పోస్ట్‌లు

అక్టోబర్ 29, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అవార్డు వద్దన్న అమ్మాయి

చిత్రం
ఎవరికైనా 35 లక్షల రూపాయలు వస్తున్నాయంటే చాలు తీసుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ స్వీడిష్ కంట్రీకి చెందిన యువ కెరటం గ్రెటా థంబర్గ్‌ మాత్రం తనకు డబ్బులు, అవార్డు వద్దని చెప్పేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్‌, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. గ్రెటాకు అవార్డుతో పాటు 35 లక్షల రూపాయలు బహుమతిగా అందుతాయి. గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మనకిప్పుడు కావాలని కోరారు. సైన్స్‌ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి అన్నారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా గ్రెటా మాట్లాడారు. పర్యావరణం విషయంలో స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చే సరికి మా...

మెగా సమేతం..నాగబాబు జన్మోత్సవం

చిత్రం
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఈ ఏడాది మరిచి పోలేని తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. తాజాగా చిరంజీవి, నయనతార, తమన్నా కలిసి నటించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా విడుదలైంది. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వసూళ్ళలో రికార్డులు తిరుగ రాస్తోంది. ఇది చిరంజీవికి 151 వ చిత్రం. ఈ మూవీ చిరంజీవి కెరీర్ లోనే హయ్యెస్ట్ వసూలు సాధించింది. దీంతో కోడలు ఉపాసన రెడ్డి, కొడుకు రామ్ చరణ్, తమ్ముళ్లు కొణిదెల పవన్ కళ్యాణ్, కొణిదెల నాగ బాబుతో పాటు కూతుళ్లు, భార్య సురేఖ, బావ అల్లు అరవింద్, అల్లు అర్జున్, తదితరులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదే సమయంలో సైరా సినిమా ప్రమోషన్ లో తమ్ముడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు కొడుకు రామ్ చరణ్. ఇదిలా ఉండగా ఇదే సమయంలో తమ్ముడు నాగేంద్ర బాబు పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. తన అన్న చిరంజీవి, వదిన సురేఖ ల సమక్షంలో వేడుకలను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిపారు. ఈ ఆనంద వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. నాగబాబుకు అభినందనలు తెలిపారు. నాగబాబు 1961 అక్టోబరు 29 న పుట్...

బిగిల్ వసూళ్ళలో జిగేల్

చిత్రం
అట్లి డైరెక్షన్ లో విజయ్ నటించిన బిగిల్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. విజయ్ తో పాటు నయనతార, తదితరులు నటించారు. ఏజీఎస్‌ సంస్థ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మించింది. ఏ.ఆర్‌. రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తాజాగా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలయ్యింది. పూర్తిగా కమర్శియల్‌ అంశాలతో తెర కెక్కిన ఈ చిత్రం విజయ్‌ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. చిత్ర వసూళ్లు మొదటి రోజున కాస్త పలుచగా ఉన్నా, రెండవ రోజు నుంచి భారీగా పెరిగాయి. దీంతో విడుదలైన 3 రోజుల్లోనే బిగిల్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు విడుదలైన ఖైదీ చిత్రం కూడా మంచి టాక్‌తో నడుస్తోంది. కాగా నటుడు విజయ్‌ ఇంటికి బాంబు అంటూ ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. స్థానిక సాలి గ్రామంలోని నటుడు విజయ్‌ తండ్రి ఇంటికి, నీలాంగరైలోని విజయ్‌ ఇంటికి గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత 26వ తేదీ రాత్రి చెన్నై పోలీస్‌ కార్యాలయానికి ఒక వ్యక్తి ఫోన్‌ చేసి నటుడు విజయ్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు చెప్పి పెట్టేశాడు. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి, పోలీస్‌ కుక్కలత...

