఆర్టీసీ కార్మికుల వైపు ఉందన్నారు.   తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్‌లు వస్తాయని కేంద్రం అనుకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. అలాగే ఆర్టీసీని విలీనం చేస్తే 91 కార్పొరేషన్‌ల డిమాండ్‌ చేస్తాయని సీఎం సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు.గతంలో ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామనే విషయంన్ని కేసీఆర్ గుర్తించడం లేదన్నారు. హైకోర్టులో తీర్పు రాక ముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ సంగతి చూస్తాం, అంతు తేలుస్తాం అని అంటున్నారే త...

సోషల్ మీడియాలో సీరియల్ స్టార్స్ హవా

చిత్రం
తెలుగు బుల్లితెర మీద ఇప్పుడు సినీ స్టార్స్ కు ఉన్నంత క్రేజ్ సీరియల్ నటీనటులకు ఉంటోంది. వీరికి ప్రత్యేకంగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటికే సీరియల్స్ క్రియేషన్ లో..టెలికాస్ట్ లో స్టార్ మాటీవీ, జీ తెలుగు, జెమిని టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. ఆయన్ను నేనెంతో ప్రేమించా..నాకింత అన్యాయం చేస్తారను కోలేదు అంటూ కన్నీళ్లు కుమ్మరించి వీక్షకుల కళ్లూ చెమర్చేలా చేస్తున్నారు టీవీ స్టార్స్‌. ఇప్పుడు వీరికి ఏడుపు సన్నివేశాల విరామాల్లో వినోదాన్ని పండిస్తున్నారు. తమ పాపులారిటీని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇందులో భాగంగా టిక్‌ టాక్‌...వీమేట్‌..హలో యాప్స్‌ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి. బుల్లితెర నటులు ఈ మధ్య షూటింగ్‌ గ్యాప్‌లో ఫన్నీ వీడియోస్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటికి వీక్షకులు, ఫాలోవర్స్‌ సంఖ్య కూడా బాగానే ఉంటోంది. కంట తడి పెట్టించే అభినయంలో నిష్ణాతులైన చిన్ని తెర స్టార్స్‌ వైవిధ్య భరిత అంశాల్లో ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించు కోవడానికి టిక్‌ టాక్‌ వీడియాలను ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని, ఫాలోయర్స్‌ని పెంచుకుం...

ఆటపై సచిన్ ఆందోళన

చిత్రం
భారత క్రికెట్ లెజెండ్ గా పేరొందిన సచిన్ రమేష్ టెండూల్కర్ ఆటలో ప్రవేశించి నేటితో ముప్పై ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఈ దిగ్గజ ఆటగాడు క్రికెట్ గురించి తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో నాణ్యమైన పేసర్ల కొరత ఉందని సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. అందువల్లే ఐదు రోజుల ఆటలో బ్యాట్‌కు, బాల్‌కు మధ్య హోరాహోరీ పోరు కరువైందని విశ్లేషించాడు.1970, 80 దశకాల్లో సునీల్‌ గవాస్కర్ తో అండీ రాబర్ట్స్, డెన్నిస్‌ లిల్లీ, ఇమ్రాన్‌ ఖాన్‌ల మధ్య ఆసక్తికర పోరు జరిగేది. అనంతరం నాకూ మెక్‌గ్రాత్, అజహరుద్దీన్, వసీమ్‌ అక్రమ్‌ల మధ్య కూడా దీటైన పోరు జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మంది నాణ్యమైన సీమర్లు ఉండటంతో ఆ పోరే కరువైందని సచిన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 నవంబర్‌ 15న సచిన్‌ టెండూల్కర్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాల్లో టెస్టు క్రికెట్‌లో వచ్చిన మార్పులపై కామెంట్స్ చేశాడు. క్రికెట్‌లో ప్రమాణాలు తగ్గడం టెస్టులకు మంచిది కాదు. నాణ్యత పెరిగి తేనే ఆట బతుకుతుంది. పిచ్‌లలో జీవం కొరవడటమే అసలు సమస్య అని అన్నాడు. ...

