పోస్ట్‌లు

ఆగస్టు 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

తమిళ నాట తలైవా సంచలనం..!

చిత్రం
ఇండియాలో తమిళుల రూటే సపరేట్. వాళ్లకు ఆవేశం వచ్చినా లేక ఆవేదన వచ్చినా తట్టుకోలేరు. వారికున్నంత ఆత్మాభిమానం ఇంకెవ్వరికి లేదంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమా స్టార్స్ కు ఉన్నంత ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్లు కు ఉండదు . వీరే వారిని శాశిస్తారు ..అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఎంజీఆర్ , కరుణానిధి , జయలలిత ..ఇలా తమిళ గత కొంత కాలంగా సాగుతూ వచ్చాయి. ఇప్పుడు స్టాలిన్ , వైగో లాంటి వాళ్ళున్నారు. దేశమంతటా బీజేపీ గాలి వీచినా తమిళనాట ఇంకా పాగా వేయలేక పోతోంది.  ట్రబుల్ షూటర్ అమిత్ షా కన్ను మదరాసు మీద పడింది.  ఎలాగైనా సరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ఆయన ప్లాన్. ఇందు కోసం కలిసి వచ్చే వారి కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు . తాజాగా భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ సందర్బంగా అమిత్ షా ప్రత్యేకంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చారు . కానీ ఒకే ఒక్కరు మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్ట్రాక్షన్ గా నిలిచారు . అతను ఎవరో కాదు లక్షలాది మంది కి ఆరాధ్య దైవంగా పిలుచుకునే రజనీకాంత్ ఉరఫ్ తలైవా. కొద్ది సేపు షా ..రజని ముచ్చటించుకున్నార...

అబ్బా..రిలయన్స్..దెబ్బ ..ఇక టెక్నలాజి వార్

చిత్రం
భారతీయ సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి నంది పలకబోతోంది ..రిలయన్స్ సంస్థ. మార్కెట్ వర్గాలను విస్మయ పరిచేలా సదరు కంపెనీ అధినేత సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఇక వచ్చే నెల నుంచి జియో ఫైబర్ ను అందుబాటులోకి ఈసుకు రానుంది. దీంతో ఒకే ఒక్క కనెక్షన్ ఉంటే చాలు ..ఇక ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ అన్నీ తక్కువ ధరకే వాడుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు . ఈ ఒక్క ప్రకటన తో ప్రతార్తి కంపెనీలు షాక్ కు లోనయ్యాయి. ఇప్పటికే టెలికం రంగంలో 34 కోట్లకు పైగా కస్టమర్లతో చరిత్ర సృష్టించింది రిలయన్స్. ప్రతి ఇంటా సాంకేతిక విప్లవం తీసుకు రావాలన్నదే తమ అంతిమ లక్ష్యమంటూ ఇటీవల జియో ను ప్రారంభించినప్పుడు ముఖేష్ అంబానీ ప్రకటించారు . ఆ దిశగా ఆయన తన ప్రణాలికను పక్కాగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు . ఇది ఓ రకంగా భారతీయ ఆర్ధిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని మార్కెట్ రంగాల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . ఉచితంగా టీవీ కనెక్షన్‌, దేశంలో ఎక్కడికైనా పైసా ఖర్చులేకుండా మాట్లాడుకునేలా ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌,  ఒకేసారి దేశ విదేశాల్లోని నలుగురితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది . అంతే కాకుండా సి...

అంపశయ్యపై ఆర్టీసీని ఆదుకోలేమా..?

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించడమే కాదు ...రెండు నెలల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఘనత ఆర్టీసీ కార్మికులదే. రాష్ట్రం ఏర్పడినా ఈ రోజు వరకు ఎన్నో ఏళ్లుగా పేరుకు పోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు . రోజు రోజుకు  నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ..నష్టాల నుంచి గట్టెక్కించేందుకు గట్టి చర్యలు చేపట్టడం లేదని కార్మికులు, యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి పూర్వ వైభవం రావాలంటే ముందు ఆ సంస్థలో ఏళ్ళ కొద్దీ తిష్ట వేసుకుని కూర్చున్న వారిని తొలగించాల్సి ఉన్నది. ప్రతి ఏటా బస్సులపై భారం పడుతోంది . ఖాళీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బనుడిలా దృష్ట్యా కొత్త వారిని తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ఉన్న వారితోనే పని చేయించుకుంటున్నారు . వయసు పైబడిన వారు, రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న వారు ఎక్కువ గా ఉన్నారు . వీరిపై పని భారం అధికం అవుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . కార్మిక చట్టాలు ఇక్కడ అమలు కావడం లేదు . ప్రభుత్వం తమ గురించి పట్టించు కోవడం లేదంటూ కార్మికుల...

అతడొక ఆయుధం ..అంతుపట్టని షా అంతరంగం..!