ఈ కామర్స్ సెక్టార్ పై రిలయన్స్ కన్ను

చిత్రం
భారతీయ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మిగతా రంగాలపై కూడా పట్టు బిగించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆభరణాలు, వజ్రాలు, ఆయిల్, టెలికాం, ఫ్యాషన్, షూస్, డిజిటల్, యాక్సరీస్, తదితర సెక్టార్స్ లలో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. మరో వైపు ఈ కామర్స్ పరంగా చూస్తే ఇండియా అతి పెద్ద మార్కెట్ గా ఉంటోంది. ప్రపంచ మార్కెట్ లో పారిశ్రామిక దిగ్గజం జాక్ మా స్థాపించిన అలీబాబా కంపెనీ ఈ కామర్స్ లో నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతూ వస్తోంది. దీనిని దెబ్బ కొట్టేందుకు అమెరికా నానా ప్రయత్నాలు చేసింది. అయినా జాక్ మా పట్టుదల ముందు బోసి పోయింది. ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ప్రతి రోజు అలీబాబా కంపెనీకి సమకూరుతున్నాయి. అలీబాబా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకున్న రిలయన్స్ కంపెనీ ఈ కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యింది. పారిశ్రామిక దిగ్గజం​ ముఖేష్‌ అంబానీ చైనాలో అలీబాబా తరహాలో భారత్‌లో ఈకామర్స్‌ దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్‌లో కీలక వాటా దక్కించు కోవాలన్న తన కలను పండించు కునేందుకు 1.73 లక్షల కోట్లతో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీని ...

స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ కు 5జీ షాక్

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్ ఆధారిత ప్రపంచం వరల్డ్ మార్కెట్ నే కాకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా టెలికాం రంగం అంతకంతకూ విస్తరిస్తోంది. దీనిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచ గతిని మార్చుతోంది. అతిపెద్ద బిగ్ నెట్ వర్క్ కలిగిన ఇండియాలో టెలికాం రంగానిదే ఆధిపత్యం. దాదాపు 100 కోట్లకు పైగా కమ్యూనికేషన్ పరంగా కనెక్ట్ అయి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మొబైల్ వాడటం చేస్తున్నారు. ఆయా టెలికాం ఆపరేటర్స్ మధ్యన పెరిగిన పోటీ వినియోగదారుల పాలిట వరంగా మారింది. ప్రస్తుతం దేశీయ పరంగా చూస్తే ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్ఎన్ ఎల్ తో పాటు రిలయన్స్, ఎయిర్ టెల్ కంపెనీలు ఇప్పటికే తమ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్స్ తో తమ కస్టమర్స్ ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఎక్కడికక్కడ టెలికాం టవర్స్ ను ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ విభాగంలో రిలయన్స్ జియో టాప్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ఇదే క్రమంలో 4 జీతో సేవలు అందజేస్తున్నాయి వినియోగదారులకు. ఇదే క్రమంలో 5జీ సర్వీసెస్ ఇవ్వాలనే టార్గెట్ తో ఆయా కంపెనీలు రెడీ అంటున్...

మన బంధం జన్మజన్మల సంబంధం

చిత్రం
సృష్టిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం విడదీయ లేనిది. ఒకే రక్తం పంచుకుని పుట్టడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు. ఈ లోకంలో అన్ని జీవ రాశుల కంటే ఎక్కువగా ప్రయారిటీ ఉన్నది ఒక్క మానవ జన్మకు మాత్రమే  . ఇది కొన్నేళ్లుగా..కొన్ని తరాలుగా..అనాది నుంచి నేటి దాకా కొనసాగుతూ వస్తున్నది. భారత దేశంలో అన్నా చెల్లెళ్ళ పండుగను ప్రతి చోటా ఘనంగా జరుపుకుంటారు. ఒకరికొకరు గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అంతే కాకుండా వీరికి ప్రత్యేకమైన ఫెస్టివల్ కూడా ఉంది. అదేమిటంటే రాఖీ పండుగ. సౌత్ లో కంటే నార్త్ లో దీనిని ఒక ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతే కాకుండా భాయ్ దూజ్ పేరుతో కూడా మరో పండుగను ఘనంగా జరుపు కోవడం ఆనవాయితీ. ఇదిలా ఉండగా తాజగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ల కూతురు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రతి ఏటా దీనిలో పాలు పంచుకుంటారు. తమ అనుభూతులను, అనుభవాలను ఒకరికొకరు నెమరు వేసుకుంటారు. దీనిని భగినీ హస్త భోజనం అనే పేరుతో పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి దిగిన ఫోటోలను ప్రియాంకా గాంధీ ట్విటర్‌లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్‌లో...