క్రికెట్ లెజెండ్ కు ఊరట

చిత్రం
భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్ గా టీమిండియా మాజీ సారధి, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కు భారీ ఊరట లభించింది. ఒక ప్లేయర్ రెండు పదవులు చేపట్టరాదని గత కొన్ని రోజులుగా ఆరోపణలు, ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి. ఆటగాడిగా, సారధిగా ఆయన అనేక విజయాలు భారత జట్టుకు అందించాడు. బ్యాట్సమెన్ గా, వికెట్ కీపర్ గా తన ప్రతిభ పాటవాలతో ఆకట్టుకున్నారు. ఇతోధికంగా సేవలు అందించారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రాహుల్ ద్రావిడ్ ను ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా రాహుల్ చేసిన ప్రసంగం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఆ మొత్తం స్పీచ్ వైరల్ గా మారింది. వరల్డ్ వైడ్ గా పేరొందిన పత్రికలు, టీవీ ఛానల్స్ ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ఈ ఆటగాడు ఎక్కువగా ఆట మీదే దృష్టి పెడతాడు. ఆయన జీవితం మొత్తం క్రికెట్ తో ముడిపడి ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలోనే ఇండియాలో మెరికల్లాంటి ఆటగాళ్లు రాటు దేలారు. ఇప్పడు ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్నారు. టీమీడియాకు ఒకప్పుడు ఆటగాళ్ల కొరత అంటూ ఉండేది. కానీ రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవి చేపట్టాకా దాని స్వరూపమే పూర్తిగా మార్చేశాడు. ఒకరు పోతే ఇంకొకరు రెడీగా ఉండేలా తీర్చి దిద్దాడు ఈ క్రికెట్ దిగ్గజం. ఇ...

టీఅర్పీలో బిగ్ బాస్ సెన్సేషన్

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద సంచలనం రేపింది బిగ్ బాస్ రియాల్టీ షో. స్టార్ టీవీ మా టీవీని కొనుగోలు చేసింది. మొదట దీనిని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ స్టార్ట్ చేయగా, రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను మరో నటుడు నాని హోస్ట్ చేశాడు. మూడో బిగ్ బాస్ ప్రోగ్రాం ను ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ప్రయోక్తగా సక్సెస్ ఫుల్ చేశాడు. ఇందులో నాగార్జున తన అందంతోనే కాదు మాటలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రాయోజిత కార్యక్రమం ఏకంగా 105 రోజుల పాటు కొనసాగింది. ఈ సందర్బంగా గ్రాండ్ ఫినాలేను నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు. ఈ ఫైనల్ ప్రోగ్రాం నాగార్జున-చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, నానిలు ప్రెజెంట్‌ చేసిన తొలి రెండు సీజన్‌ల ఫైనల్స్‌తో పోలిస్తే సీజన్‌ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. ఈ గ్రాండ్‌ ఫినాలేను స్టార్‌ మా ప్రసారం చేసింది. శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని సింగర్ రాహుల్‌ సిప్లీగంజ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎగరేసుకు పోయాడు. ఈ కార్యక్రమ...

