పోస్ట్‌లు

సెప్టెంబర్ 3, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇబ్బందుల్లో ట్రబుల్ షూటర్..!

చిత్రం
కన్నడ నాట రాజకీయం మరింత వేడి పుట్టిస్తోంది. కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ దక్షిణాదిన అధికారంలోకి రావాలని ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను, ట్రబుల్ షూటర్స్ లీడర్లను టార్గెట్ చేసింది. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసును నామ రూపాలు లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. తమిళనాడులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ను ఇప్పటికే అరెస్ట్ చేసింది. మరో వైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే శివ కుమార్ ను అరెస్ట్ చేసింది ఈడీ, ఐటి. . ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరించడం, పార్టీకి బలాన్ని చేకూర్చడం డీకే శివకుమార్ వెరీ ఎక్స్ పర్ట్. ఇప్పుడు ట్రబుల్స్  లో ఆయన చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో డీకేను  అరెస్ట్ చేశారు. దీంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటీవల సంకీర్ణ సర్కార్ ను కాపాడేందుకు డీకే శివకుమార్ శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఈడీ , ఐటి శాఖలు డీకే ఇంటిపై దాడులు చేశాయి. అప్పట్లో కేంద్రంలోని షా ప్రోద్భలంతోనే ...

ఏపీ సరే..తెలంగాణ ఆర్టీసీ మాటేమిటి..?

చిత్రం
వాళ్ళు సంస్థలో దినసరి కూలీలకంటే ఎక్కువగా పని చేస్తున్నారు. ఇంకొందరు పని భారం ఎక్కువై తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీతాలు లేకుండా పస్తులున్నారు. అష్ట కష్టాలు పడ్డారు. కొత్త రాష్ట్రంలో తమ బతుకులు బాగు పడతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సమ్మె నోటీసులు సంస్థకు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు లాభాల బాటలో పయనించిన ఈ సంస్థ ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరుకుంది. సంస్థను గట్టెక్కించేందుకు పలు చర్యలు చేపట్టాలని సంస్థ ఎండీని సీఎం ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వమే ఆర్టీసీకి సాయం చేయలని నిర్ణయం తీసుకున్నారు. అయినా ఆరీసి గట్టెక్కాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. ఆర్టీసీకి బాకీ పడిన సంస్థలు తిరిగి ఇచ్చేలా చూడాలని, ప్రభుత్వం చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని, కొత్తగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఆర్టీసీకి పన్నునుంచి మినహాయించాలని కార్మికులు, సంఘాల నేతలు కోరారు. అయితే గత ఉమ్మడి రాష్ట్...

ఇక.. ఆర్టీసీ కార్మికులు ..ప్రభుత్వ ఉద్యోగులు ..జగన్ కు జేజేలు..!

చిత్రం
ఇచ్చిన మాట తప్పకుండా, నిలబెట్టుకోవడంలో మడమ తిప్పని రాజకీయ వారసత్వాన్ని తన తాత రాజా రెడ్డి , తండ్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి నుంచి పుణికి పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలోను , వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో లోను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను అధికారం లోకి వస్తే,  ప్రభుతంలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారు. భారీ మెజారిటీతో పవర్ లోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు, ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని, ఇక అందరు సర్కార్ లో భాగస్వాములేనని స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపారు. కొత్తగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులను బదిలీ చేస్తామని, పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతున్నట్లు జగన్ వెల్లడించారు. అంతకు ముందు ఆర్టీసీకి సంబంధించి ఏం చేస్తే బావుంటుందో తెలియ పర్చాలని ఐదుగురితో నిపుణుల కమిటీని ...

ఇక సెలవు .. మరువలేను ఉండలేను..నరసింహ్మన్..!

చిత్రం
సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి రాష్ట్రానికి, ఏర్పడిన నూతన రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా పని చేసిన నరసింహ్మన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ తెలుగు ప్రాంతాలతో మమేకమై పోయారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు , నాగరికత తమ ప్రాంతంతో ముడి పడి ఉండడం వల్లనైతేనేమి విడిచి ఉండలేక పోతున్నానంటూ బాధ పడ్డారు. ఇన్నేళ్ల పాటు గవర్నర్ గా పని చేయడం అరుదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, సమ్మెలు, ఆందోళనలు, అరెస్టులు, కేసులు , ఆత్మహత్యలు , బలిదానాలు, త్యాగాలు అన్నీ నరసింహ్మన్ కళ్ళ ముందే జరిగాయి. అంతకు ముందు ఆయన హోమ్ శాఖలో పని చేసిన అనుభవం ఉన్నది. పలు ప్రాంతాలలో సేవలు అందించారు. ఇదే అనుభవం ఉమ్మడి రాష్ట్ర సమయంలో పనికి వచ్చింది. ఉవ్వెత్తున సునామీలా ఎగసి పడిన ఉద్యమాన్ని గుర్తించడంలోనూ , ప్రాణ నష్టం జరగకుండా నియంత్రించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. కేసీఆర్ , చంద్రబాబు లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది...

దమ్మున్నోడు ..దుమ్ము రేపిండు

చిత్రం
నిన్నటి దాకా సచిన్ ను చూసి మురిసి పోయాం. ఆహా ఓ హో అంటూ జేజేలు పలికాం. కానీ క్రికెట్ ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్లను మరిచి పోయాం. ఈ దేశంలో జాతీయ అభిమానం పెల్లుబికేది ..జాతి అంతా ఒక్కటై ఊగి పోయేది.త్రివర్ణ పతాకం ప్రతి సారి ఎగిరేది ..రెపరెప లాడేది ..క్రికెట్ ఆట జరుగుతున్నప్పుడే. ఇండియాలో క్రికెట్ ఫీవర్ తీసుకు వచ్చిన ఆటగాళ్లు ఎందరో. కానీ అందులో సిసలైన ఆటగాళ్లు కొందరే. వారిలో మొదటగా గుర్తుకు తెచ్చు కోవాల్సింది కపిల్ దేవ్. ఈ ఆటగాడు ప్రపంచ కప్ లో అనామక జట్టుకు అద్భుత విజయాన్ని తెచ్చి పెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ స్టయిలిస్ట్ , రిస్ట్ ప్లేయర్ అజహరుద్దీన్ , ఎమ్మెస్ ధోని భారత జట్టుకు చిరస్మరణీయమైన  విజయాలు అందించారు.. గంగూలీ , ద్రావిడ్ , సచిన్ ..ఇంకా క్రికెటర్లు తమ ప్రతిభను చాటారు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ మాటల్లో వరల్డ్ లో అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ లలో ఒకరి పేరు చెప్పమంటే ..అజ్జూ భాయి పేరు వెల్లడించారు. తాజాగా సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న ఒకే ఒక్కడు అతడే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఓటమిని ఒప్పుకోడు. గెలుపు సాధించే దాకా నిద్ర పోడు. ఇదే అ...