సుప్రీం ఝలక్..టెలికాం కు షాక్..జాబ్స్ కు బ్రేక్

చిత్రం
టెలికాం కంపెనీలు జనాన్ని కోలుకోలేని షాక్ కు గురి చేస్తున్నాయి. ఎడాపెడా నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఇదే క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు నికర ఆదాయంపై కీలక తీర్పు చెప్పింది. తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న టెలికాం కంపెనీలకు ఝలక్ ఇచ్చింది. టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్‌ జియో రాకతో కుదేలైన ఈ రంగానికి ఏజీఆర్‌పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన సుప్రీం కోర్టు తీర్పు అశ నిపాతంలా తగిలింది. టెలికాం విభాగానికి టెల్కోస్ 92,641 కోట్లను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. భారీ నష్టాల్లో ఉన్న టెల్కోల లాభ దాయకతను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతో టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని 20 శాతం తగ్గించాల్సి ఉంటుంది. తీర్పు నేపథ్యంలో దీనిని అడ్డం పెట్టుకుని రానున్న కాలంలో ఉద్యోగులను తీసి వేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. టెలికం రంగం మొత్తం సుమారు 1.3 లక్షల కోట్లు మూడు నెలల్లో ప్రభుత్వానికి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే వరకు తాజా నియామకాలు చేపట్టరాదనే నిర్ణయంతో పాటు, ఉన్న ఉద్యోగాల్లో కూ...

ఇండియాకే అమెజాన్ ప్రయారిటీ

చిత్రం
అమెరికా దిగ్గజ కంపెనీ అమెజాన్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డది. ఇప్పటికే ఏషియన్ కాంటినెంట్ లో బిగ్గెస్ట్ మార్కెట్ కలిగిన భారత్ పైనే  పలు దేశాల వ్యాపారులు, కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ కామర్స్ కంపెనీల్లో అమెజాన్, ఫ్లిప్ కార్, స్నాప్ డీల్, తదితర కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. ఇదే సమయంలో సామాన్యులు, మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంది. దీంతో వీరి అభిరుచులు, కోరికలకు అనుగుణంగా తమ వ్యాపారాలను విస్తరించే పనిలో పడ్డాయి. ఆయా కస్టమర్స్ కు ప్రయారిటీ ఇస్తూ బిజినెస్ చేస్తున్నాయి. ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తోంది. ఆ  దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో  పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్, అమెజాన్‌ డాట్‌ కామ్‌ ఇంక్‌ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్ట నున్నాయి. రైట్స్‌ ఇష్యూ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ  పూర్తి చేయ నున్నట్లు తెలుస్తోంది. ఏ విభాగంలో...

గ్లోబల్ సీఈఓల్లో మనోళ్లే టాప్

చిత్రం
ప్రపంచంలో భారత్ వెలిగి పోతోంది. వ్యాపార, వాణిజ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధో మధనం, క్రీడా, మహిళా సాధికారత రంగాలలో ఇండియన్స్ తమదైన పాత్రను పోస్తిస్తున్నారు. ఎవ్వరికీ అందనంత రీతిలో, అసాధారణమైన ప్రతిభా పాటవాలతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతే కాకుండా అగ్ర రాజ్యాలకు పెను సవాలు విసురుతున్నారు. ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ఐటీ సెక్టార్లో మనోళ్లదే హవా. వీరి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. కానీ భారత ప్రధాన మంత్రి మోదీ ఆయన ఆశలకు గండి కొట్టారు. ఏకంగా ఆ దేశ అభివృద్ధిలో భారతీయులు 30 శాతానికి పైగా సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రతి పార్టీకి భారతీయుల సహకారం అవసరమవుతోంది. వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న దిగ్గజ కంపీలకు ఇండియన్స్ కీలక పదవులలో కొనసాగుతున్నారు. ప్రెసిడెంట్, చైర్మన్, సిఇఓలు, హెడ్స్..ఇలా ప్రతి ప్రధానమైన పోస్టుల్లో భారతీయులు తమ జెండాను ఎగురవేస్తున్నారు. తాజాగా వరల్డ్ వైడ్ గా టాప్ సీఈఓ లు 10 మందితో జాబితాను వెల్లడించింది హార్వ...

ఉగ్ర మూకల అంతం..భారత్ లక్ష్యం

చిత్రం
కోట్లాది మంది ప్రజలు నాపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. వారి సంక్షేమమే నా ప్రధాన ఎజెండా. ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను రేయింబవళ్లు కష్ట పడుతున్నా. ఇదే సమయంలో ప్రతి ఒక్క దేశం బాగుండాలని కోరుకుంటా. సమున్నత భారతావని మీద ఏ ఒక్కరు దాడికి పాల్పడాలని ఆలోచన చేసినా, లేదా ప్రయత్నం చేసినా నామ రూపాలు లేకుండా చేస్తా. మేం మొదటి నుంచి శాంతిని కోరుకుంటున్నాం. ఎందరో జాతి విముక్తి కోసం జరిగిన పోరాటంలో అసువులు బాశారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది. దానిని చిదిమి వేసే హక్కు ఎవ్వరికీ లేదన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా అది అత్యంత ప్రమాదకర మైనదని అన్నారు. దాని అంతం మనందరి పంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలో భాగంగా మోదీ రియాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా సౌదీ కింగ్ సల్మాన్ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌తో పాటు ప్రభుత్వంలోని విద్యుత్, ఇంధన, కార్మిక, వ్యవసాయ, జల నిర్వహణ, తదితర శాఖల మంత్రులతో సమావేశమై చర్చలు జరిపారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారంపై సంతకాలు చ...

భక్తుల కోసం బంపర్ ఆఫర్

చిత్రం
ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అసాధారణమైన రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. నిజాయితీ, నిబద్ధతకు మారు పేరుగా పేరొందిన సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా పని చేస్తున్నారు. ఆయనతో పాటు గతంలో ఈవోగా పనిచేసిన, అపార అనుభవం కలిగిన ధర్మా రెడ్డిని ఏరి కోరి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు. మరో వైపు పూర్తి కాలపు టీటీడీ పాలక మండలిని సైతం నియమించారు. ఆలయ చైర్మన్ గా ఎస్.వి. సుబ్బారెడ్డి పూర్తి బాధ్యతలు చేపట్టాక వివిఐపీలకు కల్పిస్తున్న స్పెషల్ దర్శనాలకు చెక్ పెట్టారు. ఎంతో దూరం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. నిత్యం ఏ ఒక్క భక్తుడు, భక్తురాలు ఆకలితో ఉండకుండా ఉండేందుకు గాను టైమింగ్స్ వేళలు మార్చారు. ఉదయం టిఫిన్స్, 11 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా అన్నదానం ఉండేలా డిసిషన్ తీసుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో, చుట్టూ పక్కల పరిసరాలలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడరాదని ఆదేశాలు జారీ చేశారు. సామాన్యులకు పెద్ద పీట వేస్తున్నామని చెప...

అసాధారణ నిర్ణయాలు..అద్భుత విజయాలు

చిత్రం
ఏపీలో ముఖ్యమంత్రిగా సందింటి జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాను ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడ్డారు. అదుపు తప్పిన పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. సామాన్యులకు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన నవ రత్నాలను ప్రకటించారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన తన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అభివృద్ధి వైపు అడుగులు వేసేలా పావులు కదుపుతున్నారు. తన రాష్ట్ర అభివృద్ధిలో కోసం తెలంగాణ రాష్ట్రంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. వైద్య రంగంలో సంస్కరణలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమలుకు కమిటీని నియమిస్తున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కా...

అత్యంత సంపన్నవంతుడు బిల్ గేట్స్

చిత్రం
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా బిల్ గేట్స్ చరిత్ర సృష్టించారు. కాగా నిన్నటి దాకా మొదటి ప్లేస్ లో కొనసాగిన అమెరికా ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెఫ్ బెజోస్‌‌‌‌ ప్రపంచ కుబేరుడి కిరీటం పోగొట్టుకున్నారు. అమెజాన్ ఇంక్ క్యూ3 ఫలితాలు ఆశించిన మేర రాక పోవడంతో, కంపెనీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌‌‌‌లోనే అమెజాన్‌‌‌‌ షేర్లు 9 శాతం మేర పడి పోయాయి. దీంతో బెజోస్ సంపద 103.9 బిలియన్ డాలర్లకు అంటే 7,36,936 కోట్ల దగ్గర ఆగి పోయింది.    దీంతో బెజోస్ ఆదాయం తగ్గడంతో మైక్రోసాఫ్ట్‌‌‌‌ కో ఫౌండర్ బిల్‌‌‌‌ గేట్స్ ప్రథమ స్థానంలో నిలిచారు. దాదాపు 105.7 బిలియన్ డాలర్లు అంటే 7,49,703 కోట్ల సంపదతో బిల్‌‌‌‌ గేట్స్ మళ్లీ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. గేట్స్ నెంబర్ వన్‌‌‌‌ స్థానాన్ని దక్కించు కున్నట్టు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ ధనవంతుడి పీఠాన్ని 24 ఏళ్ల పాటు ఏలుతూ వస్తోన్న బిల్‌‌‌‌ గేట్స్‌‌‌‌కు తొలిసారి జెఫ్ బెజోస్ 2018లో చెక్ పెట్టారు. 160  బిలియన్ డాలర్లు 11,34,312 కోట్ల సంపదతో నెంబర్ వన్ స్థానాని...

ప్రేమ ఫిక్స్ ..పెళ్లి సక్సెస్

చిత్రం
వేద గుర్తున్నారా. తెలుగు సినిమాలో నటించినవి కొన్ని సినిమాలే అయినా ఆమె మంచి నటిగా పేరు పొందారు. ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు వేద. అయితే సినిమాల్లో లక్ బాగుండాలనే ఉద్దేశం తో అర్చనగా మార్చుకున్నారు. వచ్చే నెల నవంబర్ 13 న ఓ ప్రముఖ వ్యాపారితో వివాహం ఖరారైంది. ఈ మేరకు తన మ్యారేజీ విషయాన్ని హీరోయిన్ అర్చన సోషల్ మీడియా ద్వారా తానే వెల్లడించింది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపార వేత్త జగదీశ్‌ భక్త వత్సలంతో ఇటీవల అర్చన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక జగదీశ్‌, అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.  2004లో నేను అనే సినిమాతో తెరంగేట్రం చేసింది అర్చన. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం లో పలు సినిమాలలో నటించింది. జనాన్ని మెస్మరైజ్ చేసింది. అయితే సరైన హిట్ లేక పోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కు కోలేక పోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్‌ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగ పడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్ర కవచ ధార గోవిందా ...

వసూళ్ళలో హౌస్ ఫుల్

చిత్రం
బాలీవుడ్ లో హౌస్ ఫుల్ - 4 సినిమా వసూళ్లలో సరికొత్త రికార్డు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఈ సినిమాలో నటించారు. విడుదలైన అన్ని థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్‌ వసూళ్లలో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో నే 90 కోట్లు రాబట్టింది. మొత్తంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. హౌస్‌ఫుల్‌ 4 ఒక్క సోమవారం రోజున 34.56 కోట్లు వసూలు చెడింది. దేశ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 87.78 కోట్లు వసూలు చేసింది. సాజిద్‌ నదియా వాలా నిర్మాణ భాగస్వామ్యంతో ఫర్హాద్‌ సంజీ దర్శకత్వంలో హౌస్‌ఫుల్‌ 4 సినిమా తీశారు. ఇందులో ఖిలాడీ అక్షయ్‌తో పాటు కృతి సనన్‌, బాబీ డియోల్‌, కృతి కర్బంద, రితీష్‌ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా నటించారు. తమ నటనతో మెప్పించారు. సారా బొదినార్ కథ రాశారు ఈ మూవీకి. సుదీప్ ఛటర్జీ దీనికి సినిమాటోగ్రఫీ అందించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. 145 నిమిషాల నిడివి కలిగిన హౌస్ ఫుల్ ఆద్యంతమూ వినోదాత్మకంగా అలరిస్తోంది. స...