గూగుల్ సూపర్ కంప్యూటర్

చిత్రం
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న గూగుల్ టెక్ దిగ్గజం మరో చరిత్రకు నంది పలికింది. ఎప్పుడైతే భారత దేశానికి చెందిన ఐటీ దిగ్గజం, అత్యంత మేధావిగా పేరొందిన సుందర్ పిచ్చెయ్ గూగుల్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన తన బాధ్యతలు చేపట్టారో ఇక అప్పటి నుంచి ఆ కంపెనీ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. వారం లో ఒక రోజు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఉండేలా చర్యలు చేపట్టారు సుందర్. ఈ చెన్నై కుర్రాడు ఏది చేసినా, లేదా ఏ డిసిషన్ తీసుకున్నా అది ప్రపంచాన్ని, ఐటీ రంగాన్ని తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తనకు ఏడాదికి వందల కోట్ల రూపాయలు అందుతున్నా తాను మాత్రం వెరీ సింపుల్ గా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. ఇటీవల తనకు సౌకర్యాలు, అదనపు ప్రయోజనాల కింద కంపెనీ ఇవ్వబోతున్న 400 కోట్ల డాలర్లను తిరిగి కంపెనీ లోని ఉద్యోగుల సౌకర్యం కోసం, విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు తిరిగి ఇచ్చేశారు సుందర్. తనలోని మానవత్వాన్ని, దాతృత్వాన్ని ఈ రూపకంగా చాటుకున్నారు. తాజాగా గూగుల్ అసాధారణమైన ఆవిష్కారణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గూగుల్ లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను ఏర్పాటు చేసింది. సరికొత్త ఐడియాలు, ఆవిష్కర...

వాట్సాప్‌ ఆశలు ఫలించేనా..చెల్లింపులు జరిగేనా

చిత్రం
మోడీ కొలువు తీరాక డిజిటల్ చెల్లింపులకు ప్రయారిటీ పెరిగింది. ఈ రంగంలో ఇప్పటికే పలు కంపెనీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆన్ లైన్ లావాదేవీలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న వాట్సాప్‌ కూడా ఈజీగా డబ్బులు చెల్లించేందుకు ప్లాన్ చేస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల రంగంలో అవకాశాలను అంది పుచ్చు కునేందుకు, ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు ధీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పార దర్శకతను ‘వాట్సాప్‌ పే’ పట్టించు కోక పోవడం అధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పైగా తమ యూజర్లు జరిపే ఆర్థిక లావాదేవీల వివరాలను నిబంధనల ప్రకారం భారత్‌లోనే భద్ర పరుస్తోందా లేదా అన్న విషయాన్ని కూడా వాట్సాప్‌ సూటిగా చెప్పక పోవడం సంస్థ తీరుపై అనుమానాలకు తావిస్తోంది. చెల్లింపుల వ్యవస్థకు కీలకంగా మారుతున్న ఏకీకృత చెల్లింపుల వ్యవస్థను విని యోగించడానికి వాట్సాప్‌నకు పర్మిషన్ ఇచ్చిన పక్షంలో.. మొత్తం పేమెంట్స్‌ వ్యవస్థకే ముప్పు వచ్చే అవకాశాలు ఉ...

టెలికం కంపెనీలకు ఏజీఆర్ ఝలక్

చిత్రం
ఇండియాలో ఇప్పటికే టెలికం సెక్టార్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కోలుకోలేని రీతిలో భారత అత్యున్నత న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది. ఏజీఆర్‌ కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెను భారంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా 50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ  23,045 కోట్ల నికర నష్టాల్ని  ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా  74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం 2019–20 త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో 119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో 23,045 కోట్ల నష్టాలు వచ్చాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో  21,199 కోట...

పిల్లల విద్య కోసం జగన్ అంకితం

చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రిగా సందింటి జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరాడో ఆరోజు నుంచి ఆ రాష్ట్ర ప్రజలకు ఊహించని రీతిలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దేశంలో ఏపీ ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో ముందడుగులో ఉంటోంది. తాజాగా జగన్ విద్యాభివృద్ధి కోసం సమూల చర్యలు చేపట్టారు సీఎం. ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల పిల్లలు చదువుకునేలా దృష్టి సారించారు. ప్రస్తుతం బడికి వెళ్లాలన్నా, చదువు కోవాలంటే భారీ ఖర్చు అవుతోంది. తడిసి మోపెడవుతోంది. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. ఇదే యాత్రలో వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలను ఆయన విన్నారు. కళ్లారా చూశారు. ఖర్చు తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువులు లేవని బాధపడుతున్న వారి ఇబ్బందులను గమనించారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి కేవలం పేదపిల్లల చదువు కోసం ఏకంగా మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి తన అనుభవాలను జనంతో పంచుకున్నారు. రాష్ట్రంలో 45 వేల పై చిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిని మూడేళ్లలో మూడు దశల్లో బాగు...

మెరిసిన చీర మురిసిన దీపిక

చిత్రం
చీర కట్టులో ఉన్నంత అందం ఇంకెందులోను అగుపించదు. అందుకనే కాబోలు ఓ సినీ కవి అందమంతా చీరలోనే ఉన్నది అంటూ ఏకంగా ఓ పాపులర్ పాటనే రాశాడు. కురుచ దుస్తుల్లో అందాలు అగుపించేలా, మరీ ఎబ్బెట్టు కలిగించేలా మహిళల కంటే భారతీయత ఉట్టి పడేలా వస్త్రధారణతో ఉండే వారే ఎక్కువగా ఆకట్టుకుంటారు. అందుకే ఇండియన్ విమెన్స్ కు ఎక్కడలేని గౌరవం. వారంటే ప్రత్యేకమైన ప్రేమ కూడా. తాజాగా బాలీవుడ్ స్వప్న సుందరి, మోస్ట్ మెమొరబుల్ నటీమణిగా పేరున్న దీపిక పదుకొనె తన భర్తతో కలిసి తిరుమలకు విచ్చేశారు. వీరిద్దరూ సకుటుంబ సపరివారంతో ఆ శ్రీ వేంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతులిద్దరూ స్వామి వారి సేవలో తరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోయారు. అయితే, దీపిక కట్టుకున్న చీర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమలలో దీపిక అందమైన బనారస్ చీరలో తళుక్కు మనగా, రణ్‌వీర్ ఆమె చీర రంగుకు మ్యాచ్ అయ్యేలా కుర్తా చుడీదార్, నెహ్రూ జాకెట్ ధరించాడు. డిజైనర్ సబ్యసాచి వీటిని తీర్చిదిద్దాడు. దీపిక కట్టుకున్న ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఆమెకు వివాహ సమయంలో గిఫ్ట్‌గా వచ్చ...

మెట్టు దిగిన జేఏసీ..గట్టు దిగని కేసీఆర్

చిత్రం
ఓ వైపు కార్మికులు ఆత్మహత్యలు, బలవంతపు చావులు తెలంగాణలోని జనం పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ జేఏసీ ఓ మెట్టు దిగొచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం తన పట్టు మాత్రం వీడడం లేదు. రాష్ట్ర ధర్మాసనం సమ్మె విషయంలో ఇరు పక్షాలు ఓ మెట్టు దిగాలని సూచించింది. మరో అడుగు ముందుకు వేసి ఏకంగా చీవాట్లు కూడా పెట్టింది. రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఓ కమిటీని కూడా వేస్తానని చెప్పింది కూడా. దీనికి సైతం కేసీఆర్ ఒప్పు కోలేదు. ఇదే క్రమంలో ప్రైవేట్ రూట్ల పర్మిట్లను గంప గుత్తగా ఇవ్వడాన్ని నిలుపుదల చేస్తూ కోర్టు స్టే విధించింది. ఇక కార్మికుల నుంచి వత్తిళ్లు పెరగడంతో జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డి లు ఓ మెట్టు దిగేందుకు ఒప్పుకున్నారు. ఈ మేరకు విపక్షాలు, కార్మిక నేతలతో కలిసి ప్రత్యేక సమావేశం చేపట్టారు. ఇందులో మరో కార్యాచరణను ప్రకటించారు నాయకులు. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టామని, ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. పోలీసులు మఫ్టీలో వచ్చి జేఏసీ నేతల్ని అరెస్ట్‌ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని వర్...

ఆర్టీసీకి భారీ నష్టం..సమ్మె యథాతథం

చిత్రం
ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. కార్మికుల సమ్మె ఇవ్వాళ్టితో 41 రోజులకు చేరుకుంది. అయినా ప్రభుతం నుంచి సరైన స్పందన రావడం లేదు. కోర్టు చీవాట్లు పెట్టినా, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇక కార్మికులు తగ్గడం లేదు. సమ్మెను కొనసాగిస్తుండడంతో సంస్థ పీకల లోతుకు చేరుకుంది. సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్‌ ఆర్టీసీ కుదేలైంది. నిరవధిక సమ్మె దెబ్బకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రైవేట్‌ సిబ్బందిని నియమించుకున్నారు. కానీ 50 శాతం బస్సులను కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. గడిచిన 40 రోజులుగా ఆర్టీసీకి భారీ ఎత్తున ఆదాయానికి గండి పడింది. సాధారణంగా ప్రతి రోజు కోటి చొప్పున నష్టం రాగా, ఇప్పుడు అది మరింత పెరిగింది. దాదాపు సమ్మె రోజుల్లో అది రెట్టింపైంది. సిబ్బంది జీతభత్యాలు, విడిభాగాల కొనుగోళ్లు, తదితర నిర్వహణ వ్యయం తగ్గినప్పటికీ సిటీలో తిరిగే బస్సుల సంఖ్య, ట్రిప్పులు, కిలోమీటర్లు సగానికి పైగా పడి పోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గింది. తొలి 10 రోజుల్లో రోజుకు 20 లక్షలు కూడా రాబట్ట లేక పోయారు. సాధారణ రోజుల్లో 42 వేల ట్రిప్పులు తిరిగిన సిటీ బస్సులు ఇప్పుడు ...

టిక్ టాక్ ను సీన్స్ దాటేనా

చిత్రం
ప్రపంచ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు టిక్ టాక్ ఓ సంచలనం. దాని దెబ్బకు మిగతా కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. కోట్లాది మంది టిక్ టాక్ జపం చేస్తున్నారు. దీనికున్న క్రేజ్ ను చూసి తట్టుకోలేక కొత్త టెక్నాలజీని అప్ డేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టిక్‌టాక్‌ జపం అగుపిస్తోంది, వినిపిస్తోంది. ఎవరినైనా అడిగితే చాలు ఈ యాప్‌ గురించి టకీమని చెప్పేస్తారు. అంతలా పాపులర్ అయిపోయింది టిక్ టాక్. ప్రస్తుతం నెటిజన్లకు అందు బాటులో ఉన్న సోషల్ మీడియా యాప్‌లలో టిక్‌ టాక్‌కు ఎంత ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు, వృద్దులు సైతం ఈ యాప్‌ ద్వారా వీడియోలు చేసి తమను తాము బాహ్య ప్రపంచానికి పరిచయం చేసు కుంటున్నారు. ఒకప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడే వారు. అయితే ఇప్పుడు అందరి నోటా టిక్‌ టాక్ మాటే వినిపిస్తోంది. ఎవర్ని చూసినా టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక కొందరైతే ఈ యాప్ ద్వారా సెలబ్రిటీలుగా మారారు. సెన్సేషన్ సృష్టించారు. కాగా టిక్‌టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ  ఇన్‌స్ట్రాగ్రామ్‌ కూడా త్వర లోనే టిక్‌ టాక్‌ను పోలిన ఓ కొత్త టూల్‌ను అందుబాటులో...

దేశమంతా అచ్యుత కోసం

చిత్రం
                                     ఆయన పేరు చెబితే చాలు దేశం పులకించి పోతుంది. అత్యంత సామాన్యమైన అట్టడుగు కుటుంబం నుంచి వచ్చిన అచ్యుత సామంత ఏకంగా ఎవరూ సాధించలేని విజయాలను నమోదు చేసుకున్నారు. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఏకంగా ఓ విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశారు. ఇప్పుడు తన కథను ఏకంగా దేశంలో అత్యంత జనాదరణ పొందిన కరం వీర్ లో తన అనుభవాలను మిస్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పంచుకోబోతున్నారు. సోని టెలివిజన్‌ ఛానెల్‌లో ప్రజాదరణ పొందిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఇందులో వివిధ రంగాల్లో దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖలను పరిచయం చేస్తారు. ఈసారి అతిథిగా కలింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, కలింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ పేరిట సంస్థలను ఏర్పాటు చేశారు. అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ దేశానికి, జాతికి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఒడిశాలోని కందమహల్‌ నుంచి బీజేడీ ఎంపీగా విజయం సాధించి ప్రజల ప్రశంసలు అం...

రహానేకు రాయల్స్ షాక్

చిత్రం
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -13 సీజన్‌లో భాగంగా ఆటగాళ్ల వేలానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆయా ఫ్రాంఛైజీలు తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లను కొన్ని ఫ్రాంఛైజీలు రిలీజ్‌ చేయగా, వారిని నగదు ఒప్పందంపై తీసుకోవడానికి వేరే ఫ్రాంఛైజీలు ముందు కొస్తున్నాయి. ఈ తరహాలోనే కింగ్ప్‌ పంజాబ్‌ జట్టు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన ఆటగాడు రవి చంద్రన్‌ అశ్విన్‌. ఇంకా పలువురు ఆటగాళ్లు పేర్లు తెరపైకి వస్తున్నాయి. మురళీ విజయ్‌, కరణ్‌ నాయర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లను సీఎస్‌కే వదిలేయడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకుంది.ఇప్పుడు అజింక్యా రహానేకు కూడా ఆ బాధ తప్పడం లేనట్లే కనిపిస్తోంది. రహనేను జట్టు నుంచి విడుదల చేయాలని రాజస్తాన్‌ రాయల్స్‌ యోచిస్తోంది. గత తొమ్మిది సీజన్ల నుంచి రాజస్తాన్‌కు ఆడుతున్న రహనే..ఈ సీజన్‌లో ఫ్రాంఛైజీ మారే అవకాశం కనబడుతోంది. 2011లో ముంబై ఇండియన్స్‌ నుంచి రాజస్తాన్‌కు మారిన రహానే అప్పట్నుంచి ఇదే ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2012 సీజన్‌లో రాజస్తాన్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రహానే నిలిచాడు. ఈసారి రహనే తమకు వద్దనే భావ...

ప్యారిస్‌ ఒప్పందంపై పెద్దన్న కన్నెర్ర

చిత్రం
పారిశ్రామిక వ్యర్ధాలను ప్రక్షాళన చేసేందుకు భారత్‌, చైనా, రష్యా వంటి దేశాలు చేస్తున్నదేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌మరోసారి నోరు పారేసుకున్నారు. ఆ దేశాలు వారి వ్యర్ధాలను సముద్రంలోకి విడిచి పెడుతుండటంతో అవి లాస్‌ ఏంజెల్స్‌లో తేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పు అనేది సంక్లిష్ట అంశమని ట్రంప్‌ చెబుతూ ఎవరు నమ్మినా నమ్మక పోయినా తను పలు విధాలుగా పర్యావరణ వేత్తనని చెప్పుకున్నారు. ఎకనమిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో  జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం అమెరికాకు విధ్వంసకర మైనదని ఈ ఏకపక్ష ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టడంతో పాటు విదేశీ కాలుష్య కారకులను కాపాడుతుందని దుయ్య బట్టారు. ఈ ఒప్పందంతో అమెరికాకు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. చారిత్రక ఒప్పందంగా పేరొందిన పారిస్‌ ఒప్పందం కార్య రూపం దాల్చడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విపరిణామాలను నిరోధించే క్రమంలో 2...