పోస్ట్‌లు

సెప్టెంబర్ 5, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఈ కామర్స్ లో నువ్వా నేనా - చైనా కంపెనీల హవా

చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ బిజినెస్ రాకెట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ , తదితర కంపెనీలు తమ హవా కొనసాగిస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయంలో చైనా దేశానికి చెందిన కంపెనీలు టాప్ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయి. అటు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా తమ వ్యాపారాలను స్టార్ట్ చేస్తూ ..గణనీయమైన ఆదాయాన్ని గడుస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన అమెజాన్ ఈ కామర్స్ సెక్టార్ లో మొదటి ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక చైనాకు చెందిన షావోమి మొబైల్ కంపెనీ ప్రతి గ్రామానికి విస్తరించింది. అతి తక్కువ ఖర్చులో , ప్రతి సామాన్యమైన కుటుంబం వాడుకునేలా అన్ని సౌకర్యాలతో కూడిన స్మార్ట్ ఫోన్స్ ను తయారు చేస్తోంది. ఆపిల్, సామ్ సంగ్ కంపెనీలకు ధీటుగా షావో మీ అమ్మకాలు పెరిగాయి. ఈ కామర్స్,  ఇంటర్నెట్, టెక్నాలజీ , రిటైల్, ఇన్వెస్ట్ మెంట్ రంగాలలో చైనాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఆలీబాబా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ కామర్స్ రంగంలోకి ఎంటర్ కావాలని నిర్ణయం తీసుకుంది. తన అనుబంధంగా ఉన్న యూసీ వెబ్ ద్వారా ఈ ఏడాదే ఈ కామర్స్ బిజినెస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. విన్నూతంగా ...

ధర్మాసనం ఆగ్రహం ..చిదంబరంకు కష్టకాలం..!

చిత్రం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు..శాశ్వత శత్రువులు ఉండరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాలం సహకరించనప్పుడు ఏదైనా జరగ వచ్చు. అందుకు తాజా ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం. మంత్రిగా పనిచేసిన సమయంలో బీజేపీ అగ్ర నేత , ప్రస్తుత హోమ్ శాఖా మంత్రిగా ఉన్న అమిత్ చంద్ర షా ను షొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అరెస్ట్ చేయించారు. జైలుకు పంపించారు. అదే పగను పెంచుకున్న అమిత్ షా ఇప్పుడు తనకు పవర్ రావడంతో దెబ్బకు దెబ్బ తీశారు. అక్రమ ఆస్తుల నేరారోపణలు ఎదుర్కుంటున్న చిదంబరం ను కోలుకోలేకుండా చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనీ కోరినా, సుప్రీం కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. ఆర్ధిక నేరగాళ్లు బయట ఉంటే ప్రమాదమని కోర్టు పేర్కొంది. అయినా కేంద్రంలో కొలువు తీరిన మోడీ అండ్ షా మాత్రం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. చిదంబరం అరెస్ట్ పై రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , సోనియా గాంధీ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా వీరిద్దరూ నవ్వారు కానీ ఒక్క కామెంట్ చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కామెంట్స్ మాత్రమే చేశారు. మరో వైపు వచ్చే ఎన్నికల నాటికి దేశంలో బీజేపీ తప్ప మరో పా...

మళ్ళీ మెరిసిన మన హైదరాబాద్..!

చిత్రం
ఏ ముహూర్తంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో కానీ, అన్ని రంగాలలో ఈ కొత్త రాష్ట్రం దూసుకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. ఈ దేశంలో పూర్తి అవగాహన, పరిపాలనా పరమైన అనుభవం కలిగి ఉండటమే కాదు, భవిష్యత్తు పట్ల దార్శనికత కలిగిన ముఖ్యమంత్రులల్లో నవీన్ పట్నాయక్ తో పాటు మన రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఒకరు. అధికారులను పరుగులు పెట్టిస్తూ,  కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ దూసుకెళుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేలా కృషి చేస్తున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన  పురష్కారాలలో ఈ రాష్ట్రానికి పలు అవార్డులు వరించాయి. తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించిన బెస్ట్ యూనివర్సిటీస్ లలో హైదరాబాద్ లోని హైదరాబద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం అత్యంత విశిష్ట హోదా దక్కించుకుంది. చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోధనలోను, నాణ్యమైన విద్యను అందించడంలోనూ అందరికంటే ముందు ఉంటోంది. దీనిని 1974 లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి అప్పారావు ఉప కులపతిగా ఉన్నారు. హైదరాబాద్ , ముంబై రహదారికి దగ్గరలో ఉన్నది. 2000 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.  హై...

విమెన్స్ క్రికెట్ లో ఆమె ఓ ధృవతార

చిత్రం
భారతీయ మహిళల క్రికెట్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగిన క్రీడాకారిణి గా పేరు తెచ్చుకున్న మిథాలీ రాజ్ అనూహ్యంగా తాను టీ -20 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె త్వరలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలుగుతుందని వార్తలు గుప్పుమన్నాయి. తన ఆట తీరుతో వరల్డ్ వైడ్ గా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించే ప్లేయర్స్ లలో ఆమె మొదటి ప్లేస్ లో నిలుస్తారు. అటు వన్డేల్లోనూ ఇటు టెస్టుల్లోనూ మిథాలీ రాజ్ పరుగుల వరద పారించింది. టాప్ రేంజ్ క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేశారు. అంతే కాకుండా 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 45.50 సగటుతో 2776 పరుగులు సాధించింది. ఇ...

టెలికాం సెక్టార్ లో వార్ షురూ - తెర తీసిన రిలయన్స్

చిత్రం
ప్రపంచాన్ని తన కనుసన్నలలో పెట్టుకుని ఆటాడిస్తున్న ఐటి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజు రోజుకు సాంకేతికపరమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఇంటర్నెట్ వాడకం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది టోటల్ గా గ్లోబల్ ను డామినేట్ చేస్తూ వస్తోంది. భారత దేశం ఇప్పుడు వర్ధమాన దేశాల సరసన నిలబడింది. ప్రపంచ వ్యాపార రంగంలో పూర్తిగా మూడో ప్లేస్ ను ఆక్రమించింది. ఇది ఓ రకంగా ఇండియన్ మార్కెట్ కు మంచి చేసినా రాబోయే కాలంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. ప్రతి దేశమూ సాంకేతికంగా అప్ డేట్ కాకపోతే అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోయే ప్రమాదం ఉన్నది. ఐటీ సెక్టార్ లో అమెరికా టాప్ పొజిషన్ లో ఉండగా అందులో మన దేశానికి చెందిన వారు దాదాపు 30 శాతానికి మించి ఉన్నారని అంచనా. తాజా గణాంకాల ప్రకారం భారత దేశం 128 కోట్లకు పైగా జనాభా కలిగి ఉన్నదని తేలింది. దీంతో ఆసియా ఖండంలో అతి పెద్ద మార్కెట్ ను కలిగిన దేశాలలో చైనా తర్వాత మనదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు చెందిన కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించాలంటే చైనా, భారత్ లే అతి పెద్ద ఆదాయ వనరులుగాగుర్తిస్తున్నాయి. అందుకే ప్రతి కంట్రీ ఈ ప్రాంతాలలో బిజినెస్ చేసేం...