సింగర్..యాంకర్ ల మధ్యే పోటీ

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద బిగ్ బాస్ ఓ సంచలనం. స్టార్ గ్రూప్ యాజమాన్యం ఎప్పుడైతే మా టీవీ ని కొనుగోలు చేసిందో అప్పటి నుంచే దాని సక్సెస్ రేటింగ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో ను తెలుగు వాకిట స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ ను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ గా చేశాడు. రెండో ఎపిసోడ్ బిగ్ బాస్ ను మరో నటుడు నాని స్టార్ట్ చేశాడు. దీనికి రేటింగ్ పెరిగింది. ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తో మూడో బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నాడు. బుల్లి తెరపై ఈ  షో కు రేటింగ్ అమాంతం పెరిగింది. దీంతో పార్టిసిపెంట్స్ కు మరింత పాపులారిటీ లభించింది. దీంతో రియాల్టీ షో ను మరింత జనరంజకంగా మార్చేందుకు ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తూ సక్సెస్ గా నడుస్తోంది. ఇదే సమయం లో నాగార్జున బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని రోజుల పాటు షో కు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఎవరు వస్తారోనని అంతా టెన్షన్ కు లోనయ్యారు. దీనిని పటాపంచలు చేస్తూ ప్రముఖ హీరోయిన్, శివగామి రమ్యకృష్ణ హోస్టుగా వచ్చారు. అందరిని విస్తు పోయేలా చేశారు. ఎంతగానో ఆకట్టుకున్నారు. తన హావభావాలతో మెప్పించారు. పా...

తెలుగుదేశంకు రాం రాం..కమలం ఆహ్వానం

చిత్రం
సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని రీతిలో జనం తీర్పు ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా వీడుతున్నారు. వీరి బాటలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రిజైన్‌ చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కి పడిపోయింది. కాగా ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి, టీడీపీ పార్లమెంటరీ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. గత కొంత కాలం నుండి వల్లభనేని వంశీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనను అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి, వై...

ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం ..ధర్మాసనం ధర్మాగ్రహం

చిత్రం
ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నది అవగతమవుతోందని రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం  చేసింది. సమ్మెపై ఇరు పక్షాల మధ్య కోర్టులో వాడి వేడిగా వాదనలు కొనసాగాయి. ఆర్టీసీ అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని మండి పడింది. ఉప ఎన్నిక సందర్బంగా 100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వంపై ధర్మాసనం సెటైర్లు వేసింది. ఎండీ విచారణకు ఒక్క సారైనా హాజరయ్యారా అని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ను నిలదీసింది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ఏజీ కౌంటర్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం..రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి 4253 కోట్లు చెల్లించామని వివరించారు. దీనిపై  హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమన లేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. సమర్పించే నివేదికలో అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత...

సోగకళ్ల సుందరికి ఈడీ షాక్

చిత్రం
ఇండియాలో ఈడీ జనానికి చుక్కలు చూపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వాలి పోతోంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ తో పాటు ఆదాయ పన్ను శాఖా అధికారులు కూడా వాలి పోతున్నారు. ఇదే సమయంలో పొలిటికల్ లీడర్స్ తో పాటు అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన వారిని వదిలి పెట్టడం లేదు. ఐటీ, క్రీడా, తదితర శాఖలకు చెందిన వారిని టార్గెట్ చేస్తోంది ఈడీ. ఇదే సమయంలో ఇటీవల మాజీ హోమ్ శాఖా మంత్రి చిదంబరం తో పాటు కన్నడ రాజకీయాలను శాసిస్తున్న డీకే శివకుమార్ ను సైతం ఈడీ చుక్కలు చూపించింది. చిదంబరం తీహార్ జైలులో చిప్ప కూడు తింటుండగా, శివకుమార్ మాత్రం జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా బాలీవుడ్ లో నటిగా పేరున్న శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా కు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 2013లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌కు మిర్చికి సంబంథించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. కేసుకు సంబంధించి రంజీత్ బ...

రారమ్మంటున్న జనం..దిగిరానంటున్న బంగారం

చిత్రం
దేశంలో కనీవిని ఎరుగని రీతిలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కొనలేని స్థితిలోకి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభన భారతీయ పసిడి, వెండి, ఆభరణాలు, ఆయిల్ రంగాలపై తీవ్ర ప్రభావితం చూపుతోంది. గత ఏడాది 30 నుంచి 33 వేల రూపాయల మధ్యలో ఉన్న బంగారం ధర ఏడాది ఊహించని రీతిలో పెరిగింది. ఏకంగా 40 వేల రూపాయలను తాకింది. దీంతో వ్యాపారులు, అమ్మకం దారులు, కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్స్ కు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో బంగారం కంటే వెండితో పాటు ప్లాటినం ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అమ్మకాలు ఓ వైపు తగ్గినా మరో వైపు భారీ ఎత్తున ఆభరణాలను తీసి పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం చివరి వరకు పసిడి 10 గ్రాముల ధర 42,000 రూపాయలను తాకుతుందని కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వరల్డ్ మార్కెట్ ప్రధాన కారణమని చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహద పడతాయ...

