బిగిల్ వసూళ్ళలో జిగేల్
అట్లి డైరెక్షన్ లో విజయ్ నటించిన బిగిల్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. విజయ్ తో పాటు నయనతార, తదితరులు నటించారు. ఏజీఎస్ సంస్థ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మించింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తాజాగా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలయ్యింది. పూర్తిగా కమర్శియల్ అంశాలతో తెర కెక్కిన ఈ చిత్రం విజయ్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. చిత్ర వసూళ్లు మొదటి రోజున కాస్త పలుచగా ఉన్నా, రెండవ రోజు నుంచి భారీగా పెరిగాయి. దీంతో విడుదలైన 3 రోజుల్లోనే బిగిల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాతో పాటు విడుదలైన ఖైదీ చిత్రం కూడా మంచి టాక్తో నడుస్తోంది. కాగా నటుడు విజయ్ ఇంటికి బాంబు అంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానిక సాలి గ్రామంలోని నటుడు విజయ్ తండ్రి ఇంటికి, నీలాంగరైలోని విజయ్ ఇంటికి గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత 26వ తేదీ రాత్రి చెన్నై పోలీస్ కార్యాలయానికి ఒక వ్యక్తి ఫోన్ చేసి నటుడు విజయ్ ఇంటిలో బాంబు పెట్టినట్లు చెప్పి పెట్టేశాడు. బాంబు స్క్వాడ్ను పిలిపించి, పోలీస్ కుక్కలతో రెండు చోట్లా ఇళ్లను క్షణంగా పరిశోధించారు.
అయితే బాంబు లేదని విచారణలో తేలడంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యకి అన్నానగర్కు చెందిన వాడని తెలియడంతో అతన్ని పిలిపించి విచారించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు తను చెప్పింది నిజమేనా అన్న విషయం గురించి తీవ్రంగా విచారిస్తున్నారు. బాంబు పెట్టడం అన్నది బూచి అని తేలడంతో విజయ్ ఇంటికి ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును తొలగించారు. ఇంకో వైపు ఎన్ని ఆరోపణలు చేసినా వాటినన్నింటిని దాటుకుని వసూళ్ళలో చరిత్ర సృష్టించే దిశగా బిగిల్ సాగుతోంది. తెలుగులో దీనిని విజిల్ పేరుతో విడుదల చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి