మన బంధం జన్మజన్మల సంబంధం

సృష్టిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం విడదీయ లేనిది. ఒకే రక్తం పంచుకుని పుట్టడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు. ఈ లోకంలో అన్ని జీవ రాశుల కంటే ఎక్కువగా ప్రయారిటీ ఉన్నది ఒక్క మానవ జన్మకు మాత్రమే  . ఇది కొన్నేళ్లుగా..కొన్ని తరాలుగా..అనాది నుంచి నేటి దాకా కొనసాగుతూ వస్తున్నది. భారత దేశంలో అన్నా చెల్లెళ్ళ పండుగను ప్రతి చోటా ఘనంగా జరుపుకుంటారు. ఒకరికొకరు గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అంతే కాకుండా వీరికి ప్రత్యేకమైన ఫెస్టివల్ కూడా ఉంది. అదేమిటంటే రాఖీ పండుగ. సౌత్ లో కంటే నార్త్ లో దీనిని ఒక ఉత్సవంలా నిర్వహిస్తారు.

అంతే కాకుండా భాయ్ దూజ్ పేరుతో కూడా మరో పండుగను ఘనంగా జరుపు కోవడం ఆనవాయితీ. ఇదిలా ఉండగా తాజగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ల కూతురు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రతి ఏటా దీనిలో పాలు పంచుకుంటారు. తమ అనుభూతులను, అనుభవాలను ఒకరికొకరు నెమరు వేసుకుంటారు. దీనిని భగినీ హస్త భోజనం అనే పేరుతో పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి దిగిన ఫోటోలను ప్రియాంకా గాంధీ ట్విటర్‌లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్‌లో అమర్చి ప్రియాంక షేర్‌ చేశారు.

ఈ ఫ్రేమ్‌లో నాయనమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీతో దిగిన ఫోటోలను సైతం ఆమె  ట్వీట్‌ చేశారు. వీటికి  లవ్‌ యూ రాహుల్‌గాంధీ.. భాయ్‌దూజ్‌ అంటూ సోదరుడిపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే రక్షబంధాన్‌ రోజు సైతం ప్రియాంకా..రాహుల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్‌ చేశారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక ఈ భాయ్‌ దూజ్ వేడుక. సోదర, సోదరీ మణులు ఒకరికొకరు ఆశీస్సులు పొందడం, బహుమతులు ఇచ్చి పుచ్చు కోవడం అనవాయితీ.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!