పోస్ట్‌లు

జూన్ 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయంతో పాటు కోట్లాది మంది భ‌క్తులు క‌లిగిన ఏకైక దైవం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఛైర్మ‌న్‌గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని గ‌రుడాళ్వారు స‌న్నిధిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ ..వై.వితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, శాస‌న‌మండ‌లి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్యేలు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, శ్రీ‌కాంత్ రెడ్డి, ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు, పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు రౌతు సూర్య ప్ర‌కాశ్ రావు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్ర‌జ‌లకు ఇబ్బందులు లేకుండా చేయ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని, ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా చేస్తాన‌ని చెప్పారు. కాగా టీటీడీ ఛైర్మ‌న్‌గా ఆయ‌న‌కు ముందు నుంచే ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తార‌ని అనుకున్నారు. త‌ర్వాత ఫైర్ బ్రాండ్ నేత రోజా పేరు కూడా విని...

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బిర్యానీ బై కిలో - 15 వేల కోట్ల బిర్యానీ వ్యాపారం

చిత్రం
ఫుడ్ ప‌రంగా బిర్యానికి ఉన్నంత క్రేజ్ ఇంకే ఫుడ్ ఐటంకు లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇండియాలో స్టార్ట‌ప్‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఓ వైపు కేంద్రం ఇంకో వైపు రాష్ట్రాలు, బ్యాంకులు, వివిధ కంపెనీలు అంకుర సంస్థ‌ల‌కు చేయూత‌నిస్తూ ప్రోత్స‌హిస్తున్నాయి. స్టార్టింగ్‌లో ఉన్నా స‌రే వారి ఐడియాలు వ‌ర్క‌వుట్ అయ్యేలా అన్ని వ‌స‌తుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. హైద‌రాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వ‌చ్చే ట్రావెల‌ర్స్ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ బిర్యానీనే ఉంటోంది. హైద‌రాబాద్ అంటేనే బిర్యానీ ..బిర్యానీ అంటేనే ఈ సిటీనే. బిర్యాని తినాలంటే మ‌రింత రుచి క‌రంగా ఉండాలంటే బిర్యానీ రైస్ డిఫ‌రెంట్ మోడ్‌లో త‌యారు చేస్తున్నారు. ఈ రైస్‌కు హ‌య్య‌స్ట్ రేట్స్ పెట్టి కొంటున్నారు. ఇదే ఫార్మాట్‌లో ఫుడ్ రంగంలో బిర్యానీ బై కిలో స్టార్ట‌ప్ రుయ్ మంటూ దూసుకెళుతోంది. ఐవీ క్యాప్ వెంఛ‌ర్స్ సంస్థ ఏకంగా ఈ స్టార్ట‌ప్‌లో 30 కోట్ల ఫండింగ్ స‌మ‌కూర్చింది. సంప్ర‌దాయ ద‌మ్ బిర్యానీ మ‌రింత రుచిక‌రంగా ఉంటోంది. ఫ్రెష్ బిర్యానీని త‌యారు చేసింది మాత్రం కౌషిక్ రాయ్‌, విషాల్ జిందాల్, రితేష్ సిన్హా లు క‌లిసి 201...

ఆన్‌లైన్ పేమెంట్స్‌ల‌లో గూగుల్ పే నెంబ‌ర్ వ‌న్

చిత్రం
టెక్నాల‌జీ మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూనే వున్న‌ది. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థకు మ‌రింత బ‌లాన్ని ఇస్తోంది. ప‌నితీరు మెరుగు ప‌డేందుకు, ఎక్కువ సిబ్బంది, ఉద్యోగులు లేకుండా చేసేందుకు సాంకేతిక‌త ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీతో అనుసంధానం అవుతున్నారు. కంపెనీలు, వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, వ్యాపారులు, టెలికాం కంపెనీల‌న్నీ ఐటీ మీదే ఆధార‌ప‌డ్డాయి. తాజాగా డిజిట‌ల్ టెక్నాల‌జీ భారీగా విస్త‌రించింది. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంది. ఇండియాలో , ఏసియా ఖండంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియో 5 కోట్ల‌కు పైగా స‌బ్ స్క్రైబ‌ర్స్‌తో రికార్డు బ్రేక్ చేసింది. ఎక్క‌డికి వెళ్లినా త‌మ నెట్ వ‌ర్క్ ఉండేలా ఫైబ‌ర్ సిస్టంను ఏర్పాటు చేసింది ఈ కంపెనీ. మిగ‌తా టెలికాం కంపెనీల‌కు చుక్క‌లు చూపిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు క‌ల‌గ‌డంతో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కంపెనీలు యాప్స్‌ను త‌యారు చేశాయి. వీటిలో పే టిఎం ఇండియాలో ప్ర‌తి ఒక్క‌రికి ఎరుకే. ఆ త‌ర్వాత ఫోన్ పే వ‌చ్చింది. గూగుల్ పే యాప్ కు ఎ...

హైద‌రాబాద్‌పై క‌న్నేసిన అమెజాన్

చిత్రం
ఈకామ‌ర్స్ రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో ప్ర‌పంచ వ్యాప్తంగా కొన‌సాగుతున్న అమెరికా కంపెనీ అమెజాన్ హైద‌రాబాద్‌పై క‌న్నేసింది. ఇండియాలో సౌత్ ప‌రంగా చూస్తే ఈ ప్రాంతం అన్ని ర‌కాలుగా అనువుగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే అన్ని కంపెనీలు , సంస్థ‌లు గుర్తించాయి. ఆ మేర‌కు త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేందుకు ఈ కంపెనీ దీనికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తోంది. అమెజాన్‌కు చెందిన లాజిస్టిక్ గోడౌన్ షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్తూరు ప్రాంతంలో ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. ఇక్క‌డ అన్ని వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేసేందుకు ఉంచుతున్నారు. లాజిస్టిక్స్ రంగంలో అమెజాన్ రారాజుగా వెలుగొందుతోంది. అమెజాన్ కంపెనీ గ‌చ్చిబౌలిలో ఏర్పాటు చేసిన అతి పెద్ద డెలివ‌రీ స్టేష‌న్‌ను తెలంగాణ ఐటీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేష్ రంజ‌న్ ప్రారంభించారు. ఈ స్టేష‌న్ ను 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలోనే ఇదే అతి పెద్ద ఫుల్ ఫిల్ మెంట్ సెంట‌ర్ . దీనిని మ‌న హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం విస్త‌రిస్తున్న వ్యాపార రంగానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. ఇది ఎయిర్‌పోర్ట్ స‌మీపంలోనే ఉండ‌డం మ‌రికొంత అడ్వాంటేజ్‌. ర‌వాణా ప‌రంగ...