చిత్రం
భారత దేశంలో ఎప్పుడైతే నరేంద్ర మోదీజీ ప్రధాన మంత్రిగా కొలువు తీరారో అప్పుడే దాటాయి దేశాలు కలవరపడ్డాయి. చాప కింద నీరులా పీఎం కు నీడలా వెన్నంటి ఉండే ఒకే ఒక్క నమ్మకస్థుడు అమిత్ అనిల్ చంద్ర షా. అందరూ అతడిని అమిత్ షా అని ముద్దుగా పిలుస్తారు. నిన్నటి దాకా ఆయన పేరు కొద్ది సేపే వినిపించింది. తాజాగా ఆయన పేరు లేకుండా ఉండలేని స్థితికి ఈ దేశం చేరుకుంది. ఎక్కడ చూసినా ..ఎక్కడికి వెళ్లినా ..అంతటా అమిత్ షా నే. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ విషయంలో షా ..మోదీజీ అనుసరించిన కఠిన వైఖరికి అమెరికా లాంటి పెద్దన్న మిన్నకుండి పోయింది . అంతర్జాతీయంగా ఇండియాకు యెనలేని మద్దతు పెరుగుతుండగా ..మరో వైపు రష్యా బేషరతుగా భారత్ వైపు నిలిచింది . దీంతో దాయాది దేశం పాకిస్తాన్ ప్రపంచ రంగస్థలం లో ఒంటరిగా మిగిలి పోయింది . అయినా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ మొత్తం వ్యవహారంలోనీ కాదు దేశ వ్యాప్తంగా కాషాయ జెండా యుగురా వేసే పనిలో పడ్డారు అమిత్ షా. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ రాజకీయంగా కోలుకోలేకుండా చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు అమిత్ షా నే . బీజేపీకి ఇప్పుడు అతడే ఆయుధం. ఆయనకే ఎక్కడ కాలు మోపాడంటే చాలు ..అక్కడ సునామి రావాల్సిందే. నిన్నటి...

అలుపెరుగని బాటసారి .. అంతులేని విజ్ఞాన వారధి,.!

చిత్రం
భారత దేశ రాజకీయాలలో తెలుగు వారిలో పేరొందిన నాయకులలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు . సుదీర్ఘమైన రాజాకీయ అనుభవం కలిగిన గొప్ప నాయకుడు. ఎందరికో మార్గదర్శకుడు . విద్యార్ధి నాయకుడి నుంచి నేటి ఉప రాష్ట్రపతి దాకా ఆయన ఎన్నో పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు . మొదటి నుంచి భారతీయ సంకృతి , నాగరికత , సాంప్రదాయాలు అంటే వెంకయ్య నాయుడుకు యెనలేని అభిమానం. సమయానికి విలువ ఇవ్వడమే కాదు సందోర్భోచితంగా మాట్లాడటం , ప్రసంగించడం ఆయనకు మాత్రమే చెల్లింది . వ్యంగ్యం ..హాస్యం ..వినోదం ..విజ్ఞానం కలిపితే ఆయనవుతారు . విధాన సభలో నైనా ..పార్లమెంట్ లోనైనా ఏ అంశంపైనా అనర్గళంగా ..పూర్తి వివరాలతో విపక్షాలు విస్తు పోయేలా చేయడంలో జైపాల్ రెడ్డి ఒకరైతే మరొకరు వెంకయ్య నాయిడు. ఆయన అభిప్రాయలు , సిద్ధాంతాలతో ఏకీభవించక పోయినా సాహిత్యం పట్ల అభిమానం కలిగిన వ్యక్తిగా వెంకయ్యను గౌరవించకుండా ఉండలేం. ఎందుకంటే వృత్తి పరంగా ఎన్నో వత్తిళ్లు ఉన్నప్పటికీ ఆయన నిత్యం చదవడం మాత్రం మానలేదు. ఎంతటి స్థాయికి చేరుకున్నా తన మూలాలు మరిచి పోలేదు . ఇది ఆయనకున్న వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. వెంకయ్య చేసిన ప్రసంగాలతో పుస్తకం రాశారు...

రిలయన్స్ సంచలనం..ఆశాజనక భారతం ..ఆర్ధిక బలోపేతం..!

చిత్రం
భారత దేశంలో పేరెన్నికగన్న రిలయన్స్ కంపెనీ అనుకున్నట్టుగానే సంచలనాలకు తెర లేపింది. మొదటి నుంచి ఆసియా ఖండంలో బిజినెస్ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న సదరు కంపెనీ ఏది చేసినా ఓ చరిత్రే. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ, ప్రత్యర్థి కంపెనీల అంచనాలకు అందనంత దూరంలో రిలయన్స్ చుక్కలు చూపిస్తోంది. ఒక్క టెలికం రంగంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ఒక్క టెలికం రంగమే కాకుండా ఆయిల్ , లాజిస్టిక్స్ , డిజిటల్ టెక్నలాజి , తదితర రంగాలలో ఇప్పటికే ప్రారంభించింది. ఓ వైపు విదేశీ కంపెనీలు భారీగా రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టాయి. అంతే కాకుండా అమెరికా కంపెనీ తాజాగా రిలయన్స్ టవర్స్ ను కొనుగోలు చేసింది. భారీగా పెట్టుబడులు వచ్చాయి . ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు రిలయన్స్ తన ఖాతాదారులను ప్రసన్నం చేసుకునే దిశగా ఆఫర్లు ప్రకటించింది . టెలికం రంగంలో తన దరిదాపుల్లో ఏ కంపెనీ లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. 18 నెలల్లో రుణ రహిత కంపెనీగా మారుస్తామని ముకేశ్ అంబానీ వెల్లడించారు . భారత దేశ ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ పాత్ర ముఖ్యమైనది. మార్కెట్ సూచీలను ప్రభావితం చేసే పవర్ రిలయన్స్ కు ఉంది. ...