శివ సేన ఎంపీ హాట్ కామెంట్స్

చిత్రం
మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, శివ సేన పార్టీల మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో సీఎం కుర్చీపై పీటముడి వీడలేదు. ఇదే సమయంలో శివ సేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్‌ ఎవరూ ఇక్కడ లేరు అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, శివసేన అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా..శివసేన 56 సీట్లలో జయ కేతనం ఎగుర వేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, ఎన్సీపీ కూడా చెప్పుకో దగ్గ స్థాయి లోనే శాసన సభ స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాగా బీజేపీతో పొత్తు ఖరారైన నాటి నుంచి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తమకు కేటాయించడంతో పాటుగా కేబినెట్‌లో కూడా సముచిత స్థానం కల్పించాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి కోసం మరాఠా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప...

వాల్ తో దాదా ములాఖత్

చిత్రం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన దాదా, సౌరబ్ గంగూలీ తన దూకుడు పెంచాడు. వెంటనే రంగం లోకి దిగాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో మాట్లాడాడు. కోల్ కత్తా లో త్వరలో జరిగే టెస్టు మ్యాచ్ ను డే అండ్ నైట్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యాడు. ఆ జట్టును ఒప్పించాడు. అంతే కాకుండా క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్యెస్కె ప్రసాద్ తో భేటీ అయ్యాడు. సీనియర్ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ తో సుదీర్ఘంగా చర్చించాడు. ఎందుకంటే అజ్జూ భాయ్ సారధిగా ఉన్నప్పుడే గంగూలీ తన క్రికెట్ ను స్టార్ట్ చేశాడు. ఇదే టీమ్ గొప్ప విజయాలు నమోదు చేసుకుంది. ఇండియాలో గొప్ప టీమ్ గా పేరు తెచ్చుకుంది కూడా. దాదా సభ్యుడిగా అజ్జుతో కలిసి ఆడాడు. బెంగాలీ అసోషియేషన్ ఉత్సవాల్లో స్పెషల్ గా అజ్జూ భాయ్ హాజరయ్యాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు హైదరాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ స్టైలిష్ స్టార్ ఎన్నికయ్యాడు. ప్రస్తుతం దాదా దేశంలో క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకు రావాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందులో భాగంగా మాజీ టీమిండియా సారథి రాహల్ ద్రావిడ్ తో సమావేశం కానున్నాడు. భవిష్యత్తు క్రికెట్ కోసం ప్లాన్ తయారు చేసే పనిలో పడ్డాడు...

అమిత్ షాకు చిక్కని శివ సేన

చిత్రం
భారత రాజకీయాల్లో విస్మరించలేని నాయకుడిగా పేరొందిన అమిత్ చంద్ర షా అంటే కమల దళంతో పాటు విపక్ష నేతలకు దడ. ఎందుకంటే ఎప్పుడు ఎలా దాడి చేస్తారో ఆయనకు తప్పా, ఇంకొకరికి తెలియదు. ఆ అంతుపట్టని సీక్రెట్ ఒక్క తాను నమ్మిన, గురువుగా భావించే ప్రధాని మోదీకి మాత్రమే తెలుసు. ఇంతలా లో ప్రొఫైల్ మెంటైన్ చేసే ఈ ట్రబుల్ షూటర్ కు తాజగా మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల రాజకీయాలు తలనొప్పిగా మారాయి. చావు తప్పి కన్ను లొట్ట పడిందన్న చందంగా తయారైంది బీజేపీ పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆశించిన మెజారిటీ రాలేదు. దీంతో ఇతర పార్టీలపై ఆధార పడక తప్పలేదు. హర్యానాలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తాననడంతో అక్కడ దేవీలాల్ ముని మనుమడు దుశ్యంత్ కొలువు తీరారు. ఇక అసలైన రాజకీయం మాత్రం మరాఠాలో ఇంకా పీటముడి వీడడం లేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ బీజేపీ, శివ సేన కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలకు అధికారాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు. దీంతో ఇరు పార్టీలకు సీఎం కుర్చీ దగ్గర పేచీ వీడడం లేదు. ఇరు పార్టీల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదు. సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివ సేన ...